-
పోషకాల పిండివంటలు
సంక్రాంతికి మనం రకరకాల పిండివంటలు చేసుకుంటాం. అయితే అవన్నీ ఈ రుతువుకు తగినవనీ, శరీరానికి బలాన్నిస్తాయనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ పండక్కి ఈ పిండివంటలను నిర్దేశించి ఉండచ్చని వీటిలోని పోషకాలను బట్టి తెలుస్తోంది. ఏయే పిండివంటల్లో ఏయే పోషకాలున్నాయో చూద్దాం. అరిసెలు సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. వీటిని పంచదారతో, బెల్లంతో కూడా చేస్తారు కానీ, బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి మంచిది. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఐరన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కొబ్బరి బూరెలు అరిసెల తరవాత అంతటి ప్రధానమైన వంటకం కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపుపిండి, కొబ్బరి, యాలకుల పోడి, బెల్లం వాడతారు. అరిసెలలో ఉన్న పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఈ కొబ్బరి బూరెల్లో లభిస్తాయి. నువ్వుల ఉండలు పరస్పరం నువ్వుల ఉండలు పంచుకోవడం సంక్రాంతి సంప్రదాయాలలో ఒకటి. మంచి బలవర్థకమైన ఆహారం నువ్వుల ఉండలు. శీతాకాలంలో శరీరం పోడిబారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో ఉండే నూనె శరీరాన్ని కాంతిమంతంగా ఉండేలా దోహదం చేస్తుంది. టీనేజీ బాలికల్లో రక్తహీనతను నివారించడానికి ఉపకరిస్తుంది. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్ ఎ, డి, ఇ, కెలు లభిస్తాయి. దేహదారుఢ్యానికి నువ్వుండలను మించింది లేదు. జంతికలు తియ్యటి పదార్థాలు తిన్న జిహ్వ, ఆ వెంటనే కార కారంగా ఉండే వాటిని తినాలనుకోవడం సహజం. కారపు పిండివంటల్లో జంతికలు లేదా సకినాలు ప్రధానమైనవి. బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు, వాము ఇందులో వాడతారు. శనగపిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను అందిస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు సహకరిస్తాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువ తింటారు. వీటిలో వాడే వాము సుఖ విరోచనానికి తోడ్పడి.. జీర్ణప్రక్రియ చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. సున్ని ఉండలు బలవర్థకమైన ఆహారంలో సున్నిఉండలు మొదటిస్థానంలో ఉంటాయి. మినపపిండి, నెయ్యి, బెల్లం వాడతారు. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, సున్ని, నెయ్యి ద్వారాప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందిస్తాయి. కొత్త అల్లుళ్లకు సున్ని ఉండలు కొసరి కొసరి వడ్డిస్తారు. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అంటే దేనిలోనూ అతి పనికి రాదు. వంటికి మంచిది కదా.. రుచిగా ఉన్నాయి కదా అని మధుమేహులు, శరీర తత్త్వానికి పడని వాళ్లు తగిన మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యకరం అని గుర్తుంచుకోవడం మంచిది. కజ్జికాయలు అరిసెలు అంతగా పడని వారు, అంత శ్రమ తీసుకోలేనివారు కజ్జికాయలు చేసుకుంటారు. ఇవి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండటంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదార లేదా పల్లీలు, పుట్నాలు, నువ్వులతో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు వంటివి కూడా వినియోగిస్తారు. కజ్జికాయల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్ , ఖనిజ లవణాలు అందుతాయి. గారెలు సంక్రాంతికి తప్పనిసరిగా వండుకునే వాటిల్లో గారెలు ఒకటి. కనుము నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. పోట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పోట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పోట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి. -
క్రాబ్స్తో కేక్ పాపర్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కేక్ పాపర్స్ తయారీకి కావల్సినవి: పీతల గుజ్జు – అరకేజీ; బటర్ – రెండు టేబుల్ స్పూన్లు; స్ప్రింగ్ ఆనియన్ తరుగు – పావు కప్పు; ఎర్రక్యాప్సికం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; సెలెరీ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కోషర్ సాల్ట్ – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; సోయా సాస్ – పావు టీస్పూను; మయనైజ్ – పావు కప్పు; ఆవ పొడి – పావు టీస్పూను; మిరియాల పొడి – పావు టీస్పూను; బ్రెడ్ క్రంప్స్ – ఒకటింబావు కప్పులు; నూనె – ఒకటిన్నర కప్పులు. స్పైసీడిప్: మయనైజ్ – అరకప్పు; నిమ్మరసం – టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బ – పెద్దది ఒకటి(సన్నగా తర గాలి); చిల్లీ సాస్ – టీస్పూను. తయారీ విధానమిలా: బాణలిలో బటర్ వేసి, కరిగిన తరువాత.. స్ప్రింగ్ ఆనియన్ , క్యాప్సికం, సెలెరీ తరుగు వేసి వేయించాలి ∙ముక్కలన్నీ మెత్తబడిన తరువాత పీతల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి ∙ఇది వేగుతుండగానే.. ఒక గిన్నెలో గుడ్డు సొన, సోయా సాస్, మయనైజ్, ఆవపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ∙కలిపిన వెంటనే వేగుతున్న పీతల గుజుజపెన ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. చల్లారాక మీడియం సైజు బాల్స్లా చుట్టుకోవాలి. బాల్స్ అన్నీ తయారయ్యాక.. బ్రెడ్ క్రంప్స్లో ముంచి కోటింగ్లా పట్టించి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙అరగంట తరువాత నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే క్రాబ్ కేక్ పాపర్స్ రెడీ ∙స్పైసీడిప్ కోసం తీసుకున్న పదార్థాలను గిన్నెలో వేసి కలిపి.. వేడివేడి క్రాబ్ కేక్ పాపర్స్తో సర్వ్ చేసుకోవాలి. -
స్వీట్ పొటాటో పీజా బాల్స్.. సింపుల్గా చేసుకోండిలా
స్వీట్ పొటాటో పీజా బాల్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – అరకేజీ(తొక్కతీసి ముక్కలు తరగాలి); మటన్ ఖీమా – అరకప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; పీజా సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; గోధుమ పిండి – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు(సొనను బాగా కలిపి పెట్టుకోవాలి); బ్రెడ్ క్రంప్స్ – కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – రుచికి తగినంత. తయారీ విధానమిలా: చిలగడ దుంప ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టి, చిదుముకోవాలి. ఇందులో మటన్ ఖీమా, చీజ్ తురుము, పీజా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, బాల్స్లా చుట్టి పెట్టుకోవాలి గోధుమ పిండి, గుడ్లసొన, బ్రెడ్ క్రంప్స్ను వరుసగా పెట్టుకోవాలి. దుంపల బాల్స్ను ముందుగా గోధుమ పిండి, తరువాత గుడ్ల సొన, చివరిగా బ్రెడ్క్రంప్స్లో ముంచి డీప్ ఫ్రైచేసుకోవాలి ∙బాల్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి మారాక తీసేసి నచ్చిన సాస్తో సర్వ్ చేసుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: ఇటాలియన్ పీచ్ కుకీస్, ఇంట్లోనే చేసుకోవచ్చు
ఇటాలియన్ పీచ్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్ స్పూను; కోషర్ సాల్ట్ – పావు టీస్పూను; బటర్ – అరకప్పు; పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు; వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు; ఎరుపు, పసుపు ఫుడ్ కలర్ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు). పీనట్ బటర్ క్రీమ్: బటర్ – పావు కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీస్పూను; కోషర్ సాల్ట్ – చిటికెడు; పంచదార పొడి – కప్పు; పీచ్ ప్యూరీ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్లా మారేంత వరకు హ్యాండ్ మిక్సర్తో కలపాలి. తరువాత క్రీమ్ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్ను తక్కువ స్పీడ్లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ వేసి రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్ చేయాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్ ఫ్రూట్ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్ రెడీ అయిన తరువాత అవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ∙పీచ్ క్రీమ్కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్ సాల్ట్ లనుగిన్నెలో వేసి హ్యాండ్ మిక్సర్తో కలపాలి. ► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి. ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్ బేక్ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్క్రీమ్ను వేసి శాండ్విచ్లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్ పీచ్ కుకీస్ రెడీ. -
కేవలం 15 నిమిషాల్లో గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ
గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ తయారీకి కావల్సినవి: వెనీలా కేక్ మిక్స్ – మూడు కప్పులు; నూనె – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను; గ్రీన్ ఫుడ్ కలర్ – టీస్పూను(జెల్); పంచదార పొడి – ముప్పావు కప్పు; హార్ట్ షేప్ క్యాండీస్ – గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: కేక్ మిక్స్,నూనె, గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ను, గ్రీన్ఫుడ్ కలర్ను ఒక గిన్నెలో వేసి ముద్దలా కలపాలి. తరువాత రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙ఇరవై నిమిషాల తరువాత పిండి ముద్దను బయటకు తీసి స్కూప్ పరిమాణంలో పిండిని తీసుకుని ఉండలు చేయాలి. ఈ ఉండలను పంచదార పొడిలో ముంచి కోటింగ్లా అద్దాలి.తరువాత ఉండలను బేకింగ్ ట్రేలో పెట్టి, కుకీ షేప్ వచ్చేలా వత్తుకోవాలి ∙కుకీ మధ్యలో హార్ట్ ఆకారంలో ఉన్న క్యాండీని పెట్టి బేకింగ్ ట్రేని అవెన్లో పెట్టాలి ∙350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ. -
బేకరీ స్టైల్లో కుకీస్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
స్నీకర్ డూడుల్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడు కప్పులు; టార్టారిక్ యాసిడ్ – రెండు టీస్పూన్లు; కోషర్ సాల్ట్ – టీస్పూను; వంటసోడా – ముప్పావు టీస్పూను; బటర్ –కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; వెనీలా ఎసెన్స్– టీస్పూను; దాల్చినచెక్క పొడి – టేబుల్ స్పూను తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో మైదా, టార్టారిక్ యాసిడ్, వంటసోడా వేసి కలపాలి ∙అన్నీ కలిసిన తరువాత బటర్, ఒకటింబావు కప్పుల పంచదార వేసి మెషిన్ మిక్సర్తో కలపాలి ∙మిశ్రమం క్రీమ్లా మారిన తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ∙మిగిలిన పంచదారలో దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙గంట తర్వాత రిఫ్రిజిరేటర్నుంచి తీసిన మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాల్స్లా చేసి దాల్చినచెక్క పొడి అద్ది బేకింగ్ ట్రేలో పెట్టాలి ∙కుకీస్ అన్నీ తయారయ్యాక.. బేకింగ్ ట్రేని 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద, ఇరవై నిమిషాలు బేక్ చేస్తే స్నీకర్ డూడుల్ కుకీస్ రెడీ. -
స్నాక్స్ కోసం.. మైసూర్ బోండాలు, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు
గోధుమ మైసూర్ బోండాలు కావలసినవి: గోధుమ పిండి – 400 గ్రాములు పెరుగు – ముప్పావు కప్పు , బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా, పంచదార – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీలకర్ర– 1 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి – 1 టీ స్పూన్ (సన్నని తరుగు), చిన్నచిన్న కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్లు (తురుము కూడా వేసుకోవచ్చు), కరివేపాకు – 2 రెమ్మలు (సన్నగా తురుముకోవాలి), నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో బేకింగ్ సోడా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, బోంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలపాలి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుగా, జిగటగా అయ్యేలా చేసుకోవాలి. దాన్ని రెండు గంటల పాటు నానివ్వాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర,, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరిముక్కలు, కరివేపాకు తురుము వేసుకుని రెండుమూడు నిమిషాలు బాగా కలిపి.. కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా బొండాల్లా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. -
ఒకేసారి రెండు రకాల వంటలు చేసుకోవచ్చు, ధర కూడా తక్కువే
ఒకేసారి రెండు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా ఉన్న ఈ మల్టీ కుకర్ను.. యూజర్ ఫ్రెండ్లీ మెషిన్గా చెప్పుకోవచ్చు. చిన్నచిన్న అపార్ట్మెంట్స్లో, ఓపెన్ కిచెన్స్లో ఇలాంటి మినీ మేకర్ అందుబాటులో ఉంటే అలుపుసొలుపు లేకుండా ఇట్టే వంట చేసేసుకోవచ్చు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్తో పాటు కుడుములు, వాయికుడుములు వంటివెన్నో వండుకోవచ్చు. 3.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్లో.. గుడ్లు, జొన్న కండెలు, దుంపలు, కేక్స్ వంటివీ ఉడికించుకోవచ్చు. మెయిన్ బేస్ మెషిన్ మీద.. స్టీల్ ట్రేలో మరో వెరైటీని కుక్ చేసుకునే వీలుంటుంది. దీనికి సరిపడా ట్రాన్స్పరెంట్ లిడ్ (మూత) ఉంటుంది. డివైస్ ముందున్న రెగ్యులేటర్ సాయంతో దీన్ని సులభంగా వాడుకోవచ్చు. దీని ధర 80 డాలర్లు(రూ.6,672). -
క్రిస్టమస్ స్పెషల్: సాఫ్ట్ కుకీస్.. బేకరీ స్టైల్లో
క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్: కావలసినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా›– టీస్పూను; ఉప్పు – అర టీస్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; బటర్ – కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – రెండు టీ స్పూన్లు. తయారీ విధానమిలా: ►మైదా, వంటసోడా, ఉప్పుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙బటర్లో పంచదార వేసి క్రీమ్లా మారేంత వరకు బీటర్తో కలపాలి. తరువాత ఈ క్రీమ్ను రెండు గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత బటర్ క్రీమ్లో గుడ్లసొన, వెనీలా ఎసెన్స్, మైదా మిశ్రమం వేసి ముద్దగా కలుపుకోవాలి పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►రెండు గంటల తరువాత పిండి ముద్దను రొట్టెల్లా వత్తుకోవాలి ∙ఈ రొట్టెను క్రిస్టమస్ ట్రీ, స్టార్స్, బొమ్మల ఆకారంలో కట్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. కుకీస్ ఆకారాన్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ∙ఈ బేకింగ్ ట్రేను 400 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద పదినిమిషాలు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్ రెడీ. -
ఇన్స్టంట్గా చేసుకునే స్వీట్ కార్న్ గారెలు
స్వీట్ కార్న్– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి: లేత స్వీట్ కార్న్ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి) అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత జీలకర్ర – ఒక టీ స్పూన్,సోంపు – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానాతో బర్ఫీ.. సింపుల్గా, క్షణాల్లో చేసుకోవచ్చు
బనానా జాంగ్రీ బర్ఫీ తయారీకి కావల్సినవి: అరటిపండ్లు – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, మిల్క్ పౌడర్ – 1 కప్పు, బెల్లం తురుము (జాంగ్రీ) – ముప్పావు కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూన్ (అభిరుచిని బట్టి), చిక్కటి పాలు – పావు కప్పు (కాచినవి), జీడిపప్పు, బాదం ముక్కలు – గార్నిష్కి సరిపడా తయారీ విధానమిలా: ఒక పాత్రలో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పోసుకుని.. సిమ్ ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే.. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం కావలసిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
అన్నంలోకి నిమిషాల్లో రుచులు
ఇంట్లో పేరెంట్స్ లేని సమయంలో సింపుల్గా చేసుకునే కొన్ని వెరైటీలను చూద్దామిప్పుడు. మ్యాగీ, పాస్తా, శాండ్విచ్, చాకోస్ వంటివన్నీ పిల్లలు.. చిటికెలో చేసుకుని, తినగలిగినవే. నిజానికి ఇదివరకటి పిల్లలైతే అటుకులు, మరమరాలు వంటివి ఇంట్లో ఉంటే చాలు.. వాటితో ఎన్నో వెరైటీలను ఇట్టే చేసుకునేవారు.అటుకులు, బెల్లం కోరు, శనగపప్పు, కొబ్బరికోరు కలుపుకొని తింటే... బలమే కాదు చాలాసేపటి వరకు ఆకలినీ ఆపుతుంది. బెల్లం పాలు కాచుకుని అటుకులు వేసుకుని తినడం, లేదంటే అటుకుల్లో కాస్త ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవడం వంటివి చిటికెలో చేసుకోవచ్చు. ఇక మరమరాలు తడిపి.. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, టొమాటో ముక్కలు వంటివి వేసి క్షణాల్లో రుచికరమైన స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. 3 నిమిషాల్లో మజ్జిగ చారు కావాల్సినవి: పెరుగు – పావు కప్పు (కొద్దిగా నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – కొద్దికొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్ ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము – కొద్దికొద్దిగా.. తయారీ: ముందు కళాయిలో నూనె వేసుకుని.. అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దానిలో ఉప్పు వేసుకుని, ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని పలుచగా చేసుకున్న పెరుగులో కలిపి బాగా తిప్పాలి. అందులో కొత్తిమీర తురుము కూడా వేసుకుని అన్నంలోకి తింటే అదిరిపోతుంది. తాలింపు వేసే సమయంలో, వేడి పాత్రను పట్టుకునేప్పుడు జాగ్రత్తలు అవసరం. 5 నిమిషాల పచ్చడి కావాల్సినవి: పచ్చిమిర్చి – 5, చింతపండు – అర నిమ్మకాయ సైజ్ (గింజలు లేకుండా తీసి, కడిగి, నానబెట్టుకోవాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – చిన్నది (నాలుగైదు ముక్కలు చేసుకోవాలి), నూనె – 1 టీ స్పూన్ (కాచాల్సిన పనిలేదు) తయారీ: పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని.. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, మరోసారి మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని.. కొత్తిమీర తురుము, నూనె వేసుకుని, వేడి వేడి అన్నంతో తింటే సూపర్బ్గా ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు.. పెద్దలు అందుబాటులో లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు. 10 నిమిషాల లోపు కర్రీ కావాల్సినవి: ఉల్లిపాయ–1(చిన్నగా తరగాలి), టొమాటోలు – 6 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 2, ఉప్పు – సరిపడా, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ పైనే, కారం – 2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున, నూనె – 2 టేబుల్ స్పూన్లు పైనే.. తయారీ: ముందుగా చిన్న కుకర్లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేగించుకుని.. టొమాటో ముక్కలు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి గ్లాసున్నర వాటర్ పోసి.. మూతపెట్టి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాస్త చల్లారాక.. మూత ఓపెన్ చేసి.. అందులో కరివేపాకు వేసుకుని, ఇంకాస్త గ్రేవీలా అయ్యేందుకు.. చిన్నమంటపై కాసేపు మగ్గించుకోవచ్చు. ఆ సమయంలో గరిటెతో ఇంకాస్త మెత్తగా చేసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే మాదిరి టొమాటో ముక్కల బదులు బంగాళదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇలా చాలా కూరగాయలతోనూ ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. -
కమ్యూనిటీ కిచెన్: వంట చేసే పనిలేదు, ఇంటికే భోజనం వచ్చేస్తుంది
పది కుటుంబాలకు నలుగురు వండి పెడతారు. రోజూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండీ వండీ వండీ అలసిపోయేవారూ ఉద్యోగాల వల్ల టైమ్ లేని వారు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నవారు ఇదేదో బాగుందే అనుకుంటున్నవారు కేరళలో కమ్యూనిటీ కిచెన్స్ను ప్రోత్సహిస్తున్నారు. అంటే పది కుటుంబాలు కలిసి ఓ నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ మహిళలు ఆ పది కుటుంబాలకు వంట చేసి పంపిస్తున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతున్న ట్రెండ్. 'ప్లాన్ చేస్తే పోయేదేమీ లేదు వంట చేసే బాధ తప్ప’ అంటున్నారు కేరళ వాసులు. ‘వంట గది వద్దు. వంట మీద ఆదాయం ముద్దు’ అనే నినాదం కూడా ఇస్తున్నారు. ఇదంతా గత ఒకటి రెండేళ్లలో జరిగిన మార్పు. కేరళలోని పొన్నాని’ అనే టౌన్లో ఇద్దరు స్నేహితుల కుటుంబాలకు వచ్చిన ఆలోచన ‘సహకరణ కిచెన్’ (కమ్యూనిటీ కిచెన్) ఉద్యమానికి కారణం అయ్యింది. వంట చేసి పెడతారా? పొన్నానిలో రమేష్ వలియిల్ అనే బ్యాంక్ ఎంప్లాయే రోజూ వంట కోసం భార్య పడే బాధలు చూసేవాడు. ఉదయాన్నే ఆమె బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ వండి బాక్స్ కట్టివ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లకు ఆమె జబ్బు పడింది. డాక్టర్లు వంట చేయవద్దన్నారు. ఏం చేయాలో రమేష్కు ΄పాలుపోలేదు. మరోవైపు అదే ఊళ్లో ఉన్న కలీముద్దీన్, అతని భార్య మాజిద అడ్వకేట్లు. ఉదయాన్నే ఇంటికొచ్చే క్లయింట్లను చూసుకోవాలా వంట గొడవలో ఉండాలా అనేది సమస్య అయ్యింది. ఈ కుటుంబాలు రెండూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక తమకెవరైనా వండిపెట్టే వాళ్లుంటే బాగుండు అనుకున్నారు. అది కూడా ఇంటికొచ్చి కాదు. ఎక్కడైనా వండి పెట్టి అందించే వారు కావాలి. అందుకని వారే ఇద్దరు స్త్రీలను వెతికారు. వారికోసమని ఒక ఖాళీ స్థలం వెతికి షెడ్ వేశారు. తమ కుటుంబాలతో పాటు మరో ఎనిమిది కుటుంబాలను కలిపారు. మొత్తం పది కుటుంబాల కోసం అలా కమ్యూనిటీ కిచెన్ మొదలయ్యింది. వంట బాధ నుంచి పెద్ద ఉపశమనం లభించింది. మొదటి రోజే మెను రోజూ ఉదయాన్నే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్, లంచ్ తయారయ్యి ఈ పది కుటుంబాల గడపలకు చేరేవి. వంట చేసే మనుషులకు ఇలా చేరవేసే మనుషులు తోడయ్యారు. వంట ఖర్చు అన్ని కుటుంబాలు సమానంగా పంచుకున్నా నెలకు వంట చేసి పెట్టేవారికి మంచి గిట్టుబాటుగానే ఉంది. కాకుంటే వీళ్లు ఉదయాన్నే నాలుగ్గంటలకంతా లేచి వంట మొదలుపెట్టాలి. మెనూ వాట్సాప్ గ్రూప్లో మొదటిరోజు పోస్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పూరి, పుట్టు, ఆపమ్, ఉప్మా లాంటివి ఉంటాయి. భోజనంలో నాలుగు రకాల కూరలు చికెన్, ఫిష్ ఉంటాయి. ఈ కుటుంబాల వాళ్లు ఫోన్లు చేసి వాట్సప్ కాల్స్ చేసి వంటను అజమాయిషీ చేస్తారు. మసాలాలు ఏవి వేయాలో చెప్తారు. అంతా ఆరోగ్యకరమైన తిండి లభించేలా చూస్తారు. లాభాలు ఎన్నో వంట తప్పితే మొదట చాలా టైము అందరి దగ్గరా మిగులుతోంది. ‘ఇంతకుముందు పిల్లలు స్పెషల్గా ఏదైనా చేసిపెట్టమంటే రోజువారి వంటతో ఓపిక లేక చేసేదాన్ని కాదు. ఇప్పుడు చేసి పెడుతున్నాను’ అని ఒక తల్లి చెప్పింది. ‘పది ఇళ్ల వంట వల్ల అయ్యే ఇంధనం, వచ్చే చెత్త కంటే కమ్యూనిటీ కిచెన్ వల్ల అయ్యే ఇంధనం, మిగిలే చెత్త తక్కువ. డబ్బు ఆదా అవుతుంది కూడా’ అంది మరో గృహిణి. అదీగాక దీనివల్ల మరో నలుగురికి పని దొరకడం మంచి విషయంగానే చూస్తున్నారు. ఊరూరూ వ్యాపించాయి మలబార్ జిల్లాలోని పొన్నాని నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ వెంటనే పక్క జిల్లా అయిన కోళికోడ్కు వ్యాపించింది. ప్రస్తుతం మలప్పురం, బలుస్సేరి, కన్నూర్, చెవరంబలమ్... ఇలా ఒక్కో ఊరిలో కమ్యూనిటీ కిచెన్లు వెలుస్తున్నాయి. సూత్రం ఒకటే– నలుగురు కలిసి కిచెన్ నడుపుతారు. కేవలం పది లేదా 11 కుటుంబాలకు వండుతారు. ఈ సంఖ్య వల్ల పెద్ద పెద్ద వంట పాత్రలు, భారీ పొయ్యి, ఎక్కువ శ్రమ, సిబ్బంది అవసరం తప్పుతోంది. ఇద్దరు ముగ్గురు గృహిణులు కలిసి తమ ఇళ్లలోనే వండి బాక్సులు పంపిస్తున్నారు. ఇవి సక్సెస్ అవుతున్నాయి కూడా! మహిళలే... వండాలా? ఈ కిచెన్ల మీద ఒకటి రెండు విమర్శలు ఉన్నాయి. అవేమిటంటే ‘కమ్యూనిటీ కిచెన్స్లో కూడా ఆడవాళ్లే వండాలా’ అని ప్రగతివాదులు అంటుంటే ‘ఇంట్లో వంట మానేసి ఈ వేషాలా’ అని మగ దురహంకారులు అంటున్నారు. విమర్శలు ఎలా ఉన్నా ఏదో ఒకరోజు ఇళ్లలో వంట చేయడం కంటే ఇలాంటి కిచెన్ల మీద అందరూ ఆధారపడే రోజు తప్పక వస్తుంది. మంచిదే. -
మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ , మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోండిలా..
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్తో కాని తింటే రుచిగా ఉంటుంది. -
గోధుమ బిస్కట్స్.. చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు
గోధుమ బిస్కట్స్ తయారీకి కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు పంచదార పొడి – ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), ఉప్పు – కొద్దిగా, కుకింగ్ సోడా – చిటికెడు పుచ్చగింజలు – 1 టీ స్పూన్ సోంపు – 1 టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు, నెయ్యి, నీళ్లు – పావు కప్పు చొప్పున నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు, కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్లా చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్లెస్ కేక్’ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
చిక్కుడు కాయ పప్పు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
చిక్కుడు కాయ పప్పు తయారీకి కావల్సినవి: చిక్కుడు కాయలు – పావు కేజీ; పెసరపప్పు – అరకప్పు; పసుపు – పావు టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు; ఎండుమిర్చి – నాలుగు; జీలకర్ర – టీస్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు;ఉప్పు – తగినంత ఆవాలు – పావు టీస్పూను; నూనె – తగినంత; మినప్పప్పు – టీస్పూను; తయారీ విధానమిలా: పెసరపప్పుని కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. దీనిలో కప్పునీళ్లు, పసుపు, 1/2 టీస్పూను ఉప్పు వేసి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. చిక్కుడు కాయలను కడిగి ఈ నూనె తీసి ముక్కలు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేయాలి. ఉడికిన పెసరపప్పులో.. చిక్కుడు ముక్కలు, నూరుకున్న మసాలా పేస్టు, ఉప్పువేసి కలపాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక మిగతా కరివేపాకు వేసి వేయించి అందులో పప్పు మిశ్రమాన్ని కలిపితే చిక్కుడుకాయ పప్పు రెడీ. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బావుంటుంది. -
అరటికాయతో కారం పొడి.. అన్నంలోకి సూపర్ ఉంటుంది
అరటికాయ కారం పొడి తయారీకి కావలసినవి: అరటికాయలు – మూడు; పసుపు – 1/2 టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; పచ్చిశనగ పప్పు – టీస్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండుమిర్చి – ఐదు; మిరియాలు – టీస్పూను; ఎండు కొబ్బరి తురుము – నాలుగు టీస్పూన్లు; కరివేపాకు – ఐదు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఆవాలు – అరటీస్పూను. తయారీ విధానమిలా: స్టవ్ వెలిగించి మీడియం మంట మీద అరటికాయలను కాల్చాలి. చక్కగా కాలాక మంట మీద నుంచి తీసి చల్లారాక తొక్కతీసేసి, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిపెట్టి టీస్పూను మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి తురుము, మూడు రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేగాక, చల్లారనిచ్చి పొడిచేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనె వేయాలి. ∙వేడెక్కిన తరువాత మిగిలిన మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. చిటపటలాడాక అరటికాయ తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి, సన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పొడి రెడీ. -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్కి అప్పగించేయండి! -
ఒడిశా పాపులర్ డిష్:హబీషా దాల్మా..సింపుల్గా, టేస్టీగా
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి: పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు; టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు; ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. -
వ్యర్థాల నుంచి రుచికరమైన వంటలు తయారు చేస్తున్న పాపులర్ చెఫ్
వంట అందరూ చేస్తారు కానీ, ఎక్కువమంది తినేట్టు, నచ్చేటట్లు చేసిన వారు మాత్రమే చెఫ్గా మారతారు. మరింత రుచికరంగా... ఘుమఘుమలాడేలా వినూత్నంగా ఆహారాన్ని తయారు చేసిన వారు పాపులర్ చెఫ్గా పేరు తెచ్చుకుంటారు. ఇలా పాపులర్ అయిన అతికొద్దిమంది చెఫ్లలో ఒకరే దవీందర్ కుమార్. ప్రొఫెషనల్ చెఫ్గా యాభై ఏళ్లు పూర్తి చేసుకుని వేస్ట్ టు ప్లేట్’ ఐడియాతో ఇండియాలోనే గాక ప్రపంచంలోని చెఫ్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెఫ్ డీకేగా పేరొందిన దవీందర్ కుమార్ ఢిల్లీ యూనివర్శిటీలో కామర్స్ డిగ్రీ పూర్తయ్యాక ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలనుకున్నారు. అప్పట్లో పెద్దగా ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో లేవు. తన స్నేహితుడు ఒబెరాయ్ హోటల్లో పనిచేస్తుండడంతో తను కూడా హోటల్లో చేరాలనుకున్నాడు. ఇంట్లో ఎవరికీ ఇష్టలేకపోయినప్పటికీ ‘ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్’లో చేరాడు. మూడేళ్ల కిచెన్ మేనేజ్మెంట్ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత.. ఒబెరాయ్ హోటల్లో పర్మనెంట్ ఉద్యోగి అయ్యాడు. దీంతో దవీందర్ చెఫ్ ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ భాషపై ఉన్న ఆసక్తితో ఫ్రెంచ్ వంటకాలను సైతం నేర్చుకునేవాడు. ఆసక్తి మరింత ఎక్కువ కావడంతో పారిస్లోని టెక్నిక్ డీ హోటలియర్లో రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. తనకిష్టమైన వంటలన్నీ నేర్చుకుంటూ, మరోపక్క చెఫ్గా రాణిస్తూ ఒబెరాయ్ గ్రూప్లో 12 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తరువాత 1985లో ‘లీ మెరిడియన్’లో టీమ్ సభ్యుడిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెరిడియన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్గానేగాక, ఎగ్జిక్యూటివ్ చెఫ్గా పనిచేస్తున్నారు. ఇండియన్ కలినరీ ఫోరమ్కు (ఐసీఎఫ్)కు ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొక్కలతో... చెఫ్గా ఎంతో అనుభవం ఉన్న దవీందర్ కుమార్ ఒకరోజు టీవీలో వరల్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న ఆహారంలో మూడు వంతులు తినకముందే వ్యర్థంగా పోతుంది. ఒక్కో హోటల్లో పండ్లు, కూరగాయల నుంచి తయారు చేసే వంటకాల్లో కనీసం ఐదు నుంచి పది శాతం వ్యర్థంగా పోతుంది’’ అని చెప్పారు. ఇది చూసిన దవీందర్కు వ్యర్థాల నుంచి కూడా ఆహారం తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. అదే వేస్ట్ టు ప్లేట్. అనుకున్న వెంటనే పన్నెండు రెస్టారెంట్లు, ఐదు ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి పండ్లు, కూరగాయ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు. అలా సేకరించిన వాటిని శుభ్రం చేసి రంగు, రుచికి తగ్గట్టుగా వేరు చేసి, పోషకాలతో కూడిన డిష్లను తయారు చేసి కస్టమర్లకు వేడి వేడిగా వడ్డించారు వీటిని తిన్నవారు ఇష్టపడడంతో వేస్ట్ టు ప్లేట్ను కొనసాగిస్తున్నారు. ఈ ఫుడ్ వ్యర్థాల్లో కూరగాయ, పండ్లతొక్కలు, కొమ్మలు, కాడలు, విత్తనాలు కూడా ఉన్నాయి. స్పెషల్ మెనూ.. వ్యర్థాల నుంచి తయారు చేసే రుచికరమైన వంటలతో ఏకంగా స్పెషల్ మెనూని అందిస్తున్నాడు చెఫ్ డీకే. ఈ మెనూలో పనసపండు విత్తనాలు, బాదం హల్వా, సెలేరి, పాలకూర సలాడ్, యాపిల్ పల్ప్ పై, బ్రాకలీ, పుదీనా కాడల ముక్కల చట్నీ, జ్యూస్ తీయగా మిగిలిపోయిన బీట్రూట్తో రసం, క్యారట్ తొక్కల సలాడ్వంటివి ఉన్నాయి. ఈ డిష్లు రుచిగా, శుచిగానేగాక పుష్కలంగా పోషకాలు ఉండేలా వడ్డించడం విశేషం. View this post on Instagram A post shared by Chef Davinder Kumar (@chefdavinderkumar) కుక్ బుక్స్.. కొత్త వంటలని కనిపెట్టడమేగాక తను చేసే వంటలతో చాలా కుక్బుక్స్ను రాశాడు చెఫ్ డీకే. ఈ బుక్స్లో ‘కబాబ్ చట్నీ అండ్ బ్రెడ్’, జస్ట్ కబాబ్: ఫర్365 కబాబ్స్ అండ్ లీప్ ఇయర్’, సూప్స్, ఫోర్ సీజన్స్, సీజనల్ సలాడ్, సెకండ్ మీల్స్ వంటివి ఉన్నాయి. పుస్తకాల్లో కొన్నింటికి గౌరవ సత్కారాలు కూడా అందుకున్నారు. లీ మెరిడియన్ పదో వార్షికోత్సవం సందర్భంగా 7500 కేజీల కేక్ను తయారు చేసి లిమ్కాబుక్ రికార్డుల్లో నిలిచారు. అంతర్జాతీయ మెడల్స్తో పాటు, గోల్డెన్ హ్యాట్ చెఫ్ అవార్డు, భారత పర్యాటక మంత్రిత్వ శాఖతో బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా అవార్డు, జాతీయ టూరిజం అవార్డులను అందుకున్నారు. View this post on Instagram A post shared by Trends9 (@trends9official) -
స్వీట్ పొటాటోతో బిస్కెట్స్.. మీరెప్పుడైనా ట్రై చేశారా?
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు. తయారీ విధానమిలా: ►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. ► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి. ► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement