-
గ్లాసుతో సైకిల్కు గుబులు
వరుస షాకులతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి కావలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్గా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటీలో ఆయన ఉండటంతో ఓట్లు భారీగా చీలుతాయనే ఆందోళనతో ఉన్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తాజా పరిణామం అశనిపాతంలా పరిణమించింది. సుధాకర్కు అనూహ్యంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు లభించడంతో కావ్య శిబిరం ఒక్కసారిగా డీలాపడిపోయింది.కావలి: టీడీపీ రెబల్గా, స్వతంత్య్ర అభ్యర్థిగా కావలి నుంచి రంగంలోకి దిగిన పసుపులేటి సుధాకర్కు ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును కేటాయించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఓట్లు భారీగా చీలిపోతాయనే భయంతో కావ్య శిబిరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బీసీల ప్రతినిధిగా రాజకీయాల్లోకి.. బీసీల ప్రతినిధిగా.. పీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గ్లాస్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం రాష్ట్ర పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించుకొని కావలిలో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ కోసం పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సుధాకర్ తన వర్గీయులతో నిరసన ప్రదర్శనలతో పాటు రాజమహేంద్రవరంలో ర్యాలీలను చేపట్టారు. దీంతో కావలి టీడీపీ టికెట్ సుధాకర్కేనని అందరూ భావించారు. అప్పటి వరకు కావలి ఇన్చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సైతం సుధాకర్ అభ్యరి్థత్వాన్ని బలపర్చారు. రెబల్గా పోటీకి సై.. ఈ తరుణంలో కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో కావలి టికెట్ను దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, కేడర్ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో కంగుతిన్న పసుపులేటి సుధాకర్ కావలిలో రెబల్గా పోటీ చేసేందుకు డిసైడయ్యారు. ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, టీడీపీ, జనసేన కేడర్ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని బరిలోకి దిగారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సైతం పసుపులేటికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధాకర్కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఆయన వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భగ్గుమంటున్న కావ్య పసుపులేటి సుధాకర్కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో కావ్య కృష్ణారెడ్డికి మైండ్ బ్లాౖకైంది. ప్రెస్మీట్ పెట్టి మరీ పసుపులేటిపై తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై ఎనిమిది కేసులున్నాయని, 420 అంటూ నోరుపారేసుకున్నారు. ప్రతాప్కుమార్రెడ్డి, పసుపులేటి సుధాకర్ ఇద్దరూ కలిసి తనపై పోటీకి దిగారని ఆరోపించారు. రామనారాయణరెడ్డికి గ్లాస్ గుర్తు ఆత్మకూరు: అదేంది.. రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారా.. ఈ మతలబేమిటబ్బాననే సందేహం కలగక మానదు. అయితే దీన్ని కేటాయించింది ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి కాదండోయ్. అక్కడే స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో నిలిచిన ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించడంతో ఓట్లు ఎక్కడ చీలుతాయోననే ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. -
కావలిలో టీడీపీ ఖాళీ..వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్ పై మహిళల రియాక్షన్
-
మోసానికి మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అవుతారని మండిపాటు..ఇంకా ఇతర అప్డేట్స్
-
సాయన్న సౌమ్యుడు.. అన్నిటికన్నా ముఖ్యంగా...!
-
మేము చేసిన మంచి కొనసాగాలంటే వాళ్లని చిత్తుచిత్తుగా ఓడించాలి.
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
కావలిలో ఇసుకవేస్తే రాలనంతగా జనసునామీ నాకు కనిపిస్తుంది
-
జనంలోకి జగనన్న..!
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ @ కావలి
-
సీఎం జగన్ ఋణం తీర్చుకోవడానికి కావలి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
ఎవరెన్ని కుట్రలు చేసినా... మా ఓటు జగనన్నకే
-
కావలిలో చంద్రబాబుకి కోలుకోలేని దెబ్బ
-
అక్రమ మైనింగ్ తో వేల కోట్లు నొక్కేసిన కావలి టిడిపి ఇన్ ఛార్జ్ కృష్ణారెడ్డి
-
నెల్లూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి
కావలి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావలిలోకి టోల్ప్లాజా వద్ద రెండు లారీ, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 14 మందికి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందినే వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక, ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక, బస్సు కావేరీ ట్రావెల్స్కు సంబంధించినదిగా గుర్తించారు. Update.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా ఏడుకు చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండు లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. నెల్లూరు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి నెల్లూరు బస్సు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి స్పందించారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్ది కామెంట్స్ ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాం. బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 9440796383 ద్వారా సమాచారం ఇస్తున్నాం. ప్రమాదానికి కారణం ఏమిటన్నది విచారణలో తెలుస్తుంది. గాయపడిన వారి వివరాలు.. చంద్ర శేఖర్(37).. సురేష్..(32) గోపి నాథ్ (23) మనోజ్ (23) రాజ్ కుమార్ (38) ఎస్.రమణ (38) పవన్ (23) ధనవేశ్వర్ (28) రణధీర్ (31) త్రికరణ్ (46) శ్వేతా (19) అజిత (30) కన్నన్ (50) రూప( 30) మైథిలి (35) అక్షయ్ (34) గణేష్(51) నితీష్ (20).. లోకేష్ (35) లక్ష్మీ (34) కమలమ్మ (63) నిర్మల(49) కేశవ్(39). -
డ్యాన్స్ అదరగొట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
-
‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న బాలయ్య ఫాన్స్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, సాక్షి: వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు భగ్గుమన్నారు. ఏకంగా ఆ పత్రిక పేపర్లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కావలిలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పని చేశారు. ఇందుకు కారణం ఏంటంటే.. తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం- నవశకం పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే.. ఆయన పేరునుగానీ, ఫోటోగానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించలేదట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్ను ఆయన అభిమానులు తగలబెట్టారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ ఛానెల్ నందమూరి బాలకృష్ణ పట్ల గత కొంతకాలంగా వివక్షత చూపుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వెన్నుపోటు ద్వారా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా? అని అదీ లేదు. దీనికి తోడు.. ఇప్పుడు యెల్లో మీడియా కూడా కేవలం నారా కుటుంబాన్నే హైలెట్ చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఇదీ చదవండి: పవన్ తమ్ముడా?.. వీళ్లు మారరా? -
చంద్రబాబుని ఏకిపారేసిన మహిళా..వైఎస్సార్సీపీలో చేరిన మహిళలు
-
చంద్రబాబు కంటి జబ్బు దొంగ నాటకం..కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
-
బావ మీద ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు..రామిరెడ్డి ప్రతాప్ కౌంటర్
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 12వ రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఈరోజు(గురువారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర అనకాపల్లి, పామర్రు, కావలి నియోజకవర్గాల్లో జరుగనుంది. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో సాధికార యాత్ర కొనసాగనుంది. ఉదయం గం. 10:30 ని.లకు మారేడుపూడిలో యాత్ర ప్రారంభం కానుంది. మారేడుపూడి నుంచి తేగడ గ్రామం వరకూ భారీ ర్యాలీగా బస్సుయాత్ర జరుగనుంది. 11 గంటకు తేగడ గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీని పరిశీలించనున్నారు. 12 గంటలకు తేగడలో ఏపీ మోడల్ స్కూల్ పరిశీలన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం తేగడ గ్రామం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకూ భారీ బైక్ ర్యాలీ ఉండనుంది. మూడ గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రియా టవర్స్ వద్ద నాయకుల ప్రెస్ మీట్.. గం. 2:30ని.లకు ప్రియా టవర్స్ వద్ద నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గం. 3:30 ని.లకు పామర్రు సెంటర్లో బహిరంగ సభ ఉండనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి జోగి రమేష్, ఎంపీ నందగం సురేష్ సురేష్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తదితరులు పాల్గొననున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విలేకర్ల సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమం అనంతరం ఒంగోలు బస్టాండు సెంటర్లోని అబ్దుల్ కలాం విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించనున్నారు. ఆపై దర్గాని సందర్శించి, మార్కెట్ సెంటర్ వరకూ పాదయాత్ర ఉండనుంది. సాయంత్రం గం. 4:30కి మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
దాడి చేసింది టీడీపీ రౌడీలే
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నిందితుడు సుధీర్పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. -
కావలి ఎమ్మార్వో కార్యాలయంలో టీడీపీ నేతల రచ్చ
-
ఆవేదన విని.. అక్కున చేర్చుకున్న జగనన్న
సాక్షి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సాయం కోసం చూసే ఎదురు చూపులు ఎక్కడున్నా జననేతను కదిలిస్తాయి. అంత గజిబిజి షెడ్యూల్లోనూ వాళ్ల కోసం సమయం కేటాయించి.. అక్కడికక్కడే వాళ్ల సమస్యలను పరిష్కరించడం నిజంగా ఆయన గొప్పతనం. అక్కడితోనే ఆగకుండా దీర్ఘకాలికంగానూ సాయం అందేలా చూడడంలో జగనన్న ప్రభుత్వం వెనుకంజ వేయదు. తాజాగా.. కావలి పర్యటనలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ సమస్యలతో వచ్చిన కొందరిని అక్కున చేర్చుకున్నారు. తనను కలిసి సమస్యలను వివరించేందుకు వచ్చిన దివ్యాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకున్నారాయన. సావధానంగా వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆపై అందరికీ తక్షణసాయంగా లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు కూడా. 👉 ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మెదరమెట్లపాలెం గ్రామానికి చెందిన మర్రిపూడి సుబ్బారావు.. రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తన ఆపరేషన్ కోసం సీఎం జగన్కు విన్నవించుకోగా, సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. 👉 కలిగిరి మండలానికి చెందిన బత్తిన షణ్ముఖ కుమార్ జన్యుపరమైన సమస్యతో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందించారు. 👉 ఇక ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామ సర్పంచ్ అయిన దుగ్గిరాల రాఘవ.. సీఎం జగన్ను కలిసేందుకు కావలికి భార్యాబిడ్డలతో పాటు వచ్చాడు. రాఘవ రెండు కిడ్నీలు చెడిపోయాయి. వాటి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అందుకే ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు. వెంటనే సీఎం జగన్ లక్ష రూపాయల సాయం అందించారు. 👉 సర్వేపల్లికి చెందిన నోసం అమూల్య అరుదైన వైద్యంతో బాధపడుతోంది. రాయవేలూరులో చికిత్స అందుతోంది. అయితే నాలుగు సంవత్సరాలుగా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోందట. ఈ విషయం దృష్టికి రావడంతో.. అమూల్యను జగన్ ఓదర్చారు. తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించారు సీఎం జగన్. 👉 అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేల్పుచర్ల వారి పల్లి గ్రామానికి చెందిన పిడతల నాగరాజు ఒక కాలు, ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి ఎటువంటి పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. సీఎం జగన్ను కలిసి తన గోడును వెల్లబోసుకునేందుకు కావలి వచ్చాడు. నాగరాజు దీనావస్థను అర్థం చేసుకుని లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. 👉 కావలి చెంచుగారిపాలెంలో ఉండే పోసిన వెంకట్రావు షుగర్ పేషెంట్. అయితే మందులకు ప్రతినెల ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంత భారం భరించలేని స్థితిలో ఉన్నట్లు సీఎం జగన్ దృష్టికి తన ఇబ్బంది తీసుకెళ్లాడాయన. వెంటనే స్పందించిన సీఎం జగన్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. 👉 పొదలకూరు మండలం ఊట్లపాలెం గ్రామానికి చెందిన చెందిన వెంకట అఖిల్ వెన్నెముక ఆపరేషన్ కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మరింత మెరుగైన ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారట. అయితే అంత ఆర్థిక స్తోమత తన దగ్గర లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోరడానికి కావలి వచ్చాడు. అతని పరిస్థితి తెలిసి.. తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. ఈ ఏడుగురికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఆర్డీవో సీనా నాయక్ సమక్షంలో తక్షణ సాయంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రత్యేకంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే! -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ రూ. 20,000 కోట్ల విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే ఇందుకోసం ఇవాళ కావలిలో పర్యటించిన ఆయన.. ఆ పర్యటనపై ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎకరాల చుక్కల భూములపై 97,471 మంది రైతన్నలకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం అని సభలో ప్రసంగించిన వీడియోను పోస్ట్ చేశారాయన. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎకరాల చుక్కల భూములపై 97,471 మంది రైతన్నలకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండగా… pic.twitter.com/qZfUgBDoqM — YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
హైదరాబాద్లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
SRH vs GT: మ్యాచ్కు వర్షం అడ్డంకి.. హెచ్సీఏ కీలక ప్రకటన
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement