-
'కౌన్ బనేగా కరోడ్పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్పతి భారతీయ టెలివిజన్లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
లాయర్గా...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ లాయర్గా తన నటనతో ఆడియన్స్ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్ బచ్చన్ మాట్లాడే పవర్ఫుల్ డైలాగ్స్ వినే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్’ చిత్రంలో లాయర్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారట. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అది లాయర్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ లాయర్గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. -
బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్.. ఆ సినిమాను టచ్ కూడా చేయలేకపోయాయి!
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి. కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది. అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. షోలే ఫ్లాప్ టాక్.. అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి. -
అమితాబ్.. రెహమాన్లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
-
బిగ్ బీకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్ను సత్కరించనున్నారు. కాగా.. 2023లో ఈ అవార్డ్ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్స్తంభ్ ఫౌండేషన్ మనోబల్కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
‘ఓటు వేయాలంటూ.. సెలబ్రిటీల ప్రచారం’
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లులో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ, క్రీడా సెలబ్రిటీలతో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో..‘తప్పకుండా ఓటు వేయండి.. ఓటు వేయటం మీ కర్తవ్యం’అని సెలబ్రిటీలంతా కోరుతారు. ఈ షార్ట్ ఫిల్మ్ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించటం గమనార్హం. క్రీడా రంగం నుంచి సచిన్ టెండుల్కర్, సినిమా రంగం నుంచి పలువురు బాలీవుడ్, కోలివుడ్ ప్రముఖలు ఉన్నారు. వారివారి శైలీలో ఓటు వేయాలని కోరారు. ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి.. -
ప్రభాస్, రామ్ చరణ్ తాతయ్యలుగా అమితాబ్, సంజయ్ దత్!
అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోలే. వారిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇద్దరికి కోట్లమంది అభిమానులు ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు వైవిధ్యమైన సినిమాలతో వారిని అలరించారు. ఇప్పడు వయసు పైబడిన తర్వాత తమలోని మరో యాంగిల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. విలన్గా, తండ్రిగా, సోదరుడిగా, గురువుగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు తాతయ్యలుగానూ అలరించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్కు తాతగా అమితాబ్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఇది బుచ్చిబాబుకు రెండో సినిమా. ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రామ్చరణ్ మూవీ (RC16) ప్రకటించాడు. రామ్చరణ్ బర్త్డే రోజు షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ మూవీ కోసం బుచ్చిబాబు సెట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అంతేకాదు శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి అమితాబ్ కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ని ఒప్పించే పనిలో పడ్డాడట బుచ్చిబాబు. అది రామ్ చరణ్ తాత పాత్ర అట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం అని.. అమితాబ్ అయితేనే సెట్ అవుతుందని బుచ్చిబాబు భావించారట. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఫ్రీడం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే భారీ క్యాస్టింగ్తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మగా సంజయ్ దత్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామమాలవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సంజయ్ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో సంజయ్.. ప్రభాస్కు తాతగా నటించబోతున్నాడట. అకాల మరణం చెందిన సంజయ్..దెయ్యంగా తిరిగి వస్తాడట. ఆత్మగా మారిన తాత.. ప్రభాస్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో కథ సాగనుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
తాతా... మనవడు?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ తాజాగా మరో తెలుగు మూవీలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫిల్మ్నగర్ టాక్. అది కూడా హీరో రామ్చరణ్కి తాతయ్య పాత్ర అని భోగట్టా. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. తాత–మనవడు కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్చరణ్ తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ని సంప్రదించారట మేకర్స్. ‘ఆర్సీ 16’ కథ, తన పాత్ర నచ్చడంతో ఈ క్యారెక్టర్ చేసేందుకు అమితాబ్ అంగీకరించారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం సరిగా లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మార్చి 15న రోజంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్లను కోరుతూ వారందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కామెంట్లు చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని అక్కడ ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు. బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్కు కుమారుడితో అమితాబ్ హాజరయ్యారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా... అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ఆయన చికిత్స పొందారు అని ప్రచారంలో ఉన్న కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి కూడా అమితాబ్ గురించి ఎలాంటి ధృవీకరణ లేదు. దీంతో ఇవన్నీ ఫేక్ అని తెలుస్తోంది. (ISPL) ఫైనల్ మ్యాచ్లో భారత మాజీ క్రికెటర్ సచిన్తో అమితాబ్ కనిపించారు. వారిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూసిని అభిమానులు సంబరపడ్డారు. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ADలో కనిపించబోతున్నారు, ఇది 2024లో మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్నారు. కోలీవుడ్లో రజనీకాంత్ వెట్టయన్ చిత్రంలో కూడా అమితాజ్ నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటీనటుల తెరపై మళ్లీ కలయిక కోసం ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎప్పటికీ కృతజ్ఞతగా...
అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారనే వార్త గుప్పుమనడంతో అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదనే వార్త కూడా రావడంతో కూల్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే... శుక్రవారం తెల్లవారుజాము అమితాబ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారట. అమితాబ్కి యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారని సమాచారం. కాలికి ఒకచోట రక్తం గడ్డ కట్టడంతో యాంజియోప్లాస్టీ చేశారట. ఇక శుక్రవారం మధ్యాహ్నమే అమితాబ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాతే ‘ఇన్ గ్రాటిట్యూడ్ ఎవర్’ (ఎప్పటికీ కృతజ్ఞతగా..) అని ఎక్స్లో పోస్ట్ చేసినట్లున్నారు అమితాబ్. అంటే... ఆరోగ్యంగా బయటపడినందుకు ఆయన ఇలా పోస్ట్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ఇక ఇటీవల ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, రజనీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రాల షూటింగ్స్లో అమితాబ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
ఫ్యాన్స్కు ఊరట.. బిగ్ బీ లేటేస్ట్ హెల్త్ అప్డేట్ ఇదే!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చేసిన అనంతరం సాయంత్రమే ఇంటికి పంపించారు. కాగా.. అమితాబ్ను గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది. అమితాబ్ ఇటీవల టైగర్ ష్రాఫ్, కృతి సనన్ నటించిన గణపత్లో కనిపించారు. అంతే కాకుండా ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రంలో కీలక పాత్రలో నటించారు. -
ఆస్పత్రిపాలైన బిగ్బీ.. ఈ ఏడాది రెండోసారి!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు లోనయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు శుక్రవారం (మార్చి 15) నాడు ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్బీ ఎక్స్ (ట్విటర్)లో ఎప్పటికీ కృతజ్ఙతగా ఉంటాను అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి అభిమానులు స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు కాగా అమితాబ్ను గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది. ఆ సినిమాతో కెరీర్ మొదలు కాగా అమితాబ్ ప్రస్తుత వయసు 81. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 55 ఏళ్లు పూర్తయింది. 1969లో అమితాబ్ ‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నాడు. వందలాది చిత్రాలతో భారతీయులను అలరించిన అతడు ప్రస్తుతం వేట్టయాన్, కల్కి 2898 ఏడీ అనే సినిమాలు చేస్తున్నాడు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 చదవండి: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సిరీస్ ఎలా ఉందంటే? -
ఆసుపత్రిలో బిగ్ బీ : ఆంజియోప్లాస్టీ అంటే ఏమిటి?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ బిగ్బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక కృతజ్ఞతా సందేశాన్ని కూడా బిగ్బీ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెటర్ గురించి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది. ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు? గుండెలోని క్లాట్స్ను తొలగించేందుకు వినియోగించే ఆధునిక టెక్నాలజీ ఆంజియోప్లాస్టీ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించినపుడు, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత హానికరమైన క్లాట్స్ను గురించినట్టయితే ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు, ప్రాణాపాయం నుంచి కాపాడతారు. -
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ నేటి నుంచి ప్రారంభం
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) తొలి ఎడిషన్ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్ లీగ్ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్ టాలెంట్ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు.. ఐఎస్పీఎల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. చీఫ్ మెంటార్గా రవిశాస్త్రి.. ఈ లీగ్కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చీఫ్ మెంటార్గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, జతిన్ పరంజపే సెలెక్షన్ కమిటీ హెడ్లుగా పని చేయనున్నారు. అమితాబ్ వర్సెస్ అక్షయ్.. ఈ లీగ్లోని తొలి మ్యాచ్లో అమితాబ్ మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్లోని అన్ని మ్యాచ్లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్లోనూ వీక్షించవచ్చు. సచిన్ జట్టుతో తలపడనున్న అక్షయ్ టీమ్.. ఇవాళ జరుగబోయే ఓపెనింగ్ మ్యాచ్కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. -
RGV Den: హైదరాబాద్కు అమితాబ్ బచ్చన్.. ఆర్జీవీ డెన్లో సందడి (ఫొటోలు)
-
ఆర్జీవీ డెన్లో అమితాబ్ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. ఆర్జీవీతో సినిమా అంటే కథ వినకుండా ఓకే చెప్పే నటుల్లో అమితాబ్ ఒక్కరు. ఆర్జీవీ ముంబైకి వెళ్లిన ప్రతిసారి అమితాబ్ను కలుస్తుంటారు. అపాయింట్మెంట్ లేకుండానే అమితాబ్ని ఇంటికి వెళ్లి కలిసే అతి కొద్దిమందిలో వర్మ ఒక్కరు. సర్కారు సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. (చదవండి: మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్) అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్(2005) సినిమా తెరకెక్కించి బిగ్ హిట్ ఇచ్చాడు వర్మ. ఆ తర్వాత 2008లో ఈ మూవీకి సీక్వెల్గా ‘సర్కార్ రాజ్’ అనే సినిమా చేశారు. అదీ సూపర్ హిట్ అయింది. 2017లో సర్కార్ 3 తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఫ్రీ టైమ్ దొరినప్పుడల్లా వీరిద్దరు కలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్కు వచ్చిన అమితాబ్.. ఆర్జీవీ డెన్లో సందడి చేశారు. డెన్ మొత్తం కలియతిరిగి.. ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 తన కార్యాలయానికి వచ్చిన సర్కార్(అమితాబ్ని ఆర్జీవీ ముద్దుగా సర్కార్ అని పిలుస్తుంటాడు)కి ఆర్జీవీ సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి డెన్ మొత్తం చూపించాడు. అలాగే ఆఫీస్లోని తన సీట్లో కూర్చొబెట్టి.. సర్కార్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేస్తూ.. సర్కార్ నా సీటులో కూర్చున్నాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN 💐💐💐 pic.twitter.com/jnboZKlhHc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 అలాగే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ సైతం ఆర్జీవీ డెన్లో ఆమితాబ్ని కలిశాడు. దానికి సంబంధించిన ఫోటోని ఎక్స్లో షేర్ చేస్తూ..‘నేను, దాసరి కిరణ్ కలిసి అమితాబ్తో ‘వ్యూహం’ రచించాము అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి వ్యూహం ప్రమోషన్ కోసమే అమితాబ్ హైదరాబాద్ వచ్చారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం కల్కీ 2898 సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. విరామ సమయంలో ఆర్జీవీని కలిశాడు.ఆర్జీవీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ మార్చి 2న విడుదల కాబోతుంది. SHIVA ing with @SrBachchan at RGV DEN 🔥🔥🔥 pic.twitter.com/RIKwFeh7fK — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
అమితాబ్ మనవడికి ఎగ్జిమా! ఇది ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ప్రేకక్షుల ప్రశంసలందుకుంటున్నారు అమితాబ్. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతికి అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మనవడు అగస్త్య నంద 'ది ఆర్చీస్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్యూలో తాను ఎగ్జిమా అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఎగ్జిమా? ఎందువల్ల వస్తుంది. అగస్త్య సోదరి నవ్య నేవలి నంద హోస్ట్ చేసిన 'వాట్ ది హెల్ నవ్య పాడ్క్యాస్ట్' ప్రోగ్రాంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయబచ్చన్తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ముగింపులో చర్మ సంరక్షణ విషయంలో ఎవరిని సంప్రదిస్తారని ప్రశ్నించగా అగస్త్య తాను తల్లినే ఆశ్రయిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎగ్జిమా(తామర)తో బాధపడుతున్నట్లు అగస్త్య తెలిపారు. ఇది తనను బాగా వేధించే సమస్య అని అన్నారు. తన సహ నటులతో కలిసి నటించే సమయంలో ఈ సమస్య కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తాను ఎక్కువగా సన్స్క్రీన్ లోషన్, ఫేస్క్రీమ్, షేస్ వాష్ వంటి వాటిని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటానని అన్నారు. అయితే తామరకు ఇంతవరకు బెస్ట్ అయింట్మెంట్ అంటూ ఏదీ లేకపోవడం బాధకరం అని చెప్పారు. దయచేసి దానికి సరైన మందు కనుక్కొండని వేడుకున్నాడు అగస్త్య. ఇంతకీ ఏంటీ ఎగ్జామా అంటే.. ఎగ్జిమా అంటే.. తామర అనేది పిల్లలను పెద్దలను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ పరిస్థితి. దీనిని అటోపిక్ ఎగ్జిమా లేదా తామర అని కూడా అంటారు. దీని వల్ల చర్మంలో అస్సలు తేమగా ఉండదు. అస్తమాను పొడిగా ఉండి చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా చర్మం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయ్యి ఒక విధమైన గీతలు, చారలు రావడం జరుగుతుంది. అది కాస్త దురదగా, ఇరిటేట్గా ఉంటుంది. పోని గోకితే వెంటనే మరింత దురదగా ఉండి ఎర్రగా బొబ్బల్లా రావడం జరగుతుంది. లక్షణాలు.. చర్మం పొడిగా ఉండి, ఎరుపుగా ఉంటుంది. ఎక్కువుగా మోచేతుల మడతలు, మోకాళ్ల వెనుక, మణికట్టు, చీలమండలలో వస్తుంది. ఎక్కువుగా పెద్దలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఎక్కువుగా మెడ, ముఖంపై వస్తుంది. ఓ నాణెం సైజులో చేతులు, కాళ్లు, లేదా వీపుపై ఎర్రగా వస్తుంటాయి. అయితే ఎందువల్ల ఇలా వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబపరంగా వచ్చే వ్యాధే ఇది కూడా. అయితే వ్యక్తుల పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ తామర వస్తుందని వైద్యలు చెబుతున్నారు. తామర రావడానికి గల కారణాలు.. వ్యాధి నిరోధక శక్తి.. కొందరిలో వ్యాధి నిరోధక శక్తి వాతావరణంలో ఉండే బ్యాక్లీరియా లేదా వైరస్లకు అతిగా ప్రతిస్పందించడంతో అలెర్జీలకు దారితీయడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. అందువల్ల ముందుగా మన వ్యాధినిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకునేలా ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. జీన్స్.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. కుటుంబంలో ఎవ్వరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారి తర్వాత తరాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ కారకాలు.. కొందరూ పొడి వాతావరణంలో జీవిచడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వాతావరణంలో తేమ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైనా.. మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జిటీ, డిప్రెషన్ వంటి వాటికి గురైనా ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా సరిగా లేకపోయినా శరీరంపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు. వైద్యులు వద్దకు సకాలంలో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యను ఆదిలోనే నియంత్రించొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే పరిస్థితి మరింత జటిలం కాకమునుపే ఈ ఎగ్జిమాకు చికిత్స తీసుకోవడమే అని విధాల మంచిదని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: 'శబ్దమే శాపం ఆమెకు' అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..) -
అప్పుడు అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు మహేశ్ బాబు
పబ్లిక్ ఫిగర్స్ (ప్రముఖులు) వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ల వరకు ఆయా ప్రొడక్ట్ ల అమ్మకాలు జరిగేలా బ్రాండ్ అంబాసీడర్లుగా రాణిస్తున్నారు. ఆయా ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా ప్రచారం చేస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్, సినిమా స్టార్లయినా బ్రాండ్ అంబాసీడర్గా వాళ్లు చేయాల్సిందల్లా మూమెంట్లు,డబ్బింగ్ చెబితే సరిపోతుంది. ఒక్కసారి సదరు బ్రాండ్ అంబాసీడర్ యాడ్ మార్కెట్ లోకి విడుదలైందా అంతే సంగతులు. ఊహించని లాభాల్ని చూడొచ్చు. అందుకే చిన్న చిన్న కంపెనీల నుంచి బడబడా కంపెనీల వరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని తమ కంపెనీ ప్రొడక్ట్ ల అమ్మకాల కోసం బ్రాండ్ అంబాసీడర్ లు గా నియమించుకుంటాయి. వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించుకుంటాయి. తాజాగా, డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. గత ఏడాది తన స్మార్ట్ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ను అందించిన 'ఫోన్ పే'.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ను జోడించింది. ఇకపై చెల్లింపులు చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అనే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కి బదులు 'మహేశ్ బాబు' గొంతు వినిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ పే ప్రతినిధులు మహేష్ వాయిస్ తీసుకుని కృత్రిమ మేధస్సు ద్వారా వాయిస్ను జనరేట్ చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్ చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ధన్యవాదాలు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. Babu voice vasthundhi phone pay lo ma shop lo 💥💥😅🔥@urstrulyMahesh #GunturKaaram #SSMB29 pic.twitter.com/1lib8hIjl7 — babu fan ra abbayilu 💥💥🔥🤙 (@Vamsi67732559) February 20, 2024 బిగ్ బికి ఎంత రెమ్యునరేషన్ అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 30కి పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా పనిచేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరి బ్రాండ్ అంబాసీడర్ గా పని చేస్తూ తన ప్రచారంతో ఆయా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో సంస్థ నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. -
సెల్ఫ్ మేడ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అమితాబ్ బచ్చన్ ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాలీవుడ్ బిగ్ బి నటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 55 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఏఐతో చేసిన తన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. ‘‘సినిమా అనే అద్భుత ప్రపంచంలో 55 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ‘సెల్ఫ్ మేడ్’’ అంటూ అమితాబ్ బచ్చన్ ఈ ఫొటోలను ఉద్దేశించి పేర్కొన్నారు. నిజంగానే అమితాబ్ ‘సెల్ఫ్ మేడ్’. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎన్నో కష్టాలు పడి అమితాబ్ బచ్చన్ స్టార్ యాక్టర్గా ఎదిగారు. కెరీర్ తొలి నాళ్లలో ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు కూడా. తిరస్కరణలకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్నాళ్లు ముంబై మెరీనా బీచ్లో గడిపారు. ఎన్నో సవాళ్లను దాటుకుని 1969లో అమితాబ్ ‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో యాక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే న్యూ కమర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు అమితాబ్. అదే ఏడాది ఉత్పల్ దత్ హీరోగా చేసిన ‘భువన్ షోమ్’ సినిమాకు నరేటర్గా చేశారు అమితాబ్. ఆ తర్వాతే మధు, ఉత్పల్లతో కలిసి అదే ఏడాది ‘సాత్ హిందూస్థానీ’ సినిమాతో అమితాబ్ ఎంట్రీ జరిగింది. అలా ముందు తన గొంతు వినిపించి, ఆ తర్వాత నటుడిగా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. ‘భువన్ షోమ్’ చిత్రం మేలో విడుదల కాగా, ‘సాత్ హిందూస్థానీ’ చిత్రం నవంబరులో విడుదలైంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, రజనీకాంత్ ‘వేట్టయాన్’తో పాటు హిందీలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అమితాబ్ బచ్చన్. -
ఆస్తుల వివరాలు వెల్లడించిన జయా బచ్చన్
అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్.. బీటౌన్లో మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ జంట. ఇద్దరిదీ సినిమా బ్యాక్గ్రౌండే.. కాకపోతే బిగ్బీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్గా కొనసాగుతుండగా జయా బచ్చన్ మాత్రం పాలిటిక్స్లో రాణిస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈమె ఈ మధ్యే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్ వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022 - 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది. ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్ ప్రకటించారు. చదవండి: Valentine's Day 2024: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! -
చివరి ఘట్టానికి చేరుకున్న ప్రభాస్ 'కల్కి'
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ ఈ నెల రెండో వారంలో చిత్రీకరించేలా ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె.. ఇలా ఈ సినిమా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్తో ఈ సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే గొప్ప.. బిగ్బీ గుస్సా!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మీద విపరీతమైన నెగెటివిటీ వచ్చేసింది. స్టార్ కిడ్స్కు అందలమిస్తారని, వేరేవాళ్లను తొక్కేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో హిందీ సినిమాలను ఎవరూ చూడొద్దు, బ్యాన్ చేసేద్దామని నెటిజన్లు సంకల్పించుకున్నారు. ఆ తర్వాత రిలీజైన సినిమాల్లో చాలామటుకు ఫ్లాప్స్గా నిలిచిపోయాయి. అదే సమయంలో సౌత్ సినిమాలు అందరినీ ఆకర్షించాయి. పాన్ ఇండియాగా రిలీజైన చిత్రాలు జనాలను మెప్పించాయి. దీంతో బాలీవుడ్ పనైపోయింది. సౌత్ ఇండస్ట్రీదే హవా.. అన్న టాక్ మొదలైంది. ఇప్పటికీ చాలాచోట్ల దక్షిణాది చిత్రాలను పొగుడుతూ హిందీ సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. ఇది బిగ్బీ అమితాబ్ బచ్చన్కు బాధ కలిగిస్తోందట! సినిమాలను ఎందుకు తప్పుపడతారు? సౌత్ వర్సెస్ బాలీవుడ్ అన్న అంశంపై అమితాబ్ తీవ్రంగా స్పందించాడు. అలాగే సినిమాల మీద వ్యతిరేకత గురించి కూడా సంభాషించాడు. ఆయన మాట్లాడుతూ.. 'జనాల్లో వచ్చే మార్పులకు, సమాజంలో సంఘటనలకు సినిమాలే కారణమంటూ అనేకసార్లు మూవీ ఇండస్ట్రీనే తప్పుపడుతూ ఉంటారు. ఈ ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు, అనుభవాల నుంచే కథలు, సినిమాలు పుడతాయి. ఆ యదార్థ సంఘటనలే సినిమాగా తెరకెక్కుతాయి. ఈ మధ్య ప్రాంతీయ సినిమాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అందుకే అద్భుతంగా కనిపిస్తున్నాయి ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీ సినిమా బాగుంది అని వాళ్లను ప్రశంసించినప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? హిందీలో ఎలాంటి సినిమాలైతే తీశారో అలాంటి వాటినే అక్కడ తెరకెక్కిస్తున్నామన్నారు. దీవార్, శక్తి, షోలే సినిమాలను రీమేక్ చేస్తున్నామని, వాటి సారాన్ని వాడుకుంటున్నామన్నారు. కాకపోతే మలయాళం సినిమా అలాగే కొంతవరకు తమిళ సినిమాలు మాత్రం వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అలా అని మా ఇండస్ట్రీ కంటే అదే గొప్ప అని చెప్పడం సరి కాదు' అన్నాడు బిగ్బీ. చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్పై భార్య ఫిర్యాదు! -
ముఖేష్ అంబానీ మరియు అమితాబ్ బచ్చన్ విజువల్స్
-
అయోధ్య రామాలయానికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement