చైనాలో ఇకపై ఎగిరే ట్యాక్సీలు... | Sakshi
Sakshi News home page

చైనాలో ఇకపై ఎగిరే ట్యాక్సీలు...

Published Wed, Nov 1 2023 1:19 PM

రవాణ రంగంలో ఇంకో కొత్త సంచలనానికి శ్రీకారం పడింది. దశాబ్ద కాలంగా ఊరిస్తూ వచ్చిన ఎగిరే ట్యాక్సీలిప్పుడు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈహాంగ్‌ కంపెనీ తయారు చేసిన భారీ డ్రోన్లలో మనుషులు ప్రయాణించేందుకు చైనా అధికారికంగా ఓకే చెప్పింది. 2017 నుంచి దాదాపు నాలుగు వేల పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ ఫ్లయింగ్‌ ట్యాక్సీలకు అనుమతులు లభించడం గమనార్హం. ఇద్దరు ప్యాసింజర్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో మోసుకెళతాయి ఇవి.

Advertisement
Advertisement