-
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్లోనే సివిల్స్ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
ప్రేమ ఉంటేనే దత్తత
- అనాథలపై చూపాల్సింది జాలికాదు - హోం స్టడీ రిపోర్టే కీలకం - జిల్లాలో రెండు శిశు గృహాలు విజయవాడ సెంట్రల్ : ఇటీవల కృష్ణలంక బాలాజీనగర్ వద్ద పాలిథిన్ కవర్లో చుట్టి డంపర్బిన్ వద్ద పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉన్న ఈ బిడ్డను దత్తత తీసుకొనేందుకు ఇరవై మందికి పైగానే పోటీ పడుతున్నారు. ఇలాంటి మరెందరో అనాథలను దత్తత తీసుకుంటామంటూ ఐసీడీఎస్కు దరఖాస్తులు అనేకం వస్తున్నాయి. దత్తత తీసుకొనేవారికి ఉండాల్సింది జాలి కాదు, ప్రేమ అని నిబంధనలు చెబుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గన్నవరం మండలం బుద్ధవరం వద్ద కేర్ అండ్ షేర్, మచిలీపట్నంలో శిశు గృహాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రస్తుతం 16 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలంటే హోం స్టడీరిపోర్టే కీలకం. హోం స్టడీ ఇలా.. అనాథలను దత్తత తీసుకోవాలనుకొనేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిడ్డను ఎందుకు కావాలనుకుంటున్నారనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉన్నారనే డాక్టర్ సర్టిఫికెట్, ఎలాంటి కేసులు లేవని పోలీసుల నుంచి ధ్రువీకరణ పత్రం, ఏడాదికి రూ.72 వేల ఆదాయం వస్తున్నట్లు రెవెన్యూ అధికారుల నుంచి పొందిన ఆదాయం సర్టిఫికెట్లను దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. ఇలా అందిన దరఖాస్తులను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డెరైక్టర్ సంబంధిత సీడీపీవోలకు పంపుతారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారునికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరి స్తారు. దీన్నే హోంస్టడీ రిపోర్ట్ అంటారు. దరఖాస్తులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలని తేలితేనే దత్తతకు అర్హులుగా పరిగణిస్తారు. ఆర్థిక స్థోమత, కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు, ఏడాది నుంచి మూడేళ్ల లోపు చిన్నారులను రెండు కేటగిరీలుగా విభజించి దత్తత ఇస్తుంటారు. ఏ వయసు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారనే అంశాన్ని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ప్రేమ చూపాలి అనాథ బిడ్డలపై ప్రేమ ఉన్న వారికే దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ అధికారి కృష్ణకుమారి ‘సాక్షి’కి చెప్పారు. అనాథలపై జాలి చూపిస్తూ ఆదుకుంటామని కొందరు వస్తుంటారన్నారు. ఇలాంటి వారికి ప్రాథాన్యత ఇవ్వమన్నారు. పసిబిడ్డ రావడం వల్ల జీవితంలోకి వెలుగు వస్తోందని ఎవరు ఆతృతపడుతుంటారో వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement