-
ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్
అశ్విన్బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మాలి నిర్మించిన చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు వికాస్ బాడిస స్వరకర్త. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
సరికొత్త కథతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న అర్బాజ్ ఖాన్!
'జై చిరంజీవ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అర్బాజ్ ఖాన్. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు. యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక డిఫరెంట్ కథలో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని అర్బాజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'అని అన్నారు. -
వైవిధ్యమైన కథ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర. -
మెడికో థ్రిల్లర్.. యంగ్ హీరో ప్రయోగం
అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో ఆలూరి సురేష్ నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 1) అశ్విన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘మెడికో థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్గా మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: గౌర హరి. -
అనుకున్నవన్నీ జరిగాయి
అశ్విన్బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్ మీట్లో అశ్విన్ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. -
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ
టైటిల్: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె తదితరులు నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: అనిల్ కన్నెగంటి విడుదల తేది: జులై 20, 2023 కథేంటంటే.. హైదరాబాద్లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్గా చూపించినా వారికి అర్థం కాకపోతే అంతే సంగతి. ‘హిడింబ’లో ఆ పొరపాటే జరిగింది. వాస్తవానికి ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడి తప్పిదమే లేదా ఎడిటింగ్ లోపమో తెలియదు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్ లినియర్ స్క్రీన్ప్లేతో(ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే..మరొక సీన్ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి దర్శకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడేమో కానీ అది వర్కౌట్ కాకపోవడమే కాకుండా ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది. నగరంలో వరుస కిడ్నాపులు జరగడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం ఇలా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఫస్టాఫ్ సాగుతుంది. కాలబండాలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్ సీన్ ఆకట్టకుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చూడడానికి బాగుంటుంది కానీ సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్లో ఉంటుంది. హిడింబ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్ప్రైజ్లు ప్రేక్షకులను ధ్రిల్కు గురిచేస్తుంది. అయితే దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్కు సంబంధించిన క్లూలు లభించడం, నగరం దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళ వెళ్లడం, ఇలా చెప్పుకుంటూ చాలా సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. స్క్రీన్ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. పోలీసు అధికారి అభయ్ పాత్రకు అశ్విన్ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్ సీన్స్ స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్పా మరొకరిని ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
అశ్విన్ బాబు, అనిల్ సుంకర కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
-
ఒక చరిత్రను వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే కథే ‘హిడింబ’
‘‘కథని బలంగా నమ్మి చేసిన చిత్రం ‘హిడింబ’. స్క్రీన్ప్లే, విజువల్స్ రెగ్యులర్గా కాకుండా మా మూవీలో కొత్తగా ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అని హీరో అశ్విన్ బాబు అన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘హిడింబ’ రివర్స్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ– ‘‘ఒక చరిత్ర వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిడింబ’. నాకు గొప్ప తృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు గంగపట్నం శ్రీధర్. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా: హీరోయిన్
‘‘స్టార్డమ్ అనేది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యమైన పాత్రలు చేశాను. ‘హిడింబ’తో నాకు స్టార్డమ్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అన్నారు నందితా శ్వేత. అశ్విన్బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. (ఇది చదవండి: రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది: నటి) ఈ సందర్భంగా హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘హిడింబ’లో ఆద్యా అనే పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. ఇక దాదాపు నాలుగేళ్లుగా కండరాలకు సంబంధించిన ఫైబ్రోమాల్జియాతో ఇబ్బంది పడుతున్నాను. దీనివల్ల భారీగా కసరత్తులు, డైట్ చేయకూడదు. నిద్రలేమి ఉండకూడదు. కానీ ‘హిడింబ’ కోసం ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా కొంత స్ట్రగుల్ అయ్యాను. నేను చేసిన ‘మంగళవారం’ , ఓ మంచి ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఒకటి, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. (ఇది చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్) -
'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే'
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం 'హిడింబ'. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని జానర్' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్లో వేశారు మేకర్స్. (ఇదీ చదవండి: రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్తో!) 'యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, థ్రిల్ని ఇచ్చేలా ‘హిడింబ’ని మలిచారు అనిల్ కన్నెగంటి. ఈ చిత్రంలో కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ వారు చెప్పారు. దీంతో రివ్యూ కమిటీ ద్వారా సినిమాని రీ–సెన్సార్ చేసి విడుదల చేస్తున్నాం' అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాదిసా, కెమెరా: బి. రాజశేఖర్. -
'ఇప్పటి వరకు అన్నీ నువ్వే'.. ఏడ్చేసిన హీరో అశ్విన్!
-
'నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా'.. హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం!
టాలీవుడ్లో యంగ్ హీరో అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు గారి గది సిరీస్తో అభిమానులను మెప్పించారు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీనియస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మెప్పించారు ఆయన నటించిన రాజుగారి గది సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. రాజు గారి గది సిరీస్ చిత్రాలకు అతడి అన్నయ్యే దర్శకుడు కావడం విశేషం. (ఇది చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్) హిడింబ చిత్రం మరోసారి అభిమానులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఓంకార్ యాంకర్గా హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అశ్విన్తో పాటు హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ కూడా వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో పాల్గొన్న తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి తమ్ముడితో సిక్త్ సెన్స్ షో ఆడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారిని ప్రశ్నించిన ఓంకార్.. తన తమ్ముడికి కూడా ఓ ప్రశ్న వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ ప్రశ్నకు అశ్విన్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. 'ఇప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ' కన్నీటి పర్యంతమయ్యాడు. తమ్ముడిని చూసిన అన్నయ్య కూడా ఫుల్ ఎమోషనల్గా కనిపించారు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ముులు కాగా.. చిన్నతమ్ముడు నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. తన తమ్ముళ్ల కోసం ఓంకార్ ఎంత ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. -
‘హిడింబ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది
‘‘క్రికెట్ వల్ల అశ్విన్ తో నాకు పరిచయం ఏర్పడింది. అశ్విన్ హీరోగా నటించిన ‘హిడింబ’ ట్రైలర్ లాంచ్కు రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ‘హిడింబ’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సాయిధరమ్ ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అశ్విన్ బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ నా కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నుంచి హిస్టారికల్ ఫిక్షన్ కు వెళ్లే చిత్రమిది. అశ్విన్ యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాతో తెలుస్తాయి’’ అన్నారు అనిల్. ‘‘అశ్విన్ సపోర్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: బి. రాజశేఖర్. -
ఘనంగా ప్రారంభమైన అశ్విన్ బాబు కొత్త సినిమా
‘రాజుగారి గది’ ఫేం అశ్విన్ బాబు కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత అశ్విన్ నటిస్తున్న ఈ చిత్రం ఇది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. డీఎస్సార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఓపెనింగ్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
అశ్విన్ బాబు యాక్షన్ థ్రిల్లర్.. కొత్త ఏడాదిలో ప్రారంభం..!
విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ రాజు గారి గది సినిమా సిరీస్తో ఘన విజయాన్ని సాధించిన హీరో అశ్విన్ బాబు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్గా 'హీడింబ'తో మరోసారి తన సత్తా చాటనున్నారు . దమ్మాలపాటి కృష్ణారావు ఆశీస్సులతో.. శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్పై అశ్విన్ బాబుతో కొత్త ఏడాదిలో ప్రముఖ నిర్మాత డీఎస్ఆర్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటిస్తున్న అశ్విని బాబు తదుపరి చిత్రం ఒక విభిన్న మైన స్టోరీ లైన్తో,మెడికల్ థ్రిల్లర్గా రూపొందుతుంది. ఈ చిత్రంతో ఎం.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో.. మంచి టెక్నికల్ వాల్యూస్తో ఉన్న చిత్రాలు నిర్మించనున్నట్లు చిత్ర నిర్మాత డీఎస్ఆర్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
యాక్షన్తో అదరగొట్టిన అశ్విన్.. ఆసక్తిగా 'హిడింబ'
Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released: విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. జీనియస్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్గా అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా నందితా శ్వేత నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ రిలీజైన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. 'పోలీసు ఆపరేషనా' అంటూ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే డైలాగ్తో ప్రారంభమైన ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఓ బాలుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కినట్లు సమాచారం. హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్్ అద్భుతంగా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీతో అశ్విన్కు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. చదవండి: అదరగొట్టిన కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. -
అశ్విన్బాబు కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
యాంకర్ ఓంకార్ తమ్ముడు, ‘జీనియస్’ఫేమ్ అశ్విన్బాబు హీరోగా, అనిల్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అశ్విన్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఆదివారం ఆ సినిమా టైటిల్తో పాటు, ఫస్ట్లుక్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘హిడింబ’ అనే విభిన్న పేరుని ఖరారు చేశారు. తలపై రక్తపు చుక్కలు.. చేతిలో ఇనుప చువ్వను పట్టుకుని సీరియస్లో లుక్లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు అశ్విన్. బట్టి చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో అశ్విన్ సరసన నందితా శ్వేత నటిస్తోంది. రఘుకుంచె, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ పతాకంపై గంగాపట్నం శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వికాస్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రేక్షకుల సపోర్ట్ చాలు
ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘రాజుగారి గది–3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్బాబు, అవికాగోర్ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ –‘‘నా తమ్ముడు అశ్విన్ను హీరోగా యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాధారణంగా పెద్ద íహీరో సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఫుల్ అవుతుంటాయి. అలాంటిది మా ‘రాజుగారి గది 3’ చిత్రం ఫుల్ అవుతోంది’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నేను కూకట్పల్లిలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాను. వారందరూ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఆడాలంటే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే చాలు’’ అన్నారు. ‘‘4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. అశ్విన్ ప్రాణం పెట్టి నటించారు’’ అన్నారు కెమెరామెన్ ఛోటా. కె. నాయుడు. ‘‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఈ చిత్రంతో నాకు ఓ మార్కెట్ ఏర్పడింది అని ఫ్రెండ్స్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అశ్విన్. ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మా యూనిట్కి అభినందన లు’’ అన్నారు అవికాగోర్. సంగీత దర్శకుడు షబ్బీర్ పాల్గొన్నారు. -
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
-
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగారి గది 3 జానర్ : హర్రర్ కామెడీ నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ సంగీతం : షబీర్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ‘ఆట’లాంటి షోస్తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి! కథ..: మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి. ఎవరు ఎలా చేశారు? రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు. విశ్లేషణ..! హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్గా చెప్పవచ్చు. సెకండాఫ్లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్రూపంలో చెప్పడం కన్విన్సింగ్గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు. బలాలు కామెడీ సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓంకార్ టేకింగ్ బలహీనతలు కథ, కథనాలు సాలిడ్గా లేకపోవడం హార్రర్ పెద్దగా లేకపోవడం ఫస్టాఫ్లో సాగదీత ఫీలింగ్ - శ్రీకాంత్ కాంటేకర్ -
మూడో గదిలో వినోదం కూడా ఉంది
‘‘నా సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తాను. కథ నచ్చితేనే ప్రేక్షకులు హిట్ చేస్తారు. ‘రాజుగారి గది 3’ సినిమా కథపై నాకు నమ్మకం ఉంది. తప్పక విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఓంకార్. అశ్విన్బాబు, అవికా గోర్ జంటగా ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాజుగారిగది 3’. ఈ చిత్రం నేడు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన విశేషాలు. ► ‘రాజుగారి గది’ (2015) విజయానికి ఆ సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలే కారణం. అందులో మంచి సందేశంతో పాటు వినోదం కూడా ఉంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ‘రాజుగారి గది 2’ (2017)లో మంచి సందేశం ఉంది కానీ వినోదాన్ని మిస్సయ్యాం అని ప్రేక్షకులు అన్నారు. ‘రాజుగారి గది 3’ మంచి వినోదాన్ని అందిస్తుంది. ► ఈ సినిమా కథ రాసుకుంటున్నప్పుడే నా తమ్ముడు అశ్విన్ హీరోగా సరిపోతాడనిపించింది. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లోనే కాక, ఇతర సినిమాల్లోనూ అశ్విన్ నటించాడు. కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘రాజుగారి గది 3’ తర్వాత అశ్విన్కు హీరోగా మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను. అవికా అద్భుతంగా నటించింది. ► ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం కాజల్, తాప్సీలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఫైనల్గా అవికాను తీసుకున్నాం. కథలో కూడా కొన్ని మార్పులు చేశాం. కానీ తమన్నాకు నేను చెప్పిన కథ వేరే. ఈ కథతో ఓ అగ్ర కథానాయికతో భవిష్యత్లో సినిమా చేయాలనుకుంటున్నాను. అలాగే ‘రాజుగారి గది 2’ సినిమాను వెంకటేశ్గారితో తెరకెక్కించాలనుకున్నా. వేరే సినిమాలతో ఆయన బిజీగా ఉండటం వల్ల నాగార్జునగారితో తీశాం. వెంకటేశ్గారితో ఓ సినిమా చేయాలన్నది నా కోరిక. ‘రాజుగారి గది’ సిరీస్లో ఓ చిత్రాన్ని ఆయనతో చేయాలని ఉంది. ► నేను అక్టోబరులో పుట్టాను. ‘రాజుగారి గది’ సిరీస్లో వస్తోన్న ప్రతి సినిమా అక్టోబరులోనే విడుదలవుతోంది. ‘రాజుగారి గది 3’ సినిమా నాకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడినిగానే కొనసాగుతాను. ► నేను చేస్తోన్న ఓ రియాలిటీ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నా దగ్గర ‘రాజుగారి గది 4’ కథతో పాటు, ఓ క్రీడా నేపథ్యంలో సాగే కథ ఉంది. వీటిలో ఏ సినిమా ముందు సెట్స్పైకి వెళ్తుందనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
Advertisement