-
నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలి
గోవిందరావుపేట: నాణ్యత ప్రమాణాలతో కూడిన విత్తనాలను మాత్రమే తయారు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మండల కేంద్రంలోని టీఎస్ఎస్డీసీ ప్రాసెసింగ్ యూనిట్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విత్తనాలు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన విత్తనాలు మాత్రమే తయారు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు చేసుకొని విత్తనాలు సకాలంలో రైతులకు అందేవిధంగా చూడాలనానరు. ఎవరైనా నకిలీ విత్తనాలు తయారీ చేసినా, అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ చంద్ర, టీఎస్ఎస్డీసీ ఫీల్డ్ సూపర్ వైజర్ భిక్షపతి, ఏఓ టెక్నికల్ ఎండి వాజిద్, ఏఈఓలు గోపాల్ రెడ్డి, దాదా సింగ్ తదితరులు పాల్గొన్నారు. టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు ములుగు: నకీలి విత్తనాల నియంత్రనకు రెండు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. విడిగా ఉన్న సంచుల్లో విత్తనాలు కొనుగోలు చేయవద్దని, కంపెనీ లేబుల్ ఉన్న ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ఆ బిల్లులు, విత్తనాల లేబుల్ ప్యాకెట్లను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొన్ని విత్తన కంపెనీలు వ్యాపారం నిమిత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాటిని రైతులు నమ్మవద్దని సూచించారు. నకిలీ విత్తనాల నియంత్రణకు సహాయ సంచాలకులు, ములుగు, ఏటూరునాగారం విత్తన ధ్రువీకరణ అధికారి, పోలీస్ అధికారులతో టాస్క్ఫోర్స్ బృంధాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ టీమ్లు 24గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఎవరైనా బీజీ 3, హెచ్టీ పత్తి విత్తనాలు రాత్రి సమయాల్లో గ్రామాల్లో తిరిగి అమ్మే విత్తనాల గుంరించి సమాచారం తెలిస్తే టాస్క్ఫోర్స్ అధికారులు తెలియజేయాలని సూచించారు. ములుగు ఏడీఏ శ్రీపాల్ 7288894761, ఏటూరునాగారం ఏడీఏ శ్రీధర్ 7288894766 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.కలెక్టర్ ఇలా త్రిపాఠి -
జూనియర్ కళాశాల ఏర్పాటు
వెంకటాపురం(కె): మండల కేంద్రంలో నూతన జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో అడ్మిషన్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కళాశాలకు వాజేడు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ను ఇన్చార్జ్ ప్రిన్సిపల్గా నియమించినట్లు వెల్లడించారు. ఇసుక రీచ్ల తనిఖీ వెంకటాపురం(కె): మండల పరిధిలోని సూరవీడు, రామచంద్రాపురం, ముత్తారం ఇసుక రీచ్లను గురువారం మైనింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు జాయింట్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇసుక రీచ్ల వద్ద పరిమితులకు మించి ఇసుకను తరలిస్తున్నారా, నిబంధనలు పాటిస్తున్న విషయాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ ఏడీ జయరాజ్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్, టీఎస్ఎండీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ హబీబ్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జీఎం ఏరియా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సింగరేణి ఆధ్వర్యంలో జూన్ 2న ఏరియా మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు జోతి, రామకృష్ణారెడ్డి, ప్రసాద్, రాజశేఖర్, రవికుమార్, భిక్షమయ్య పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై కేకు కట్చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. గణేష్ చౌక్లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐయిత ప్రకాశ్రెడ్డి, పీసీసీ సభ్యులు మధు, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఓగ బుచ్చయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కాళేశ్వరం: నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్సై భవానీసేన్ అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రకు వచ్చిపోయే వాహనాలు, అనుమానితులను నిలిపి గురువారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నకిలీ విత్తనాలు రవాణాచేసిన, విక్రయించినా కేసు నమోదు చేస్తామన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు దొరికితే వారిపై పీడీయాక్ట్ కేసు నమోదుచేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. అంతర్రాష్ట్ర వంతెన వద్ద ప్రతినిత్యం నిఘా ఉంటుందని అన్నారు. -
హుండీ ఆదాయం రూ.11.62 లక్షలు
మంగపేట: మండల పరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ మహబూబాబాద్ డివిజన్ పరిశీలకులు కవిత పర్యవేక్షణలో గురువారం హుండీ లెక్కింపు ద్వారా రూ.11,62,774 ఆదాయం వచ్చిందని ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి శనిగల మహేష్ తెలిపారు. ఆలయంలోని వివిధ ప్రదేశాల్లో ఈ ఏడాదిలో మార్చి 27నుంచి మే 29వ తేదీ వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏర్పాటు చేసిన 13 హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించినట్లు పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.11,62,774తో పాటు యుఎస్ఏకు చెందిన 15 డాలర్లు, మలేషియా దేశానికి చెందిన రెండు డాలర్లతో పాటు వెండి, బంగారు మిశ్రమాలను ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో భద్రపరిచినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా..
మంగపేట: జిల్లాలోని మల్లూరులో టూరిజం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.4.19 కోట్ల నిధులతో హరిత హోటల్ నిర్మించారు. హోటల్ నిర్మాణం జరిగి నాలుగేళ్లు అయినా ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక హబ్గా విరాజిల్లుతున్న జిల్లాలో ఎన్నో చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, బొగత జలపాతం, లక్నవరం, రామప్ప, ఏటూరునాగారం అభయారణ్యం వంటి ప్రాంతాలతో పాటు వనదేవతలు మేడారం సమ్మక్క– సారలమ్మ కొలువై ఉన్నారు. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను చూడడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఉండేందుకు జిల్లాలో ఐదు హోటళ్లను టూరిజం శాఖ నిధులతో నిర్మించి నాలుగింటిని మాత్రమే ప్రారంభించింది. మల్లూరులో హోటల్ నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారింది. ఈ హోటళ్లను ప్రభుత్వం 15 సంవత్సరాలకు కాంట్రాక్టు పద్ధతిలో టెండర్ ద్వారా గుజరాత్కు చెందిన లల్లూజీ అండ్ సన్స్ కంపెనీకి పనులను అప్పగించింది. ప్రభుత్వం నుంచి టెండర్ పొందిన ఆయా హోటళ్లను రీడిజైనింగ్తో సుందరంగా తీర్చిదిద్దింది. ములుగు గట్టమ్మ, తాడ్వాయి, మేడారం, బొగత, హోటళ్లను ప్రారంభించింది. కాని నిత్యం పర్యాటకులు, భక్తుల రద్దీతో ఉండే మల్లూరులో ఏర్పాటు చేసిన హోటల్ను ప్రారంభించక పోవడంతో హేమాచల క్షేత్రానికి వచ్చే భక్తులతో పాటు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు ఉండేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. లాడ్జీలో ఉండలేక అవస్థలు లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులు స్థానికంగా విడిది చేసేందుకు ప్రైవేట్ లాడ్జీలకు వేలాది రూపాయలు చెల్లించలేక వేరే వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హేమాచల క్షేత్రానికి ప్రతీ శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, పొరుగున ఉన్న ఆంధ్రపదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు స్థానికంగా ఉండేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో వారు ఎదుర్కునే ఇబ్బందులు వర్ణనాతీతం. ఎలక్ట్రికల్, వైర్లు మాయం అటు ప్రభుత్వం ఇటు టూరిజం, పర్యాటక శాఖ ఇద్దరిలో ఏ ఒక్కరూ హోటల్ను ప్రారంభించకుండా వదిలేయడంతో పర్యాటకులకు, భక్తులకు ఉపయోగపడాల్సిన హోటల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హోటల్ భారీ గ్లాస్ డోర్లతో పాటు కిటికీల డోర్ల ధ్వంసం చేసి రూముల్లోని విలువైన సీలింగ్ ఫ్యాన్లు, సోలార్ లైట్ల ఫానల్లు, బ్యాట్రీలతో విలువైన లైట్లు, ఎలక్ట్రికల్ వస్తువులు, వైర్లను ఎత్తుకు పోయారు. ఇప్పటికే శితిలావస్థకు చేరుకుంటున్న హోటల్ను ఇలాగే వదిలేస్తే అతి త్వరలోనే ఎవరికి ఉపయోగపడకుండా పోయే పరిస్థితి లేకపోలేదు.ఆది నుంచి నిర్లక్ష్యమే.. 2017లో ప్రారంభమైన హోటల్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడటంతో పనులు పొందిన కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నాసిరకంగా పూర్తిచేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ప్రారంభానికి ముందే వర్షానికి స్లాబ్ కురుస్తుండడంతో పాటు స్లాబ్పై టార్ఫాలిన్ షీట్ వేసి కనిపించకుండా ప్లాస్టింగ్ చేయడం, గోడకు పగుళ్లు తేలడం, హోటల్ మధ్య భాగంలో కిందకు కుంగిపోవడం వంటి పనులు చేయడం చర్చనీయాంశమైంది. మల్లూరు హోటల్ను ప్రారంభించకుండా ఫర్నీచర్స్, హోర్డింగులు తదితర వస్తువులను భద్రపరిచేందుకు స్టోర్ రూమ్గా వినియోగించారు. గత ఏడాది నుంచి పూర్తిగా దాని గురించి పట్టించుకోకుండా కాంట్రాక్టర్ లల్లూజీ అండ్ కంపెనీ పట్టించుకోకుండా వదిలేసింది. హోటల్ రక్షణకు నియమించిన స్థానిక సిబ్బందికి వేతనాలు నాలుగేల్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో వారు సైతం హోటల్ను పట్టించుకోకుండా వదిలేశారు. నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోని హరిత హోటల్ రూ.4.19కోట్లతో మల్లూరులో నిర్మాణం పర్యాటకులకు ఉపయోగపడని వైనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా -
రోళ్లు పగిలేలా..
రోహిణి కార్తెలో భానుడి భగభగ ● 43 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదు ● రెండు రోజులుగా పెరిగిన వేడి ● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి ● నిర్మానుష్యంగా రోడ్లుకాళేశ్వరం: రోహిణి కార్తెలో గోదావరి తీర ప్రాంతం తీవ్రమైన ఎండలతో హీటెక్కుతుంది. సూర్య ప్రతాపంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. రెండు రోజులు ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారంలో కురిసిన వర్షాలతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గాయి. ప్రస్తుతం బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటడంతో జనం బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9గంటలకే ఇళ్లకు చేరి సాయంత్రం ఆరు గంటల తర్వాతనే బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి దర్శనమిస్తున్నాయి. కాళేశ్వరాలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిత్యం వేలల్లో వచ్చే భక్తుల సంఖ్య వందకు చేరింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగుతుంది. పెరిగిన ఉక్కపోతలు.. మే నెల రెండవ వారంలో కురిసిన వర్షాలతో కాస్త ఎండలు తగ్గుముఖం పట్టి, మళ్లీ రోహిణి కార్తె మొదలతో దంచికొడుతున్నాయి. ఈ కార్తెలో ఎండలకు తోడు ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో తప్ప బయటకి అడుగు వేయడం లేదు. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావడానికి జనం సాహసించడం లేదు. ఎండ తీవ్రతకు వృద్ధులు అక్కడక్కడ వడదెబ్బతో మృతి చెందుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకునేందుకు చల్లని ప్రదేశాల్లోనే సేదదీరుతున్నారు. ఏసీలు, కూలర్ల వద్దనే ఉదయం నుంచి రాత్రి వరకు గడుపుతున్నారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటున్నా రైతులు, జనం ఎదురు చూస్తున్నారు. ఆలయానికి భక్తుల తగ్గుముఖం.. ఎండలు మళ్లీ పెరుగడంతో కాళేశ్వరాలయానికి భక్తుల రాక తగ్గుతుంది. నిత్యం వేలల్లో వచ్చే భక్తులు ఎండల తీవ్రతతో తగ్గుతున్నారు. దీంతో ఆలయానికి ఆదాయం కూడా తగ్గుతుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. -
ఓట్ల లెక్కింపుపై శిక్షణ..
భూపాలపల్లి అర్బన్: జూన్ 4వ తేదీన జరగనున్న పార్లమెంటు ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్మిశ్రా తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మీటింగ్హాల్లో గురువారం కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రోఅబ్జర్వర్లకు కౌంటింగ్ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 317 పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్లు లెక్కింపు చేసేందుకు 18 రౌండ్లు ఉంటాయని, ఇందుకోసం 18 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ టేబుల్ పర్యవేక్షణకు ఒక మైక్రో అబ్జర్వర్ను నియమించినట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది 4వ తేదీన ఉదయం 6 గంటలకు వరంగల్లోని కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కంట్రోల్ యూనిట్ 17సీ ప్రకారం నమోదు జరిగిందా లేదా అన్నది జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. -
పేకాట శిబిరంపై దాడి
ఎస్ఎస్తాడ్వాయి: పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి రెండు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కథనం ప్రకారం..మండల పరిధిలోని మేడారంలోని కొంగలమడుగు చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేశాం. ఈ క్రమంలో పేకాడుతున్న మేడారానికి చెందిన చీర్ల రవి, ఆత్మకూరు సతీష్, సిద్ధబోయిన సందీప్, నార్లాపూర్ గ్రామానికి చెందిన మంచికట్ల లక్ష్మణ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మేడారానికి చెందిన రాజు, నరేష్, కాల్వపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.10,500 నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 7సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే వరగంల్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారు బుధవారం మేడారం జాతరకు వచ్చి మేడారంలోని శివరాంసాగర్ చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట అడుతూ పట్టుపడ్డారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకుని, రెండు కార్లు, 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహమ్మద్ ఇబ్రహీం అలియాస్ చోటు, మహమ్మద్ షకీల్, రవిచందర్, గాడి సంజీవ, నాయని నర్సింగం, గాండ్ల సతీష్, పోషవేని ఇజ్జగిరి, గుండం లక్ష్మీనారాయణ, చల్ల సంపత్, అన్నాల వేణు, తోట సంతోష్, సయ్యద్ ఫరీద్, గుండెపు నగేష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.రెండు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు -
వైభవంగా ముయ్యలమ్మ జాతర
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామం వద్ద గురువారం ముయ్యలమ్మ జాతరను గిరిజనులు వైభవంగా జరుపుకున్నారు. గొంది ఇంటి పేరు ఉన్న వారందరు ఈ జాతరను కనులపండువగా జరుపుకున్నారు. గ్రామస్తులు, తలపతి(పూజారి)ఆధ్వర్యంలో మేల తాళాల నడుమ గుట్ట నుంచి నేరుగా ముయ్యలమ్మ గద్దె వద్దకు వనం తీసుకొచ్చి గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సాయంత్రం 4గంటలకు గుట్ట నుంచి ముయ్యలమ్మ దేవతను తీసుకువచ్చారు. అనంతరం ఊరి పొలిమేర నుంచి భక్తుల సమక్షంలో మేల తాళాల నడుమ దేవతను చీకుపల్లిలోని గొందివారింటికి చేర్చారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యాలతో భక్తులు, ప్రజలు ఊగిపోయారు. -
సన్నబియ్యం పేరుతో మోసం
ఏటూరునాగారం: సన్న బియ్యం తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి కొనుగోలు చేసిన ఓ నిరుపేద కుటుంబం మోసపోయింది. ఈ ఘటన మండల కేంద్రంలోని 6వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. 6వ వార్డులో నివాసం ఉంటున్న జాడి సమ్మయ్య భార్య సన్నబియ్యం ఒక్కొక్కటి 25 కేజీల బస్తాలను మూడింటిని రూ.3వేలకు అపరిచిత వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన అనంతరం అమ్మిన వ్యక్తి వెళ్లిన తర్వాత బస్తాల కుట్టు విప్పి చూసే సరికి కొద్దిపాటి సన్నబియ్యం ఉండగా మిగితావన్ని దొడ్డు రకం, పురుగులు పట్టిన బియ్యం దర్శనమిచ్చాయి. వాటిని చూసిన బాధితురాలు ఆ వ్యక్తి కోసం వెతుకులాడినా ఫలితం లేకుండా పోయింది.బస్తా విప్పి చూస్తే దొడ్డు బియ్యం -
వ్యర్థాలను కాలిస్తే నష్టం..
టేకుమట్ల: రైతులు వ్యవసాయ పంటలలో శ్రమను తగ్గించుకుంటూ యాంత్రికతను ఉపయోగించుకుంటూ వ్యవసాయాన్ని చేస్తున్నారు. అదే క్రమంలో వ్యవసాయంలో భవిష్యత్ నష్టాలను సైతం లెక్క చేయకుండా రైతులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రైతులు యాసంగిలో వరి, మొక్కజొన్న, పుచ్చకాయ, పల్లి తదితర పంటలను వేస్తారు. యాసంగిలో జిల్లాలో సుమారుగా రైతులు 9వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంటను సుమారు 52వేల ఎకరాల్లో సాగు చేశారు. కాగా, పంటలు పూర్తయ్యాక మళ్లీ వానాకాలం సీజన్ కోసం వరి పొలంలోని పశుగ్రాసాన్ని పశువులు ఉన్న రైతులు మాత్రమే నిల్వ చేసుకుంటున్నారు. మిగతా రైతులు మాత్రం పొలంలోనే కాల్చేస్తున్నారు. ఇక మొక్కజొన్న రైతులు పూర్తిగా పంటపొలంలోనే దగ్ధం చేస్తున్నారు. పొలంలోనే దున్నడం వల్ల లాభాలు... పంట పూర్తి అయ్యాక వరి పొలంలోనే కలియదున్నడం వల్ల నేలలో సేంద్రియ కర్భన శాతం పెరడంతో పాటు, సుమారు ఎకరాకు టన్ను ఎరువు తయావుతోంది. తద్వారా సుమారుగా 5 నుంచి 10 శాతం పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. దుక్కి దున్నే సమయంలో సూపర్ పాస్పేట్ చల్లితే పంట అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా రూపాంతరం చెంది పంటకు సేంద్రియ ఎరువుగా మారుతోంది. దాని ద్వారా పంటలో డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. అంతే కాకుండా మొక్కలకు 2శాతం నత్రజని, 4శాతం పాస్పరస్ అదనంగా లభిస్తుంది. జింక్, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మదాతువులు అంది పంటకు మేలు చేకూర్చడంతో పాటు నీటి నిల్వ పెరుగుతోంది. వరి కొయ్యలను భూమిలో కలియ దున్నితే పోషకాలు తిరిగి నేలకు చేరుతాయి. పొలం దున్నే ముందే ఎకరాకు 50కిలోల సూపర్ పాస్పేట్ను చల్లితే సేంద్రియ పదార్థాల స్థాయిని పెంచుకునే అవకాశం ఉంటుంది. నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలు.. వరి కొయ్యలు, మొక్కజొన్న పంటలకు నిప్పు పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు, అత్యధిక ఉష్ణోగ్రతతో నేల భూసారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా భూమిలో ఉండే నత్రజని, పాస్పరస్ వంటి పోషక పదార్థాలతో పాటు, పంట దిగుబడి తగ్గిపోతుంది. అలాగే భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కూడా కాలిపోతాయి. అంతే కాకుండా పంటకు మేలు చేసే ఖనిజ లవణాలు, సూక్ష్మజీవులు కూడా కాలిపాతాయి. అలాగే మంటలకు వివిధ రకాల జీవులు సై తం మృత్యువాతపడే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా అగ్ని ప్రమాదలు జరిగే అవకాశం ఉంది. పంట కొయ్యలను తగులబెడతే తగ్గనున్న దిగుబడి అవగాహన లేక కాల్చేస్తున్న రైతులు -
భద్రాచలానికి కాలినడకన భక్తులు
గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయి గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ భక్తులు మంగళవారం భద్రచలానికి పాదయాత్రగా బయలుదేరారు. నాలుగు రోజుల పాటు పాదయాత్రగా వెళ్లి హనుమాన్ జయంతి నాటికి భద్రాచలం చేరుకుంటారు.టేకుమట్ల: చిట్యాల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ భక్తులు మంగళవారం కొండగట్టుకు కాలినడకన యాత్ర ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం వరకు కొండగట్టుకు చేరుకుంటామని భక్తులు తెలిపారు. గతంలోను కొండగట్టుకు పాదయాత్ర చేశామని, ఇప్పుడు కూడా చేయడం ఆనందంగా ఉందన్నారు. -
విద్యార్థులకు అభినందన
మొగుళ్లపల్లి: మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేష్మ, ఆఫీఫాతబుసం, దినకరన్, రాకేష్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్నకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12 వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనంగా, ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వము అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థులతో పాటు గైడ్గా వ్యవహరించిన ఉమారాణి, వీరయ్య ఉపాధ్యాయ బృందాన్ని, అలాగే ఎస్ఎస్సీ 2024లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులను మంగళవారం అభినందించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు సదానందం, ఉపాధ్యాయులు నరసింహస్వామి, సంపత్ కుమార్, వీరయ్య, ఉమారాణి, రాణి, రవీందర్, శ్రీధర్ స్వామి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
భూపాలపల్లి రూరల్: ఎన్పీడీసీఎల్ విద్యుత్ ఆర్టిజన్స్ అన్మ్యాడ్, రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ స్టేట్ యూనైటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నాయకులు మంగళవారం భూపాలపల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్నాయక్ వినతిపత్రం అందజేశారు. డివిజన్ ఇంజనీర్ నాగరాజుకు వినతిపత్రం అందించారు. విద్యుత్ శాఖ కార్మికులు ఆర్టిజన్లు ఉద్యోగుల కన్వర్షన్ అన్మ్యాడ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని కోరారు. జేఎల్ఎంలకు, రెగ్యులర్ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. పలు సమస్యలౖపై జూన్ 10న ఎన్పీడీసీఎల్ సీఎండీకి మెమోరాండాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖలోని సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఎలకి్ట్రసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారి పోరాట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా యూనియన్ నాయకులు తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోసరి భాస్కర్, జిల్లా కార్యదర్శి మోత్కూరి కోటితో పాటు తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చి మొక్కల తొలగింపు
మహాముత్తారం: మండలంలోని క్రీడాప్రాంగాణాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి నిరుపయోగంగా మారాయి. దీంతో మంగళవారం ‘సాక్షి’లో ఆటలు ఆడేదెలా అనే కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ సిబ్బందితో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి డోజర్ ద్వారా క్రీడా ప్రాంగణాన్ని చదును చేయించారు. దీంతో క్రీడాకారులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి గ్రామంలో మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ప్రనీత్ కుమార్ మహిళలో నెల వారి సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సరైన ఆహారం తీసుకోవటం, రోజు వారి వ్యాయమంపై వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. అడవి పంది దాడి ● యువకుడికి గాయాలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామానికి చెందిన చల్ల రాజయ్య అనే యువకుడు తునికాకు సేకరణ కోసం సమీపంలోని మంగళవారం అడవిలోకి వెళ్లాడు. ఈక్రమంలో అడవి పంది దాడి చేసింది. మోకాలి కింద తీవ్ర గాయం కాగా స్టానికులు సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాజీనామా కాటారం: కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాయిత విఠల్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్న క్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పార్టీకి రాజీనామా చేసినట్లు విఠల్ పేర్కొన్నారు. కొనసాగుతున్న క్యాంపు వాజేడు: మండల పరిధిలోని కోయ వీరాపురం గ్రామంలో 14 ఏళ్ల లోపు బాల బాలికల క్రీడల క్యాంపు ఉత్సాహంగా కొనసాగుతుంది. కోయవీరాపురం గ్రామంలో కొన్ని రోజులుగా వేసవి క్రీడల క్యాంపును నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు ఉదయం సాయత్రం శిక్షణ ఇస్తున్నారు. వాలీబాల్, ఫిట్నెస్లపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. క్యాంపు ముగిసిన వెంటనే క్యాంపులో పాల్గొన్న వారికి జిల్లా నుంచి ధ్రువీకరణ పత్రాలను ఇవ్వనున్నట్లు క్యాంపు శిక్షకుడు ఉయిక నవీన్ తెలిపారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
బంగారం, వెండి ఆభరణాలు, లాప్టాప్, బైక్ స్వాధీనం మణుగూరు టౌన్: ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. పలుచోట్ల చోరీలకు పాల్ప డుతూ పట్టుబడి జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చాడు. అయినా తీరు మార్చుకోక మళ్లీ చోరీలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ సతీశ్కుమార్, ఎస్సైలు ప్రసాద్, రాజేశ్ తెలిపిన వివరాలు.. మణుగూరులో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పల్సర్ బైక్పై అశ్వాపురం – మణుగూరు వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా భూపాలపల్లికి చెందిన దొరిశెట్టి స్వామి నిరంజన్గా తేలింది. ఆయన మణుగూరుతో పాటు భద్రాచలంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి డిసెంబర్లో జైలుకు వెళ్లి ఈనెల 7వ తేదీన బెయిల్పై బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆపై ములకలపల్లికి చెందిన జున్దూరి శ్రీనుతో కలిసి మణుగూరులోని పీ.వీ.కాలనీతో పాటు కొత్తగూడెం ఏరియాలోని పలు ఇళ్లల్లో జున్దూరి శ్రీనుతో కలిసి చోరీ చేశాడు. చోరీ చేసిన వస్తువులను భద్రాచలానికి చెందిన బానోత్ మోహన్కు విక్రయించినట్లు నిందితుడు ఇచ్చిన సమాచారంతో 9తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, ల్యాప్టాప్, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని మోహన్, స్వామి నిరంజన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. అలాగే, పరారీలో ఉన్న శ్రీను కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, స్వామి నిరంజన్పై గతంలో భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, వెంకటాపురం, గణపురం, భద్రాచలం, మణుగూరు పోలీస్స్టేషన్లలో కలిపి 14 చోరీ కేసులు ఉండగా.. జైలుకు వెళ్లి బెయిల్పై రాగానే చోరీలకు పాల్పడడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని సీఐ వివరించారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
చిట్యాల: మండల కేంద్రంలో అంజనేయ స్వామి శోభాయాత్రను మంగళవారం సాయంత్రం భక్తులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఉరేగింపుగా గ్రామంలోని అన్ని వీధుల గుండా తిరిగారు. మహిళలు , భక్తులు స్వామి వారికి కొబ్బరికాయాలతో, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు నేపాలి వేణుసింగ్, పిట్టల నాగరాజు, పాముకుంట్ల రవి, ఆకుల హరీష్, బుర్ర చక్రపాణి, ఆకుల రాజు, గడ్డం కొమురయ్య, తాటిపల్లి శ్రీనివాస్, కొడెల నరేష్, ప్రవీణ్, సుమన్, ఎల్లయ్య, సదానందం, సాయిచరణ్, మాసు రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. రేగొండ(కొత్తపల్లిగోరి): కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో హనుమన్ నగర సంకీర్తన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహంచారు. గురు స్వామి దాసరి సంజీవయ్య ఆధ్వర్యంలో సదాశివ దేవాలయం నుంచి వేడుకలు ప్రారంభించారు. హనుమంతుని ప్రతిమను ఊరేగింపుగా మాలధారులు భక్తి, భజనలతో, కోలాటాలతో హోరెత్తిపోయింది. స్వామి వారికి మహిళలు నీళ్లు ఆరగించి, మంగళహారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో మాలధారులు నిమ్మల రాజు, పుట్ట రాంబాబు, పసుల రాకేష్, నిమ్మల రాజేందర్, సాదు రఘుపతి, పుట్ట రమేష్, మనోహర్, దేవరాజు, ప్రకాష్, సుమన్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలో రామాలయం ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగ హనుమాన్ మాలధారులు రామాలయం వద్ద నుంచి నగర సంకీర్తన ర్యాలీని ప్రారంభించి మండలంలోని అన్ని వీధుల్లో హనుమాన్ నామ స్మరణతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ గురుస్వామి సాంబయ్య, అంజన్న స్వాములు పాల్గొన్నారు. -
కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి
ములుగు రూరల్: రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి మునుకుంట్ల సంతోష్ అన్నారు. మంగళవారం మండలంలోని జగ్గన్నపేట, పులిగుండం గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. తప్పకుండా బిల్లు రశీదు తీసుకొని పంట కాలం పూర్తి అయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని అన్నారు. గ్రామాల్లో ఎవరైన తిరిగి విత్తనాలు అమ్మకాలు చేపడితే కొనుగోలు చేయకూడదని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. సరైన వర్షాపాతం నమోదయ్యాక మాత్రమే విత్తనాలను వేసుకోవాలని, పొడి దుక్కిలో విత్తనాలు వేయకూడదని అన్నారు. అనంతరం విత్తనాలు అమ్మకాలు చేపడుతున్న దుకాణాలను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. లూజు సంచుల్లోని విత్తనాలను విక్రయించొద్దు వాజేడు: ప్రైవేట్ వాహనాల్లో వచ్చే లూజు సంచుల్లో విత్తనాలను రైతులు కొనవద్దని మండల వ్యవసాయ అధికారి గుంటుక నర్సింహారావు అన్నారు. మండల పరిధిలోని పేరూరు రైతు వేదికలో మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలకు సంబంధించి రశీదును తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన విత్తనాలను కొనవద్దన్నారు. డీలర్లు స్టాక్ బోర్డు, సరుకు వివరాలను పొందు పర్చాలని, ఎమ్మార్పీకి మించి విత్తనాలను అమ్మితే శాఖా పరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. వాజేడు సొసైటీ పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కావాల్సిన రైతులు పట్టా, ఆధార్ జిరాక్స్లు ఇచ్చి కొనుగోలు చేసుకోవాలన్నారు. 30 కేజీల బస్తా రూ.1,116 చెల్లించాలని తెలిపారు. మొగుళ్లపల్లి: మండలంలోని వివిధ విత్తనాల దుకాణాలను మంగళవారం ఎస్సై అశోక్, ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ.. గడువు ముగిసిన విత్తనాలు, లేబుల్స్ లేనివి, లూజ్ విత్తనాలు నిలువ ఉంచిన అమ్మిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాల విషయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసిన విత్తనాలకి సరిన రశీదులు తీసుకోవాలన్నారు. ఎస్సై వెంట మండల వ్యవసాయ అధికారి సురేందర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో గేదెల మృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మెట్పల్లి పరిధిలోని బీరాసాగర్ లక్ష్మీపంపుహౌస్కు చెందిన కూలీల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు వద్ద విద్యుత్ కనక్షన్ తీగలు గాలిదుమారానికి తెగిపడి సోమవారం రాత్రి రెండు గేదెలు మృతి చెందాయి. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి గ్రామానికి చెందిన దాసరి సమ్మయ్య, శ్రీరాముల బక్కయ్యలకు చెందిన రెండు గేదెలు విద్యుత్ తిగలు తెగి పడి మృతి చెందాయి. వాటి విలువ రూ.80 వేల వరకు ఉంటుందని తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎన్పీడీసీఎల్ లైన్ ఇన్స్ఫెక్టర్ సదానందంను సంప్రదించగా పంపుహౌస్కు సంబంధించిన విద్యుత్ తీగలు తెగిపడినట్లు తెలిపారు. -
హామీలు అమలు చేయాలి
కాటారం: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతుల కోసం పేర్కొన్న హామీలను వెంటనే నెరవేర్చాలని పేర్కొన్నారు. ధరణి లోపాలను సరి చేయడంతో పాటు అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని తెలిపారు. 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలి, సాగు రైతులకు రూ.15000 వేల రైతు భరోసా అందించాలని అన్నారు. సబ్సిడీపై రైతులకు మైక్రో ఇరిగేషన్ పథకాలు అమలు చేయాలని తెలిపారు. రూ. 2లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఇసునపు మహేందర్, కిశోర్, మానస, మంథెన సుధాకర్, మేడి సందీప్రాజు పాల్గొన్నారు. -
క్రికెట్ ఆటలో ఫిట్నెస్ చాలా ముఖ్యం
ములుగు: క్రికెట్ ఆటలో ఫిట్నెస్ చాలా ముఖ్యమని ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య అన్నారు. ఈ మేరకు హెచ్సీఏ ఆధ్వర్యంలో కోచ్ రమేశ్, క్యాంప్ ఇన్చార్జ్, కోచ్ సందీప్నేత్ర ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా అండర్ 8, 10, 14, 16, 19, 21, 23 విభాగంలో శిక్షణ పొందిన 100మందికి వీవర్స్ కాలనీలోని పద్మశాలీ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమంలో సూర్య ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సెల్ఫోన్ల వినియోగం తగ్గించాలని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్గా క్యాంపులు ఉంటాయని, క్రీడాకారులకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపా రు. ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో అ న్ని రకాల వసతులతో గ్రౌండ్, ట్రాక్, గ్రంథాల యం ఏర్పాటుకు మంత్రి సీతక్కను ఒప్పిస్తామని అన్నారు. అడగగానే ములుగు జిల్లాలో సమ్మర్ క్యాంప్ నిర్వహించేందుకు అనుమతినిచ్చిన హెచ్సీఏకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ము లుగు జిల్లా నుంచి ఓపెన్ కేటగిరిలో రాష్ట్ర స్థాయికి ఎంపికై న లక్ష్మీదేవిపేటకు చెందిన అన్వేష్, ఏటూరునాగారానికి చెందిన రియాజ్లకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. సమ్మర్ క్యాంప్ ఇన్చార్జ్, కోచ్ సందీప్నేత్ర మాట్లాడుతూ.. క్యాంపునకు సహకరించిన హెచ్సీఏ సెక్రటరీ జగన్మోహన్రావు, డీడబ్ల్యూడీసీ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గండ్రకోట సుధీర్యాదవ్, రవిచందర్, తిరుపతిరెడ్డి, మధు పాల్గొన్నారు. -
కరకట్ట పనులు నాణ్యతతో చేపట్టాలి
ములుగు: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం నుంచి ఎక్కెల వరకు నిర్మించిన కరకట్ట మరమత్తులు, తూముల రిపేర్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అధికారులకు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం కరకట్ట మరమత్తులకు కేటాయించిన రూ.6కోట్లతో కాంట్రాక్టర్ జేబులు నింపుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అలాంటి అక్రమాలను ఉపేక్షించదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని, ప్రణాళికను రూపొందించి పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. వర్షాకాలంలో వచ్చే వరదలతో ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో వెంకటాపురం(ఎం) మండలం బూర్గుపేట మండలంలోని మారేడుగుండ చెరువు కట్ట తెగిపోయి ముగ్గురు ప్రా ణాలు కోల్పోవడం బాధాకరం అన్నా రు. యుద్ద ప్రాతిపదికన టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. ముంపు గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రజల ను అప్రమత్తం చేయాలన్నారు. ఏటూరునాగారం మండలం రాంనగర్ గ్రామం నుంచి మంగపేట మండలం పొదుమూరు వరకు కరకట్ట పనులు ప్రారంభించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీ, ఎస్ఈ, ముఖ్యఅధికారులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన
ములుగు ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ బ్యూరో టెక్నికల్ టీం తరఫున గత నెల రోజులుగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కళాశాలలు, కార్యాలయాలు, యువకులు, ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాని వాట్సప్, సాధారణ మెసేజ్ వస్తే అటువంటి లింక్లను ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు. ఒకసారి యాప్ డౌన్లోడ్ అయితే మాల్వేర్ కలిగిన యాప్ ద్వారా డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయి వాట్సప్, కాంటాక్ట్ హ్యాక్ అయ్యే ప్రమాదాన్ని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఫేక్ మెసేజ్లను క్లిక్ చేయడం ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బులు అంతా పోగొట్టుకోవడంతోపాటు, మానసిక ఇబ్బందులు తప్పవని వివరిస్తున్నారు. -
పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి
ఏటూరునాగారం: మండలంలో అమ్మ అదర్శ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా సమగ్ర శిక్ష అధికారులు హర్షంరాజు, సాంబయ్య అన్నారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలను మంగళవారం వారు పరిశీలించారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులు జూన్ 1వ తేదీ లోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థుల యూనిఫామ్ కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా యూనిఫామ్స్ కోసం సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్టీ శ్రీధర్ నాయక్, సత్యరావు తదితరులు ఉన్నారు రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి ములుగు రూరల్: నర్సరీ యజమానులు రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అనసూయ అన్నారు. ఈ మేరకు మండలంలోని అబ్బాపూర్లో ఆమె నర్సరీలను మంగళవారం తనిఖీ చేసి, మాట్లాడారు. నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలను వినియోగించాలన్నారు. 45రోజుల లోపు నారు మాత్రమే రైతులు పొలాలలో నాటుకోవాలని అన్నారు. అనంతరం నర్సరీల్లో మొక్కలు, కోకో ఫిట్స్ పరిశీలించారు. లైసెన్స్ కలిగిన నర్సరీల్లో మాత్రమే నారు కొనుగోలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి వేణు మాధవ్, ప్రవీణ్, యార కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న గోల్డ్ చైన్ అప్పగింత గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా బ్యాంక్లో మేడారానికి చెందిన శిడెం లక్ష్మయ్య గోల్డ్ చైన్ పోగొట్టుకోవడంతో పస్రా ఎస్సై కమలాకర్ కొద్ది గంటల వ్యవధిలోనే గుర్తించి బాధితుడికి అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. మేడారం గ్రామానికి చెందిన శిడెం లక్ష్మయ్య తన దగ్గర ఉన్న 2తులాల బంగారు గొలుసును బ్యాంక్లో తాకట్టు పెట్టేందుకు మంగళవారం పస్రా బ్యాంక్కి వచ్చాడు. బ్యాంక్లో పని కాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంగారు గొలుసు ఎక్కడో పోగొట్టుకున్నాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో పస్రా ఎస్సై కమలాకర్ స్పందించి తన సిబ్బందితో పస్రాలో అన్ని చోట్ల ఆరా తీయగా పస్రా గ్రామానికి చెందిన ఎలిశాల ధనమ్మకు చైన్ దొరికినట్లుగా గుర్తించారు. ధనమ్మను సంప్రదించి ఆమె వద్దనుంచి సేకరించిన బంగారు గొలుసును ఎస్సై సమక్షంలో బాధితుడు లక్ష్మయ్యకు అందజేశారు. వెంటనే స్పందించిన పస్రా ఎస్సై కమలాకర్తోపాటు, సిబ్బంది లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపాడు. ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు ఏటూరునాగారం: మండల కేంద్రం నుంచి వెళ్తున్న ఇసుక లారీలను మంగళవారం ఏటూరునాగారం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అడ్డుకున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు వెళ్లడం వల్ల రోడ్డు పై దుమ్ము లేచి ఇళ్లలోకి రావడంతోపాటు, రోడ్డు పై ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక లారీల వల్ల కలిగే సమస్యలను పరిష్కరించాలని కోరారు. దుమ్మను అరికట్టేందుకు రోడ్డు పై వాటరింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. -
No Headline
ములుగు: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎంత మందికి సహకారంగా మారుతుందో.. అంతే మందికి నష్టంగా మారుతుంది. ఇటీవల అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ బ్యాంకు ఖాతాల్లో నగదును పోగొట్టుకోవడం, పర్సనల్, బిజినెస్ లోన్ పేరిట వచ్చే మెసేజ్లకు స్పందించి లింకు క్లిక్ చేసి మోసపోవడం వంటి పరిణామాణాలు సర్వసాధారణంగా మారాయి. తల్లిదండ్రులకు తెలియకుండా అధిక వడ్డీలని చూడకుండా తమ అవసరం తీర్చుకోవడం అప్పు తీర్చలేని స్థాయికి చేరుకున్నాక సదరు ఆన్లైన్ బ్యాంకులు పర్సనల్ డేటా హ్యాక్ చేసి స్నేహితులు, బంధువులకు పంపిచడంతో చాలా మంది చనువుచాలించుకున్న సంఘటనలు చూస్తున్నాం. ఈనేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ శాఖ సైబర్ నేరాలను చెక్ పెట్టేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సైబర్ వారియర్స్ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్కు ఓ సైబర్ వారియర్ను నియమించింది. ఫిర్యాదులను తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ సైబర్ నేరాలకు బలిఅవుతున్న వారు బయటికి చెప్పుకోలేక, చెబితే సమాజంలో చులకనగా చూస్తారనే భావంతో ఎవరికీ చెప్పుకోలేక లోలోన బాధపడుతుంటారు. ఈక్రమంలో ఆన్లైన్లో సైబర్ పోర్టల్(ఎన్సీఆర్బీ) www.cybercrime.gov.inలో తమ ఫిర్యాదు చేసేందుకు సంబంధిత శాఖ అవకాశం కల్పించింది. ఫిర్యాదు చేయడానికి, ఫిర్యాదు వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా 1930టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. బాధితుడు ఫోన్ చేయగానే వివరాల ప్రకారం సదరు పోలీస్స్టేషన్ సైబర్ వారియర్కు కనెక్ట్ అవుతుంది. వార వెంటనే స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. ఈ మేరకు జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారీగా ములుగు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ సందీప్రెడ్డి, సీఐ యాసిన్ ఆధ్వర్యంలో సైబర్ వారియర్స్ను నియమించారు. వీరందరికీ కొత్త సిమ్ కార్డులను అందించారు. -
సైబర్ నేరాలు అరికట్టేందుకు చర్యలు
సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా నియమించబడిన టీమ్తో ముందుకెళ్తున్నాం. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ను నియమించాం. వారందరికీ ప్రత్యేక సిమ్ కార్డులు అందించాం. టెక్నికల్ టీమ్ పనితీరులో పురోగతి కనిపిస్తుంది. చదువుకున్న యువత, ఉద్యోగులు, గృహిణులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు అత్యాశకు పోయి మోసపోతున్నారు. మీ అకౌంట్లో కొంత అమౌంట్ జమ అయిందని లింక్ క్లిక్ చేసి డైరెక్టుగా బ్యాంకు ఖాతాతో డ్రా చేసుకోవచ్చని ఆశ చూపుతారు. అలాంటి వాటికి రెస్పాన్స్ కాకూడదు. ఇబ్బందులు ఉంటే నిర్మోహమాటంగా వచ్చి సైబర్ వారియర్స్కు ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ శబరీశ్, ఎస్పీ ●
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (31-05-2024)
'ఐర్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుంది'.. ఉతప్ప షాకింగ్ కామెంట్స్
ఢిల్లీలో నీటి సంక్షోభం.. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా
సూర్యుడి భగభగ.. ఎండ వేడి తట్టుకోలేక 54 మంది మృత్యువాత
నిప్పుల కుంపటిలా తెలంగాణ
రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!.. ఆ జట్టులోనూ ఉంటే..
ఏపీలో ఆల్టైం హై విద్యుత్ వినియోగం!
గూగుల్ మ్యాజిక్ ఎడిటర్.. గురించి ఎప్పుడైనా విన్నారా!
'రోహిత్ అద్భుతమైన కెప్టెన్.. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు'
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
Advertisement