-
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
యుద్ధ ట్యాంక్ను నడిపిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు. అధికార వార్తా సంస్థ(కేసీఎన్ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్ను నడిపినట్లు మీడియా పేర్కొంది. మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్ర్సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. -
కిమ్కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కు బహుమతిగా విలాసవంతమైన లిమోసిన్ కారు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ కారు ఉత్పత్తి చేసిన కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి రెండేళ్లు పూర్తవడం, అలెక్సీ నావల్ని మృతిపై రష్యాపై అమెరికా తాజాగా విధించిన 500 ఆంక్షల జాబితాలో లిమోజిన్ కారు కంపెనీ ఆరస్ను కూడా అగ్రరాజ్యం చేర్చడం గమనార్హం. ఉత్తర కొరియాకు రష్యా ఆర్టిలరీ బాంబులు సరఫరా చేస్తుండటం, కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలపై చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వీడియోకాన్ఫరెన్స్లో శుక్రవారం చర్చించారు. కాగా, ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా సరిహద్దులో ఉత్తర కొరియా ఆర్టిలరీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని దక్షిణ కొరియాకు చెందిన ఐలాండ్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు దక్షిణకొరియాను ఉత్తర కొరియా రెచ్చగొడుతోంది. ఇదీ చదవండి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. రెండేళ్లు -
క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ‘ఆదివారం ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే. ఇదీచదవండి..బ్రిటీష్ నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి -
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు. -
సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్
ప్యాంగ్యాంగ్ : కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల వల్లే కిమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘దక్షిణ కొరియాతో కలవడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. మనం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం వస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం. మన రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంది. దక్షిణ కొరియా మన ప్రధాన శత్రువని రాబోయే తరాలకు తెలియజేయాలి. దక్షిణ కొరియాను ఆక్రమించుకునేందుకు మనం ప్రణాళిక రచించాలి. రెండు దేశాల మధ్య ఇక ఎలాంటి సమాచార పంపిణీ ఉండకూడదు. ప్యాంగ్యాంగ్లో ఉన్న కొరియా పునరేకీకరణ ఐకాన్ను ధ్వంసం చేయండి. కొరియా దేశాల పునరేకీకరణ కోసం పని చేస్తున్న సంస్థను మూసేయండి. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని వెంటనే ఆపండి’ అని నార్త్ కొరియా పార్లమెంట్లో కిమ్ ప్రసంగించారు. ఇదీచదవండి.. నౌకలపై దాడులతో ఇంధన సరఫరాపై ప్రభావం -
కిమ్కు ఉన్న పిచ్చి ఏంటంటే.?.. నటిని కిడ్నాప్ చేసి..
ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 1994 జూలై నుంచి 2011 డిసెంబర్లో తానుమరణించే వరకు ఉత్తర కొరియా నియంతగా కొనసాగారు. కొరియన్ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చూపే ప్రతీ అంశాన్ని కిమ్ జోంగ్ ఇల్ నిషేధించారు. విదేశీ సినిమాలు చూడటం మొదలుకొని బ్లూ జీన్స్ ధరించడం వరకు అన్నింటినీ నిషేధించారు. జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. తన దేశంలో సినిమాలు తీయడానికి ఒక ప్రముఖ దక్షిణ కొరియా నటిని, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. కిమ్ జోంగ్ ఇల్ నాటి ప్రముఖ దక్షిణ కొరియా నటి చోయ్ యున్ హీని కిడ్నాప్ చేసి, రెండున్నరేళ్లు నిర్బంధించి, ఆమె చేత 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978 నాటిది. ఆ కాలాన్ని దక్షిణ కొరియా చిత్రాలకు గోల్డెన్ పీరియడ్ అని అంటారు. అప్పట్లో చాలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలయ్యేవి. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ జియోంగ్ గ్యున్ సినిమా దర్శకుడు. వీరు సెలబ్రిటీ జంటగా పేరుగాంచారు. ఓ జూనియర్ నటితో ఆమె భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిన కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో నటి చోయ్ యున్ హీ ఒక వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్ వెళ్లారు. ఇంతలో ఉత్తర కొరియా ఏజెంట్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను ఆమెను స్పీడ్బోట్లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లాడు. హాంకాంగ్లో జరిగిన వ్యాపార ఒప్పందం అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని ఆ నటికి అప్పుడు అర్థమైంది. అయితే తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టానుసారమే ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు. ఉత్తర కొరియాలో రూపొందే సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాలని కిమ్ జోంగ్ ఇల్ తపించిపోయాడు. చోయ్ యున్ హీ భర్తను కూడా తమ ప్రాంతానికి బలవంతంగా తీసుకువచ్చాడు. అయితే ఆ దర్శకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. ఐదేళ్లపాటు జైలులో ఉంచి వివిధ శిక్షలు విధించారు. నార్త్ కొరియా కోసం సినిమాలు తయాలని ఆదేశించారు. షిన్ జియోంగ్ గ్యున్ ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, తన భార్య చోయ్ యున్ హీ కలసి రెండేళ్లలో మొత్తం 17 సినిమాలు చేశామని చెప్పారు. రాత్రిపూట మూడు గంటలకు మించి నిద్రపోకూడదని, నిరంతరం పని చేయాలని, అప్పుడే మా ప్రాణాలు నిలబడతాయని కిమ్ జోంగ్ ఇల్ ఆదేశించారని షిన్ జియోంగ్ గ్యున్ తెలిపారు. అయితే 1986లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కిమ్ నటి చోయ్ యున్ హీ, దర్శకుడు షిన్ జియోంగ్ గ్యున్లను ఉత్తర కొరియా ప్రతినిధులుగా పంపారు. వారికి కిమ్ గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. గదుల్లో కూడా గార్డులను మోహరించాడు. అయితే ఆ దంపతులు ఎలాగోలా తప్పించుకుని, అమెరికా చేరుకుని అక్కడ ఆశ్రయం పొందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం.. రష్యా కోసం..
సియోల్: ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ దేశంలోకి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, రష్యాకు చెందిన ఓ గ్రూప్ నార్త్ కొరియాలో పర్యటించనున్నారు. ఈ బృందం ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఉత్తర కొరియాకు బయలుదేరనుంది. వివరాల ప్రకారం.. పర్యాటకుల విషయంలో ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తమ దేశంలోకి మళ్లీ పర్యాటకులు వచ్చేందుకు తాజాగా నార్త్ కొరియా అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నార్త్ కొరియా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పర్యాటకులకు అనుమతించలేదు. దేశంలోకి రాకుండా కఠిన నిబంధనలను విధించింది. ఇక, తాజాగా పర్యాటకులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన టూరిస్టులు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన నార్త్ కొరియాకు వెళ్లనున్నారు. అక్కడ నాలుగు రోజులు పాటు పర్యటించనున్నారు. పలు సిటీల్లోకి ప్రవేశించనున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరులో తూర్పు రష్యాలో ఒక శిఖరాగ్ర సమావేశం కోసం కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ, సైనిక రంగాలలో సహకారం అందించుకునేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. ఉత్తరకొరియాకు చైనా నుంచి కూడా సహకారం అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నార్త్ కొరియాకు జిన్పింగ్ మద్దతుగా నిలిచారు. కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్లను నార్త్ కొరియాకు చైనా పంపించింది. -
North korea: సౌత్ కొరియాకు కిమ్ మళ్లీ వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్జాంగ్ఉన్ మరోసారి దక్షిణ కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమకు ముఖ్యమని, అయితే తమ పై ఆ దేశం మిలిటరీ చర్యలకు దిగితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. తమ వద్ద ఉన్న మొత్తం సామర్థ్యం మొత్తం వినియోగించైనా సరే దక్షిణ కొరియాను లేకుండా చేస్తామని కిమ్ అన్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. పరోక్షంగా అణుబాంబులు వేయడానికి కూడా వెనుకాడబోమని కిమ్ వ్యాఖ్యలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారంలో దక్షిణ కొరియాకు సరిహద్దులో ఉన్న సముద్రంలోని ఓ ఐలాండ్లో ఉత్తర కొరియా 200 రౌండ్ల ఆర్టిలరీ బాంబులు వేసింది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా అక్కడ ఉంటున్న కొంత మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు కిమ్ ఈ ఏడాది జరగనున్న సౌత్కొరియా, అమెరికా సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. రెండు దేశాల్లో తనకు అనుకూలమైన వారు ఎన్నికవుతారని ఆయన ఆశిస్తున్నట్లున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు దక్షిణ కొరియాలో లిబరల్స్ అమెరికాలో తిరిగి ట్రంప్ అధికారంలోకి వస్తారని, వీరు గనుక ఎన్నికైతే తమకు కొంత వరకు మేలు జరుగుతుందని కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..వామ్మో 2023 -
North Koria : కిమ్ 40వ బర్త్ డే వేడుకలు ఎందుకు చేసుకోలేదు..?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కి 40 ఏళ్లు వచ్చాయి. ఆయన తన 40వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకోలేదు. దీనికి పలు కారణలున్నాయని తెలుస్తోంది. ఇందులో ముఖ్య కారణం మాత్రం కిమ్ జాంగ్ ఉన్ తల్లేనట. ఎందుకంటే కిమ్ తల్లి జపాన్కు చెందిన మహిళ అవడంతో బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఆమె ఉత్తర కొరియాకు చెందినది కాదనే చర్చ జరుగుతుందని కిమ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే బర్త్డే వేడుకలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే తన తండ్రి, తాత తరహాలో బర్త్డే రోజు ప్రభుత్వ సెలవు ఇవ్వడంతో పాటు మిలిటరీ పరేడ్ నిర్వహించేత వయసు తనకు ఇంకా రాలేదని, తాను ఇంకా చిన్నవాడినని ఆయన అనుకుంటుంటారని సమాచారం. ఈ కారణాలతోనే కిమ్ తన బర్త్డే వేడుకలను జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే బర్త్డే రోజు కిమ్ తన కూతురుతో కలిసి ఓ కోళ్ల ఫామ్ను సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఇదీచదవండి..ఎన్నికల్లో విజయం..బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు -
నిన్ను ఆకలి దప్పికలు లేని ఓ కొత్త లోకానికి తీసుకెళ్తా..!
ఈ కొత్త ఏడాదిలో నిన్ను ఆకలి దప్పికలు లేని ఓ కొత్త లోకానికి తీసుకెళ్తా డోంట్ వర్రీ! -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. అవును.. ఇది నిజం.. దేశంలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపధ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ రోదించారు. వేదికపై కూర్చున్న ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలో దీర్ఘశ్వాస తీసుకున్నారు. ఆ సమయంలో అతని కళ్లు మరింత ఎర్రబారాయి. కన్నీటిని రుమాలుతో తుడుచుకున్నారు. ఉత్తరకొరియా ప్రభుత్వ టెలివిజన్ ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసి, ప్రసారం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపుతో పాటు, సభకు హాజరైన తల్లుల రోదనను కలిపి చూపించారు. అత్యంత క్రూరమైన నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ కన్నీరు కారుస్తున్న చిత్రాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే కిమ్ జోంగ్ ఏడుపు అక్కడి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఉత్తరకొరియా జాతీయ టెలివిజన్లో కిమ్ ఏడుపు చూపించడం ఇదేమీ మొదటిసారి కాదని నిపుణులు అంటున్నారు. ఇది నిజమైనదా లేదా మొసలి కన్నీరా అనే అంశంతో సంబంధం లేకుండా.. కిమ్ జోంగ్ మానవత్వం కలిగిన నేత అని చూపించేందుకే అతని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహంలో భాగమని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరకొరియా సుప్రీం కమాండర్ బహిరంగంగా కన్నీరు పెట్టడమనేది తొలిసారిగా 2011డిసెంబర్లో కనిపించింది. కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ సమాధి వద్ద తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ను గుర్తు చేసుకుంటూ కిమ్ కంటనీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కూడా అతని వెనుక ఉన్నారు. ‘రోడాంగ్ సిన్మున్’లో ప్రచురితమైన ఫోటోలో.. తండ్రి అంత్యక్రియల్లో కిమ్ కన్నీటిని నియంత్రించుకున్న దృశ్యం కనిపించింది. 2020, అక్టోబర్లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ జోంగ్.. కరోనా మహమ్మారి కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు తన ప్రయత్నాలు సరిపోలేదని పేర్కొంటూ కిమ్ ప్రసంగ సమయంలో రోదించారు. కాగా సియోల్లోని కూక్మిన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్యోడర్ టెర్టిస్కీ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా నేతలు ఏడవడం కొత్త విషయమేమీ కాదని, మాజీ నేతలు కిమ్ జోంగ్ ఇల్, కిమ్ ఇల్ సంగ్ ఇలా ఏడుస్తూ కనిపించారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు 2022, జూలై 2022లో జరిగిన విక్టరీ డే ఈవెంట్లో తన భర్త పక్కన నిలుచుని ఏడుస్తూ కనిపించారు. ఉత్తర కొరియా నేతల తీరును విశ్లేషించిన ఒక నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నేతల ఏడుపులను ఆయా సందర్భాలను అనుసరించి వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. కిమ్ జోంగ్ 2020లో ఒలికించిన కన్నీరు ఉద్దేశపూర్వకంగా లేదా సెంటిమెంటల్ రాజకీయాల కోసం చేసిన చర్యగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సవాలుతో కూడిన దేశ పరిస్థితుల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఒంటరితనంతో కుమిలిపోతూ భావోద్వేగానికి లోనై ఉండవచ్చన్నారు. అలాగే తండ్రి మరణించినప్పుడు కిమ్ ఏడుపు.. తండ్రిని కోల్పోయిన బాధలోంచి వచ్చినదన్నారు. కొరియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ బాలాజ్ స్జాలోంటాయ్ మాట్లాడుతూ నియంతలు బహిరంగంగా రోదించడం అనేది చాలా అరుదు అని పేర్కొన్నారు. వియత్నాం మాజీ నియంత హో చి మిన్ కూడా దీనికి ఉదాహరణ అన్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఏడుపు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అయి ఉండవచ్చన్నారు. భావోద్వేగ సందర్భాల్లో ప్రజల మందు ఉదాసీనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఇలా భావోద్వేగంతో కనిపించి ఉండవచ్చని స్జాలోంటాయ్ పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఏడుపు నిజమైనదే అయితే, అతను నిజంగా ప్రజానాయకుడైతే ఉత్తరకొరియాలో నియంతృత్వ పాలన పోయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించివుండేవారన్నారు. కిమ్ జోంగ్ ఉన్ కార్చిన కన్నీరు అతని అపరిపక్వతకు చిహ్నమని స్జాలోంటాయ్ విశ్లేషించారు. ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాకు కొత్త భయం -
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్పై దాడి.! భారత్కు పన్నూ బెదిరింపులు -
ఎక్కువ మందిని కనండి: కిమ్
సియోల్: దేశాన్ని బలోపేతం చేయాలంటే జననాలను పెంచటం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ చెప్పారు. ఆదివారం జరిగిన నేషనల్ మదర్స్ సమావేశంలో కిమ్ ప్రసంగిస్తూ ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలకు పిలుపునిచ్చారు. జననాల రేటు క్షీణతను అడ్డుకోవడం, చిన్నారుల సంరక్షణ, విద్య అనేవి తల్లుల వల్లే సాధ్యమవుతాయని చెప్పారు. దేశ జనాభా గణాంకాలను ఉత్తరకొరియా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. అయితే, అక్కడ గత పదేళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తోందని పొరుగు దేశం దక్షిణ కొరియా అంటోంది. పిల్లల పెంపకం, చదువు చెప్పించడం వంటివి చాలా ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఉత్తర కొరియాలోని చాలా కుటుంబాలు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కార్మికుల సమీకరణపై ఆధారపడే ఆ దేశానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. -
అమెరికాకు అదిరిపోయే కౌంటరిచ్చిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: అగ్ర రాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అంతరిక్ష హక్కులు, తాము ప్రయోగించిన నిఘా ఉపగ్రహానికి అమెరికా హాని తలపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా మండిపడినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్రమంలో నార్త్ కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఒకవేళ అమెరికా అటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని తాము యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని తెలిపారు. తమ చట్టబద్ధమైన అంతరిక్ష ఉపగ్రహా కార్యక్రమాలకు సంబంధించిన విధానాలను ఉల్లంఘించడానికి ప్రయత్నస్తే.. తాము కూడా అమెరికా గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గూఢచారి ఉపగ్రహాలను నాశనం చేయటం, ప్రతిఘటించడానికి తమదైన వ్యూహాలను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా స్వీయ రక్షణలో భాగంగా అమెరికా స్పేస్ కమాండ్ ప్రతినిధి షెరిల్ క్లింకెల్ మాట్లాడుతూ.. అన్ని డొమైన్లలోని తమ ప్రత్యర్థి దేశాల శక్తి, సామర్థ్యాలను తాము ఎందుర్కొవటంతో పాటు, అవసరమైతే వాటిని నాశనం చేసే సత్తా తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర కోరియా బాలిస్టిక్ టెక్నాలజీ ఉపయోగించి చేపట్టే పలు క్షిపణీ పరీక్షల విషయంలో యూఎన్ తీర్మాణాల పాటించని విషయం తెలిసిందే. అయితే అంతరిక్ష ప్రయోగాల సామర్థ్యాలకు బాలిస్టిక్ క్షిపణలు అభివృద్ధికి మధ్య సాంకేతికత విషయంలో దగ్గరి సంబంధాలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
వైట్హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు...
సియోల్: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్ జొంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. మల్లిగియోంగ్–1 అనే నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది. -
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాను మళ్లీ రెచ్చగొట్టింది. ఈసారి క్షిపణి పరీక్షతో కాదు.. అంతకు మించిన చర్యతో. అణ్వాయుధ బలగాలను విపరీతంగా పెంచుకునేలా ఏకంగా ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకుంది. తద్వారా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో తొక్కి.. అణు ఆయుధాలను అపరిమితంగా తయారు చేసుకునే చట్టాన్ని రూపొందించారు. తద్వారా.. ప్యాంగ్యాంగ్తో ఆర్థిక సాయం విషయంలో నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు అమెరికా చేసిన అభ్యర్థనను ఆయన తేలికగా తీసుకున్నట్లు అయ్యింది. గురువారం ఉత్తర కొరియా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ జరిగింది. ఈ సమావేశంలో.. కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్ర పక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాంగ్యాంగ్ అణు ఆశయాలను అణిచివేసేందుకు, దాని వ్యవస్థను నాశనం చేసేందుకు అమెరికా, దాని భాగస్వాముల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి తాను ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీపీఆర్కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం ద్వారా ఉత్తర కొరియా అపరిమితంగా అణ్వాయుధాల్ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. అణ్వాయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, వాటిని వివిధ సేవల్లో ఉపయోగించుకోవడం లాంటి అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరోవైపు ఈ చర్యపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది. -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
యుద్ధ విమానాల ప్లాంట్ను సందర్శించిన కిమ్
సియోల్: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జొంగ్ ఉన్ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్స్క్ ఆన్ అముర్లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ ఎస్యూ–57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్ విడుదల చేసింది. ఒక ఎస్యూ–35 ఫైటర్ జెట్ ల్యాండ్ అయినప్పుడు కిమ్ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్ సుఖోయ్ ఎస్జే–100 ప్యాసింజర్ విమానాల ప్లాంట్ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఉన్నారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. -
ఇప్పుడు పుతిన్కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
రష్యా గడ్డపై కిమ్.. నాలుగేళ్ల తర్వాత తొలిసారి
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాలో అడుగు పెట్టారు. రష్యాకు కిమ్ వెళ్లడం ఇది రెండో సారి. తొలుత 2019లో ఆయన మొదటిసారి రష్యాలో పర్యటించారు. దాదాపు నాలుగేళ్ల తరువాత మరోసారి రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా తెలియరాలేదు. 2019లో ఇరువురు నేతలు వ్లాదివోస్తోక్లోనే సమావేశమయ్యారు. ఈసారి కూడా భేటీ అక్కడే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ మాట్లాడుతూ.. దేశాల సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం రష్యాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. ఇక పటిష్టమైన భద్రత మధ్య విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి రష్యాకు చేరుకున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని పాంగ్యాంగ్ నుంచి రైలులో బయలుదేరారు. 740 కి.మీ ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో రష్యా భూభాగంలో ఉన్న వ్లాదివోస్తోక్ నగరానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలోని ఉసురియ్స్క్ అనే ప్రాంతానికి ఈ రైలు చేరుకున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రాంతంలో కొరియన్ల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. అయితే, కిమ్ గమ్యస్థానం ఏమిటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిమ్ రష్యాకు చేరినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ నిర్ధారించారు. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఒంటరిగా మారిన కిమ్ జోంగ్ ఉన్ రష్యా సహాయాన్ని అర్థిస్తున్నారు. చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా గంటకు 50 కిలోమీటర్ల వేగమే.. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో భారీ బరువు కారణంగా వేగంగా వెళ్లలేదు. ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు. -
అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా
కరడుగట్టిన నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మిత్రదేశం రష్యా చేరుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కిమ్ భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో రేపో చర్చలు జరగనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాపై ఉన్న ఉమ్మడి శత్రుత్వం వల్ల రష్యా–ఉత్తర కొరియా సన్నిహితంగా మారాయని చెప్పొచ్చు. రెండు దేశాలూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలను దుష్ట దేశాలుగా అమెరికా అభివర్ణిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్–పుతిన్ తాజా సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వల్ల ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఆయుధమే కీలకం.. పుతిన్–కిమ్ భేటీతో ఎవరికి ఎంత లాభం? అనేదానిపై చర్చ మొదలైంది. కిమ్ రాజ్యంలో భారీస్థాయిలో ఆయుధ పరిశ్రమ వర్థిల్లుతోంది. ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్పై సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల ఎగుమతిపై ఇరుదేశాల నడుమ ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అమెరికా అనుమానిస్తోంది. తుది ఒప్పందం కోసమే కిమ్ రష్యాకు వెళ్లినట్లు చెబుతోంది. అయితే, దీనిపై రష్యా ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. ఆయుధాల కొనుగోలును నిర్ధారించలేదు. కానీ, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియా తీర్మానించుకున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఈ ఏడాది జూలైలో ఉత్తర కొరియాలో పర్యటించారు. అక్కడ ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ఆయుధాల ఫ్యాక్టరీలను సైతం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఉత్తర కొరియాతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేపడతామని సెర్గీ ప్రకటించారు. అప్పట్లో సెర్గీకి కిమ్ జోంగ్ ఉన్ ‘టూర్ గైడ్’గా పనిచేశారు. దగ్గరుండి తమ ఆయుధాలను చూపించారు. సంతకాన్ని రద్దు చేసుకుంటే! ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు చేతికి అందిన తర్వాత ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని పుతిన్ సంకేతాలిస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో నడస్తున్న ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) మారుతుందని అంటున్నారు. తమ లక్ష్య సాధనకు ఉత్తర కొరియాతో సైనిక సహకారం సైతం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అణ్వస్త్ర ప్రయోగాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాతో ఎవరూ ఆయుధ వ్యాపారం చేయరాదని ఆదేశించింది. ఈ తీర్మానంపై రష్యా కూడా సంతకం చేసింది. తమ సంతకాన్ని రద్దు చేసుకొనే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వెనక్కి తగ్గితే ఉత్తర కొరియాపై ఆంక్షలు బలహీనమవుతాయి. అప్పు డు ఉత్తర కొరియా నుంచి యథేచ్ఛ గా ఆయు ధాలు కొనుగోలు చేసుకో వచ్చు. ప్రతిఫలం అదేనా? రష్యా సంగతి సరే మరి ఉత్తరకొరియాకు దక్కే ప్రయోజనమేంటి?రష్యాకు ఆయుధాలు ఇచ్చి, తిరిగి పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ రాజ్యంలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. పౌష్టికాహారం అనేది కలలో మాటగా మారింది. అందుకే మానవతా సాయం పేరిట రష్యా నుంచి భారీగా ఆహార ధాన్యాలను తీసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అలాగే సైన్యానికి ఉపయోగ పడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ముందంజలో ఉంది. ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచి సొంతం చేసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అందుకు పుతిన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ తనకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి తీసుకుంటారు. బదులుగా ఆహార ధాన్యాలు, ఆధునిక టెక్నాలజీని కిమ్కు అందజేస్తారు. ఇద్దరికీ లాభమేనన్నమాట! ఇక ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది. -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్లో పుతిన్తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement