సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు.
కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే.
రైలులోనే ఎందుకు?
గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్లో పుతిన్తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది.
Breadcrumb
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
Published Tue, Sep 12 2023 5:36 AM
Related news
-
బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా గుప్పిట పెట్టుకుని ఆడిస్తోందని.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధంతో ఎన్నికల కమిషన్ వైఖరి బయటపడిందని విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైషమ్యాలు రెచ్చగొడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను తిడుతూ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా బీజేపీ విషం చిమ్ముతోంది. బీజేపీ కాకుండా ఇతరులు అధికారంలోకి వస్తే.. సంపదను ఎక్కువ పిల్లలున్న ముస్లింలకు దోచిపెడతారంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నుంచి ఉలుకూపలుకూ లేదు. ఆ వ్యాఖ్యలపై 20వేల మందికిపైగా పౌరులు ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే ధైర్యం లేక.. మోదీకి బదులుగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో దేవుడు, మతాన్ని ప్రస్తావించడం నేరమని తెలిసీ.. అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు శ్రీరాముడి ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. అయినా వారికి నోటీసులు, చర్యలు లేవు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలు ఈసీకి కనిపించడం లేదు. కేసీఆర్పై రాకెట్ వేగంతో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే.. మోదీ, రేవంత్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వైఖరి ఉంది. ఒక పార్టీ, కొందరు నాయకులు ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మాటలేమైనా ప్రవచనాలా? ‘నిరోధ్లు, పాపడాలు అమ్ముకోండి..’అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల పాటు మాట్లాడకుండా గొంతు నొక్కారు. బీఆర్ఎస్ నుంచి సీఎం రేవంత్పై ఎనిమిది ఫిర్యాదులు.. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరుల వ్యాఖ్యలపై 27 ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించలేదు. ఏప్రిల్ 10న తుక్కుగూడ సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సుభాíÙతాలు, సూక్తుల్లా కనిపించాయా? రేవంత్ మాటలను ఉటంకించడానికి సంస్కారం అడ్డువస్తోంది. అలాంటి వ్యాఖ్యలపై ఈసీ చర్యలేవి? కూడబలుక్కుని నిషేధం పెట్టారు కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారనే వార్తలు, నిఘా సంస్థల నివేదికలు వారికి కంటగింపుగా మారాయి. బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తుండటం, జన స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. దీంతో బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్ కూడబలుక్కుని కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లకుండా నిషేధం పెట్టారు. ఈ అప్రజాస్వామిక ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. కేసీఆర్ ప్రచారాన్ని నిషేధించింది. కొందరిని మాత్రం ప్రజలు, ప్రత్యర్థుల మీదకు అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేసింది.రేవంత్పై క్రిమినల్ కేసు పెట్టాలి హాస్టళ్ల మూసివేతపై ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ గతేడాది ఇచ్చిన సర్క్యులర్, స్టాంప్ను ఫోర్జరీ చేసి ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేసిన సీఎం రేవంత్రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి. ఉస్మానియా వర్సిటీ చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దాంతో ఓయూ చీఫ్ వార్డెన్కు రిజి్రస్టార్, సదరన్ డిస్కం నుంచి నోటీసులు ఇప్పించారు. అంతటితో ఆగకుండా గత ఏడాది చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను రేవంత్ పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. రేవంత్ ఫోర్జరీ డాక్యుమెంట్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు అని ఓయూ అధికారులు నిరూపిస్తే.. చంచల్గూడ జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. రేవంత్పై ఓయూ విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్పై చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
దేశ ప్రజల భవిష్యత్ కోసమే ఇండియా కూటమి
నడిగూడెం: దేశ ప్రజల భవిష్యత్ కోసమే ఇండియా కూటమి ఏర్పాటు అయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో కోదాడ ఎమ్యెల్యే పద్మావతి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డిలతో కలిసి నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకమని, బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో దేశ ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు.బీజేపీ సర్కార్ మతపరంగా ప్రజలను విభజించి పాలిస్తోందన్నారు. మోదీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారన్నారు. దీంతో ప్రజలకు భారంగా మారిందన్నారు. దేశంలో మెజారిటీ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పదేళ్లలో బీఆర్ఎస్ కూడా చేసిందేమీ లేదని, లోక్సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీ మనుగడలేకుండా పోతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో అధికార దుర్వినియోగం జరిగిందని, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, పోలీసు శాఖను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల అనంతరం అర్హులైన పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్యెల్యే వేనేపల్లి చందర్రావు ఈ సభలో పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: వావ్! గెనీబెన్!!
గెనీబెన్ నాగాజీ ఠాకోర్. ఉత్తర గుజరాత్లో కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో పారీ్టకి బలమైన గొంతుక. సభలో ధాటైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది కలిగిన ప్రజాప్రతినిధి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుమ కూడా వావ్ స్థానం నుంచి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించే నాయకురాలు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా హాజరవుతారు. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగి బీజేపీకి గట్టి సవాలే విసురుతున్నారు... పంచాయతీ నుంచి... 2017 అసెంబ్లీ ఎన్నికలు గెనీబెన్ రాజకీయ జీవితంలో కీలక మలుపు. వావ్ నుంచి బీజేపీ సీనియర్ నేత, మంత్రి శంకర్ చౌదరీని ఓడించడంతో ఆమె పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. ఆమెకు కేవలం రెండో ఎన్నికలవి. జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ నుంచి పొలిటికల్ సైన్స్ చదువుతూ గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేశారు. పంచాయతీ సభ్యురాలిగా చేశారు. 2012లో కాంగ్రెస్ వావ్ నుంచి టికెటిచి్చంది. అప్పుడు 12వేల ఓట్లతో ఓడినా 2017లో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒకరు.క్రౌడ్ ఫండింగ్తో నిధుల సేకరణ... బనస్కాంత జిల్లాలో అన్ని సామాజికవర్గాల వారూ తనను సోదరిగా భావిస్తారంటారు గెనీబెన్. ఎన్నికల ఖర్చు కోసం నియోజకవర్గంలో క్యూ ఆర్ కోడ్ను క్రియేట్ చేసి మరీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ‘‘బీజేపీకి బలమైన ఆర్థిక వనరులున్నాయి. నాకున్నది విలువలు, సామాజిక సూత్రాలే. అయినా బలమైన సిద్ధాంతంతో పోరాడేవారిని ఎవరూ ఓడించలేరు. కనుక దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడానికి తోచిన సాయం చేయండి’’ అని ప్రజలను కోరుతున్నారు. రాజస్తాన్, పాకిస్తాన్తో సరిహద్దులో ఉన్న లోక్సభ స్థానం బనస్కాంత. ‘సీమ దర్శన్’ పేరుతో ఇక్కడ సరిహద్దు పర్యాటక స్థలం కూడా ఉంది. ఇక్కడ ఠాకోర్ ఓటర్లు 18 శాతం, చౌదరి ఓటర్లు 13 శాతం ఉన్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు... కులాంతర, మతాంత వివాహాలను నిషేధిస్తు ఠాకోర్ సామాజికవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గెనీబెన్ సమరి్థంచడం వివాదం రేపింది. యువతులకు మొబైల్ఫోన్లను నిషేధించడాన్ని కూడా ఆమె సమరి్థంచారు. ‘‘బాలికలకు మొబైల్ఫోన్లను నిషేధించడంలో తప్పు లేదు. మొబైల్స్కు దూరంగా ఉండి బాగా చదువుకోవాలి’’ అని సూచించడంపై చాలా విమర్శలే వచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ను నమ్మి గ్రామీణులు మోసపోయారు
మూసాపేట/రహమత్నగర్: గ్రామాల్లోని ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు చెప్పారు. ఆరు గ్యారంటీల పేరు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఇంకా ఆ హా మీలను అమలు చేయట్లేదని ఆరోపించారు. లోక్సభ ఎ న్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు 10–12 సీట్లు అందిస్తే బీజేపీ, కాంగ్రెస్లను కూకటివేళ్లతో పెకిలించి తెలంగాణ రాష్ట్రా న్ని కేసీఆర్ శాసిస్తారని చెప్పారు. పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తరఫున గురువారం హైదరాబాద్లోని మూసాపేట, రహమత్నగర్ డివిజన్ శ్రీరాంనగర్లలో నిర్వహించిన రో డ్షోలలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు నగర పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలను గెలిపించినట్లుగానే నగరంలోని లోక్సభ స్థానా ల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోత.. నీటి కొరత కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు లేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రోజుకు 4–5 సార్లు కరెంటు పోతోందన్నారు. మంచినీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి తెచ్చిన కంపెనీలు గుజరాత్, తమిళనాడుకు వెళ్లిపోయాయని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న అవకాశాలను పోగొట్టే అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి డమ్మీ అని, ఆమెను ఎక్కడి నుంచో ఇక్కడకు తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీవి మత రాజకీయాలు.. ప్రధాని మోదీ తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ తీసుకురాలేదని, మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, మూసీ సుందరీకరణకు నిధులు ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణతోపాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు కూడా మోదీ ఏమి చేయలేదని విమర్శించారు. బీజేపీ అక్కరకు రాని చుట్టమంటూ ఎద్దేవా చేశారు. ఆయన కేవలం హిందూ ముస్లింల పేరుతో ఓట్లు దండుకొని మత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ పునర్నిర్మించినా ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని చెప్పారు. దేవుళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయవచ్చా? అని ప్రశ్నించారు. మోదీ, రేవంత్లు బడే భాయ్, చోటే భాయ్ బడే భాయ్ మోదీ, చోటా భాయ్ రేవంత్రెడ్డి మాటలను నమ్మొద్దని కేటీఆర్ ప్రజలను హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ మాయల మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. పేదవారిని ఆదుకొనే ఒక్క పథకమైనా చేశారా అని ప్రశ్నించారు. నాలుగున్నర నెలల్లో చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప రేవంత్ ఏమీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే రేవంత్ నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. జూన్ 2న హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ కుట్రపన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో కేసీఆర్ పంపే గులాబీదళం ఉండాలన్నారు. అందుకోసం మల్కాజిగిరి ప్రజల తరఫున మాట్లాడే రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయా రోడ్ షోలలో కేటీఆర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్, శంబీపూర్ రాజు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
సాక్షి, యాదాద్రి: ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, తొలిసారి పాగా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపు కోసం పోరాడుతోంది. సీపీఎం మాత్రం లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యేరసవత్తర పోరు సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున చామల కిరణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లే‹Ù, సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పోటీలో ఉన్నారు. బూర నర్సయ్యగౌడ్ బీజేపీబీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి బూరభువనగిరిలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో బీజేపీలో చేరారు. తొలి విడతలోనే బీజేపీ టికెట్ సంపాదించారు. ప్రధాని మోదీ చరిష్మాతోపాటు తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చెప్పుకోదగ్గ ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో రాబట్టుకోలేకపోయింది. గౌడ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, బీసీ నినాదం, బీఆర్ఎస్ లోని పాత పరిచయాలతో క్రాస్ ఓటింగ్, మాదిగ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్సామాజికవర్గ సమీకరణలో క్యామ మల్లేష్రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్ బీఆర్ఎస్లో చేరారు. క్యామ మల్లేష్ది గొల్లకుర్మ సామాజికవర్గం. కేసీఆర్ చరిష్మా, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రచారాన్ని సాగిస్తున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జనగామలో తప్ప, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలను ఎండగడు తూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై అధికంగా ఆధారపడ్డారు. దీనికితోడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసివస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. గులాబీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్కోమటిరెడ్డి ఆధ్వర్యంలో చామల కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపు బాధ్యతలను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. కోమటిరెడ్డి సోదరులను గెలిపించిన భువనగిరి ప్రజలు తన సోదరుడులాంటి చామలను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. తన సామాజికవర్గ ఓట్లు, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఇస్తోంది. సెమీ అర్బన్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ స్థానం పరిధి సెమీ అర్బన్గా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, ఆలేరులోని కొంతప్రాంతం హెచ్ఎండీఏలో ఉంది. జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంతంగా మాత్రంగానే ఉంది. హైదరాబాద్కు ఈస్ట్కు శివారులో ఉన్నా, ప్రగతి మాత్రం వెనుకబడి ఉంది. పోటీలో సీపీఎం రాష్ట్రం మొత్తంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక లోక్సభ నియోజకవర్గం భువనగిరి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వివిధ వర్గాల కారి్మకుల ఓట్లపై కన్నేసింది. ప్రభావితం చేసే అంశాలు పెండింగ్ రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారుల విస్తరణ జాప్యం కాళేశ్వరం భూసేకరణలో కోల్పోయిన భూములకు పరిహారం చేనేత కార్మికుల, ఐటీ కారిడార్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు టూరిజం, డ్రైపోర్టు, ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం గౌడ, గొల్లకుర్మ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు 2019 లోక్సభ ఎన్నికల ప్రధానపార్టీల అభ్యర్థుల ఓట్లు ఇలా... కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్) 5,32,795 (44.37 శాతం) బూరనర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) 5,27,576 (43.94 శాతం) పీవీ శ్యాంసుందర్రావు (బీజేపీ) 65,451 (5.45 శాతం)
Related News by category
-
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్లో లేను. ఒకవేళ ఫామ్లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్మన్ పావెల్ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్గా అయినా పరాగ్కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్రౌండర్కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. రికార్డు స్థాయిలో ముంబైని ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపిన హిట్మ్యాన్పై వేటు వేస్తూ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.స్టేడియంలో లోపలా.. వెలుపలా పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దిగుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గురువారం నాటి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంబంధించిన జట్టు గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి ముంబైలో రోహిత్ విలేకరులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం గురించి ప్రశ్న ఎదురైంది.నాకు ఇదేమీ కొత్త కాదుఇందుకు బదులిస్తూ.. ‘‘జీవితంలో ఇదంతా భాగమే. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. ఏదేమైనా వేరొకరి(హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి) కెప్టెన్సీలో ఆడటం గొప్ప అనుభవం.ఇంతకు ముందు కూడా నేను చాలా మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ఒక ఆటగాడిగా జట్టు కోసం ఏం చేయగలనో అది చేయడమే నాకు ముఖ్యం. గత నెల రోజులుగా నేను అదే పని చేస్తున్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా గతంలో మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, ఆడం గిల్క్రిస్ట్(దక్కన్ చార్జర్స్), హర్భజన్ సింగ్(ముంబై ఇండియన్స్, రిక్కీ పాంటింగ్(ముంబై ఇండియన్స్) కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా విఫలంఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ శర్మ 314 పరుగులు చేశాడు. ఇక ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా మాత్రం ఆకట్టులేకపోతున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో కేవలం మూడింట మాత్రమే ముంబై గెలిచింది. అక్కడ రోల్ రివర్స్కాగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ తర్వాత వరల్డ్కప్ టోర్నీతో రోహిత్ శర్మ బిజీ కానున్నాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్కు హార్దిక్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే? -
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్లో ఈ మధురానుభూతిని చవిచూశారు.ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి.. పటిష్ట రాజస్తాన్ రాయల్స్పై రైజర్స్ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. #TATAIPL Matches 📂↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH— IndianPremierLeague (@IPL) May 2, 2024 ‘‘హేయ్.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.అగ్ర స్థానంలోనే రాజస్తాన్కాగా ఐపీఎల్-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్కు సన్రైజర్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్ గట్టెక్కింది. Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో అందరి కంటే ముందే ఉంది.సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఉప్పల్, హైదరాబాద్👉టాస్: సన్రైజర్స్- బ్యాటింగ్👉హైదరాబాద్ స్కోరు: 201/3 (20)👉రాజస్తాన్ స్కోరు: 200/7 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్పై సన్రైజర్స్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3/41)👉టాప్ స్కోరర్లు: నితీశ్ రెడ్డి(సన్రైజర్స్- 42 బంతుల్లో 76 రన్స్- నాటౌట్)👉రియాన్ పరాగ్ (రాజస్తాన్- 49 బంతుల్లో 77 పరుగులు).చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్ ప్రశంసలు -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్పై సన్రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్పై సన్రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్లోనూ రాణిస్తున్నాడు. బౌలర్గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్డౌన్లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్మన్ పావెల్ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
సన్రైజర్స్పై 202 పరుగుల లక్ష్యఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్ బౌలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీయగా, 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా, భువనేశ్వర్ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్ను చేజేతులా రాయల్స్ కోల్పోగా, ఓటమి అంచుల నుంచి హైదరాబాద్ ఒక పరుగుతో గట్టెక్కింది. సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఒక పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు చేశారు. భువనేశ్వర్కు (3/41) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నితీశ్ ధమాకా... పవర్ప్లే ముగిసేసరికి 2 వికెట్లకు 37 పరుగులు... ఈ సీజన్లో సన్రైజర్స్ చేసిన అత్యల్ప పరుగులివి. దీనిని చూస్తే రైజర్స్ 200 పరుగులకు చేరగలదని ఎవరూ ఊహించలేదు. అభిషేక్ శర్మ (12), అన్మోల్ప్రీత్ (5) విఫలం కాగా... హెడ్ అప్పటికి 17 బంతుల్లో 18 పరుగులే చేసి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. చహల్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది హెడ్ జోరు ప్రదర్శించగా... నితీశ్ తన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. 10 ఓవర్ల తర్వాత స్కోరు 75 పరుగులకు చేరింది. 37 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. చహల్ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లతో నితీశ్ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు హెడ్ను బౌల్డ్ చేసి అవేశ్ ఈ జోడీని విడదీయగా, కొద్ది సేపటికి 30 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో రైజర్స్ బ్యాటర్లు నితీశ్, క్లాసెన్ మరింత చెలరేగడంతో 70 పరుగులు వచ్చాయి. అశ్విన్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు కొట్టిన నితీశ్... అవేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మరోవైపు చహల్ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదిన క్లాసెన్... చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి స్కోరును 200 పరుగులు దాటించాడు. కీలక భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి బట్లర్ (0), ఐదో బంతికి సామ్సన్ (0) అవుట్... రైజర్స్ పైచేయి! కానీ 7 పరుగుల వద్ద యశస్వి ఇచ్చిన క్యాచ్ను వదిలేసిన కమిన్స్... 24 పరుగుల వద్ద పరాగ్ ఇచ్చిన క్యాచ్ను వదిలేసిన అభిషేక్... అంతే... ఆట రాజస్తాన్ వైపు మొగ్గింది. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి, పరాగ్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వికెట్లు పడినా వీరిద్దరు ధాటిగా ఆడి పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఇద్దరూ బ్యాటర్లు రైజర్స్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఒకే ఓవర్లో యశస్వి 30 బంతుల్లో, ఆ తర్వాత 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే విజయం వైపు దూసుకుపోతున్న దశలో వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత కీలక సమయాల్లో మరో మూడు వికెట్లు చేజార్చుకున్న రాయల్స్ ఓటమిని ఆహా్వనించింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) అవేశ్ 58; అభిషేక్ (సి) జురేల్ (బి) అవేశ్ 12; అన్మోల్ప్రీత్ (సి) యశస్వి (బి) సందీప్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 76; క్లాసెన్ (నాటౌట్) 42; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–35, 3–131. బౌలింగ్: బౌల్ట్ 4–0–33–0, అశి్వన్ 4–0–36–0, అవేశ్ 4–0–39–2, సందీప్ శర్మ 4–0–31–1, చహల్ 4–0–62–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) నటరాజన్ 67; బట్లర్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సామ్సన్ (బి) భువనేశ్వర్ 0; పరాగ్ (సి) జాన్సెన్ (బి) కమిన్స్ 77; హెట్మైర్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 13; పావెల్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 27; జురేల్ (సి) అభిõÙక్ (బి) కమిన్స్ 1; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–135, 4–159, 5–181, 6–182, 7–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–41–3, జాన్సెన్ 4–0–44–0, కమిన్స్ 4–0–34–2, నటరాజన్ 4–0–35–2, ఉనాద్కట్ 2–0–23–0, నితీశ్ కుమార్ రెడ్డి 1–0–12–0, షహబాజ్ 1–0–11–0. ఐపీఎల్లో నేడుముంబై X కోల్కతావేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
Advertisement