-
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్సైకిల్ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్సైకిల్ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
Q4 results: బజాజ్ ఆటో లాభం హైజంప్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. వాహన విక్రయాలు జూమ్ క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది. బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది. -
సీఎన్జీ బైక్పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్తో నడిచే మోటర్సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్..!
బజాజ్ ఆటో షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. కంపెనీ అత్యున్నత అధికారులు, వీరి తరఫు బంధువులు సంస్థ సెక్యూరిటీలు, ఈక్విటీ షేర్లలో లావాదేవీలు నిర్వహించే విండోను ఈ నెల 1 నుంచి 26వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 6,989 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్టం రూ. 7,060 వరకూ ఎగసింది. -
విడుదలకు సిద్దమవుతున్న ఫస్ట్ సీఎన్జీ బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్నేమ్తో రానున్న ఈ కొత్త సీఎన్జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు. సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్' - ఫోటోలు చూశారా? పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీ ధరలు తక్కువ. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాల కంటే సీఎన్జీ వాహనాల మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎన్జీ బైక్ మైలేజ్ దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. -
వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలు - సంజీవ్ బజాజ్
ముంబై: బజాజ్ ఫైనాన్స్ సూక్ష్మ రుణాలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లకు రుణాలు ఇచ్చే వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. అలాగే, వచ్చే రెండేళ్లలో మరో 1,000 శాఖలను తెరవనున్నట్టు చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో కస్టమర్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ద్విచక్ర వాహన ఫైనాన్స్లోకి అడుగు పెట్టామని, ఆ తర్వాత కన్జ్యూమర్ ఫైనాన్స్లోకి, అనంతరం ప్రాపర్టీపై రుణాలు ఇవ్వడంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. ఇప్పుడు సూక్ష్మ రుణాలు, ఎంఎస్ఈ, ఇతర వాహన రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తమకు 4,000 శాఖలు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 5,000కు చేర్చనున్నట్టు పేర్కొన్నారు. 2008లో ఈ సంస్థ సేవలు ప్రారంభించగా, ప్రస్తుతం 4 కోట్ల కస్టమర్లను కలిగి ఉన్నట్టు సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ కాలంలో సంస్థ మార్కెట్ విలువ 450 రెట్లు పెరిగినట్టు చెప్పారు. రుణ ఆస్తులు 250 రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. -
ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో ఆఫర్
Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్) బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్లెస్ DC మోటార్తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా.. బజాజ్ ఆటో కీలక నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బజాజ్ ఆటో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ శిక్షణ కేంద్రాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, డిప్లమాలతో కూడిన అధునాతన నైపుణ్య శిక్షణను ఇస్తాయని వివరించింది. మెకాట్రానిక్స్, మోషన్ కంట్రోల్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి క్లిష్ట మాడ్యూల్స్పై శిక్షణ ఉంటుంది. తయారీ పరిశ్రమలో నైపుణ్యం అంతరాన్ని పరిష్కరించడంలో ట్రైనింగ్ సెంటర్లు సహాయం చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అవసరమైన పరికరాలను ఈ శిక్షణా కేంద్రాలకు బజాజ్ ఆటో అందిస్తుంది. కార్యక్రమ ప్రారంభ దశలో నిర్వహణ ఖర్చులకు నిధులు కూడా సమకూరుస్తుంది. ‘భారత్లో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగులుగా చేరుతున్నారు. సాంకేతికతలో వేగవంతమైన మార్పులతో యువతను ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడంలో విద్య, పరిశ్రమల మధ్య భారీ అంతరం ఉంది. సమాజానికి తిరిగి ఇచ్చే వారసత్వంతో ఈ అంతరాన్ని పూడ్చేందుకు కట్టుబడి సీఎస్ఆర్ ప్రాజెక్ట్ను ప్రకటించినందుకు గర్విస్తున్నాము’ అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. -
అందరికి తెలిసిన బైక్ లాంచ్ చేయనున్న బజాజ్ - పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో మళ్ళీ తన అవెంజర్ 220 బైక్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ క్రూజ్ 220, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 సరసన స్ట్రీట్ 220. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త అవెంజర్ 220 బైక్ చూడటానికి దాని స్ట్రీట్ 160 మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో రౌండ్ హెడ్ లాంప్, బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఒక చిన్న ఫ్లైస్క్రీన్ మరియు ప్లాట్ హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి. బజాజ్ అవెంజర్ 220 బైక్ 200 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 18.7 bhp పవర్, 17.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ లేటెస్ట్ బిఎస్ 6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందింది. కావున మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఈ బికా ధరలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది అవెంజర్ క్రూజ్ 220 కంటే తక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీని ధర బహుశా రూ. 1.40 లక్షలు ఉండవచ్చు. ఈ బైక్ గురించి గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్నుబట్టి భవిష్యత్లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
బ్రిటీష్ కంపెనీ ఇప్పుడు బజాజ్ చేతుల్లోకి..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఇప్పుడు భారతదేశంలో ట్రయంఫ్ మోటార్సైకిల్స్కి సంబంధించి విక్రయాలు, సర్వీస్ మొదలైన వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొన్ని సంవత్సరాలకు ముందు ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది ఒక భాగం. బజాజ్ ఆటో ఇప్పుడు ట్రయంఫ్ భాగస్వామ్యంతో కొత్త ఎంట్రీ-లెవల్ మిడ్-కెపాసిటీ ట్రయంఫ్ మోడల్లను అభివృద్ధి చేయడంలో భాగంగా బజాజ్ తన చకాన్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం సుమీత్ నారంగ్ నేతృత్వంలోని బజాజ్ ప్రోబైకింగ్ కిందికి వస్తాయి. బజాజ్ కంపెనీ చేసిన ఈ అధికారిక ప్రకటనలో భాగంగా 2023లో మొదటి బజాజ్-ట్రయంఫ్ బైక్ విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఇందులో అది ఏ బైక్ అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. దీనికి సంబంధించిన వివరాలు రానున్న రోజుల్లో విడుదలవుతాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) బజాజ్-ట్రయంఫ్ నేతృత్వంలో మరింత సరసమైన ట్రయంఫ్ మోడల్లను అందించడానికి, కంపెనీ డీలర్ నెట్వర్క్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో దాని నెట్వర్క్ పెంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలోని 120 నగరాల్లో తన షోరూమ్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్ఫైటర్ లైన్కు అప్డేట్ వెర్షన్ను విడుదల చేసింది. ఈ సిరీస్లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
భారత్లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్సైకిల్గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్ కొనుగోలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ ముంబైలో అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో, సముద్ర తీరంలోని ఓ పెంట్ హౌస్ (ట్రిప్లెక్స్)ను రూ.252.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. గృహాల సెర్చింగ్ పోర్టల్ ఇండెక్స్ట్యాప్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ రియల్టీ డెవలపర్ లోధా గ్రూపు నుంచి నీరజ్ బజాజ్ ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగింది. రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు సమాచారం. మలబార్ ప్యాలసెస్ ప్రాజెక్ట్లోని 29, 30, 31 అంతస్తులను నీరజ్ బజాజ్ ఇంత భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణం (కార్పెట్ ఏరియా 12,624 చదరపు అడుగులు) పరిధిలో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఎనిమిది కారు పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. గత నెలలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబైలోని వర్లిలో అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం తెలిసిందే. అలాగే డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సైతం పలు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. -
250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు
సాక్షి,ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం లగ్జరీ ఫ్లాట్లకు నెలవుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ నీరజ్ బజాజ్ ముంబైలో ఖరీదైన ఫ్లాట్లను కొనుగోలు చేశారు. బజాజ్ గ్రూప్ డైరెక్టర్ ఏకంగా రూ.252 కోట్లతో మూడు అంతస్తులను కొనుగోలు చేశారు. దీంతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్కు బజాజ్ ఓనర్గా అవతరించారు. ఇదే ముంబైలో అతిపెద్ద డీల్గా భావిస్తున్నారు. మాక్రోటెక్ డెవలపర్స్ నుండి బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ 252.5 కోట్ల రూపాయలకు సీ-ఫేస్డ్ ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ను సొంతం చేసుకున్నారు. దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్లో 18వేల చదరపు అడుగుల ట్రిప్లెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీగా డీల్ స్టాంప్ డ్యూటీ రూ.15 కోట్లు. 29, 30, 31వ అంతస్తులతోపాటు, ఎనిమిది పార్కింగ్లను కూడా నీరజ్ కొనుగోలు చేశారు. 31 అంతస్తులున్న లోధా మలబార్ ప్యాలెస్ ప్రాజెక్ట్ ఒక్కో ఫ్లాట్ కనీస పరిమాణం దాదాపు 9,000 చదరపు అడుగులు. ఒక్కో అపార్ట్మెంట్ ధర రూ. 100 కోట్లకు పైమాటే ప్రస్తుతం బజాజ్ ముంబైలోని పైదార్ రోడ్డులో 50 ఏళ్ల నాటి భవనంలోని రెండు అంతస్తుల్లో కుటుంబం నివసిస్తోంది. నీరజ్ బజాజ్ ఎవరు? రాహుల్ బజాజ్ మరణానంతరం బజాజ్ గ్రూప్ను ముందుండి నడిపిస్తున్న 69 ఏళ్ల నీరాజ్ బజాజ్ఆ సియా అత్యంత సంపన్నులలో ఒకరు. 2021లో గ్రూప్ ఛైర్మన్ అయిన నీరజ్కు 35 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం ఉంది. బజాజ్ పల్సర్తో సహా అనేక ప్రసిద్ధ ద్విచక్ర వాహనాలను తయారు చేసే బజాజ్ ఆటో, అలాగే బజాజ్ అలయన్జ్ , జనరల్ ఇన్సూరెన్స్లో డైరెక్టర్ల బోర్డులో కూడా ఉన్నారు. మూడు సార్లు టేబుల్ టెన్నిస్ చాంపియన్, 17 ఏళ్లకే అర్జున అవార్డు మూడు సార్లు జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ అయిన నీరజ్ బజాజ్ 1977లో ఆట నుండి రిటైర్ అయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 22 సంవత్సరాలు. ఇది సోదర వర్గానికి మరియు అతని స్వంత కుటుంబానికి కూడా షాక్ ఇచ్చింది. బజాజ్, అయితే టేబుల్ టెన్నిస్ జీవితకాల సాధన కాబోదు అందుకే కుటుంబ వ్యాపారంలో చేరాలనుకుంటున్నట్లు స్పష్టంగా నీరజ్ ప్రకటించారు.పారిశ్రామికవేత్తల కుటుంబంలో ప్రపంచస్థాయి క్రీడాకారుడుగా రాణించడం చాలా అరుదు అనే ఘనతను దక్కించుకున్నారు. 17ఏళ్లకే నీరాజ్ బజాజ్ 1974లో అర్జున అవార్డు గెల్చుకున్నారు. అలాగే ప్రమోటర్గా ప్రపంచంలోనే తొలి టేబుల్ టెన్నిస్ ఫ్రాంచైజీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)ని ప్రారంభించారు. 1970-77 మధ్య ఏడు సంవత్సరాలు టేబుల్ టెన్నిస్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు. నాలుగు సార్లు నంబర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ర్యాంక్ సాధించారు. నీరజ్ భార్య మినాల్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కృతి, నీరవ్ బజాజ్ ఉన్నారు. నీరజ్కు ఇద్దరు సోదరులు. మధుర్ , శేఖర్ బజాజ్ వీరిలో నీరజ్ చిన్న. ఫోర్బ్స్ ప్రకారం 2022 నాటికి ఈ సోదరుల నికర సంపద దాదాపు రూ. 65000 కోట్లు. 1954లో జన్మించిన నీరజ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి కామర్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండిఎంబీఏ పట్టాను పొందారు నీరజ్ నేతృత్వంలోని గ్రూపులో 50000 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.4,50,000 కోట్లు. అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీ సేల్స్ జోరు కోవిడ్ తరువాత గత రెండేళ్లుగా అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీల అమ్మకాలు పెరిగాయి. ఇండిపెండెంట్ నాన్-బ్రోకరేజీ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ కంపెనీ లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ తెలిపారు. రెసిడెన్షియల్ యూనిట్లను కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక మూలధన పన్ను మినహాయింపు ఏప్రిల్ 1, 2023 నుండి రూ. 10 కోట్లకు పరిమితం కానుందని బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో మార్చి 31కి ముందు లగ్జరీ యూనిట్ల అమ్మకాలు పెరుగుతాయని ముందే చెప్పామని మరో నిపుణుడు అభిషేక్ కిరణ్ గుప్తా అన్నారు. ఏప్రిల్ 1నుంచి పాలసీ మారుతున్న క్రమంలో లగ్జరీ గృహాలను కొనుగోలు చేసేవారికి ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ తర్వాత నీరజ్ బజాజ్ కొనుగోలుమూడో అతిపెద్ద ప్రాపర్టీ డీల్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీమార్ట్ యజమానిరాధాకిషన్ దమానీ, అతని ఫ్యామిలీ ఒబెరాయ్ రియల్టీలో 28 యూనిట్లను బల్క్గా కొనుగోలు చేశారు. అలాగే గత నెలలో (ఫిబ్రవరి 8,) వెల్స్పన్ గ్రూప్నకు చెందిన బీకే గోయెంకా అదే లగ్జరీ ప్రాజెక్ట్లో రూ.240 కోట్లకు ముంబై ఫ్లాట్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ విఫణిలో పల్సర్ NS160 & NS200 స్ట్రీట్ నేకెడ్ మోటార్సైకిళ్ల అప్డేట్ వెర్షన్స్ విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.47 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైకులు వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా రూ. 10,000 (ఎన్ఎస్160), రూ. 7,000 (ఎన్ఎస్200) ఎక్కువ. ఈ రెండు బైకులు మునుపటి స్టాండర్డ్ టెలిస్కోపిక్ యూనిట్ స్థానంలో అప్సైడ్ ఫోర్క్ను పొందాయి, అంతే కాకుండా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: మీ మొబైల్పై ఎవరైనా నిఘా పెట్టారేమో.. ఇలా తెలుసుకోండి..!) డిజైన్ పరంగా కొంత అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్, పర్ఫామెన్స్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఎన్ఎస్160 అదే 160.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 17.2 హెచ్పీ పవర్ 14.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక ఎన్ఎస్200 బైక్ 199.5 సీసీ ఇంజిన్తో 24.5 హెచ్పీ పవర్ 18.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఫీచర్స్ పరంగా కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. -
బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు వాహనాలు అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇందులో భాగంగానే ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ చేతక్ 'ప్రీమియం ఎడిషన్'లో విడుదలైంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). బజాజ్ కంపెనీ ఈ కొత్త వేరియంట్ని మూడు కలర్ ఆప్సన్స్లో విడుదల చేసింది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ సీటు, బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్రెస్ట్ కాస్టింగ్లు, హెడ్ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటి వాటిని పొందుతుంది. భారతదేశంలో కంపెనీ ఈ కొత్త బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి డీలర్షిప్లను విస్తరించనుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ డీలర్షిప్ నెట్వర్క్ భారతదేశంలోని 60 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంది. అంతే కాకుండా 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 85 కంటే ఎక్కువ నగరాల్లో 100 కంటే ఎక్కువ స్టోర్లకు విస్తరించడానికి ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి కంపెనీ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ధర ప్రీమియం ఎడిషన్ కంటే తక్కువ. ఇప్పుడు ఈ వేరియంట్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఇది బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో అనే నాలుగు కలర్ ఆప్సన్స్లో అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్ లేదు. కావున ఇందులో అదే 2.9 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 4.2kW పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఛార్జ్పై 90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బజాజ్ చేతక్ ఎక్కువ అమ్మకాలు జరపకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తున్నాయి, కొనుగోలుదారులు కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున చేతక్ క్లెయిమ్ చేసిన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ (IDC) పరిధిని 20 శాతం పెంచి 108కిమీలకు పెంచబోతున్నట్లు బజాజ్ ఆటో గత నెలలో ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఇదే జరిగితే చేతక్ అమ్మకాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. -
దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఈ-స్కూటర్లు: ప్రత్యేకంగా..!
బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో రెండు ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో లాంచ్ చేశాయి. దేశీయ వినియోగానికి అనుగుణంగా రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని కంపెనీలు వెల్లడించాయి. యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్, డీఎక్స్ జీఆర్ పేరుతో లాంచ్ చేశాయి. దేశీయ అవసరాలు, రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్ చేస్తున్నట్టు యూలు, బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపాయి. మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని సాధించాలని యూలు లక్క్ష్యంగా పెట్టుకుంది. నెక్ట్స్జెన్ మేడ్-ఫర్ ఇండియా వాహనాలు అధునాతన డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే
భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ నుంచి బిఎస్6 2 ఉద్గార నిబంధలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ డామినర్ 400' మీద కంపెనీ ఇప్పుడు రూ. 25,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ ఆకర్షణీయమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీనితో పాటు తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల డామినార్ 400 రూ. 1,99,991 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడమే కాకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బజాజ్ డామినర్ 400 రూ. 1.36 లక్షల వద్ద 2016లో విడుదలైంది. బజాజ్ డామినార్ 400 మోటార్సైకిల్ 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్సి ఇంజన్ కలిగి 39.4 బిహెచ్పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ 43 మిమీ యుఎస్డి ఫోర్క్స్, 110 మిమీ ట్రావెల్తో మోనోశాక్ పొందుతుంది. బజాజ్ డామినార్ 400 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా సఫోర్ట్ చేస్తుంది. -
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
అమ్మకాల పరంగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'పల్సర్ 220ఎఫ్' విడుదల చేసింది. ఈ ఆధునిక బైక్ ధర రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్). బజాజ్ పల్సర్ మొదటిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007లో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది, ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ రీ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్సన్స్ కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్లో విడుదల చేసింది. కంపెనీ తన బైకులను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇంజిన్ & పర్ఫామెన్స్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడిఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. -
ఏకంగా108 కి.మీ. రేంజ్తో 2023 బజాజ్ చేతక్ ఈవీ.. వచ్చేస్తోంది!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ సంస్థ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీ 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 90 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 18 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుందని స్పష్టమవుతోంది. బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసినప్పటికీ డిజైన్, ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, పవర్ అవుట్పుట్ వంటివి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కంపెనీ ఇందులో కొంత ఎక్కువ రేంజ్ అందించడానికి బ్యాటరీ మేనేజ్ మెంట్ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, అన్ని సబ్సిడీలు మినహాయించి). త్వరలో విడుదలయ్యే 2023 చేతక్ ఈవీ ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్డేటెడ్ మోడల్ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. -
ఈవీల్లో అన్ని విభాగాల్లోకి వస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అన్ని విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తామని అర్బనైట్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను అర్బనైట్ బ్రాండ్లో బజాజ్ ఆటో ఆఫర్ చేస్తోంది. ఈ–టూ వీలర్స్లో ఏటా ఒక కొత్త మోడల్ను పరిచయం చేయాలన్నది బజాజ్ లక్ష్యమని అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ‘ఇందుకు అనుగుణంగా నూతన ఉత్పాదనలను అభివృద్ధి చేస్తున్నాం. చేతక్ లేదా ఇతర పేర్లతోనూ వాహనాలు రావొచ్చు. ఈవీ వ్యాపారం ఒక దీర్ఘకాలిక క్రీడ. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల వాటా గతేడాది 9 శాతం. ఇప్పుడిది ఏకంగా 20 శాతానికి చేరింది. రెండేళ్లలో మొత్తం స్కూటర్ల విక్రయాల్లో 70 శాతం ఎలక్ట్రిక్ కైవసం చేసుకుంటుంది’ అని వెల్లడించారు. చేతక్ శకం మళ్లీ వస్తుంది.. నాణ్యతలో రాజీపడని కస్టమర్ల తొలి ప్రాధాన్యత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఎరిక్ అన్నారు. ‘బ్రాండ్ను నిలబెట్టడానికి మన్నిక, సాంకేతికత, ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్ త్రీ, ఫోర్ వీలర్ల విభాగంలోకి రాలేమని చెప్పలేను. చేతక్ అంటే అంచనాలు ఎక్కువ. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కిన చేతక్ శకం మళ్లీ వస్తుంది. మొబిలిటీ కంపెనీ యూలు వినియోగిస్తున్న 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి సరఫరా చేశాం. మొబిలిటీని ఒక సేవగా దేశంలో ప్రోత్సహిస్తాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ టూవీలర్లను అద్దె ప్రాతిపదికన బెంగళూరు, ముంబై, ఢిల్లీలో యూలు ఆఫర్ చేస్తోంది. కాగా, నెలకు 200లకుపైగా చేతక్ స్కూటర్లను విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక మోబైక్స్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో చేతక్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు మూడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
బజాజ్ ఆటో లాభం 16% డౌన్
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 2,040 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం తగ్గింది. విదేశాలకు ఎగుమతులు 25 శాతం క్షీణించడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 8,762 కోట్ల నుంచి రూ. 10,203 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మాత్రం లాభం రూ. 1,275 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 11,44,407 యూనిట్ల నుంచి నామమాత్రంగా 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5,32,216 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధి చెంది 6,94,375 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 6,12,191 యూనిట్ల నుంచి 4,56,637 యూనిట్లకు తగ్గాయి. విదేశీ మార్కెట్లలో స్థూలఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు ఇందుకు కారణమని బజాజ్ ఆటో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం విక్రయాలు పుంజుకున్నాయని వివరించింది. శుక్రవారం బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్లు 1% క్షీణించి రూ. 3,569 వద్ద క్లోజయ్యాయి. -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement