-
భారత్పై జో బైడెన్ షాకింగ్ కామెంట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ తమ దేశంలోకి విదేశీ వలసదారులను అనుమతించేందుకు భయపడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే భారత్ వంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధి వేగంగా లేదని చురకలించారు.కాగా, వాషింగ్టన్లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడుతూ.. భారత్, జపాన్, చైనా, రష్యా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ దేశాలు విదేశీ వలసదారులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు భయపడుతున్నాయి. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. కానీ, అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. ఈ కారణంగానే వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. Breaking news: "President Joe Biden calls Japan and India ‘xenophobic’ nations that do not welcome immigrants." Joe Biden comes out as a hardline pro-immigrant, pro-open border & pro-Chinese fentanyl President of the US! pic.twitter.com/yyTTHrvSeZ— Tan Vu (@TanVu327031160) May 2, 2024ఈ క్రమంలో భారత్, జపాన్, చైనా, రష్యా దేశాలను ‘జెనోఫోబిక్’ (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు. ఈ సందర్బంగా అమెరికాను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు బైడెన్. అయితే, ఎన్నికల సందర్బంగా బైడెన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా మిత్ర దేశాలైన భారత్, జపాన్ గురించి బైడెన్ తక్కువ చేసి మాట్లాడం సరికాదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అలాగే, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో ఉన్న భారతీయులపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. మరోవైపు.. బైడెన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది. బైడెన్ ఎంత గౌరవిస్తారో మా మిత్రదేశాలు, భాగస్వాములకు బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ.. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. జపాన్, భారత్తో మాకు బలమైన సంబంధాలున్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు. -
చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్ప్రెస్ వే..
బీజింగ్: చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని మెయిజౌ నగరంలో బుధవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. చైనాలో ‘లేబర్ డే’సందర్భంగా ఐదు రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి. దీంతో గ్వాంగ్డాంగ్– ఫుజియాన్ ఎక్స్ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెయిజౌ నగరంలోని కొండప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. -
చైనాతో భారత్ ‘ఢీ’
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్ బెర్త్ కోసం 10 సార్లు చాంపియన్ చైనాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 1–4తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ ప్రణయ్ 61 నిమిషాల్లో 13–21, 21–12, 21–12తో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్టింగ్ను ఓడించాడు. రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 77 నిమిషాల్లో 22–24, 24–22, 19–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ జంట చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 18–21, 21–16, 17–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో మ్యాచ్లో ధ్రువ్ కపిల–సాయిప్రతీక్ జోడీ 20–22, 11–21తో లియో కార్నాండో–డేనియల్ మార్టిన్ జంట చేతిలో పరాజయం పాలైంది. చివరిదైన ఐదో మ్యాచ్లో శ్రీకాంత్ 21–19, 22–24, 14–21తో ద్వి వర్దాయో చేతిలో ఓడిపోయాడు. గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలువగా... భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో చైనాతో భారత్; మలేసియాతో జపాన్; కొరియాతో ఇండోనేసియా; చైనీస్ తైపీతో డెన్మార్క్ తలపడతాయి. మరోవైపు మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో నేడు జపాన్తో భారత్; డెన్మార్క్తో చైనా... శుక్రవారం ఇండోనేసియాతో థాయ్లాండ్; చైనీస్ తైపీతో కొరియా పోటీపడతాయి. -
మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్ ఏప్రిల్ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ)కార్లలోని సాఫ్ట్వేర్ను విడుదల చేసేందుకు,ఎఫ్ఎస్డీ అల్గారిథమ్లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఎక్స్లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్ కంట్రీలో ఎఫ్ఎస్డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement