-
రామ్చరణ్ బర్త్డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
బర్త్డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్గా గడుపుతారు. రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు. (Image Courtesy:Instagram) ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్డే. ఈ సందర్భంగా గొల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ భామ. (Image Courtesy:Instagram) ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy:Instagram) -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
#HBDYSJagan : భారీ కేక్తో జననేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు (ఫొటోలు)
-
జెయింట్ 7-టైర్ కేక్తో ధర్మేంద్ర 88వ పుట్టినరోజు వేడుకలు (ఫోటోలు)
-
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
Mehreen Pirzada Birthday: మెహరీన్ బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ
-
తొలిసారి బేబీ బంప్తో ఉపాసన.. ఫొటోలు వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య ఉపాసన ప్రస్తుతం 6 నెలల గర్భవతిగా ఉన్నారు. అయితే మొదట అంతా ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతుందా? అంటూ గాసిప్స్ వినిపించాయి. దీనికి కారణం ఆమె బేబీ బంప్తో కనిపించకపోవడమే. తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఈ ఏడాది ప్రారంభంలో చరణ్-ఉపాసనలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఉపాసన షేర్ చేసిన ఏ ఫొటోల్లోనూ ఆమె బేబీ బంప్ కనిపించలేదు. అంతేకాదు రీసెంట్గా ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొన్న ఆమె సాధారణంగానే కనిపించారు. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై పుకార్లు మరోసారి గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రూమర్లకు చెక్ పడింది. సోమవారం రామ్ చరణ్ బర్త్డే పార్టీ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఉపాసన బ్లూ కలర్ సింగిల్ పీస్లో మెరిసారు. ఇందులో ఆమె బేబీ బంప్తో కనిపించి పుకార్లకు చెక్ పెట్టారు. భర్త చరణ్తో కలిసి బర్త్డే పార్టీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు ఆమె. ఈ ఫొటోల ఉపాసన మొదటి బేబీ బంప్తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. -
వరంగల్ లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
-
చాలా మిస్ అవుతున్నాను.. కూతుర్ని తలచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దానికి కారణం అతని పర్సనల్ లైఫ్లో విభేదాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. తాజాగా కూతురు నవిష్కను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కల్యాణ్ దేవ్. ఫిబ్రవరి 11న కల్యాణ్ దేవ్ బర్త్డే. ఈ సందర్భంగా గతంలో కూతురితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘నీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇది నాలుగోసారి. నా బర్త్డేను ఇంతకంటే గొప్పగా స్టార్ట్ చేయలేను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నా’అంటూ కల్యాణ్ దేవ్ రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన కూతురి బర్త్డే సెలబ్రేషన్స్లో కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్
సూపర్స్టార్ రజనీకాంత్ 72వ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సతీమణి లత రజనీకాంత్ కూడా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. అనేకమంది అభిమానులు రజనీకాంత్ను చూడడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే గంటలపాటు పడిగాపులు కాసినా రజనీకాంత్ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరైతే ఎంతో ఆశతో వచ్చినా తమ అభిమాన నటుడిని చూడలేకపోయామంటూ కంటతడి పెట్టుకున్నారు. చదవండి: బిగ్బాస్ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్ కాగా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించిన విషయం తెలిసిందే. దీంతో వారందరికీ పేరుపేరునా రజనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ రవి, మిత్రుడు, ముఖ్యమంత్రి స్టాలిన్కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అదే విధంగా మరో ప్రకటనలో ఎడపాడి పళనిసామి, ఓ.పన్నీర్ సెల్వం, అన్నామలై, టీకే.రంగరాజన్, వైగో, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, తిరుమావళన్.. చదవండి: విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్ ఏసీ షణ్ముగం, తిరువుక్కరసు, సీమాన్ తదితర నాయకులకు, నటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ఉదయనిధి స్టాలిన్, ధను, వైరముత్తు తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రజనీకాంత్ తన మనవళ్ల (నటుడు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కొడుకులు)తో ఉత్సాహంగా గడుపుతున్న ఫొటోను ఆమె పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మీడియాకు విడుదల చేశారు. అందులో పుట్టినరోజు వేడుక తరువాత అని పేర్కొనడం గమనార్హం. Cannot capture something more beautiful.. Cannot caption some such bonds .. My birthday boy with my boys ! #grandfatherlove❤️ #grandsonsrock💙 pic.twitter.com/iCWLZ6b6n7 — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) December 12, 2022 -
పవన్ ఫ్యాన్స్ బీభత్సం.. బీర్ బాటిల్స్తో థియేటర్లో అరాచకం
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో పవన్ అభిమానులు బీభత్సం సృష్టించారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా వైజాగ్లోని లీలా మహల్ థియేటర్లో జల్సా సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్లో హంగామా సృష్టించిన పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిల్స్ పగలకొట్టి స్క్రీన్ చించేశారు. సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్ కూడా డామేజ్ చేశారు. పేపర్ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో థియేటర్ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది. పవన్ అభిమానులు చేసిన ఈ అరాచకానికి సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. -
స్మశానంలో పుట్టినరోజును జరుపుకున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు చాలా స్పెషల్. తమ పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుకుంటారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే స్టార్ హోటల్స్, రిసార్ట్స్,పబ్స్లో బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇందుకు విభిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం తన పుట్టినరోజుని స్మశానవాటికలో జరుపుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి ఆర్యా ఘారే మంగళవారం తన పుట్టినరోజు వేడులను స్నేహితులతో కలిసి స్మశానంలో జరుపుకంది. స్మశానవాటికలోనే కేక్ కట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలా బర్త్డేను స్మశనాంలో జరుపుకోవడంపై నటి ఆర్యా ఘారే స్పందిస్తూ.. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఇలా పుట్టినరోజును జరుపుకున్నట్లు తెలిపింది. కాగా ఈ బర్త్డే వేడుకలకు ఆమె తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే డ్యూల్ బంద్, భిర్గీత్, అబా, బ్యాక్ టూ స్కూల్ వంటి చిత్రాలతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో ఆర్య ఘారే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. -
విజయ్ బర్త్డే సెలబ్రేట్ చేసిన సమంత
విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా సమంత అతడికి సర్ప్రైజ్ ఇచ్చింది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆదివారం రాత్రి అతడితో కేక్ కట్ చేయించింది సమంత. కాగా వీరిద్దరు ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్పైకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు విజయ్ బర్త్డే కావడంతో సామ్ సెట్స్లో అతడి పుట్టినరోజును సెలబ్రేట్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపింది. చదవండి: అశును వరస్ట్ కంటెస్టెంట్ అన్న రవి, షో మధ్యలో నుంచి వెళ్లిపోయిన నటి కాగా మొన్నామధ్య సమంత బర్త్డే రోజు విజయ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ చేసినట్టే చేసి సమంత బర్త్డేని సెలబ్రేట్ చేశాడు. తాజాగా ఇప్పుడు సమంత వంతు వచ్చింది. విజయ్కు తెలియకుండానే సెట్లోనే అతడి బర్త్డే వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసింది సామ్. ఇందుకోసం ఓ రూం అంతా డెకరేట్ చేసి, మూవీ టీంతో స్పెషల్గా కేక్ తెప్పించింది. ఆదివారం అర్థరాత్రి సమంత, మూవీ టీం కలిసి విజయ్తో కేక్ కట్ చేయించారు. కాగా ఈ పార్టీలో డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఎన్టీఆర్ ఇంట్లో రామ్చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు లీక్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మేనియా నడుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్చరణ్కి ఆర్ఆర్ఆర్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆదివారం(మార్చి27)న రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా చరణ్కి తారక్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన ఇంట్లో చెర్రీ కోసం గ్రాండ్గా బర్త్డే పార్టీని నిర్వహించాడు. ఈ వేడుకకి రాజమౌళి, అఖిల్ అక్కినేనితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా రామ్చరణ్- ఎన్టీఆర్ మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. -
ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం
విలక్షణ నటుడు మోహన్ బాబు బర్త్డే వేడుకలు శనివారం తిరుపతిలో ఘనంగా జరిగాయి. మార్చి 19న మోహన్ బాబు బర్త్డే. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన 70వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, జీఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవి శంకర్ ముఖ్య అతిథిలుఉ హజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా ఎదగడం వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు. చదవండి: రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి స్టేజ్ మీద ఏం మాట్లాడాలో తెలియడం లేదు గురువు గారు అంటూ దాసరి నారాయణను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు మోహన్ బాబు ‘జీవితమంత కష్టాలమమైంది. దాదాపు 7 సంవత్సారాలు తిండిలేక, రెండు జతల బట్టలతో.. కారు షెడ్లో ఉంటూ.. ఎదో సాధించాలని పొట్ట చేత పట్టుకుని తిరుపతి నుంచి మద్రాసుకు వెళ్లాను. దేవుని ఆశీస్సులతో దాసరి గారు మోహన్ బాబుగా నన్ను పరిచయం చేశారు. ప్రతి క్షణం నా జీవితం ముల్ల బాటగా ఉండేది’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ‘నేను ఎంతో మంది ఉపయోగపడ్డాను. కానీ వారెవరు కూడా నాకు ఉపయోగపడలేదు. ఎన్నో రకాలుగా మోసపోయాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. జీవితం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోంది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఫీజులో రాయితీ.. సినీ కార్మికుల పిల్లలకు ఆఫర్: మోహన్ బాబు ఇక 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని మోహన్బాబు అన్నారు. ఇక పండిట్ రవిశంకర్ మాట్లాడుతూ.. మోహన్బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మోహన్బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశంసించారు. దీని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ బర్త్డే వేడుకలు: భారీ కేక్స్, ఆకట్టుకునే సైకత శిల్పం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు. అలాగే సినీ, క్రీడారంగ దిగ్గజాలు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దీంతో సోషల్మీడియాలో భారీ సందడి నెలకొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మోదీబర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్లో సిరంజి ఆకారంలో ఉన్న 71 అడుగుల పొడవైన కేక్ను కట్ చేసి ప్రధానికి విషెస్ తెలిపారు. భోపాల్లో 71 అడుగుల కేక్ కట్ చేశారు. అలాగే 71 మంది బీజేపీ కార్యకర్తలు, రక్తదానం చేయనున్నారు. మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో సెప్టెంబర్ 16 న నిర్వహించారు మట్టి దీపాలు వెలిగించి 71 కిలోల లడ్డూతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 'కాశీ సంకల్ప్' పుస్తకాన్ని లాంచ్ చేశారు. చదవండి: Ola Electric : రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ ఒడ్డున ప్రధాని సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పట్నాయక్ సముద్ర గవ్వలతో స్పెషల్గా రూపొందించిన ఈ సైకత శిల్పం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. గౌరవ ప్రధాని మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథ స్వామి దీవెనలు ఎప్పటికీ ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మోదీకి ఆయన బర్త్ డే విషెస్ చెప్పారు. ఒడిశా కళాకారిణి ప్రియాంక సహానీ ప్రదాని పుట్టినరోజున తృణ ధాన్యాలతో మోదీ చిత్రాన్ని రూపొందించారు. 8 అడుగుల x 4 అడుగులతో అపురూపమైన కళాఖండాన్ని తయారు చేశారు. ఇందుకోసం 25 గంటలు పట్టిందని ఆమె తెలిపారు. Wishing Our Hon’ble Prime Minister @narendramodi ji on his birthday. May Mahaprabhu Jagannatha bless him with long and healthy life to serve mother India. I’ve created a SandArt installation used 2035 sea shells with message #HappyBirthdayModiJi at Puri beach , Odisha . pic.twitter.com/uDTJGOLCFk — Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2021 Birthday wishes to our Honourable Prime Minister @narendramodi ji. May the Almighty shower you with good health, happiness and success throughout your journey. @PMOIndia #HappyBdayModiji pic.twitter.com/ABdFCMt87q — Mohanlal (@Mohanlal) September 17, 2021 -
చిరంజీవి బర్త్డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది..
రాఖీ పండగ, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రెండు పండగలు ఒకేరోజు రావడంతో మెగావారి ఇంట సంబరాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. మెగా బ్రదర్స్, హీరోలు అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఇక మెగా ఆడపడుచులంతా చేరి మెగా బ్రదర్స్కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి చిరు బర్త్డేను సెలబ్రేట్ చేశారు. చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..! ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, మెగాస్టార్ కొడుకు-కోడలు రామ్ చరణ్, ఉపాసన కామినేని, కూతుళ్లు సుస్మిత, శ్రీజ వారి ఫ్యామిలీ, చిరంజీవి అక్కాచెల్లెలు, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా హీరో వరుణ్ తేజ్ నిహారిక ఆమె భర్త హాజరయ్యారు. అలాగే అల్లు అరవింద్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక బంధువులతో మెగా ఇళ్లంతా కళకళలాడింది. కానీ ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు ఆయన తమ్ముడు, హీరో అల్లు శిరీష్ కూడా హజరుకాలేదు. చదవండి: నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు మెగా ఫ్యామిలీలో అంత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ గైర్హాజరుతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఎందుకు రాలేదా అని ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే అల్లు స్నేహారెడ్డి ఎందుకు రాలేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ ఈ మెగా వేడుకలో లేకపోడం ఏదో వెలితిగా ఉందంటూ అభిమానులు స్పందిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ను ఇలా మెగా కుటుంబంతో కలిసి చూసినందుకు ఆయన అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సెట్లో అక్కినేని సుమంత్ బర్త్ డే సెలబ్రెషన్స్
-
సుకుమార్-మహేష్ కాంబినేషన్లో మరో సినిమా?
డిఫరెంట్ సినిమాలతో ఎంతోమంది టాలీవుడ్ హీరోలకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్. నేడు (జనవరి 11) ఈ లెక్కల మాస్టారి 51వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ చెబుతున్నారు. తాను పనిచేసిన అత్యంత టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సూపర్ స్టార్ మహేష్బాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వన్ నెనొక్కడినే సెట్పై ఇద్దరూ ముచ్చటిస్తున్న ఫోటోను మహేష్ షేర్ చేశారు. కాగా ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన వన్ నెనొక్కడినే మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీస్లో ఒకటిగా నిలిచింది. Happy birthday to one of the most talented filmmakers I've worked with @aryasukku! Wishing you happiness and good health always. 🤗 pic.twitter.com/NDSEUH9o39 — Mahesh Babu (@urstrulyMahesh) January 11, 2021 రెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ వస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. దీంతో అదే కథను సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్కు వినిపించారు. కొన్ని మార్పులు-చేర్పులు చేసి అదే స్టోరీని ప్రస్తుతం ‘పుష్ఫ’ గా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమా అనంతరం సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం రానున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. (‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్) ఇక అల్లుఅర్జున్ ట్వీట్ చేస్తూ..''నా దర్శకుడు మరియు స్నేహితుడు అయిన సుకుమార్ ఇలాంటి సంతోషకరమైన రోజులు మరెన్నో జరుపుకోవాలి. మేము కలిసి సినిమా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఆయన ఇంకా ఎన్నో మైలురాళ్ళు చేరుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ సుకుమార్'' అని పేర్కొన్నాడు. సుకుమార్ - బన్నీ కలిసి కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్య-2 తెరకెక్కించారు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా 'పుష్ప: అనే పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. (‘ఆచార్య’కి నో.. అల్లు అర్జున్ చెల్లిగా ఓకే ) Many many happy returns of the day to my director and friend Sukumar garu . We started our journey in film together and I admire his journey. I wish him many more milestones to come . Happy Birthday once again darling. #sukumar pic.twitter.com/ZFXaX0o162 — Allu Arjun (@alluarjun) January 10, 2021 -
అద్వానీతో కేక్ కట్ చేయించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ 93వ పుట్టిన రోజు నేడు (నవంబర్ 08). ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రాజకీయ గురువు అద్వానీ ఇంటికి వెళ్లి పాదాభివందనం చేసి ఆశీర్వదాలు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడులకును జరిపారు. దీనికి సంబంధిన ఫోటోలను మోదీ తన ట్విటర్ ఖాతాలో ఫోస్ట్ చేస్తూ..‘అద్వానీ జీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయనతో సమయం గడపటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయన సజీవ ప్రేరణ. ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వెంటహోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. #WATCH Delhi: Prime Minister Narendra Modi visits senior BJP leader Lal Krishna Advani's residence to celebrate latter's birthday today. Union Home Minister Amit Shah and BJP President JP Nadda also present. https://t.co/RVEDaIzhqj pic.twitter.com/sMlrarfo8O — ANI (@ANI) November 8, 2020 -
సోనూసూద్ పుట్టినరోజు: 3 లక్షల ఉద్యోగాలు
ముంబై: వెండితెరపై ఆయన భయంకరమైన విలన్. కానీ రియల్గా మాత్రం మంచి మనుసున్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి చేయూత అందిస్తున్న రియల్ హీరో నటుడు సోనూసూద్. ఈ రోజు (గురువారం) జూలై 30 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా వలస కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వారిని ఆదుకునేందుకు మరో ముందడుగుడు వేశాడు. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదినం కానుకగా 3 లక్షల ఉద్యోగాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు ప్రవాసిరోజ్గర్.కామ్లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి’’ అంటూ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇప్పటికే లాక్డౌన్లో వలస జీవులను తన సొంత ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించి గ్రామాలకు చేర్చిన విషయం తెలిసిందే. (చదవండి: భావోద్వేగం, సోనూ సూద్ కంటతడి!) मेरे जन्मदिन के अवसर पे मेरे प्रवासी भाइयों के लिए https://t.co/UWWbpO77Cf का 3 लाख नौकरियों के लिए मेरा करार। ये सभी अच्छे वेतन, PF,ESI और अन्य लाभ प्रदान करते हैं। धन्यवाद् AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea और अन्य सभी का।#AbIndiaBanegaKamyaab pic.twitter.com/rjQ0rXnJAl — sonu sood (@SonuSood) July 30, 2020 ఈ విషయంలో తనకు మద్దతుగా వచ్చిన పలు సంస్థలు ధన్యవాదాలు తెలిపాడు. లాక్డౌన్లో వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చిన సోనూసూద్ ఆ తర్వాత కూడా నిరంతరాయంగా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పేద రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియోకు చలించిన ఆయన ఏకంగా ట్రాక్టర్ను కొని పంపించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన టీవీ నటుడి చికిత్సకు డబ్బు సాయం చేశాడు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శారదకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తూ సోనూసూద్ అందరి మన్ననలు పొందున్నాడు. (చదవండి: చిరునవ్వుతో నమస్కరించాలి: సోనూసూద్) -
పీవీ.. అపర మేధావి
సాక్షి, వరంగల్ : పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు... దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి... ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిన అపర చాణక్యుడు.. 9 భారతీయ భాషలతో పాటు 8 విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడిన బహుభాషా కోవిదుడు. స్వాతంత్య్రోద్యమకారుడు, రాజనీతిజ్ఞుడు, మృదుస్వభావి, కవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘనతలను, కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకున్న అచ్చమైన తెలుగుతేజం మన పీవీ. నేడు ఆయన శత జయంతి. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పీవీ జీవితంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. పోరాట వీరుడిగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి–సీతారామారావు దంపతులకు పీవీ నరసింహారావు జన్మించారు. దాదాపు మూడేళ్ల వయసులో కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పీవీ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివే రోజుల్లోనే అంటే 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఓయూ నుంచి ఆయనను బహిష్కరించడంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లోనే అతని ఇంట్లో ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బీ చదివారు. స్వామీ రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పీవీ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్లతో కలసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం... 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుంచి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968–71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. సొంత వర్గం లేకున్నా సీఎం పగ్గాలు... కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా నడిచిన నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేకున్నా పీవీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నేతను సీఎంగా ఎంపిక చెయ్యడం అనివార్యమైంది. దీంతో వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, పార్టీలో ఏ వర్గానికీ చెందని ఆయన రాజకీయ నేపథ్యం 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే.. ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరగడంతోనే సరిపోయేది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆం ధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రుల్లో చాలా మంది రాజీనామా చేశారు. దీంతో 1973 జనవరి 8న కొత్త వారితో పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. కానీ ఆ మర్నాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. అలా పీవీ ముఖ్యమంత్రి పదవి ముగిసింది. ఎంపీ నుంచి ప్రధాని వరకు... పీవీ 1977లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు హన్మకొండ నుంచి మరో రెండు పర్యాయాలు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, 1991లో ఏపీలోని నంద్యాల నుంచి, 1998లో ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 1980–1989 మధ్య కేంద్రంలో హోం, విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను ఆయన చేపట్టారు. అయితే ఆయన్ను ప్రధాని పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని, పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించడంతో ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేసింది. అయితే అప్పటికి ఆయన ఎంపీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన గంగుల ప్రతాపరెడ్డి చేత కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలో పీవీని నిలిపింది. అలా పీవీ ఆ ఎన్నికలో గెలిచారు. తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకపోయినా రాజనీతిజ్ఞతతో వ్యవహరించి ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన వెంటనే ‘లైసెన్స్ రాజ్’కు తెరదించి దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాటలో పరుగెత్తించారు. పీవీ ఇంటిపక్కనే మ్యూజియం పీవీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన ఇంటికి మెరుగులు దిద్దుతున్నారు. పురాతన భవనం పక్కనే నిర్మిస్తున్న భవన నిర్మాణం పూర్తయింది. ఆయన స్మారకార్థం పీవీ ఉపయోగించిన కుర్చీ, మంచం, కళ్లజోడు, ఆయన రాసిన, చదివిన పుస్తకాలు మొదలైన 100కి పైగా వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరచి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వంగర.. సమస్యలతో సతమతం పీవీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా తనకున్న వెయ్యి ఎకరాల భూమిని వంగర, మంగళపల్లిలోని పేదలకు పంపిణీ చేశారు. అలాగే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. 1996లో ఆయన పదవికి దూరం కావడం.. 2004 డిసెంబర్ 23న పీవీ మరణించడంతో వంగర నిరాదరణకు గురైంది. పోలీస్ స్టేషన్, పీవీ మోడల్ కాలనీ, రక్షిత తాగునీటి బావి, సీసీ రోడ్ల నిర్మాణం, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్స్టేషన్, గ్రంథాలయ భవనం మంజూరయ్యాయి. టీటీడీ కళ్యాణ మండపం మంజూరైనా అది అనివార్య కారణాల వల్ల నిర్మించలేదు. ఇక మిగతా పనులన్నీ జరిగాయి. ప్రస్తుతం వంగర గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో తేలికపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వంగర నుంచి రత్నగిరికి, మంగళపల్లికి, మాణిక్యాపూర్కు వెళ్లే దారి గుంతల మయంగా మారింది. దీంతో తమ గ్రామ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
చరణ్ బర్త్డే: ఉపాసననే స్వయంగా..
ఈ రోజు మెగాపవర్ స్టార్ రామ్చరణ్ బర్త్డే. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే తన బర్త్డే వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నాడు చెర్రీ. సెల్ఫ్ ఐసోలేషన్ కారణంగా ఎవరు కూడా తనను కలవడానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండాలని.. అభిమానులు, సన్నిహితులు అదే తనకు ఇచ్చే గొప్ప బహుమతని చరణ్ పేర్కొన్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులెవరూ కూడా స్వయంగా చరణ్ ఇంటికి వెళ్లి విష్ చేయలేదు. టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగానే చెర్రీకి బర్త్డే విషెస్ తెలిపారు. కాగా, తన భర్త చరణ్ బర్త్డే సందర్భంగా ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్వయంగా ఉపాసననే తన స్వహస్తాలతో తయారు చేసి కేక్ను చరణ్కు గిఫ్ట్గా ఇచ్చారు. రెండు విభిన్న కేకులను తయారు చేసిన ఉపాసన వాటిపై పండ్లతో ‘ఆర్సి’అని రాశారు. ఆ కేకును చరణ్ కట్ చేసి బర్త్డే వేడుకలను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా చరణ్ కేక్ కట్ చేస్తున్న ఫోటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తాను తయారు చేసిన కేక్కు సంబంధించిన వివరాలను వీడియోగా రూపొందించి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినట్లు ఉపాసన పేర్కొన్నారు. ఇక రామ్చరణ్ బర్త్డే సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఆర్ఆర్ఆర్లో రామ్చరణ్ లుక్ను, తన క్యారెక్టర్ను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక రామరాజు గురించి చెబుతూ భీమ్(ఎన్టీఆర్) అందించి వాయిస్ ఓవర్ సూపర్బ్గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Happy birthday Mr C. @alwaysramcharan - I’m sure u enjoyed ur birthday cake. -😂😛😉 For the real recipe head to my YouTube channel 😘 A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on Mar 27, 2020 at 2:57am PDT -
సీఎం జగన్ కటౌట్పై పూలవర్షం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement