-
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్లో 131 మంది, టఖార్లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. నిరాశ్రయులైన ప్రజలు (ఫొటోలు)
-
పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
రియోడిజెనెరియో: బ్రెజిల్లో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. దక్షిణ బ్రెజిల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రియో గ్రాండేలో వరదలు పోటెత్తాయి. బ్రెజిల్ గత 80 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందిపైగా చనిపోట్లు అధికారికంగా ప్రకటించారు.వరదల్లో వందల మంది గల్లంతయ్యారు. లక్షల మంది చెల్లాచెదురయ్యారు. తాగునీరు, కరెంటు లేకుండా పోయాయి. టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయడం లేదు. వీధులు నదుల్లా మారిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి ఇళ్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడటం లేదు.A devastating flood has hit Rio Grande do Sul in Brazil impacting more than 1 million people, of which 41,000 had already been forced to flee.UNHCR is working with local authorities and civil society to respond to this climate emergency. https://t.co/Ewm4e1IprO pic.twitter.com/IypsMLTV7s— UNHCR, the UN Refugee Agency (@Refugees) May 9, 2024తమ ఇళ్లలో దోపిడీ జరుగుతుందేమో అన్న భయంతో వారు పునరావాస కేంద్రాలకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా గ్యూబా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మొత్తం ఐదు డ్యామ్లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. స్పందించిన బిలీయనీర్ ఎలాన్ మస్క్...బ్రెజిల్ రియో గ్రాండేలో పోటెత్తిన భీకర వరదలపై టెస్లా అధినేత, పాపులర్ బిలియనీర్ ఎలాన్మస్క్ స్పందించారు. స్టార్లింక్కు చెందిన 1000 టర్మినల్స్ను విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ కోసం ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. బ్రెజిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Horse stranded on rooftop amidst the floodwater in the city of Canoas, Brazil. The city’s mayor said they were hoping to rescue the horse with a helicopter.pic.twitter.com/4CDfpA2Lst— Mahatma Gandhi (Parody) (@GandhiAOC) May 9, 2024ఇంటి మీదకు ఎక్కిన గుర్రం.. వీడియో వైరల్ రియో గ్రాండేలోని పోర్టో అలెగ్రెలోని కానోస్ పట్టణంలో పోటెత్తిన వరదల నుంచి తప్పించుకోవడానికి ఒక గుర్రం ఏకంగా ఇంటిపైకి ఎక్కి నిల్చుంది. ఈ గుర్రాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కారామెలో అని నిక్నేమ్తో నెటిజన్స్ పిలుచుకుంటున్న గుర్రాన్ని ఫైర్ ఫైటర్స్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం కారామెలో వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. Man searching for survivors during the devastating floods in Brazil smashes through the roof of a fully inundated house to rescue a dog after he hears barking and whimpering. 🇧🇷🙏pic.twitter.com/51Kv6gylSM— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 9, 2024 -
టెక్సాస్లో భారీ వర్షం.. ఎటుచూసినా వరద నీరే..
టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం.వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
భారీ వరదలు.. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటే..
ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇటీవల కురిసిన వర్షానికి వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో పనిచేసేలా అక్కడి యంత్రాంగం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. దాంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిసామర్థ్యానికి చేరుకుందని సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ విమానాశ్రయం కార్యకలాపాలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 75 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రన్వే నీట మునిగింది. దీంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి విమానాశ్రయం సాధారణ స్థితికి వచ్చిందని, రోజుకు దాదాపు 1400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని గ్రిఫిత్స్ తెలిపారు.ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీవిమానాశ్రయం తిరిగి యథావిధిగా పనిచేసేలా కృషి చేసిన వారిని ఉద్దేశించి సీఈఓ మాట్లాడారు. ‘విమానాశ్రయం తిరిగి కార్యకలాపాలు సాగించడంలో సిబ్బంది చాలాచొరవ చూపారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా 2,155 విమానాలు రద్దు చేశాం. 115 ఎయిర్క్రాఫ్ట్లను దారిమళ్లించాం. దుబాయ్లోని రెండు విమానాశ్రయాలు డీఎక్స్బీ, డీడబ్ల్యూసీ చుట్టూ నీరు చేరడంతో సామగ్రిని రవాణా చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నాం. రెండు విమానాశ్రయాల్లోని సిబ్బంది, ప్రయాణికులకు 75,000 పైగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు మా ఎయిర్లైన్ భాగస్వాములు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య భాగస్వాములు, సేవా భాగస్వాములతో కలిసి పని చేయాల్సి వచ్చింది’అని ఆయన అన్నారు. -
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కసారిగా కురిస్తే ఇలా ఉంటుందా..!
వర్షం అనేది మనకు సీజన్ల బట్టే వస్తోంది ఒక్కోసారి సమ్మర్లో కూడా వచ్చిన అదికూడా ఓ మోస్తారుగా వస్తుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే నమోదవ్వుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్ని వణికించేలా వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా దుబాయ్లోని కార్లు, బహుళ అంతస్థులు నీట మునిగాయి. అంతేగాదు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కురవాల్సిన వానంతా ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా కురిసేసింది. అంతేగాదు అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎన్నడు చూడలేదని ఇది "చారిత్రక వాతావరణ సంఘటన" అని చెబుతున్నారు. దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భారీ వర్షాలు యూఏఈనే కాకుండా ఒమన్ని కూడా తాకింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారిలాంటి దుబాయ్ అంతటా కాలువలు పారుతున్నాయంటూ పోస్టులు పెట్టారు. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్.. 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా దుబాయ్ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
Afghan: ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్తాన్లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ దేశంలో సంభవించిన వరదలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అబ్దుల్లా జనాన్ తెలిపారు. వర్షాల కారణంగా 200 పశువులు మృతిచెందాయని, 800 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ,పశ్చిమ ఫరా, హెరాత్, సదరన్ జాబుల్, కాందహార్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అఫ్గానిస్తాన్లోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఫిబ్రవరిలో తూర్పు అఫ్గానిస్తాన్లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మార్చిలో కురిసిన వర్షాలకు 60 మంది మృత్యువాత పడ్డారు. అఫ్గానిస్తాన్లోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని పేర్కొంది. -
Russia Floods: రష్యాలో భారీ వరదలు
మాస్కో: రష్యాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉరల్ పర్వతాలు, సైబీరియా ప్రాంతాల్లో మంచు కరిగి నదుల్లోకి చేరడం వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. కజకిస్తాన్ సరిహద్దులోని ఒరెన్బర్గ్ ప్రాంతం వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ 10వేల ఇళ్ల దాకా నీటిలో మునిగాయి. పశ్చిమ సైబీరియాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. ఉరల్ నది ప్రమాదకర స్థాయిలలో ప్రవహిస్తోంది. దీంతో నది తీర ప్రాంతాల్లో ఉండే వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నది ఒరెన్బర్గ్ మీదుగా కజకిస్తాన్ వెళుతుంది. సమీపంలోని డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒర్స్క్ నగరం పూర్తిగా నీటిమయమైంది. ఇదీ చదవండి.. దైవ కణం ఉందన్న శాస్త్రవేత్త కన్నుమూశాడు -
వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..!
బ్రిటిష్ పాలనలో చాలా రకాల పన్నులు వేసేవారు. ఇప్పటికీ వారి పాలనలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక ట్యాక్స్లు సామాన్యుల భారంగా మారుతున్నాయి. మనిషి తయారుచేసిన ఉత్పత్తులు, వాటికి అందించే సేవలపై ట్యాక్స్లుండడం సహజం. అయితే విచిత్రంగా ప్రకృతి ప్రసాదించే వర్షానికి సైతం పన్ను చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు. మొట్టమొదటిసారిగా కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు కెనడా ప్రభుత్వం ప్రకృతి సహజంగా ప్రసాదించే వర్షంపై ప్రజలపై ఎందుకు ట్యాక్స్ విధిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం..టొరంటో నగరంతోపాటు దాదాపు కెనడా మొత్తం తుపాను నీటి నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. కెనడాలో మార్చి నుంచి మే నెల వరకు వర్షంతో పాటు మంచు కురుస్తుంది. భూఉపరితలం, చెట్లు, మొక్కల ద్వారా గ్రహించబడని వర్షపునీరు బయట రోడ్లపై ప్రవహిస్తుంటుంది. అయితే ఆదేశంలో నేల కనిపించకుండా ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు.. అలా దాదాపు అంతా కాంక్రీటుమయం కావడంతో నీటి నిర్వహణ సవాలుగా మారుతోంది. కెనడాలో తుపాన్లు ఎక్కువగా వస్తూంటాయి. అది సమస్యను మరింత పెంచుతోంది. దాంతో ప్రజల రోజువారీ కార్యకలాపాలు చాలా దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితుల్లో స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. నీటి వినియోగదారులు, ఆసక్తిగల పార్టీల సహకారం, ఎన్జీఓలతో తుపాను నీటి నిర్వహణను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘స్మార్ట్ వాటర్ ఛార్జ్, వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని ప్రజలే భరించాలనే ఉద్దేశంతో రెయిన్ట్యాక్స్ను విధించనున్నట్లు తెలిసింది. కెనడాలో అధికభాగం రాతినేలలే. దాంతో వర్షపునీరు నేలలో ఇంకేందుకు చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్ వాటర్తో నాలాలు పొంగిపోర్లుతుంటాయి. ఈ సమస్యను ‘రన్ఆఫ్’ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్ వాటర్ ఛార్జ్ను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీస్తారు. దానికి అయ్యే ఖర్చులను రెయిన్ట్యాక్స్ ద్వారా భర్తీ చేస్తారు. వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్ఆఫ్ ఉంటుంది. అందువల్ల అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువ విధిస్తారు. ఈ పన్ను కేటగిరీలో ఇళ్లు, పార్కింగ్ స్థలాలు, కాంక్రీటుతో చేసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. కెనడాలో విధించే వ్యక్తిగత పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధించే దేశాల విభాగంలో కెనడా ఉంటుంది. తాజాగా వర్షపు పన్ను ప్రజలపై మరింత భారంమోపేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. టొరంటో ప్రజలు ఇప్పటికే నీటిపై పన్ను చెల్లిస్తున్నారు. ఇందులో తుపాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉందని కొందరు చెబుతున్నారు. నీటి పన్నుతోపాటు ప్రత్యేకంగా రెయిన్ట్యాక్స్ విధించడంపట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. -
ముంపు నుంచి ‘రక్షణ’
వర్షం వచ్చిందంటే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణం కృష్ణా నది పొంగుతుందో... ఎక్కడ తమ ప్రాంతానికి వరద వస్తుందో... తమ ఇళ్లు ముంపు బారిన పడతాయో... మళ్లీ మా బతుకులు ఎక్కడ అతలాకుతలంఅవుతాయోనని ఆందోళన చెందేవారు. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవాడ నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్య. అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఎన్నో మారినా ఇక్కడివారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ సమస్యపై దృష్టిసారించారు. అవసరమైన నిధులు మంజూరు చేసి రక్షణగోడ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వేలాదిమంది ప్రజల చింత తీర్చారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర ప్రజలకు వరద ముప్పు నుంచి పూర్తి ఉపశమనం కలగనుంది. ఆర్టీసీ బస్టాండు నుంచి యనమలకుదురు వరకు వేలాది మంది ప్రజలకు వరద కష్టాలు తొలగనున్నాయి. ప్రకాశం బ్యారేజినుంచి 5లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వదిలితే దిగువ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యేవి. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినా ఏ ఇబ్బంది లేకుండా రక్షణ గోడ నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతవాసుల ముంపు కష్టాల నుంచి గట్టెక్కిస్తూ కనకదుర్గమ్మ వారధినుంచి కోటినగర్ వరకు రూ. 122కోట్లతో రక్షణగోడ నిర్మించారు. తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మవారధి వరకు రూ. 120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కృష్ణలంకకు రక్షణ కవచం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతం కృష్ణానదికి వరదలు వచ్చినపుడల్లా ముంపుబారిన పడేది. ఇక్కడి కాలనీ వాసులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించేవారు. వారం, పదిరోజుల పాటు వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే తలదాచుకునేవారు. ఈ సమస్యను ప్రత్యక్షంగా చూసిన సీఎం వైఎస్ జగన్ రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటి నగర్ వరకు 1.2 కిలో మీటర్ల పొడవునా రూ.122.90 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన దాదాపు 50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బ్యారేజీ నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతిసారీ చలసాని నగర్, కృష్ణలంక, గీతానగర్, రాణిగారితోట, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భ్రమరాంబపురం వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవి. రక్షణ గోడ నిర్మాణంతో ఈ ప్రాంత వాసుల కష్టాలు పూర్తిగా తీరాయి. తుది దశకు పనులు ప్రస్తుతం పద్మావతి ఘాట్నుంచి కనకదుర్గా వారధి మధ్య కృష్ణానది వెంబడి 1.070 కిలో మీటర్ల పొడవున రూ120.82 కోట్ల నిధులతో రిటైనింగ్ వాల్ మూడో దశ పనులు తుది దశకు చేరాయి. దీనివల్ల కృష్ణలంకలోని రణదీప్ నగర్, గౌతమి నగర్, నెహ్రూనగర్, ద్వారక నగర్లో నివసిస్తున్న 30 వేల మందికి వరద కష్టం తీరింది. స్వరూపం – ఆర్టీసీ బస్టాండ్ నుంచి యనమలకుదురు వరకు రక్షణ గోడ – ఇప్పటివరకూ 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం. – ఇకపై 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు సమస్యే ఉండదు. – కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు రూ.122.90 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణం – తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 1.070 కిలోమీటర్ల పొడవున రూ.120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి. ముంపు సమస్య తీరింది వర్షాకాలం వచ్చిందంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణాన్నైనా వరద వచ్చేస్తుందేమోనని భయాందోళన చెందేవాళ్లం. వరద ఇళ్లలోకి వస్తుండటంతో ఇళ్లు కాళీ చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ భయం లేదు. మా కష్టాలు తీరాయి. – మండాది దుర్గ, తారకరామనగర్ మా జీవితాలకు రక్షణ వరద ముంపు సమస్యకు పరిష్కారం దొరకింది. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ సమస్య పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మా వరద కష్టాలను పరిష్కరించి, మా జీవితాలకు రక్షణ కల్పించారు. – వీర్ల సుభద్రాదేవి, తారకరామనగర్ దశాబ్ధాల సమస్య పరిష్కారం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కూలీ పనులు చేసుకుంటూ, కృష్ణానది కరకట్టపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వరద వచ్చినప్పుడల్లా ఇళ్లు కాళీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఆ సమస్యలేదు. దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. – బాపనపల్లి కుమార్, ఆటోడ్రైవర్, భూపేష్గుప్తానగర్ రిటైనింగ్ వాల్ పనులు పూర్తయ్యాయి కృష్ణా నది కరకట్ట వెంబడి రిటైనింగ్ వాల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడోదశలో పద్మావతి ఘాట్నుంచి కనకదుర్గా వారధి వరకు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. దీని ద్వారా విజయవాడ వాసులకు ముంపు కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. . – టి.జె ప్రసాద్, నీటిపారుదలశాఖ ఎస్ఈ, విజయవాడ దశాబ్దాల కల నేరవేర్చారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర వాసుల ముంపు కష్టాలు చూసి, వారి కష్టాలకు చెక్ పెట్టే విధంగా, కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఇది కృష్ణలంక ప్రజలకు రక్షణ కవచంగా మారనుంది, దీంతో పాటు నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా రిటైనింగ్ వాల్ను అందంగా తీర్చి దిద్దుతున్నారు. దశాబ్దాల కలనేరవేర్చిన ముఖ్యమంత్రికి తూర్పు నియోజక వర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – దేవినేని అవినాష్, తూర్పునియోజక వర్గ ఇన్ఛార్జి కృష్ణాతీరం... ఇక ఆహ్లాదం... నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ వెంబడి పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.38.39 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి, పనులు ప్రారంభించారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ వెంబడి బండ్ పనులు పూర్తయ్యాయి. -
ఆ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఊటలే!.. నీటి ఊటతో కూలుతున్న ఇళ్లు
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ల ముంపు బాధితులకు మరో ముప్పు వచ్చి పడింది. ఉబికి వస్తున్న నీళ్లతో కునుకు లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. నీటి ఊటలతో నివాసగృహాలు ధ్వంసమై కూలిపోతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది మక్తల్ మండలం భూత్పుర్, మాగనూర్ మండలం నేరడుగాం ముంపు గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అందని పరిహారం.. 2010 నవంబర్ 3న భూత్పుర్ను ముంపు గ్రామంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. గ్రామంలో 2,400 మంది జనాభా ఉంది. భూత్పుర్ రిజర్వాయర్లో 530 ఇళ్లు, 2,500 ఎకరాలు మునకకు గురవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అప్పట్లో ప్రభుత్వం తరి పొలానికి రూ.80 వేలు, మెట్టభూమి ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నేటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్లో నీటిమట్టం పెరగడంతో గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుకుసాగని పునరావాసం పనులు.. భూత్పుర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 2015లో అధికారులు స్థలం ఎంపిక చేయగా.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం, పునరావాస కేంద్రంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో ముంపు గ్రామంలోనే నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా రిజర్వాయర్ నీళ్లు ఇళ్లలోకి వస్తుండటంతో నిర్వాసితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నేరడుగం నిర్వాసితుల గోస.. సంగంబండ రిజర్వాయర్కు కట్టకింద ఉన్న నేరడుగాం గ్రామంలో దాదాపు 2,200 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 2,800 ఎకరాలు రిజర్వాయర్లో, 300 ఎకరాలు కాల్వల్లో ముంపునకు గురికాగా.. నేటి వరకు నష్టపరిహారం అందలేదు. అదేవిధంగా 746 ఇళ్లు రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించి, నంబరింగ్ ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకుగాను 150 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో ముంపు గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు పదేళ్లు గడిచినా భూత్పుర్, నేరడుగాం నిర్వాసితుల సమస్య తీరడంలేదు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలుతున్న ఇళ్లు.. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కారణంగా నేరడుగాం, భూత్పుర్ గ్రామాల్లో ఎక్కడ చూసినా నీటి ఊటలే కనిపిస్తున్నాయి. నీటి ఊటలతో నివాసగృహాలు కూలిపోతున్నాయి. రోజురోజుకూ నీళ్లు ఉబికి రావడం అధికం కావడంతో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వారి పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళనకు చెందుతున్నారు. ఉబికి వస్తున్న నీళ్లతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నష్టపరిహారం చెల్లించాలి.. రోజురోజుకూ భూత్పుర్ గ్రామంలో నివసించే పరిస్థితి లేకుండాపోతోంది. తమకు పునరావాసం కల్పించడంతో పాటు ఇళ్లు, స్థలాలను కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ సారించాలి. – కుర్వ హన్మంతు, సర్పంచ్, భూత్పుర్ ఇళ్లు కూలిపోతున్నాయి.. గ్రామంలో నీళ్లు ఉబికి వ స్తుండటంతో ఇళ్లు కూలిపోతున్నాయి. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాన్ని ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఉంది. అధికారులు గుర్తించిన 530 ఇళ్ల కు త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – ఆనంధ్ శేఖర్, భూత్పుర్ ప్రభుత్వం ఆదుకోవాలి.. భూత్పుర్ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. గ్రామంలో నీళ్లు ఉబికి వస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. – ఖతాల్ హుస్సేన్, కోఆప్షన్ సభ్యుడు, భూత్పుర్ -
గుండ్లకమ్మకు ‘చంద్ర’ గండం!
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం శాపంలా పరిణవిుంచింది! గత సర్కారు నిర్వాకాలతో గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటులో దిగువన తుప్పు పట్టిపోయిన భాగం (8.4 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల ఎత్తు) శుక్రవారం రాత్రి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, రంగులు పేరుతో టీడీపీ హయాంలో 2014 –2019లో పనులు చేయకుండానే రూ.3.57 కోట్లు దిగమింగేయడం దీనికి కారణం. సుందరీకరణ పేరుతో మరో రూ.1.58 కోట్లు వెరసి రూ.5.15 కోట్లు స్వాహా చేశారు. గేట్లకు రంగులు పూయకపోవడం వల్ల తుప్పు పట్టి బలహీనంగా మారాయి. దీంతో వరద ఉద్ధృతికి గతేడాది ఆగస్టు 31న మూడో గేటు కొట్టుకుపోగా తాజాగా రెండో గేటులో అడుగు భాగం కొట్టుకుపోయింది. చంద్రబాబు హయాంలో నిధులు కాజేయకుండా గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరమ్మతు టెండర్ ఖరారైన రోజే.. గతేడాది మూడో గేటు కొట్టుకుపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసి రైతుల ప్రయోజనాలను కాపాడింది. మరో రెండు గేట్లు బలహీనంగా ఉండటంతో యుద్ధప్రాతిపదికన రూ.1.11 కోట్లు వెచ్చించి మరమ్మతు చేసింది. మిగతా 10 గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం, దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, కొత్త వైర్ రోప్లు, గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటు పనులకు రూ.9.14 కోట్లతో టెండర్లు పిలిచింది. వాటిని అధికారులు శుక్రవారం ఖరారు చేశారు. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఆ పనులను రాజస్థాన్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మెషినరీ సంస్థ దక్కించుకుంది. గేట్ల మరమ్మతు టెండర్ ఖరారైన రోజే వరద ఉద్ధృతికి రెండో గేటు కొట్టుకుపోయింది. టీడీపీ సర్కార్ అవినీతితో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం పేరుతో నిధులు కాజేసింది. దీంతో గేట్లు తుప్పు పట్టిపోయాయి. దీని ఫలితంగానే పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు, గుండ్లకమ్మలో రెండు గేట్లు కొట్టుకుపోయాయి. యుద్ధప్రాతిపదికన స్టాప్లాగ్ గేటు గుండ్లకమ్మ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 24.380 మీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు. ప్రాజెక్టు స్పిల్ వేకు 8.4 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో కూడిన 12 గేట్లను అమర్చారు. మిచాంగ్ తుపాను వల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ పది వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చింది. గేట్లు బలహీనంగా ఉండటంతో 2.30 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ సమయంలో రెండో గేటు, పదో గేటు మరీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఒక్కో స్టాప్ లాగ్ ఎలిమెంట్ను అడుగు భాగంలో దించారు. అయితే బలహీనంగా ఉన్న రెండో గేటులో 4 మీటర్ల ఎత్తుతో కూడిన ఒక భాగం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్లో 2.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో శనివారం పూర్తి స్థాయి స్టాప్ లాగ్ గేటు అమర్చి నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడతామని సీఈ మురళీనాథ్రెడ్డి చెప్పారు. -
ఎవరూ భయపడొద్దు, బాధపడొద్దు...ఈ ప్రభుత్వం మీది
-
మిగ్జామ్ తుపాను బాధితులకు భీమవరంలో పునరావాసకేంద్రం
-
వణికించిన మిచాంగ్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మిచాంగ్ తుపాను తిరుపతి, నెల్లూరు జిల్లాలను కుదిపేసింది. పలు జిల్లాలను వణికించింది. దీని ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు.. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన అతి తీవ్ర వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకుపైగా నీళ్లు ఉండడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఈదురు గాలులకు నెల్లూరు జిల్లాలో కరెంటు స్తంభాలు, పలు చోట్ల గుడిసెలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలిపోయాయి. అయితే ప్రభుత్వం సహాయక చర్యల్ని వేగంగా చేపట్టడంతో యుద్ధ ప్రాతిపదికన కరెంటును పునరుద్ధరించగలిగారు. కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించే పనులు చేపట్టారు. మరోవైపు ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వాసులను భయపెడుతున్న మిచాంగ్ తుపాను ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య బాపట్లకు నైరుతి దిశగా 15 కి.మీల దూరంలో తీవ్ర తుపానుగా తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తీరం దాటడానికి 3 రోజుల ముందు నుంచి బంగాళాఖాతంలో తుపాను 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో బాపట్ల వైపు దూసుకువచ్చింది. మొదట్లో దివిసీమ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కనిపించినా, చివరకు అది తీవ్ర తుపానుగా మారి బాపట్లకు దగ్గరగా వచ్చి ఆ సమీపంలోనే తీరం దాటింది. తీరం దాటిన తర్వాత భూమిపై 11 కిలోమీటర్ల వేగంతో నార్త్ వెస్ట్ వైపు పయనిస్తూ తుపానుగా బలహీనపడింది. మంగళవారం రాత్రి 9 గంటలకు బాపట్లకు 20 కిలోమీటర్లు, ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అది బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. తీవ్ర తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. తిరుపతి జిల్లా చింతవరంలో 42 సెంటీమీటర్ల వర్షం తుపాను ప్రభావంతో మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సగటున 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సగటున 8.6 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లాలో 6.4, కృష్ణాలో 5.5, నెల్లూరు జిల్లాలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలో 24 గంటల వ్యవధిలో 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కోట మండలం చిట్టేడులో 39 సెంటీమీటర్లు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లెలో 37, తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడులో 35, చిల్లకూరులో 33, నాయుడుపేటలో 29, బాలాయపల్లె మండలం చిల్లమన్నూరులో 25, నెల్లూరు జిల్లా సైదాపురంలో 22, వెంకటాచలంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా వెంకటగిరి, సత్యవేడు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం, మనుబోలు, వెంకటాచలం, అన్నమయ్య జిల్లా పెనగలూరు, బాపట్ల జిల్లా పర్చూరు, బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలాల్లో పలుచోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నమోదైన గరిష్ట వర్షపాతాల్లో అత్యధికంగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా తాడువాయిలో 15.9, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 14.5, అనకాపల్లి దార్లపూడిలో 13.6, కొత్తకోటలో 13, బలిఘట్టం 12.6, బాపట్ల జిల్లా అప్పికట్లలో 12.5, అనకాపల్లి కృష్ణాపురంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వాగులు, వంకలు మిచాంగ్ తుపాన్ వల్ల తిరుపతి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. స్వర్ణముఖి, అరణియార్, కాళంగి, కళ్యాణీ డ్యాం, మల్లిమడుగు, సదాశివకోనతో పాటు తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ, గోగర్భం జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 775 చెరువులకు భారీగా వరద నీరు చేరటంతో కలుజులు పొంగి ప్రవహిస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. చేపలు పట్టేందుకు వెళ్లిన తిరుపతి జీవకోనకు చెందిన తాత, మేనమామతో కలిసి వెళ్లిన నిఖిల్ (10) వాగులో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ఏర్పేడు మండలం బండారుపల్లి వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు రైతులను రెస్క్యూ టీమ్ రక్షించింది. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజక వర్గాల పరిధిలోని అనేక గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. కాళంగి రిజర్వాయర్ నుంచి 38 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయటంతో సూళ్లూరుపేట పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుంది. చెంగాళమ్మ ఆలయం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. చెన్నై– విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కరివేటి కాలువ, కాళంగి నది, పాముల కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కాదలూరు, సూళ్లూరుపేట చెరువులకు గండ్లు పడ్డాయి. సూళ్లూరుపేట– శ్రీకాళహస్తి మధ్య రహదారిపై 3 కి.మీ మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీహరి కోట, పులికాట్కు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిచ్చాటూరు పరిధిలోని అరణియార్ మత్స్య కేంద్రం నీట మునగటంతో 10 లక్షలకుపైగా చేప పిల్లలు సముద్రంలో కలిసిపోయాయి. వెంకటగిరి పరిధిలో కైవల్యం, పిన్నేరు, మాలేరు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వెంకటగిరి–గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలోని కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. చెన్నారెడ్డి కాలనీలోని నివాసం ఒకటి కూలిపోవటంతో పక్కనే ఉన్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద కాలువల్లో పూడికతీత పనులు తీయటం, ప్రజలను అప్రమత్తం చేయటం వంటి పనులు చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్వర్ణముఖి, నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 31 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వెయ్యికిపైగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 200పైగా ట్రాన్సఫార్మర్లు కాలిపోయాయి. ఫలితంగా 279 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్దణ పనుల కోసం 188 బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీట మునిగిన పంటలు.. ► బాపట్ల జిల్లాలో తుపాన్ తీరం దాటే సమయంలో సముద్రంలో భీకర హోరుతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. చీరాల ప్రాంతంలో 60 మీటర్లు, బాపట్ల, నిజాంపట్నం వద్ద 20–30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం కోతకు గురైంది. తుపాన్ ధాటికి సూర్యలంక ప్రాంతంలో అవుట్పోస్టు దెబ్బతింది. 177 గ్రామాల్లో తుపాన్ ప్రభావం కనిపించింది. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. గాలివానకు 30 విద్యుత్ స్తంభాలు, 100 ఇన్సిలేటర్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పూరిళ్లు, ప్రహరీలు కూలిపోయాయి. అద్దంకి ప్రాంతంలో గుండ్లకమ్మ, నల్లవాగు, పర్చూరు నియోజకవర్గంలో పోలూరు, వింజనంపాడు, ఎద్దనపూడి వాగులు పొంగి పొర్లాయి. ► ప్రకాశం జిల్లాలో 20 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీట ముగాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఒంగోలు విద్యుత్ డివిజన్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలనూ మిచాంగ్ తుపాన్ వణికించింది. ఉద్యాన, వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కడప–చెన్నై రహదారిలోని భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం గ్రామం వద్ద చెట్టు విరిగి మీదపడటంతో బైక్పై వెళుతున్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్ దుర్మరణం చెందారు. పీలేరు మండలం మేళ్లచెరువులో పాఠశాల ప్రహరీ గోడ కూలి దూడ మృతి చెందింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుంజన నది ఉప్పొంగి ప్రవహించింది. దాదాపు 30 గ్రామాల ప్రజలు బయటి ప్రాంతానికి రాలేకపోయారు. ► కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతాన్ని తుపాను అతలాకుతలం చేసింది. ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాల్లోని తీరంలో మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్డు రెండు కిలోమీటర్ల మేర దెబ్బతింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా వచ్చిన సుడిగాలులు కొత్తపల్లి మండలం కొండెవరం, పిఠాపురం మండలం పి దొంతమూరులలో బీభత్సం సృష్టించాయి. రెండు గ్రామాల్లో 180 గృహాలు దెబ్బతిన్నాయి. ► డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సగటున 121 మి.మీటర్ల వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మోరి, వి.వి.మెరకలలో సుడిగాలి తీవ్రతకు ఇళ్ల మీద రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిçపడ్డాయి. ► మిచాంగ్ తుపాను నేపథ్యంలో పెద్ద ఎత్తున కెరటాలు, బలమైన ఈదురు గాలులతో భీమిలి నుంచి గుడ్లవానిపాలెం బీచ్ వరకు తీరం అల్లకల్లోలంగా మారింది. మంగమారిపేట, రుషికొండ, సాగర్నగర్ బీచ్ల వద్ద కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడి తీరాన్ని కోతకు గురి చేసింది. రుషికొండ బీచ్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కు, సాగర్నగర్లో కొబ్బరితోట పార్కు నీట మునిగాయి. మంగమారిపేట, ఉప్పాడ, భీమిలి తీర ప్రాంతాల్లో సముద్రం కాస్త ముందుకు చొచ్చుకుని రావడంతో మత్య్సకారులు ఆందోళనకు గురయ్యారు. భీమిలి తీరంలో అలల తీవ్రతకు బోయివీధి గట్టు చాలా వరకు దెబ్బతింది. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రుషికొండ బీచ్లో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు. కె.నగరపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో వర్షాలకు వరి పంట నీట మునిగింది. ► ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 417 గ్రామాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. 121.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 144 గ్రామాల పరిధిలో 3354 హెక్టార్లలో వరి పంట నీట మునింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 172 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోకి వర్షపు నీరు చేరింది. కలెక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 93.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వీరవాసరం, నరసాపురం మండలాల్లో సుడిగాలి తాకిడికి వందల కొద్దీ కొబ్బరి చెట్లు, అధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి దుమారం.. ఇద్దరు దుర్మరణం బుట్టాయగూడెం : సుడిగాలి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరానికి చెందిన వెట్టి గంగరాజు, వెట్టి కన్నపరాజు, ఎస్.కోటేశ్వరరావు, మంగబాబు, జోడే రాముడు అనే వ్యక్తులు జోరుగా గాలి, వాన రావడంతో గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో ఉన్న ఒక పాకలోకి వెళ్లారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ చలిమంట ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా గాలి బీభత్సం సృష్టించడంతో పాక పడిపోవడంతో పాటు పక్కనే ఉన్న సిమెంట్ స్తంభం గంగరాజు (55) తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో పాకకు మంటలు అంటుకుని జోడే రాముడు (65) బయటికొచ్చే అవకాశం లేక సజీవ దహనమయ్యాడు. కన్నపరాజుకు స్వల్ప గాయాలు కాగా.. కోటేశ్వరరావు, మంగరాజు సురక్షితంగా బయటపడ్డారు. -
హమాస్ సొరంగాలకు కృత్రిమ వరద..?
టెల్ అవీవ్: హమాస్ అంతమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న ఇజ్రాయెల్ మరో కీలక ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలను బయటకు రప్పించడానికి కృత్రిమ వరదను సృష్టించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు సైన్యం నీటి పంపులను తరలిస్తున్నట్లు సమాచారం. సొరంగాలను నీటితో నింపితే ప్రాణ రక్షణ కోసం ఉగ్రవాదులు బయటకు వస్తారని (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఐడీఎఫ్ వ్యూహ రచన చేస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఆల్-షతీ శరణార్థి క్యాంపుకు ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ ఐదు భారీ పంపులను నవంబర్ ప్రారంభంలోనే ఏర్పాటు చేసింది. గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యమున్న భారీ పంపులను సైన్యం తరలించింది. వీటితో కొన్ని వారాల్లోనే సొరంగాలన్నింటినీ నీటితో నింపేయవచ్చు. బందీల విడుదల ప్రక్రియ పూర్తైన తర్వాత ఐడీఎఫ్ ఈ వరద ఎత్తుగడను ఉపయోగిస్తుందా..? లేక అంతకు ముందే నీటిని విడుదల చేస్తుందా? అనే అంశం ప్రస్తుతానికి తెలియదు. మరోవైపు బంధీలను సురక్షిత ప్రాంతంలో ఉంచామని హమాస్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఐడీఎఫ్ మిలిటరీ, టెక్నికల్గా అన్ని దారుల్లో ముందుకు వెళుతోంది. కాల్పుల విరమణ తర్వాత భూతల దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. సరికొత్త యుద్ధ తంత్రాలను ఉపయోగిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట హమాస్ దాడుల్ని ప్రారంభించినా.. ఇజ్రాయెల్ తేరుకుని చావు దెబ్బ కొడుతోంది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. బాంబుల మోతతో గాజా అంతటా విలయం తాండవం చేస్తోంది. ఇప్పటికే గాజాలో 12 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపు 1400 మంది చనిపోయారు. ఇటీవల నాలుగు రోజులు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. కానీ గడువు ముగియగానే మళ్లీ యుద్ధం ప్రారంభించారు. ఇదీ చదవండి: విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి -
ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్
మిచౌంగ్ తుపాను ధాటికి తమిళనాడు ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. రెండు రోజులు విరుచుపడుతున్న మిచౌంగ్ తుపాను ఇవాళ ఉగ్రరూపం దాల్చింది. చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఐదుగురు మరణించగా.. చాలామంది ఇంకా వరద ముంపులోనే ఉన్నారు. దీంతో వరదలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్టార్ హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చెన్నై మేయర్ ప్రియా రాజన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన శ్రీమతి ప్రియా రాజన్ (చెన్నై మేయర్), కమిషనర్తో సహా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లోని ఇతర అధికారులు సురక్షితంగా మీ కుటుంబాలతో బాగా ఉన్నారని ఆశిస్తున్నా. ఎందుకంటే వరద నీరు, డ్రైనేజీ మీ ఇళ్లలోకి ప్రవేశించదు. మరీ ముఖ్యంగా మీకు ఆహారం, విద్యుత్ సరఫరా ఉంటుందని ఆశిస్తున్నా. మీరు ఉన్న ఇదే నగరంలో నివసిస్తున్న పౌరులుగా మీలా సురక్షితమైన స్థితిలో లేరు. డ్రైనేజీ కాలువ ప్రాజెక్ట్ మొత్తం సింగపూర్ కోసమా? లేదా చెన్నై కోసమా?' అంటూ నిలదీశారు. అంతే కాకుండా.. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు 2015లో మేమే రోడ్లపైకి వచ్చాం. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలియజేయగలరని కోరుతున్నా. మేం ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆహారం, నీరు అందిస్తూనే ఉంటాం. కానీ ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులందరూ బయటకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. అద్భుతం కోసం ఎదురుచూడకుండా సాధారణ పౌరులే డ్యూటీ చేయాలి. గాడ్ బ్లెస్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. విశాల్ ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. Dear Ms Priya Rajan (Mayor of Chennai) and to one & all other officers of Greater Chennai Corporation including the Commissioner. Hope you all are safe & sound with your families & water especially drainage water not entering your houses & most importantly hope you have… pic.twitter.com/pqkiaAo6va — Vishal (@VishalKOfficial) December 4, 2023 -
మిచౌంగ్ ఎఫెక్ట్.. గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరోలు!
'మిచౌంగ్' తుపాను వల్ల చెన్నై వణికిపోతుంది. గత నెట 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. నిన్న తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య-పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశగా 100 మీటర్ల దూరంలో దీని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇదీ నేడు తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తుపాను ప్రభావం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. 'మిచౌంగ్' తుపాను ప్రభావంతో చెన్నైలో నివసించే సాదారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. టి.నగర్ టన్నెల్, అరంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ చెరువు, అన్నానగర్, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో కట్టుబట్టలతో వారందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అయితే ఆహారం విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం క్రింద వారు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు , మెడిసిన్స్ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సాయం చేసేందేకు తాము వెనుకాడమని కార్తి తెలిపాడు. ఇప్పటికే మరో హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు. -
మిచౌంగ్ తుపాను : చెన్నైలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
చెన్నైలో జలప్రళయం
సాక్షి, చెన్నై: ఎక్కడ చూసినా నీరే. అంతటా వరద ప్రవాహమే. తమిళనాడు రాజధాని చెన్నై సముద్రాన్ని తలపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుపానుగా మారి తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయమే సృష్టించింది. ఆదివారం రాత్రి నుంచీ ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కొనసాగింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది! దాంతో వీధులన్నీ వాగులుగా మారాయి. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి! నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మంగళవారం ఉదయం దాకా మూసేస్తున్నట్టు ప్రకటించారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. వండలూరు జూలోకి వరదనీరు పోటెత్తడంతో పెద్ద సంఖ్యలో మొసళ్లు తప్పించుకున్నాయి. దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే 7 అడుగుల మేర కుంగింది! అక్కడ టాన్స్ఫార్మర్లు, వాహనాలు అందులో పడిపోయాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయ చర్యలూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం కూడా వర్షాలు కొనసాగుతాయన్న హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. నగరం, శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నగరాన్ని చుట్టుముడుతున్న వరదను తొలగించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో మంగళవారం కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వేలాది మంది నిర్వాసితులై చెన్నై, శివార్లలో వందలాది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాలకు చెన్నైలో ఐదుగురు మృతి చెందారు. వందలాది రైళ్లు రద్దయ్యాయి. 47 ఏళ్లలో అతి భారీ వర్షం తాజా వర్ష బీభత్సం చెన్నై నగరంలో గత 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది. 2015 నాటి కుంభవృష్టిని కూడా మించిపోయింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చూసేందుకు డీఎంకే ప్రభుత్వం నగరంలో రూ.4 వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవడంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది. మంగళవారం నాటికి 10 సెం.మీ. వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
‘మిచాంగ్’ హోరు.. తీవ్ర రూపం దాల్చిన తుపాను.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీరప్రాంతం అతలాకుతలమైంది. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. ప్రధాన వీధుల్లో రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జిలు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శివారు కాలనీలు నీట మునిగాయి. కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఈ మూడు జిల్లాల్లో వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. బాపట్ల, అవనిగడ్డ, మచిలీపట్నం, రేపల్లె తదితర ప్రాంతాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాలోఇకి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో మంగళవారం కోస్తా తీరమంతా తీవ్రమైన గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 60 గ్రామాలకు రాకపోకలు బంద్ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సుమారు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో పిట్టవారిపల్లె వద్ద రొయ్యల చెరువులో ఐదుగురు కూలీలు చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో వారిని రక్షించారు. చిళ్లకూరు మండలంలోని తిప్పగుంట పాళెం వద్ద ఉప్పుటేరు ఉదృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సత్యవేడు నియోజకవర్గంలోనూ 40కి పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచి పోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పదుల సంఖ్యలో నేలకొరిగాయి. విద్యుత్ను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. తిరుపతి జిల్లాలో పొలాల్లా వరి పంట నీట మునిగింది. కాళంగి, మల్లెమడుగు, కళ్యాణిడ్యామ్లు, స్వర్ణముఖి, సదాశివకోన, అరణియార్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోగా ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేశారు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరకట్ట దెబ్బతినకుండా జేసీబీల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు మరమతులు చేస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీకాలనీలో ఆదివారం గోడ కూలి యశ్వంత్ అనే బాలుడు మృతి చెందగా తక్షణమే స్పందించిన రెవెన్యూ అధికారులు రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించారు. చలి గాలులకు తట్టుకోలేక సోమవారం వాకాడు మండలం గొల్లపాళెం గ్రామానికి చెందిన బందిల పొండమ్మ (63) అనే వృద్ధ మహిళ మృతి చెందింది. నాగలాపురం మండలం కొట్తకాడు గ్రామంలో సంధ్య అనే మహిళకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే తీవ్ర వర్షాల వల్ల ఎక్కడికక్కడ దారులు మూసుకుపోయాయి. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులు ఆమెను చేతులతో మోసుకొని వాగు దాటించారు. నగరి నియోజకవర్గ పరిధిలోని కుశస్థలి ఉధృతంగా ప్రవహిస్తోంది. కార్వేటి నగరం మండలంలోని క్రిష్ణాపురం జలాశయంకు అధికంగా వరద నీరు చేరుతోంది. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం గేటు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అలల ధాటికి పాకల సముద్ర తీరం కోతకు గురైంది. పడవలు, వలలు ఇతర సామాగ్రి సైతం జాగ్రత్త చేసుకునేలా మత్స్యకారులకు అవగాహన కల్పించారు. బాపట్ల జిల్లాలో తుపాన్ కారణంగా సముద్రంలో అలజడి రేగింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి తీరంవైపు చొచ్చుకువచ్చాయి. చీరాల, బాపట్ల, నిజాంపట్నం తీరంలో సముద్రం కొంతమేర ముందుకు వచ్చింది. ఈదురు గాలులు పెరిగాయి. చీరాల, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో సోమవారం సాయంత్రానికి వర్షం పెరిగింది. బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం మిచాంగ్ తుపాను గత ఆరు గంటలుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు ఆగ్నేయ దిశలో 250 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా దక్షిణ ఏపీ తీర ప్రాంతాలైన నెల్లూరు, మచిలీçపట్నానికి సమాంతరంగా ప్రయాణిస్తూ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. అందుకనుగుణంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఏపీఎస్డీపీఎస్ (ఏపీ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ) అధికారులు జిల్లాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కాగా, తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ సోమవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రైల్వేకోడూరులో మాత్రం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రేణిగుంట ప్రధాన రహదారిలో శేషాచల అడవుల నుంచి భారీగా వచ్చిన వరద నీరు రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. మామిడి, అరటి, బొప్పాయి తోటల్లో వర్షపు నీరు నిలిచింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. పూసపాటిరేగ మండలం చింతపల్లి రేవులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. బోట్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం రాత్రి నుంచి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దెబ్బతిన్న కాకినాడ–ఉప్పాడ బీచ్రోడ్డు కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ–ఉప్పాడ బీచ్రోడ్డు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. కెరటాలు బీచ్రోడ్డుపైకి దూసుకు వస్తుండడంతో రక్షణగా వేసిన బండరాళ్లు సైతం పక్కకు కదిలిపోతున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ట్రాఫిక్ను ఉప్పాడ నుంచి పిఠాపురం మీదుగా మళ్లించారు. సోమవారం ఉదయం సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. ఈదురు గాలుల ప్రభావం వల్ల పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురవ్వగా పలువురు మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. సముద్రతీరంలో లంగరు వేసిన బోట్లు ధ్వంసమవుతుండడంతో మత్స్యకారులు తమ బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ సైతం కెరటాల ఉధృతిని ఆపలేక ధ్వంసమైంది. పలుచోట్ల అండలు జారడంతో సముద్రపునీరు గ్రామాల్లోకి చొచ్చుకు వస్తోంది. కెరటాలతోపాటు రాళ్లు ఎగిరి పడుతుండడంతోపాటు బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీరంలో కెరటాలు సుమారు 8 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి పోలీసు, రెవిన్యూ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. నేడు, రేపు భారీ వర్షాలు సాక్షి, విశాఖపట్నం: మిచాంగ్ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచించింది. తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉందని పేర్కొంది. -
ఓటేయాలంటే..వాగు దాటాలె
కొండాయి గ్రామ జనాభా 1860 ఓటర్లు: 1220 నివాస గృహాలు: 418 బతకడం వేరు. జీవించడం వేరు. వాళ్లు కేవలం బతుకుతున్నారంతే.. జీవించడాన్ని మన పాలకులు వాళ్లకింకా అలవాటు చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులూ మారుతున్నా.. ఆవిష్కరణలు ఆకాశాన్ని చుట్టేస్తున్నా.. ఇప్పటికీ ములుగు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగులు దాటుతున్నారు. ఈ ఏడాది జూలై 27న వరద ఎనిమిది మందిని మింగింది. ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఏ మనిషిని కదిలించినా రోదనలే. అంతుచిక్కని వేదనలే. వారిని ‘సాక్షి’ పలకరిస్తే వాగంత దుఃఖాన్ని వెళ్లబోసుకున్నారు. వారి ఎజెండా.. ఏమిటో చెప్పుకొచ్చారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది మా అమ్మగారింటికి(కొండాయి) తొలుసూరు కాన్పు చేయించుకునేందుకు వచ్చిన. వాగుపై బ్రిడ్జి కూలింది. నొప్పులు రావడంతో వాగులో నుంచి నడుములోతుల్లో దాటుకుంటుపోయిన. దొడ్లకు చేరుకొని అక్కడి నుంచి ఏటూరునాగారం, ములుగు వెళ్లేసరికి బిడ్డ అడ్డం తిరిగింది. పెద్దాపరేషన్ చేసి డెలివరీ చేసిండ్లు. మళ్లీ బాలింత నొప్పులతో ఉంటే.. మా అమ్మనాన్న, వాళ్లు మరో పదిమంది కలిసి డొల్ల కట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. – మానేటి సంధ్యారాణి, బాలింత, కొండాయి ఐదు నెలల నుంచి అంతులేని వ్యథ ఈ ఏడాది జూలై 27న అకాల వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధి హైలెవెల్ బ్రిడ్జి కూలింది. జంపన్న వాగు ఉధృతికి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కొండాయి గ్రామంలో వరద 8 మందిని జల సమాధి చేసింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఐదు నెలల నుంచి ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. గర్భిణులు ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డొల్లాలు కట్టి వాగు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం కోసం సైతం కొండాయిలో వేలి ముద్రవేసి.. వాగుదాటి దొడ్లకు వెళ్లి అక్కడి నుంచి బియ్యాన్ని మోసుకుంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎరువు అందుతలేదు.. పొలం పనుల కోసం కావాల్సిన ఎరువు బస్తాలు, ఇతర సామగ్రిని తెచ్చుకునేందుకు నరకం కనిపిస్తోంది. ఎరువు బస్తాలను వాగులో నుంచి తలపై పెట్టుకొని దాటించడం కష్టంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా వ్యవసాయ పనిముట్లకు కష్టాలు పడుతూ వాగుదాటాల్సి వస్తోంది. –బొచ్చు ఉపేందర్, రైతు ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. నా భర్త, కొడుకు జంపన్నవాగు ప్రమాదంలో చచ్చిపోయిండ్లు. ఇంటికి మగదిక్కులేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. నాకు ఏ అవసరం వచ్చినా.. ఆదుకునే వారే లేరు. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న. – మున్నిబేగం, కొండాయి ఒక్క కొండాయి గ్రామమే కాదు... ఏజెన్సీ పరిధిలోని అనేక ఆదివాసీ గూడేల ప్రజలు వంతెనలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో, పోటీలో ఉన్న నేతల హామీల్లో వీరి సమస్యలు ఎక్కడా కనిపించవు. ఏజñ న్సీ వాసుల ఇబ్బందులు ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది బీడీ కార్మికులు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. వీరి వెతలు నేతల చెవికెక్కుతాయన్న ఆశతో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ...ఈ పీపుల్స్ ఎజెండాకు మోక్షం లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. - అలువాల శ్రీనివాస్ -
పీపుల్స్మేనిఫెస్టో
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 3,17,32,727 మంది. వీరిలో గ్రేటర్ను ఆనుకొని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఓటర్లు 1,04,90,621 మంది. అంటే దాదాపు మూడోవంతు మంది ఇక్కడే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఎందరో ఉన్నారు. నగర ప్రజల మేనిఫెస్టోను అమలు చేయడమంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేసినట్లే. – సాక్షి, హైదరాబాద్ రవాణా.. అతిపెద్ద సమస్య నగరంలోని ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రవాణా. జిల్లాల నుంచి నగర శివార్లలోకి రెండు గంటలలోపే చేరుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతోంది. ఇందుకు పరిష్కారంగా ఇస్నాపూర్ నుంచి షాద్నగర్ వరకు, యాదాద్రి నుంచి చౌటుప్పల్ వరకు.. నగరం నలువైపులా ఎటునుంచి ఎటు వెళ్లేందుకైనా మెట్రో రైలు కావాలంటున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ప్రజారవాణా పెరగాలి. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ ఇక్కట్లు తీరలేదు. ట్రాఫిక్ జామ్లు తప్పేలా లింక్రోడ్లు పెరగాలి. అన్ని రద్దీప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జీలుండాలి. వరద ముంపు తప్పాలి విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో వానొస్తే నాలాల్లో మరణాలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నాలాలన్నింటినీ ఆధునీకరించాలి. నాలాల మరణాలు తప్పేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణ దూరాభారం తగ్గించేందుకు మూసీపై 14 వంతెనలు అందుబాటులోకి రావాలి. అపరిమిత ఇంటర్నెట్.. మొబైల్ లేనిదే చేయి విరిగినట్లుగా భావిస్తున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అన్ని వేళలా ఉచిత ఇంటర్నెట్ ఉంటే ఎంతో మేలంటున్నారు. ప్రజలకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉన్నా, ఇంటర్నెట్కు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండరాదని, అందులోనూ అంతరాయాలు ఉండొద్దని బలంగా కోరుకుంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆయా ప్రాంతాల్లో రద్దీ తెలుసుకునేందుకు సింగిల్యాప్ లాంటిది కావాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఉద్యోగాలు.. సొంతిళ్లు.. ఆరోగ్య బీమా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు సొంతిళ్లు లేనివారికి నెలనెలా ఈఎంఐలతో గృహ సదుపాయం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు, సకాలంలో ఉద్యోగాల భర్తీ, పేదలకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలకు ఉపకరించేలా ప్రభుత్వమే ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలంటున్నారు. 24 గంటలు స్వచ్ఛమైన నీరు కరెంటు కష్టాలు తీరినప్పటికీ నగరంలో నీటి ఇబ్బందులున్నాయి. నిర్ణీత వేళల్లో కాకుండా 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పినా తాగునీరొచ్చే సదుపాయం ఉండాలంటున్నారు ప్రజలు. -
పంటనష్టమొచ్చిందని కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
మంథని (పెద్దపల్లి జిల్లా): ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతు దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధి నెల్లిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కటుకు అశోక్ (35), సంగీత (28) దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి (5), కూతురు సన (4) ఉన్నారు. గ్రామ శివారులో ఐదెకరాల వ్యవసాయభూమిని కౌలు తీసుకుని రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి వేశారు. వ్యవసాయ పనులు లేనిసమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం తెచ్చిన ఈ అప్పులు తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు...సోమవారం రాత్రి పురుగుమందు తాగారు. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించగా దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, వీరి మృతితో అనాథలైన చిన్నారులు తమ తల్లిదండ్రులకు ఏమైందో తెలియక దిక్కులు చూస్తున్న దృశ్యం గ్రామస్తులను కలచివేసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement