-
అప్పుడు 'బేబీ'.. ఇప్పుడు 'బ్యూటీ'!
గతేడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బేబి' కచ్చితంగా ఉంటుంది. అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్కు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి ఒకడు. ఇప్పుడు ఈయన నుంచి మరో సినిమా వస్తోంది. దానికి 'బ్యూటీ' అని పేరు ఖరారు చేశారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్తో కలిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 22న లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపించారు. అయితే అందులో కల్ట్ పాయింట్ పట్టుకొన్నారు. అది యూత్కి బాగా నచ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేనని సమాచారం. 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్) -
తెలుగుతనం ఉట్టిపడుతున్న ‘బేబీ’ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్లో కనిపించిన సీన్కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు
బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంగా 'బేబీ' సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. (ఇదీ చదవండి : వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: టాప్ హీరోయిన్) ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ సాయి రాజేశ్కు తాను చెప్పానంటూ శిరిన్ శ్రీరామ్ తాజాగా తెలుపుతున్నాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు ఆయన తెలుపుతున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం. ' 2015లో 'కన్నా ప్లీజ్' టైటిల్తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు 'ప్రేమించొద్దు' అని టైటిల్ పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 2023లో 'బేబీ' టైటిల్తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేశ్ డైరెక్టర్గా ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన 'ప్రేమించొద్దు' స్టోరీనే అని శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. -
కంటెంట్పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్తో సినిమా రాలేదు.' అన్నారు. -
బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్కేఎన్ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఐకాన్స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్కేఎన్ తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్కెఎన్కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. -
బేబీ నిర్మాత 'ఎస్కేఎన్' ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గారు అయిన శ్రీ గాదె సూర్య ప్రకాశరావు గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగ ఆయన మరణించినట్లు తెలుస్తోంది.దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్కేఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నేడు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఎస్కేఎన్ కుటుంబం తెలిపింది. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్కేఎన్ మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్గా ఆపై పీఆర్ఓగా ఇండస్ట్రీలో తన జర్నీ ప్రారంభించాడు. తర్వాత అల్లు అరవింద్ కుటుంబానితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అతన్ని నిర్మాతను చేసింది. దీంతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడు అయన డైరెక్టర్ సాయి రాజేష్తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. . -
Rewind 2023: బడ్జెట్తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్గా నిలిచిన స్మాల్ మూవీస్పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్టాక్తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్గా!
'బేబి' సినిమాతో నిర్మాత ఎస్కేఎన్.. తెలుగు ఇండస్ట్రీకి క్రేజీ హిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై వరస మూవీస్ నిర్మిస్తున్నారు. 'బేబి' హీరోహీరోయిన్ కాంబోలో ఓ చిత్రం, రష్మిక మెయిన్ లీడ్గా 'గర్ల్ఫ్రెండ్' అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్గానే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) మరోవైపు సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా తీస్తున్న నిర్మాత ఎస్కేఎన్.. తను నిర్మించే ఓ కొత్త మూవీ కోసం 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే 'బేబి' హిట్ కావడంతో అప్పుడు ప్రమోషన్స్ కోసం పోస్టర్స్పై కల్ట్ బొమ్మ అని వేశారు. ఇప్పుడు ఈ పదాన్ని ఏకంగా మూవీ టైటిల్ చేసేయడం డిఫరెంట్గా అనిపించింది. ఏమైనా బేబి ప్రమోషన్లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్గా ఉంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు
సినిమా విజయానికి కంటెంట్ ప్రధాన కారణం.దీనికి రుజువుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు.కథ బలంతో వచ్చి..ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తున్నాయి.తక్కువ బడ్జెట్లో నిర్మాణం జరుపుకుని లాభాల పంట పండిస్తున్నాయి. 2023 లో వచ్చిన స్మాల్ మూవీస్ ఇందుకు సాక్షంగా నిలిచాయి. ఒకటో రెండో కాదు..ఎన్నో సినిమాలు..విజయ ఢంకా మోగించాయి. ప్రేక్షకులను కనుల విందు చేసాయి. స్టార్స్ నటించకున్నా కూడా..మంచి కలెక్షన్లు రాబట్టి మేము కూడా ఫేమస్ అని నిరూపిస్తున్నాయి. ఆ మధ్య తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన కీడా కోలా మూవీ థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకు సూపర్ హిట్ స్టెటస్ కూడా దక్కింది. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే...తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు..ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్. తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్ను అట్రాక్ట్ చేసాడు. రీసెంట్గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తర్వాత వెంకటేశ్తో తరుణ్ మూవీ పట్టాలు ఎక్కాల్సింది. కాని ఈ మూవీ ప్రారంభం అవటం ఆలస్యం అవుతుండటంతో..ఈ లోపు కీడా కోలా మూవీకి మెగా ఫోన్ పట్టుకున్నాడు. మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో విడుదలయింది.మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆడియన్స్ ఈ థ్రిల్లర్ సబ్జెక్టు బ్రహ్మరథం పట్టారు.ఇటీవల మా ఊరి పొలిమేర మూవీకి సెకండ్ భాగం కూడా విడుదల అయింది.అయితే ఈ సారి థియేటర్లలోకి వచ్చింది.ఫస్ట్ భాగానికి వచ్చిన స్పందనతో...రెండో భాగానికి మంచి వసూళ్లు వచ్చాయి.సత్యం రాజేష్,బాలాదిత్యా లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. (చదవండి: వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు) ఈ ఇయర్ హిట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే..మ్యాడ్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి.అంతగా గుర్తింపు లేని యాక్టర్లు నటించిన ఈ కామెడీ డ్రామా..యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ..మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: ప్రభాస్ 'సలార్' షర్ట్ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?) మీడియం రేంజ్ హీరోలకే వందకోట్ల కలెక్షన్లు డ్రీమ్గా మారాయి. రేపో మాపో ఈ టార్గెట్ చేరుకోవాలి అనుకుంటున్నారు. అయితే బేబి లాంటి చిన్న సినిమా మాత్రం ..దాదాపుగా వందకోట్ల వసూళ్లుకు దగ్గరగా వెళ్లింది. ఆనంద్ దేవరకొండ కు ..బిగ్ హిట్ లేదు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేశ్కు కూడా..ఓ కమర్శియల్ విజయం లేదు. కాని..కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే భారీ విజయం సాధ్యం అయింది శ్రీవిష్ణుకి విజయం వచ్చి చాలా కాలామే అయింది. అయితే ఈ ఇయర్ మాత్రం..ఉహించని సక్సెస్ చూశాడు. సామజవరగమనతో..సూపర్ హిట్ అందుకున్నాడు.డిఫరెంట్ సబ్జెక్ట్తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆడియనన్స్ను ఫ్రెష్ ఫీల్ కలుగజేసింది.సెంటిమెంట్,ప్రేమ,మెసెజ్ లాంటి అన్ని అంశాలతో కట్టి పడేసింది. ఈ సినిమాలో సంభాషణలు ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకున్నాయి. మినిమిం బజ్తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో తెరకెక్కింది బలగం. ఈ మూవీ మీద ఏమాత్రం అంచానాలు లేవు. కాని కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ..చిన్న సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చెప్పటానికి పెద్ద ఉదాహారణగా ఈ మూవీ నిలిచింది. చావు చుట్టు తిరిగే ఈ మూవీ స్టోరీ. బందాలు,అనుభందాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మరో విజయం దక్కలేదు.మార్కెట్ కూడా పాడు చేసుకున్నాడు.దాంతో విజయం కంపల్ సరిగా మారింది.ఈ సారి బెదురు లంక 2012 మూవీతో వచ్చాడు.ఈ ఇయర్ థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని..డీసెంట్ హిట్ కొట్టింది.కార్తికేయను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.నేహా శెట్టి ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఇక ఈ నెలలో విడుదలైన మంగళవారం, కోట బొమ్మాళి చిత్రాలు కూడా హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అయితే ఇందులో మంగళవారం చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక కోట బొమ్మాళి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఏడాది వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరులో జరిగే సబ్జెక్ట్తో రూపొందిన పరేషాన్, డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన మిస్టర్ ఫ్రెంగ్నెంట్.. సుహాన్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాలు కూడా డీసెంట్ హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. -
సరికొత్త కథతో వస్తోన్న బేబీ నటుడు.. రిలీజ్ ఎప్పుడంటే?
బేబి చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. తాజాగా అతను హీరోగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయికగా నటిస్తోంది. అను ప్రసాద్ దర్శకత్వంలో శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను నిర్మాత నిరీష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలే విడుదలైన టీజర్కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో అందర్ని ఆకట్టుకుంటుంది. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నామని అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్కు 'దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ సంగీతమందిస్తున్నారు. -
అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే బేబీ హిట్తో జోష్లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు. మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు. -
కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత
పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) రియాక్ట్ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు. దీంతో ఎస్కేఎన్ ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తన ఫ్రెండ్ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం. ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్కేఎన్కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు. Sad to know & it's very unfortunate to see their innocence keep money like that Can any one share their contact please Would like to help them — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023 -
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్గా సాయి రాజేష్కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
'బేబి' డైరెక్టర్కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
బేబి.. ఈ ఏడాది బ్లాక్బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ తీశారు. అద్భుతమైన టాక్తో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి:'బిగ్బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) అలా ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది 'బేబి'. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్కు నిర్మాత ఎస్కేఎన్.. ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్గా ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన ఎస్కేఎన్.. డైరెక్టర్కి ఓ కారు బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు బేబి సక్సెస్ అయిన సంతోషంలో బెంజ్ కారుని గిఫ్ట్గా అందించారు. దీని ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లో హిట్ అయిన బేబి.. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి రాజేశ్.. తన తర్వాతి సినిమా కూడా ఎస్కేఎన్తోనే చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) -
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్కి తగ్గట్టు ఫుల్గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్బండ్కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
భయం.. అత్యాశ.. కుట్ర
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం టీజర్ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ‘బేబీ’ తో ఆడియన్స్ ఎంత ఎమోషనల్ అయ్యారో, ‘గం..గం..గణేశా’ చిత్రంతో అంత ఎంటర్టైన్ అవుతారు. ఉదయ్ కథ, విజన్ను నమ్మి ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ కారుమంచి. ‘ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది’’ అన్నారు ఈ చిత్ర సహనిర్మాత అనురాగ్ పర్వతనేని. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది చెప్పలేం. అలా కొన్నాళ్ల ముందు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి, బీభత్సం సృష్టించిన మూవీ అంటే గుర్తొచ్చేది 'బేబి'నే. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లు తీసిన ఈ ట్రాయాంగిల్ లవ్స్టోరీ.. యువతకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లిపై కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఆ చిన్న సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించి పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. 'బేబి' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఈమె నటనకిగానూ అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చేసే బిజీలో ఉన్న ఈమె.. తాజాగా ఓ యూట్యబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్, సినిమా కష్టాలు అన్ని చెప్పింది. అయితే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. 'నాకు కాబోయే భర్త గురించి పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోవడం లేదు. ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా, అందంగా లేకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి మనసు ఉంటే చాలు' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. అయితే ఈ కాలంలో ఇలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయిలంటే చాలా వెతకాల్సి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటి నుంచి స్ట్రీమింగ్) -
'బేబి'లో వైష్ణవి పెళ్లి చేసుకున్న నటుడితడే! అమ్మాయి చేతిలో మోసపోయానంటూ..
బేబి సినిమా.. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన దృశ్యకావ్యం. చెప్పుడు మాటలు విని తప్పటడుగులు వేసే అమ్మాయి.. ప్రేమించిన అమ్మాయి చేసిన మోసాన్ని తట్టుకోలేక పిచ్చోడైన ప్రియుడు.. చనువిచ్చింది కదా అని అలుసు తీసుకునే కుర్రాడు.. ఇలా ఈ ముగ్గురి కథే బేబి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బేబి క్లైమాక్స్లో వైష్ణవి.. హీరోలిద్దరినీ కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లికొడుకు కొన్ని సెకన్లే కనిపించినప్పటికీ బాగా వైరలయిపోయాడు. డైరెక్టర్ కాబోయి యాక్టర్ తనపై బోలెడన్ని మీమ్స్ కూడా వచ్చాయి. ఆ అభాగ్యుడు ఎవరా? అని అప్పట్లో అంతా తలలు బాదుకున్నారు. ఫైనల్గా బేబిని పెళ్లి చేసుకుందెవరో తెలిసిపోయింది. అతడి పేరు కృష్ణ మల్లిడి. తనది తూర్పు గోదావరి. ఆయన సోదరుడు వశిష్ట ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తున్నాడు. డైరెక్టర్ అవుదామనుకుని యాక్టరైన కృష్ణ కలర్ ఫోటో సహా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. బేబి సినిమాలోలాగే నిజజీవితంలోనూ ఓ అమ్మాయి మోసం చేసిందంటున్నాడు కృష్ణ. ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లవుతోంది. ఓసారి కారులో వెళ్తుండగా సాయిరాజేశ్ ఈ కథ చెప్పాడు. హీరోయిన్తో పెళ్లితో షూటింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో నాపై చాలా మీమ్స్ వేశారు. మొదట్లో కంగారుపడ్డాను. కానీ, ఈ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా ఉంటాయని నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నాను. బేబి సినిమాలోలాగే ఓ అమ్మాయి నన్ను మోసం చేసింది. అప్పటినుంచి ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది. ఆమె నాతో పాటు మరో అబ్బాయిని ఒకేసారి డేటింగ్ చేసింది. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఆమెను వదిలేయాలనుకోలేదు. నాతో పాటు మరొకరితో డేటింగ్.. అందరినీ వదిలేసి నేను నీ ఒక్కదాని గురించే పిచ్చోడిలా ఆలోచించాను. నా మనసంతా నువ్వే నిండిపోయావు అని చెప్పాను. ఆమె మరో అబ్బాయిని వదిలేయడానికి రెడీగా లేకపోవడంతో ఇద్దరితో ఉండమన్నాను. మూడు నెలలపాటు ఆమె నాతో, మరొకరితో ఉంది. నరకం అనుభవించాను. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. భార్యగా ఊహించుకున్న అమ్మాయి నీతో పాటు మరొకరితో ఉంటుందంటే ఆ బాధ భరించలేము. నా వల్ల కాలేదు, ఒకరోజు ఆమెను తిట్టేసి బ్రేకప్ చెప్పేశాను. అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడు. ఇలా నాకు మూడు బ్రేకప్లు జరిగాయి' అని చెప్పుకొచ్చాడు కృష్ణ. చదవండి: రతిక గుండెలో ఇంత బాధ మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్తో బ్రేకప్.. -
బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథకు యూత్ బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాపై సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. నా గుండె ఎందుకో అదురుతోంది డైలాగ్.. 'ఊహించని ముగింపుతో వచ్చిన అందమైన ప్రేమ కథ బేబి. ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్ ఓ చిన్న తప్పు చేసింది. ఈ తప్పును ప్రేమించినవాడికి చెప్పి ఉంటే సినిమా ముగింపు మరోలా ఉండేది. కానీ, ఆ తప్పును అతడితో చెప్పకుండా దాన్ని మర్చిపోయేందుకు మరో పెద్ద తప్పు చేసింది. ఏదో జరుగుతున్నట్లు నా గుండె ఎందుకో అదురుతోంది అన్న డైలాగ్తో ఏదో గండం రాబోతుందని డైరెక్టర్ ముందే హింటిచ్చాడు. సరిగ్గా అప్పుడే విరాజ్ ఎంట్రీ ఇవ్వడం.. హీరోయిన్ మేకప్ వేసుకోవడం.. తనలో మార్పులు రావడం చూపించారు. ఇంటర్వెల్లో విరాజ్కు ముద్దు.. కానీ సెకండాఫ్ ప్రారంభంలో.. హీరో ఆనంద్ ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్ వైష్ణవికి కొత్త ఫోన్ కొనిస్తాడు. కానీ ఎప్పుడైతే విరాజ్ ఐఫోన్ కొనిస్తాడో అప్పుడు ఆనంద్ ఇచ్చిన మొబైల్ను డబ్బా ఫోన్ అనేస్తుంది హీరోయిన్. దీంతో అతడు ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు. అతడిచ్చిన ఫోన్నే చులకన చేసింది మరి ఆటోవాడితో కలిసి జీవిస్తుందా? అన్న ప్రశ్నను మనలో రెకెత్తించారు. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్.. హీరోయిన్ విరాజ్కు కిస్ ఇస్తుంది. కానీ సెకండాఫ్ ప్రారంభంలో తన పెదాలు కడిగేసుకుంటుంది. అంటే తాగిన మత్తులో ఆ పని చేసిందే తప్ప తన ప్రేమ మాత్రం ఆనంద్ మీదే ఉందని అర్థమవుతుంది. హీరోయిన్కు చెడ్డ సలహా.. అయితే విరాజ్ తనను వదిలేయాలంటే అతడి దగ్గరకు ఒకసారి వెళ్లి వస్తే సరిపోతుందని హీరోయిన్కు ఆమె స్నేహితురాలు చెడ్డ సలహా ఇస్తుంది. కథను ఇలా రాసుకున్న సాయిరాజేశ్ గట్స్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఈ పాయింట్తో నా సినిమా ఏమైపోతుందోనని భయపడలేదు. ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు కూడా! శారీరకంగా ఒకరికి దగ్గరైన అమ్మాయి ఇంకొకరిని ధైర్యంగా పెళ్లి చేసుకోగలదా? కానీ హీరోయిన్ అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్లైమాక్స్తో సినిమా ఆడకూడదు. కానీ ఆడింది. హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది పెట్టుబడికి 7 రెట్ల డబ్బులు వసూలు చేసింది. సమాజం ఇలాగే ఉందని నమ్మారు కాబట్టే జనాలు బేబిని ఆదరించారు. హీరోయిన్ విరాజ్కు పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు క్లైమాక్స్లో హీరోహీరోయిన్లు కలిసిపోయేవారు అనిపించింది. టైటిల్కు తగ్గట్లుగా హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది. రిస్కులు తీసుకుంటున్న స్క్రీన్ప్లేను కూడా జనాలు విజయవంతం చేస్తున్నారని బేబితో నిరూపితమైంది. ఏదేమైనా దర్శకుడు సాహసోపేతంగా తీశారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: పుష్పరాజ్ దెబ్బ.. సెకండ్ పార్ట్కు రూ.1000 కోట్ల డీల్..! -
బేబి సినిమాలో హీరోగా ట్రై చేశా.. కానీ డైరెక్టర్ ఆ మాటనడంతో బాధేసింది!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. సాయి రాజేశ్ మొదట ఈ సినిమా కథను ఓ హీరోకు చెప్పేందుకు ప్రయత్నించగా అతడు కథ వినడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదన్న సంగతి తెలిసిందే! దీంతో ఈ సినిమా కథ ఆనంద్ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. ఇకపోతే ఇందులో రెండో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ స్థానంలో తాను ఉండాల్సింది అంటున్నాడు నటుడు అర్జున్ కల్యాణ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు జరిగిన ఓ సంఘటన వల్లే నేను బిగ్బాస్కు వెళ్లాను. ఇటీవలి కాలంలో కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఓ సినిమాలో(బేబి చిత్రాన్ని ఉద్దేశిస్తూ) రెండో హీరోగా ప్రయత్నించాను. హీరోయిన్ నా స్నేహితురాలు కావడంతో తను నన్ను రిఫర్ చేసింది. డైరెక్టర్ కూడా నా స్నేహితుడే! నేను నటించిన రెండు, మూడు సినిమాల ఫంక్షన్స్కు కూడా వచ్చాడు. అయితే అతడి సినిమాకు నేను ట్రై చేశాను. ఆయన మాత్రం.. అర్జున్.. నీకింకా మార్కెట్ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి కావాలనుకుంటున్నాం అని రిజెక్ట్ చేశాడు. ఇలా జరిగిందేంటని నిరాశపడ్డాను. అందుకే నేను బిగ్బాస్ షోకి వెళ్లాను. నాకంటూ మార్కెట్ సృష్టించుకోవాలనే షోలో పాల్గొన్నాను. సొంతంగా మార్కెట్ వచ్చేంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమాలు చేయకుండా మార్కెట్ ఎలా వస్తుంది? సినిమాలు చేస్తే కానీ మార్కెట్ రాదు, మార్కెట్ ఉంటే కానీ సినిమాలు రావు. మార్కెట్ లేకపోయినా సరే.. నా టాలెంట్ చూసి పెళ్లికూతురు పార్టీ, ప్లేబ్యాక్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నాడు అర్జున్ కల్యాణ్. చదవండి: జైలర్ సినిమాకు షాక్.. ఆన్లైన్లో HD ప్రింట్ లీక్.. కలెక్షన్స్కు దెబ్బ.. ఓటీటీలో.. -
ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు సినిమాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమావాళ్లకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ. చాలామంది ప్రత్యేకంగా ఈరోజే చిత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆరోజు రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్న సరే తమ సినిమాను వాయిదా వేసుకోవడానికో, ప్రీపోన్ చేసుకోవడానికో ఇష్టపడరు. కచ్చితంగా ఫ్రైడేనే విడుదల చేస్తామంటారు. అలా ఈ రోజు(ఆగస్టు 25న) గాండీవధారి అర్జున, బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్(డబ్బింగ్) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో గాండీవధారి అర్జునకు మిశ్రమ స్పందన లభిస్తుండగా బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్కు వెళ్లలేని వారి కోసం ఓటీటీలో కూడా కొత్త చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బింగ్ మూవీతో కలుపుకుని నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ల బ్రో మూవీ నెట్ఫ్లిక్స్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు స్లమ్డాగ్ హజ్బెండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. బేబి మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. పిజ్జా 3: ద మమ్మీ సైతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పిజ్జా 3 మూవీ థియేటర్లలో విడుదలై కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో వారం రోజులకే దీన్ని ఓటీటీలోకి తెచ్చేశారు. మీరు కూడా పైవాటిలో నచ్చిన మూవీని సెలక్ట్ చేసుకుని ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి.. చదవండి: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ టాక్.. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్.. ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement