-
USA: ‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి 480 కోట్లు
వాషింగ్టన్: ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల(రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు. కీలకమైన బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా మళ్లీ నిర్మించేందుకు అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఒకటి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. కాగా, మంగళవారం(మార్చ్ 29)న అర్ధరాత్రి ఒంటిగంటకు పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్కీ బ్రిడ్జి భారీ కంటెయినర్ నౌక ఢీకొని కుప్పుకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడిపోగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురు ఆజూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
బస్సు లోయలో పడి 45 మంది మృతి
కేప్ టౌన్: ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్ క్రిస్టియన్ చర్చి’ ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. #BREAKING : Bus Accident Kills 45 In South Africa At least 45 people were killed as a result of a bus accident, South Africa's Department of Transportation said. An 8-year-old girl is reportedly the only survivor. The crash occurred near Mamatlakala in the northern province of… pic.twitter.com/15tGAbdAM0 — upuknews (@upuknews1) March 29, 2024 బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్ కన్నుమూత -
Baltimore Bridge Accident : అమెరికాలో కంటెయినర్ షిప్ ఢీకొని కుప్పకూలిన బాల్టీమోర్ బ్రిడ్జ్ (ఫొటోలు)
-
Bihar: కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు
పాట్నా: బిహార్లోని సౌపాల్లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం( మార్చ్ 22) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా కూలిన బ్రిడ్జి కింద పలువురు చిక్కుకుపోయారు. కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘి ఇదీ చదవండి.. కేజ్రీవాల్ కస్టడీ కోరనున్న ఈడీ -
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
చైనాలో వంతెనను ఢీ కొట్టిన భారీ షిప్.. రెండు ముక్కలైన బ్రిడ్జి
దక్షిణ చైనాలో వంతెనను భారీ కార్గో షిప్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ షిప్ ఫోష్మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొట్టింది. తాకిడికి వంతెన రెండు ముక్కలుగా వీడిపోయింది. నౌక్ బ్రిడ్జి మధ్యే చిక్కుకుపోయింది ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి సరుకు లేదని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదానికి కారణమైన షిప్ కెప్టెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇదీ చదవండి: రియల్ లైఫ్ మోగ్లీ: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! -
Khammam: గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భాగంగా వైరా-మధిర మధ్య భారీ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వంతెన మీద ఉన్న కూలీలు ప్రాణాలు రక్షించుకునేందుకు బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులను హెచ్డీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. -
కర్ణాటక - తెలంగాణ సరిహద్దులో ఉన్న కృష్ణానది వంతెన
-
‘అటల్ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ‘అటల్ బిహారీ వాజ్పేయి సేవరి- నవ శేవ అటల్ సేతు’ వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనను రూ.17,480 కోట్లతో నిర్మించారు. 21.8 కిలోమీటర్ల 6 లేన్ల పొడవుతో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద, 5.5 కిలోమీటర్లు భూమిపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. డిసెంబర్ 2016 లో ఈ బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ కారణంగా భారత్ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతి తక్కువ ఐదేళ్ల కాలంలో పూర్తయిన ఈ బ్రిడ్జి వినియోగంతో కనెక్టివిటీ, రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రవాణా సంబంధిత పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రిడ్జిని నిర్మించే సమయంలో వినియోగించిన టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే ఆటల్ సేతు ప్రత్యేకతలు : భూకంపాలనే నిరోధించేలా : వంతెన భూకంపాలను నిరోధించేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకోలగలదు. రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్: సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి వినియోగించిన టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శబ్ధాన్ని తగ్గిస్తూ : వంతెనలో నాయిస్ సైలెన్సర్లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు. ఎకో-ఫ్రెండ్లీ లైటింగ్: వంతెనపై లైటింగ్ సిస్టమ్ జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా రూపొందించబడింది. టోల్ క్యూలు లేవు: ఎంటీహెచ్ఎల్ ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది, ఇది టోల్ల వద్ద పొడవైన క్యూల సమస్యను పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్లు వాహనాన్ని స్కాన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలు అవుతాయి. తద్వారా వాహనాల నిరీక్షణ సమయం తగ్గుతుంది. డిస్ప్లేలు: డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జామ్లు లేదా ప్రమాదాల గురించి వారికి సమాచారం అందుతుంది. -
అతిపొడవైన సముద్రపు వంతెన.. ‘అటల్ సేతు’ను ప్రారంభించిన మోదీ
సాక్షి, ముంబై: ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని .. జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. VIDEO | PM Modi inaugurates Mumbai Trans Harbour Link (MTHL), the longest sea bridge in the country, in Navi Mumbai. The MTHL, also known as Atal Setu named after former PM Atal Bihari Vajpayee, originates from Sewri in Mumbai and terminates at Nhava Sheva in Uran taluka in… pic.twitter.com/Z9cy8S1vAD — Press Trust of India (@PTI_News) January 12, 2024 ఇది ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జ్కు ఒకవైపు సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి రెండు గంటల సమయం పట్టేది. #WATCH | Atal Setu - the Mumbai Trans Harbour Link - is India's longest bridge built on the sea and it is expected to see the movement of more than 70,000 vehicles every day pic.twitter.com/VqmPMf1CCU — ANI (@ANI) January 12, 2024 అటల్ సేతు వంతెనకు 2016 డిసెంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కావాల్సిన వంతెన.. గడువుకు ఆరు నెలల ముందే( డిసెంబర్ 25 నాటికి) సిద్ధం చేసినట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ సంజయ్ ముఖర్జీ తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. -
Mumbai Trans Harbour Link: పొడవైన సముద్రవంతెన.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
ముంబయి: భారత్లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
సముద్రపు వంతెన ‘అటల్ సేతు’.. ప్రత్యేకతలివే!
దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన నిర్మాణం పూర్తయింది. దీనిని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముంబయి- నవీ ముంబయిలను కలిపే ఈ అతిపెద్ద సముద్రపు వంతెన పొడవు 22 కిలోమీటర్లు. దీనికి ‘అటల్ సేతు’ అనే పేరు పెట్టారు. దీని విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన కారణంగా ముంబై నుండి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది ఆరు లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమయ్యింది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ను దాటుతుంది. -
కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్
విశాఖ సిటీ: మాస్టర్ప్లాన్ రోడ్లు.. సెంటు స్థలాల లేఅవుట్లు.. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్లు.. ఇలా ఒకవైపు ప్రజావసరాలకు అనువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణాలు..కైలాసగిరి, తెన్నేటి పార్కుల పునరుద్ధరణ.. సీ హారియర్ మ్యూజియం.. హెల్త్ ఎరీనా జాగింగ్ ట్రాక్.. కొండకర్ల ఆవలో ఫ్లోటింగ్ జెట్టీ.. మరోవైపు పర్యాటకులను ఆకట్టుకొనే ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) విశాఖ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. సుందర విశాఖను పర్యాటకులకు స్వర్గధామంగా మలిచేందుకు మరిన్ని బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీఎంఆర్డీఏ గత ఏడాది కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ప్రగతి, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై మెట్రోపాలిటన్ కమిషనర్, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. వీఎంఆర్డీఏ గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.161 కోట్లు ఆదాయం రాగా.. రూ.215 కోట్లు వ్యయం జరిగినట్లు వెల్లడించారు. సెంటు స్థలాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం బల్క్ ల్యాండ్ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిందని, వాటి వేలం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఫన్ ప్రాజెక్టులు.. స్టార్ హోటల్.. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా వైశాఖి జల ఉద్యానవనంలో 3.48 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో అమ్యూజ్మెంట్ అండ్ ఫన్ జోన్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. ► అలాగే తెన్నేటి పార్కు బీచ్లో డిజైన్–ఇన్వెస్ట్–ఇన్స్టాల్మెంట్–ఆపరేషన్ విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► వీఎంఆర్డీఏ పార్కు వెనుక ఉన్న 7.97 ఎకరాల్లో పీపీపీ విధానంగా రూ.220 కోట్లతో ఫైవ్స్టార్ హోటల్, మైస్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జ్యుడీషియల్ రివ్యూ కోసం పంపించారు. ► నేచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డీపీఆర్ సిద్ధం చేశారు. ● ఎన్ఏడీ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 25 శాతం మేర పూర్తయ్యాయి. 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► 83 లేఅవుట్లలో 1,41,654 మందికి సెంటు స్థలాల పట్టాలు అందించారు. ఈ లేఅవుట్ల అభివృద్ధిలో వీఎంఆర్డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. వీటిలో రూ.175 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ► భూములు ఇచ్చిన రైతులకు 1,215 ఎకరాల్లో 48 లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లను కేటాయించారు. వాటి అభివృద్ధికి రూ.660 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులను మూడు దశలలో ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో రూ.200 కోట్లతో క్వారీ రబ్బిష్ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులు జరుగుతున్నాయి. ఫేజ్–2లో రూ.305 కోట్లతో బీటీ రోడ్లు, ప్లాంటేషన్, పార్కులు, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఫేజ్–3లో రూ.155 కోట్లతో నీటి సరఫరా కల్పించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్కు మంచి స్పందన ► మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలన్న సంకల్పంతో చేపట్టిన జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్కు మంచి స్పందన వస్తోంది. ► విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 204.96 ఎకరాల్లో లేఅవుట్లు వేసి 1280 ప్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ► విజయనగరం జిల్లా రఘుమండలో ఉన్న 229 ప్లాట్లకు ఇప్పటికే 165 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో లాటరీ తీసి 160 మంది కేటాయింపులు చేశారు. అలాగే జియ్యానివలసలో 130 ప్లాట్లకు 66 దరఖాస్తులు రాగా 56 మందికి ఇచ్చారు. విశాఖలో పాలవలస 1, 2లలో 150 దరఖాస్తులకు గాను లాటరీ 94 ప్లాట్లు విక్రయించారు. ఇప్పటికీ వస్తున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే వాటికి లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు. రూ.58.74 కోట్లతో మాస్టర్ప్లాన్ రోడ్ల అభివృద్ధి ► విశాఖలో రూ.58.74 కోట్లతో మాస్టర్ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► బోయపాలెం హైవే నుంచి నుంచి కాపులుప్పాడ, బీచ్ రోడ్డులో సీతకొండ, పాయకరావుపేట రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ● అలాగే రూ.12 కోట్లతో లా కాలేజీ హైవే నుంచి పెబెల్ బీచ్ హౌసింగ్ వరకు ఫుట్పాత్, గ్రీనరీ, రూ.3.22 కోట్లతో విజయనగరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ నుంచి కేఏ పేట మీదగా పాల్ నగర్ జంక్షన్ వరకు రోడ్డు, రూ.9.7 కోట్లతో సబ్బవరం నుంచి గుల్లేపల్లికి, రూ.3.52 కోట్లతో యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహం వరకు, రూ.7 కోట్లతో, మారికవలస జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ► మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ 11 ఫ్లోర్లలో 9 ఫోర్ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ● చీమలాపల్లి, ఎండాడ లా కాలేజీ వద్ద చేపట్టిన కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం 30 శాతం పూర్తయింది. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, సెక్రటరీ కీర్తి, సీఈ శివప్రసాద్రాజు, డీఎఫ్ఓ శాంతిస్వరూప్, ఈఈలు భవానీప్రసాద్, బలరాం తదితరులు పాల్గొన్నారు. కై లాసగిరిపై సరికొత్త ప్రాజెక్టులు ► పర్యాటకులను మరింత ఆకట్టుకొనే తరహాలో కై లాసగిరిపై గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► దీంతో పాటు జిప్లైన్, స్కై సైక్లింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రెండు నెలల్లోనే వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నారు. ►అలాగే కై లాసగిరిపై 1.99 ఎకరాల్లో పీపీపీ విధానంలో రూ.18 కోట్లతో నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ► వీఎంఆర్డీఏ పార్కు లైహౌస్ వద్ద ఓషన్ డెక్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను పూర్తి చేశారు. ► సీఆర్జెడ్ అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ► కై లాసగిరిపై రూ.4.69 కోట్ల అంచనా వ్యయంతో సైన్స్ మ్యూజియం నిర్మాణానికి రెండు రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు. ► అలాగే కొండపై డ్యాషింగ్ కార్, 12డీ థియేటర్, ఫ్లాష్ టవర్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
Phu Quoc: వెహికిల్స్కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్లకు ప్రసిద్ధి. అక్కడి సన్సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కల సాకారం చేసిన సీఎం జగన్..
-
HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్నగర్ వైపు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని పోలీసులు కోరారు. చదవండి: పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్ -
నాగలదిన్నె బ్రిడ్జి ప్రారంభం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం
అయిజ/నందవరం: ఇరు తెలుగు రాష్ట్రాలకు నాగలదిన్నె బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైలెవల్ వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్రం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రిబ్బన్ కట్ చేసి వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2009లో తుంగభద్ర నది ఉధృతిలో పాత బ్రిడ్జి కొట్టుకుపోయిందన్నారు. 2011లో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి కొత్త బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించారన్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. కరోనా విపత్తు, తెలంగాణ వైపు భూ సేకరణ వంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆయన పట్టుబట్టి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయని, వారందరికీ ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి రూ.42 కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశామన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్కు నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి భూ సేకరణ సమస్యను పరిష్కరించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లించి వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం మంజూరు చేసి పూర్తి చేయించిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దకాలంగా ఎదురు చూశారని, ఎట్టకేలకు రెండు రాష్ట్రాల బంధాలకు వంతెన వారధిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కర్నూలు కలెక్టర్ సృజన, సబ్ కలెక్టర్ అభిషేక్కుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఆదోని డివిజన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిత్యానందరాజు, ఎంపీడీఓ దశరథ రామయ్య, సీఐ మోహన్రెడ్డి, ఎస్ఐలు తిమ్మయ్య, తిమ్మారెడ్డి, శరత్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్య థాక్రేపై కేసు నమోదు
ముంబయి: అనుమతి లేకుండా వంతెనను ప్రారంభించారనే ఆరోపణలతో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రేపై కేసు నమోదైంది. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్వేను అధికారిక అనుమతి లేకుండా థాక్రే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసిన ముంబయి పోలీసులు.. కేసు నమోదు చేశారు. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్ వంతెన ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. వంతెనను వాహనదారులు వాడుకోవచ్చని అధికారిక సంస్థలు ఇంకా ధ్రువీకరించలేదు. ఇవేవీ పట్టించుకోకుండా వంతెనను ఆదిత్య థాక్రే ప్రారంభించారు. థాక్రే చర్యలపై పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సునీల్ షింద్, సచిన్ అహిర్లతో పాటు ఆదిత్య ఠాక్రేపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 143, 149, 336, 447 కింద కేసు నమోదు చేయబడింది. ఈ సెక్షన్లు చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య నేరపూరిత నేరాలకు సంబంధించినవి ఉంటాయి. దక్షిణ ముంబయి లోయర్ పరేల్ మధ్య నిర్మిస్తున్న కీలకమైన లింక్ డెలిస్లే బ్రిడ్జ్ను జూన్లో పాక్షికంగా తెరిచారు. కర్రీ రోడ్ నుండి లోయర్ పరేల్ను కలిపే మరో దశ సెప్టెంబర్లో ప్రారంభించబడింది. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోదీ -
ఓటేయాలంటే..వాగు దాటాలె
కొండాయి గ్రామ జనాభా 1860 ఓటర్లు: 1220 నివాస గృహాలు: 418 బతకడం వేరు. జీవించడం వేరు. వాళ్లు కేవలం బతుకుతున్నారంతే.. జీవించడాన్ని మన పాలకులు వాళ్లకింకా అలవాటు చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులూ మారుతున్నా.. ఆవిష్కరణలు ఆకాశాన్ని చుట్టేస్తున్నా.. ఇప్పటికీ ములుగు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగులు దాటుతున్నారు. ఈ ఏడాది జూలై 27న వరద ఎనిమిది మందిని మింగింది. ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఏ మనిషిని కదిలించినా రోదనలే. అంతుచిక్కని వేదనలే. వారిని ‘సాక్షి’ పలకరిస్తే వాగంత దుఃఖాన్ని వెళ్లబోసుకున్నారు. వారి ఎజెండా.. ఏమిటో చెప్పుకొచ్చారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది మా అమ్మగారింటికి(కొండాయి) తొలుసూరు కాన్పు చేయించుకునేందుకు వచ్చిన. వాగుపై బ్రిడ్జి కూలింది. నొప్పులు రావడంతో వాగులో నుంచి నడుములోతుల్లో దాటుకుంటుపోయిన. దొడ్లకు చేరుకొని అక్కడి నుంచి ఏటూరునాగారం, ములుగు వెళ్లేసరికి బిడ్డ అడ్డం తిరిగింది. పెద్దాపరేషన్ చేసి డెలివరీ చేసిండ్లు. మళ్లీ బాలింత నొప్పులతో ఉంటే.. మా అమ్మనాన్న, వాళ్లు మరో పదిమంది కలిసి డొల్ల కట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. – మానేటి సంధ్యారాణి, బాలింత, కొండాయి ఐదు నెలల నుంచి అంతులేని వ్యథ ఈ ఏడాది జూలై 27న అకాల వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధి హైలెవెల్ బ్రిడ్జి కూలింది. జంపన్న వాగు ఉధృతికి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కొండాయి గ్రామంలో వరద 8 మందిని జల సమాధి చేసింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఐదు నెలల నుంచి ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. గర్భిణులు ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డొల్లాలు కట్టి వాగు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం కోసం సైతం కొండాయిలో వేలి ముద్రవేసి.. వాగుదాటి దొడ్లకు వెళ్లి అక్కడి నుంచి బియ్యాన్ని మోసుకుంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎరువు అందుతలేదు.. పొలం పనుల కోసం కావాల్సిన ఎరువు బస్తాలు, ఇతర సామగ్రిని తెచ్చుకునేందుకు నరకం కనిపిస్తోంది. ఎరువు బస్తాలను వాగులో నుంచి తలపై పెట్టుకొని దాటించడం కష్టంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా వ్యవసాయ పనిముట్లకు కష్టాలు పడుతూ వాగుదాటాల్సి వస్తోంది. –బొచ్చు ఉపేందర్, రైతు ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. నా భర్త, కొడుకు జంపన్నవాగు ప్రమాదంలో చచ్చిపోయిండ్లు. ఇంటికి మగదిక్కులేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. నాకు ఏ అవసరం వచ్చినా.. ఆదుకునే వారే లేరు. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న. – మున్నిబేగం, కొండాయి ఒక్క కొండాయి గ్రామమే కాదు... ఏజెన్సీ పరిధిలోని అనేక ఆదివాసీ గూడేల ప్రజలు వంతెనలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో, పోటీలో ఉన్న నేతల హామీల్లో వీరి సమస్యలు ఎక్కడా కనిపించవు. ఏజñ న్సీ వాసుల ఇబ్బందులు ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది బీడీ కార్మికులు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. వీరి వెతలు నేతల చెవికెక్కుతాయన్న ఆశతో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ...ఈ పీపుల్స్ ఎజెండాకు మోక్షం లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. - అలువాల శ్రీనివాస్ -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!
కనువిందు చేసే కొన్ని దృశ్యాలు ఎంతగా ఆకట్టుకుంటాయో.. అంతే బెదరగొడతాయి. ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన నిర్మాణాల వెనుక ఉన్న రహస్యమైన కథలే అందుకు ప్రతీకలు. జర్మనీ, సాక్సోనీ రాష్ట్రం, గోర్లిట్జ్ జిల్లా, గబ్లెంజ్ సమీపంలోని రాకోట్జ్ సరసుపైనున్న వంతెన అలాంటిదే. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన కుమ్లౌ అజేలియా రోడడెండ్రన్ పార్క్కి ఆనుకుని ఉంది. ఇక్కడి ప్రకృతి అందం.. కనురెప్పలను క్షణం కూడా వాల్చనివ్వదు. ఎటు తిరిగి చూసినా స్వప్నలోకంలో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ వంతెనకు.. సర్కిల్ బ్రిడ్జ్, బసాల్ట్ బ్రిడ్జ్, కుమ్లౌ బ్రిడ్జ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సుందరమైన ఈ వంతెన.. సరసులో ప్రతిబింబిస్తూ.. ఎటు నుంచి చూసినా.. కచ్చితమైన కొలతలతో.. వృత్తాకారంలో కనువిందు చేస్తుంది. చలికాలంలో కిందున్న నీరంతా గడ్డకట్టి.. ఓ ఆర్చ్లా ఆకట్టుకుంటుంది. అగ్నిపర్వతాల శిల నుంచి ఏర్పడిన ‘బసాల్ట్’ అనే రాతితో పాటు మరిన్ని సహజమైన రాళ్లతో ఇది నిర్మితమైందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అయితే ఇది జనజీవనాన్ని కలిపే వారధి కాదని, కేవలం వీక్షకుల అహ్లాదం కోసం నిర్మించిన కట్టడం మాత్రమేనని కొందరు నిపుణుల ఉద్దేశం. దీన్ని 19వ శతాబ్దంలో ఓ మోతుబరి దగ్గరుండి కట్టించాడని స్థానికంగా కొన్ని కథనాలున్నా వాటికి సరైన ఆధారాల్లేవు. వైవిధ్యమైన ఒంపుతో మలచిన ఈ వంతెన.. ఎలాంటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద కొన్ని కొనలు.. ముళ్ల కిరీటాన్ని తలపిస్తాయి. ఇంత గొప్ప కట్టడం మనుషులకు సాధ్యంకాదని, దెయ్యాలు దీన్ని నిర్మించాయని, సైతాను ఆదేశంతో ఇది ఏర్పడిందని, ఈ వారధి సమీపంలో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే దీన్ని ‘డెవిల్స్ బ్రిడ్జ్’ అని పిలిచేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ ప్రత్యేకమైన కలువ పువ్వులు, అరుదైన వృక్షజాతులు.. రకరకాల రంగులతో ఆకట్టుకుంటాయి. మరోవైపు కొందరు దైవచింతన కలవారు.. ఈ వంతెన నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తారు. ఇది మరొక ప్రపంచానికి మార్గమని సూచిస్తారు. దాన్నే బలంగా నమ్ముతుంటారు. ఇక్కడి అందాలను చూడటానికి చాలామంది ఔత్సాహికులు ఎగబడుతుంటారు. కానీ ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు. చుట్టూ ఉన్న అందాలను మాత్రం తరించొచ్చు. ఏది ఏమైనా ఈ బ్రిడ్జ్ని నిర్మించింది ఎవరు? ఎందుకు నిర్మించారు? ఎందుకు దెయ్యం పేరుతో భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి? అసలు ఆ కాలంలో ఇంత గొప్ప నిర్మాణం ఎలా సాధ్యమైంది లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు. --సంహిత నిమ్మన (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన
-
Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్/ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజధాని హైదరాబాద్ మహానగరంలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉధృతంగా మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు మూసీలో వదలడంతో మూసారాంబాగ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మూసీ వాగు ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. #HyderabadRains Moosarambagh bridge is being closed from 9 Pm this evening due to increase in water levels in Musi as about 6000 cusecs is released from Osmansagar & Himayathsagar into Musi .. We will review the situation tomorrow pic.twitter.com/krWO8uqTyW — Arvind Kumar (@arvindkumar_ias) September 5, 2023 మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో :1013.18 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో : 3753.81క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 643.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ : 4.09టీఎంసీలు ఉంది. చదవండి: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు జంట జలాశయాలకు భారీగా వరద నీరు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
స్టీల్ బ్రిడ్జికి ‘నాయిని’ పేరు
హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.426 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు చౌరస్తాలో మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. స్టీల్బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లే వాహనాదారులకు ఇది ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఎటువంటి రోడ్డు వెడల్పు లేకుండా దుకాణాదారులకు నష్టం కలిగించకుండా అనుకున్న సమయానికి స్టీల్బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెట్రో ట్రైన్ మీదుగా అత్యంత ఎత్తు నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం స్టీల్ మాత్రమే ఉపయోగించి నిర్మించినట్లు తెలిపారు. ఇది నగరానికే తలమానికమని ఆయన కొనియాడారు. కాగా.. స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారని, స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయనుందన్నారు. నాయిని నరసింహారెడ్డి సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించారన్నారు. అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
ఇంజినీర్ను బురదలో దింపిన ఎమ్మెల్యే
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇంజినీర్ను బురదలో దింపి పనిష్మెంట్ ఇచ్చిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురం–నెలమంగల ప్రధాన రహదారి మార్గంలో గొల్లహళ్లి వద్ద రైల్వే పైవంతెన పనులు గత రెండు సంవత్సరాలుగా కుంటుతూ సాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు ఎమ్మెల్యే శ్రీనివాస్ వద్ద ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఇంజినీర్ను పిలిచి దుర్భాషలాడి ఒకసారి బురదలో దిగి పరిశీలించాలని ఆదేశించాడు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంజినీర్ బురదలో దిగి నడిచాడు. పనులు త్వగా పూర్తిచేయాలని లేదంటే ఇదే బురద ముఖానికి పూస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అధికారులు ఇలా చేస్తే కనీసం పనులు త్వరగా చేస్తారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి..
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
Advertisement