Odisha Government extends Indian Hockey team sponsorship till 2033 - Sakshi
Sakshi News home page

భారత హాకీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం

Published Tue, Apr 25 2023 8:57 AM

Odisha Government To Sponsor Indian Hockey Till 2033 - Sakshi

భువనేశ్వర్‌: భారత సీనియర్, జూనియర్‌ పురుషుల, మహిళల హాకీ జట్లకు మరో పదేళ్లపాటు (2033 వరకు) స్పాన్సర్‌ షిప్‌ చేస్తామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి ఒడిశా జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2018, 2023లలో పురుషుల ప్రపంచకప్‌ టోర్నీలకు ఒడిశా ఆతిథ్యమిచ్చింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement