-
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు లేదేని, ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు తన నల్ల ఖజానా గేట్లు ఎత్తేశారు. పచ్చ నోట్ల వరద పారిస్తున్నారు. ఇందుకు నిదర్శనాలివి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరుల వద్ద భారీ మొత్తంలో అక్రమ నగదు, కానుకలు పట్టుబడ్డాయి.వెలుగులోకి రాని అక్రమాలు, పట్టుబడకుండా టీడీపీ నేతల వద్ద గుట్టలు గుట్టలుగా ఉన్న అక్రమ సొమ్ముకు లెక్కే లేదు. ఎన్నికల కమిషన్ (ఈసీ)ని బురిడీ కొట్టిస్తూ కొత్తదారుల్లో పచ్చ నోట్లు వెదజల్లుతున్నారు. అందుకోసం షెల్ కంపెనీల నుంచి రామోజీరావుకు చెందిన మార్గదర్శి, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ నేతల వ్యాపార సంస్థల్లోకి భారీగా అక్రమ నిధులు మళ్లిస్తున్నారు.గొల్లపూడిలో దొరికింది పెద్దమొత్తమే!భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారుల దాడిలో దొరికింది రూ. కోటి అని చెబుతున్నప్పటికీ, ఇంకా పెద్దమొత్తంలోనే నగదు బయటపడినట్లు భావిస్తున్నారు. సురేష్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు భవానీపురం పోలీసులకు అందిన సమాచారాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధకు తెలియజేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొల్లపూడి టెలికాం కాలనీలోని సురేష్ ఇంట్లో సోదాలు చేశారు.దాదాపు నాలుగు గంటలపాటు సోదాలు చేసి, సురేష్ను విచారించారు. సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ కూడా తెప్పించారు. దీంతో పెద్ద మొత్తమే దొరికి ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6.30 తరువాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధ బయటకు వచ్చి తమ సోదాలో కోటి రూపాయలు దొరికాయని ముక్తసరిగా చెప్పారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వెళ్లిపోయారు. అసలు ఈ డబ్బు సురేష్ వద్దకు ఎలా వచ్చింది, ఇతర విషయాలు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మైలవరం నియోజకవర్గంలో పంచాయితీరాజ్ డీఈఈగా ఉన్న సుధకు ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్తో పరిచయాలు ఉండటం వల్లే ఇంత గోప్యంగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణప్రసాద్ ఇదే విధంగా తన సామాజికవర్గానికి చెందిన పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు డంప్ చేసినట్లు సమాచారం.ఉప్పందించింది దేవినేని ఉమా వర్గమే!ఎన్టీఆర్ జిల్లా కవులూరుకు చెందిన ఆలూరి సురేష్ కొన్నేళ్లుగా గొల్లపూడిలో శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుతున్నాడు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు వెంట ఉండేవారు. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో ఆయనకు అనుచరుడిగా మారారు. సురేష్ బుల్లెట్ బైక్ వెనుక నంబరు కూడా లేదు. ‘మన మైలవరం..మన వసంత’ అని స్టిక్కర్ ఉంది. మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్కు, మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గానికి పడదు. దీంతో దేవినేని వర్గమే సురేష్ వద్ద ఉన్న డబ్బు సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ పంపిణీ చేస్తున్న ఓటర్ల స్పిప్పులు ఇవి. ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ సాధారణమే. కానీ అక్కడే ఉంది చంద్రబాబు మాయోపాయం. ఓటర్లకు పంచుతున్న ఆ ఓటరు స్లిప్పుల మీద హోలోగ్రామ్ ముద్రించారు. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి బూత్కు ఓ ఏజెంటును నియమించారు. ఓటరు స్లిప్పును ఆ ఏజెంటుకు ఇస్తే, ఆయన దానికి స్కాన్ చేసి, ఓటరు ఖాతాలో రూ.3 వేలు వేస్తారు. ఇలా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది ఓటర్లకు ఓటుకు రూ.3 వేలు చొప్పున రూ. 51 కోట్ల పంపిణీకి చంద్రబాబు బరితెగించారన్నది సుస్పష్టం. పోలింగ్ రోజు వరకు మద్యం పంపిణీ, చోటా మోటా నేతలు, బూత్ కమిటీలకు యథేచ్ఛగా డబ్బుల పందేరం అదనం. ఇలా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు చంద్రబాబు రూ.100 కోట్లతో పకడ్బందీ స్కెచ్ వేసినట్టు స్పష్టమైంది. మాచర్లలో పోలీసులు దాడులు చేసి టీడీపీ నేతల ఇళ్లలో ఉన్న ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు పన్నాగం బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కు అత్యంత సన్నిహితుడు ఆలూరి సురేశ్ బాబు నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీ చేసి, రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆయన విజయవాడలోని స్వీట్ మ్యాజిక్ హోటల్స్ భాగస్వామి. మైలవరం నియోజకవర్గంలో ఓట్లు కొనేందుకే ఈ నిధులు అక్రమంగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరికింది రూ. కోటే అయినా, స్వీట్ మ్యాజిక్ హోటల్స్ యజమానుల ద్వారా షెల్ కంపెనీలను ఉపయోగించి దాదాపు రూ.10 కోట్ల వరకు తరలించాలని కుతంత్రం పన్నినట్టు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.రాష్ట్రం అంతటా మాచర్ల ఫార్మూలానే!మాచర్ల ఫార్మూలానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు పకడ్బందీ ప్రణాళిక రచించారు. హోలోగ్రామ్లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులతో ఓట్లు కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. దీంతోపాటు మద్యం, నేతలకు ముడుపులకూ నల్ల ధనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున 175 నియోజకవర్గాలకు మొత్తం రూ.17,500 కోట్లు వెదజల్లి ఎన్నికల అక్రమాలకు బరితెగించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగించాలని, ఎంతటి బీభత్సమైనా సృష్టించాలని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈమేరకు నియోజకవర్గాల్లో దౌర్జన్యాలకు, చివరికి హత్యలకు కూడా తెగించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ బాస్, రిటైర్డ్ డీఐజీ, సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లతో ఓ ముఠాను తయారు చేసి పచ్చ పన్నాగం అమలు బాధ్యతను అప్పగించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబుతో కలసి చదువుకున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్, ఓ రిటైర్డ్ ఐఏఎస్ (ఈయన చంద్రబాబు కేసుల్లో సహా నిందితుడు కూడా), టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు ఈ కుట్ర అమలు కోసం టీడీపీ నేతలతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.అంతా చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనేఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు నల్ల ధనం తరలింపు వ్యవహారం మొత్తం చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనే సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా కుంభకోణాలకు పాల్పడి కొల్లగొట్టిన నిధులను చంద్రబాబు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని నాలుగు బ్యాంకుల్లో ఉన్న టీడీపీ ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతోసహా గుర్తించిన విషయం తెలిసిందే. అదే విధంగా అమరావతి భూములు, మద్యం, ఇసుక, ఫైబర్ నెట్ తదితర కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన లక్షల కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఆ అక్రమ ఖజానా నుంచే ప్రస్తుతం ఎన్నికల అక్రమాల కోసం నిధులను వివిధ రూపాల్లో తరలిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మార్గదర్శి, నారాయణ, రాయల్ మెరైన్ సీఫుడ్స్, సోమా అగ్రిటెక్, స్వీట్ మ్యాజిక్... ఇలా వివిధ సంస్థల ద్వారా నియోజకవర్గాలకు తరలిస్తున్న వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అక్రమ ఖజానా నుంచి మళ్లిస్తున్నవేనన్నది సుస్పష్టం. పోలింగ్నాటికి చంద్రబాబు ఇంకెంతగా బరితెగిస్తారో.. ఈ అక్రమాలను ఈసీ, పోలీసులు ఎలా కట్టడి చేస్తారో అన్నది చూడాల్సిందే.ఇటీవలి కాలంలో పట్టుబడ్డ ‘పచ్చ’ ధనంలో ప్రధానమైనవి మరికొన్ని..» అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. » బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫుడ్స్ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. » ఏకంగా చంద్రబాబు రాజగురువు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల నుంచే గుట్టుచప్పుడు కాకుండా నల్లధనం పంపిణీ జరుగుతుండటం గమనార్హం. విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది అక్రమ నిధులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్ఫండ్స్ శాఖల ద్వారా నెలకు రూ.200 కోట్ల టర్నోవర్ అని అక్రమంగా చూపిస్తూ.. కొన్ని నెలలుగా టీడీపీ ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని వెదజల్లేలా సాగిస్తున్న కుట్ర బట్టబయలైంది. » టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు చెందిన విద్యా సంస్థల తరపున ఏర్పాటు చేసిన ఇన్స్పైరా కంపెనీ వ్యవహారాల ముసుగులో ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని మళ్లించిన బాగోతం ఇటీవల బట్టబయలైంది. పోలీసులు సోదాల్లో నగదుతోపాటు, షెల్ కంపెనీల ద్వారా భారీగా నల్లధనం తరలించినట్లు వెలుగులోకి వచ్చింది.» బీజేపీ తరపున పోటీ చేస్తున్న చంద్రబాబు ముఠా సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి నల్లధనం పంపిణీకి ఏకంగా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు. ఓట్ల కొనుగోలు, ఇతర అక్రమాల కోసం సుజనా చౌదరికి ఉమ్మడి కృష్ణా జిల్లా, సీఎం రమేశ్కు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించారు.» బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు తన నోవా అగ్రిటెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోకి అక్రమ నిధులు మళ్లించి, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ బాగోతం కూడా డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కంపెనీ వ్యాపార లావాదేవీల ముసుగులో ఓట్లు కొనుగోలు, ఇతర ఎన్నికల అక్రమాలకు నిధులు తరలించిన కుతంత్రం ఆధారాలతోసహా బయటపడింది. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా దుష్ప్రచారానికి కుట్ర పన్నినట్లు నిర్ధారణ అయింది. భూములకు సంపూర్ణ భద్రత కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న కుతంత్రం వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని నిగ్గు తేలింది. టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించింది.ఈ అంశంపై తక్షణం తగిన చర్యలు తీసుకుని తమకు నివేదించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. సీఐడీ చేపట్టిన దర్యాప్తులో ఈ కుట్ర గుట్టు వీడింది. చంద్రబాబు, లోకేశ్ పన్నాగం ప్రకారమే టీడీపీ, ఆ పార్టీ ఎన్నికల ప్రచార బృందాలు ఈ కుట్రకు తెరతీశాయని సీఐడీ నిర్ధారించింది. దాంతో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా లోకేశ్, ఏ 3గా టీడీపీ, ఆ పార్టీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీమ్లతోపాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్),(జి), 188, 505(2) రెడ్విత్ 120 (బి) కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. కుట్రదారు చంద్రబాబే..అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా ప్రచారం చేయకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతోంది. భూ హక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై పక్కా పన్నాగంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు తెర తీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు పన్నిన కుట్రలన్నీ బెడిసి కొట్టడంతో ఆయనకు దిక్కు తోచడం లేదు.సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలపై టీడీపీ చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రజలు గుర్తించారు. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అపోహలు వ్యాప్తి చేయాలని పథకం వేశారు. లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగంతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.ఈ చట్టం ద్వారా ప్రజల భూములను గుంజుకుంటారని, కబ్జా చేసేస్తారని, పత్రాలు మాయం చేస్తారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని ప్రజలను బెదిరింపులకు గురి చేసేలా ఈ ముఠా దుష్ప్రచారానికి తెగించింది. ఏకంగా ఓటర్లకు ఫోన్లు చేసి మరీ భయాందోళనలకు గురి చేస్తోంది. మంగళగిరితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, చండీఘడ్ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఫోన్లు చేస్తూ హడలెత్తించేందుకు యత్నించారు. టీడీపీకి వంతపాడే ఈనాడు, ఈటీవీ, ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లతోపాటు టీడీపీ సోషల్ మీడియా విభాగం పక్కా పన్నాగంతో ఈ దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ఈసీ ఆదేశాలతో..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ కాల్ రికార్డింగులతోపాటు ఇతర ఆధారాలను అందచేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఐవీఆర్ఎస్ కాల్స్, ఇతర ఆధారాలను పరిశీలించి విశ్లేషించిన సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ కుట్ర వెనుక చంద్రబాబు, లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగం కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చారు.టీడీపీ కార్యాలయానికి నోటీసులుల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం వెనుక చంద్రబాబు, లోకేశ్ తదితర కుట్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఐడీ బృందం ఆదివారం నోటీసులు అందించేందుకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేరు. పార్టీ ప్రధాన కార్యాలయం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుతో సీఐడీ అధికారులు ఫోన్లో మాట్లాడి కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించారు.టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగం ప్రతినిధులు సోమవారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్తోపాటు ఇతర టీడీపీ నేతలను కూడా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.నేరపూరిత కుట్రే.. నియమావళికి విరుద్ధంకఠిన సెక్షన్ల కింద కేసు నమోదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే కాకుండా నేరపూరిత కుట్రగా సీఐడీ నిర్ధారించింది. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఎన్నికల లబ్ధికి యత్నించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుతంత్రం పన్నినట్టు నిగ్గు తేల్చింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్),(జి), 188, 505(2) రెడ్విత్ 120(బి) కింద అభియోగాలు నమోదు చేసింది. 171(ఎఫ్)(జి): ఎన్నికల్లో అసత్య ప్రచారం, అభ్యంతకరమైన రీతిలో ప్రచారం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నడం. 188: ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నడం505(2): అసత్య ప్రచారం ద్వారా సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టడం, సామరస్య వాతావరణానికి విఘాతం కల్పించడం, పరస్పర శతృత్వాన్ని ప్రేరేపించడం.120(బి): కుట్రపూరితంగా వ్యవహరించడం, నేరానికి పాల్పడటం.టీడీపీ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వండితమ పార్టీపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం మర్నాడే స్పందించింది. ఐవీఆర్ కాల్స్ ద్వారా వైఎస్సార్సీపీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన జరిపి ఎన్నికల నియమావళి మేరకు తగిన చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.స్వయంగా లోకేశ్ దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచార కుట్రను నారా లోకేశ్ స్వయంగా అమలు చేయడం గమనార్హం. చట్టం గురించి అవాస్తవాలు, అభూత కల్పనలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా లోకేశ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఐవీఆర్ కాల్స్గా ఓటర్ల సెల్ ఫోన్లకు వస్తున్నాయి. టీడీపీ పేరిట వస్తున్న ఈ ఐవీఆర్ఎస్ కాల్స్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీ శనివారం ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ ఆదివారం ఉదయం కేసు నమోదు చేసింది.అయినా సరే ఆదివారం రాత్రి కూడా లోకేశ్ మాటలతో ఐవీఆర్ కాల్స్ రావడం గమనార్హం. 7313771502 అనే నంబర్ నుంచి లోకేశ్ కాల్ రికార్డింగులు ఓటర్ల సెల్ ఫోన్లకు వచ్చాయి. ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా టీడీపీ ఎంతగా బరితెగించిందో స్పష్టమవుతోంది. లోకేశ్ను ఏ2గా పేర్కొంటూ దీనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా స్వయంగా లోకేశ్ మాట్లాడి రికార్డ్ చేసిన కాల్స్ రావడంతో ఈ కేసులో తీవ్రత మరింత పెరిగింది. -
బూతులు.. దాడులు
సాక్షి, అమరావతి : తీవ్రమైన ఫ్ర్రస్టేషన్ కారణంగా చంద్రబాబు తన పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు. సీఎంను రాళ్లతో కొట్టండి.. అడ్డొచ్చిన వారిని గాజు గ్లాసుతో పొడవండి అంటూ.. పిలుపులిస్తున్నారు. ఈ పిలుపును అందుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లిలో గురువారం ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు మూకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి మృతి చెందడం కలకలం రేపింది. ఓటమి భయంతో లోకేశ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నట్లు, చంద్రబాబు వ్యాఖ్యలు అందుకు తోడైనట్లు ఈ ఘటన రుజువు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోనూ గురువారం టీడీపీ గూండాలు రోడ్షో చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంపేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య రోడ్షోను టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించి వీరంగం సృష్టించారు. ఈ దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శృతిమించిన చంద్రబాబు వ్యాఖ్యలతో దాడులు చంద్రబాబు శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు బహిరంగ సభలో చెప్పిన తర్వాతే విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై రాయితో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఒకపక్క సీఎం జగన్ తన పాలనలో ప్రతి ఒక్కరికీ చేసిన మేలును వివరిస్తూ మీ ఇంటికి మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని హుందాగా కోరుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం హింసను ప్రేరేపించడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు. తమ పార్టీ విధానాలను ప్రస్తావించకుండా వ్యక్తిగత దుర్భాషలకు దిగడం ఎన్నికల వేళ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బాబు గారేమిటి ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకేమైనా మతి పోయిందా?’ అని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికలను హింసాత్మకంగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దున్నపోతు అంటూ దిగజారుడు మాటలు ఇటీవల రాజధాని ప్రాంతమైన తాడికొండ సభలో ‘ఆ దున్నపోతును మనిషిని ఒక రాయి తీసుకుని ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’ అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారు. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం ఏమిటని, ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ మలి సంధ్యలో చంద్రబాబు మరింత దిగజారిపోతున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇటీవలే మరో సభలో గాజు గ్లాసు తీసుకుని పొడవాలంటూ సైగలు చేయటాన్ని చూసి పక్కనున్న నేతలే విస్తుపోయారు. ఈ సమయంలో ఆయన హావభావాలు కూడా నీచంగా ఉన్నాయని తప్పుబడుతున్నారు. ప్రతి సభలో సీఎం జగన్పై అక్కసుతో కక్ష పూరితంగా మాట్లాడటం పార్టీకి చాలా మైనస్గా మారిందని అంటున్నారు. ప్రసంగాల్లో సైకో అని సంభోదిస్తూ గల్లీ లీడర్కంటే దిగజారిపోవటాన్ని ప్రజలు ఎలా సహిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబు తీరుతో నష్టపోతున్నాం ఒకవైపు సీఎం జగన్ ప్రసంగాలు హుందాగా, పద్ధతిగా, ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు, హింసాత్మక వ్యాఖ్యలతో నిండిపోతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు గ్రాఫ్ బాగా పడిపోవడానికి ఆయన దిగజారుడు మాటలే కారణమని టీడీపీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ తన పాలనలో చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు వైఫల్యాలు, పాత మేనిఫెస్టోను చూపించి ఎండగడుతున్నారని, దీనికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు అదే పనిగా నోరు పారేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలను పోల్చి చూపడం, బాబు మోసాలను వివరిస్తున్న విధానం ప్రజల్లోకి బాగా వెళుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండా పోయిందని, దానికి తోడు చంద్రబాబు శ్రేణులను రెచ్చగొడుతున్న తీరుతో తాము రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తింటున్నామని టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల సీనియర్ నాయకుడినని చెప్పుకొనే చంద్రబాబు విజ్ఞత కోల్పోవడం వల్ల ప్రజల్లో బాగా చులకనవుతున్నామని చెబుతున్నారు. -
‘మంగళగిరి’లో టీడీపీ దాష్టీకం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్కు, ఆయన అనుచరులకు ఓటమి భయం పట్టుకోవడంతో వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సీఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయవద్దన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలపై వచ్చినవారు.. ఇక్కడ లోకేశ్ గెలవాలంటూ కేకలు వేశారు. టీడీపీకి, లోకేశ్కు అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ ద్విచక్ర వాహనాలను తిప్పారు. వీరిని పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ క్రమంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బూతులు తిడుతూ ఎన్నిసార్లు చెప్పాలిరా ప్రచారం చేయవద్దని అని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి కలగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మనడంతో అతడిపై దాడిచేశారు. అంతలో మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. వారిలో ఒక యువకుడు మోటారు సైకిల్తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఢీకొట్టాడు. ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు రోడ్డుపై పడిపోయారు. కుంచనపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డిని మరోసారి ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఆయన కిందపడిపోయారు. తలకు తీవ్రంగా గాయమైంది. వచ్చిన ఆరుగురిలో ఇద్దరు యువకులు రోడ్డుపై రక్తపుగాయాలతో ఉన్న మేకా వెంకటరెడ్డిని కాళ్లతో తన్నారు. వెంకటరెడ్డిని కొడుతుంటే ఆపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేసి కొట్టి ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై పారిపోతున్న వారిలో ఒక యువకుడిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుకున్నారు. అది గమనించిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెనక్కివచ్చి పట్టుకున్న వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పట్టుబడిన వ్యక్తి విడిపించుకుని పరారయ్యాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను అడిగి వెంకటరెడ్డి పరిస్థితి తెలుసుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు తెలిపారు. బయటి నుంచి దించారు ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి పలువురిని తీసుకొచ్చారు. కొందరు స్థానికులు, బయట నుంచి వచ్చినవారు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు వచ్చిన ద్విచక్ర వాహనాల్లో ఒకటి ఏపీ 39 ఎఫ్వై 2192 నంబరుతో ఉంది. ఇది విశాఖ అడ్రస్తో ఉందని తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి లోకేశ్ నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయంలో వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగించారని, ఎవరూ ఎక్కడా తగ్గవద్దు.. నేను చూసుకుంటానంటూ చెప్పారని గుర్తుచేశారు. లోకేశ్ అలా మాట్లాడబట్టే ఆ పార్టీ వారు ఇలా దాడులు చేస్తున్నారని చెప్పారు. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
ఆ రాయి ప్రజల గుండెలపై పడినట్లే..
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రం నివ్వెరపోయిందని, ఆయనపై విసిరిన రాయి తెలుగుప్రజల గుండెలపై పడినట్లేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్పై దాడి జరిగి ఆయన నుదిటికి బలమైన గాయం తగిలితే.. ఇది ఎన్నికల ముందు సింపతీ కోసం డ్రామా అని చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ విమర్శించడాన్ని ఖండించారు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ, ప్రజాబలం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఆయనకు సింపతీ అవసరమేంటని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆర్థికంగా దెబ్బతినిపోతామని భావించి చంద్రబాబు వర్గీయులు తమ నాయకుడిపై కక్షగట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం తమకుందని చెప్పారు. కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఆయన్ని హత్యచేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడనేది వాస్తవమన్నారు. చంద్రబాబునాయుడు అధికారం లేకుంటే సహించలేడని, బతకలేడని చెప్పారు. తాను కలలుగనే అధికారం దక్కడం లేదనే కక్షతో, ఈర్షితో కుట్రలు, దారుణాలకు ఒడిగడుతున్నాడని ధ్వజమెత్తారు. హింసను ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నాడన్నారు. ఈసారి తమ నాయకుడిపై రాయిగానీ, మరొకటేదైనా పడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును క్షమించరని చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 గెల్చుకుని అధికారంలోకొచి్చన ప్రజాదరణ గలిగిన తెలుగు నాయకుడు జగన్కు గాయం అయితే తెలుగుప్రజలకు గాయమైనట్లు కాదా.. అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థి మనోహర్ గెలిస్తే తెనాలి సర్వనాశనమేనన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని తిక్కలోడు పవన్కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగాలన్నీ బూతులేనన్నారు. బూతులు మాట్లాడే నేతల్ని పిఠాపురం ప్రజలు శాసనసభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. ఏది నాటకమో, ఏది నిజమో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న పవన్, చంద్రబాబుకు ఎన్నికల కౌంటింగ్ తర్వాత రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. -
టీడీపీ హత్యా రాజకీయాలపై.. ఎగసిన నిరసన
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి తెగబడటాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధులు, అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో జగన్ను ఎదుర్కోలేక.. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనే అక్కసుతోనే సీఎంపై హత్యాయత్నానికి పురిగొలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. ఇందులో భాగంగా.. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో హోంమంత్రి తానేటి వనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే దాడిచేయడం బాధాకరమని మంత్రి అన్నారు. దండకున్న తీగ గుచ్చుకుని గాయమైనట్లు కొంతమంది వక్రీకరిస్తున్నారని.. తీగ గుచ్చుకుని గాయమైతే వెనుకనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎలా గాయమైందని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భీమడోలు మండలం కోడేరుపాడు గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మర్రితిప్ప వద్ద చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు సామర్లకోటలో, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, జగ్గంపేట, తునిలో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. జగన్ను టచ్ చేశారు పుట్టగతులుండవు : మంత్రి ‘కొట్టు’ సీఎం జగన్ని దాడి ద్వారా టచ్ చేశారు, ఈ కుట్రకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఆయన నల్లరిబ్బన్లు ధరించి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పతున్నారన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక సీఎంపై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఆరోపించారు. పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు జగన్పై దాడులు చేయిస్తావా చంద్రబాబూ అని నిలదీశారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంద్రబాబు అంతమొందించాడని, నేడు అదే కోవలో ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జామి మండలంలోని పీతలపాలెంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్యే కళావతి నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. సీఎంపై జరిగిన దాడి అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైనవని కోలగట్ల అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోంపేటలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డిశాంతి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబు కేడర్ను రెచ్చగొడుతున్నారు ఇక సీఎం జగన్పై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత.. సింగరాయకొండలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీమకుర్తిలో మంత్రి మేరుగ నాగార్జున, కంభంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు పదేపదే తన కేడర్ను రెచ్చగొడుతున్నారని, ఇది హేయమైన చర్య అని బాలినేని, ఆదిమూలపు, మేరుగ నాగార్జున ఆరోపించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, అధికార పార్టీ అభ్యర్థులు కరణం వెంకటేష్, పానెం హనిమిరెడ్డి, ఎడం బాలాజీ, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, రేపల్లె అభ్యర్థి ఈవూరి గణేష్లు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఉమ్మడి విశాఖలో ఆగ్రహ జ్వాలలు.. ఉమ్మడి విశాఖ జిల్లా మర్రిపాలెంలో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్, ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎండాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలు చెల్లవని.. ఇలాంటి దాడులను తాము సహించబోమన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా.. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను, తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నియోజకవర్గంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెనమలూరు మండలం గంగూరులో మంత్రి జోగి రమేష్, పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఇక్కడి ప్రస్తుత అభ్యర్ధి షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మచిలీపట్నం పోర్టు ట్రస్టు ఎండీ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర మండలాల్లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేశారు. అలాగే, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో నల్లకండువాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాస్తారోకోలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రొంపిచర్ల, వినుకొండలోనూ ఆందోళనలు చేశారు. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే ఇదిలా ఉంటే.. సీఎంపై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రతిపక్ష పార్టీల కుట్రేనని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే, హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో నల్ల కండువాలు, నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారన్నారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత ఆందోళనలు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ జనాగ్రహం పెల్లుబికింది. ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆధ్వర్యంలో.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోనూ నిరసన ర్యాలీలను నిర్వహించారు. -
తెలుగుదేశందే కుట్ర
ప్రజాదరణ చూసి ఓర్వలేకే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్ర ఉంది. అందుకు టీడీపీ నాయకుడు లోకేశ్ వ్యాఖ్యలే నిదర్శనం. లోకేశ్ ట్విటర్లో 2019లో కోడికత్తి, 2024లో రాయిదాడి అని పెట్టారు. లోకేశ్ వ్యాఖ్యలను గమనిస్తే ఈ హత్యాయత్నం వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది. ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్పై ఈ దారుణానికి పాల్పడ్డారు. సిద్ధం సభలు, బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారు. బస్సుయాత్రకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు కుట్రకు తెరతీశారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కడుపుమంటతోనే దారుణానికి ఒడిగట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఎలాగైనా దాన్ని ఆపాలనే కుట్రతోనే ఈ హత్యాయత్నం చేశారు. కూటమి నేతల సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. కదిలి రా అని ఎంత పిలిచినా జనం కదలడం లేదు. ఇదే సమయంలో వైఎస్ జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కడుపుమంటతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం బాబుకు కొత్త కాదు. – ఎస్బి అంజద్బాషా, ఉప ముఖ్యమంత్రి సీఎం జగన్పై హత్యాయత్నం చేసింది టీడీపీ గూండాలే.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పేందుకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తుంటే చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ గూండాలే ఆయనపై హత్యాయత్నం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని కూటములు కట్టినా ప్రజాగళంçసభలు వెలవెలబోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక నిరాశ, నిస్పృహలతో టీడీపీ గుండాలు ఈ అరాచకానికి పాల్పడ్డారు. ఇటువంటి వాటితో జగన్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. – విశ్వరూప్, రవాణాశాఖ మంత్రి ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి సీఎం జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే పాలకులపై దాడులు చేయించే విషసంస్కృతిని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయి. ప్రజల్లో అత్యంత విశ్వాసం కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి బస్సుయాత్రలో ప్రజలు సంద్రం మాదిరిగా ఆయన వెంట రావడం చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ వస్తువు కొంచెం కిందకు తగిలితే సీఎం జగన్ కన్ను దెబ్బతినేది. దీనిపై విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలి. – చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి హింసను ప్రేరేపిస్తున్న బాబు సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. అబద్ధాలు చెప్పడం, హింసను ప్రేరేపించడం, అధర్మాన్ని పాటించడం ద్వారా మరోసారి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు భ్రమిస్తున్నారు. ఆయన ఇప్పటికీ గుణపాఠాలను నేర్చుకోకపోవడం శోచనీయం. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు తీసుకోవాలి సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్పై టీడీపీ అభిమాని విశాఖ ఎయిర్పోర్టులో కత్తితో దాడిచేశాడు. – వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ ప్రతిపక్షాల ప్రకటనలు దారుణం సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో నిలుస్తూ, ప్రజాభిమానంతో అప్రతిహతంగా సాగుతున్న బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఆయనపై హత్యాయత్నం చేశారు. ఇది రాజకీయ కుట్రే. ఈ హత్యాయత్నంపై ప్రతిపక్షాల ప్రకటనలు దారుణం. అధికారుల వైఫల్యం అనటం అర్థంలేని మాట. సమగ్రంగా విచారించి దోషులను పట్టుకున్న తరువాత వారికి ప్రతిపక్షాలు మద్దతుగా నిలవకుండా ఉండాలి. అప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కావు. – పిల్లి సుభాష్చంద్రబోస్, ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ సీఎం జగన్ జోలికి వస్తే అంతు చూస్తాం పోరాటాలతో పుట్టిన వైఎస్సార్సీపీకి యుద్ధం కొత్త కాదు. ఇటువంటి ఉడత బెదిరింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భయపడరు. జగనన్న జోలికి వస్తే అంతు చూస్తాం. ప్రజాగ్రహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయి. రాజకీయాల్లో సింహలా గర్జిస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగనన్నను చూసి తట్టుకోలేక ఆయనపై టీడీపీ హత్యాయత్నం చేయించింది. నేను తలుచుకుంటే నువ్వు ఏమై పోతావో జగన్.. అంటూ ఇటీవల చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఇదేనేమో. ఇటువంటి దుర్మార్గులకు అధికారం దక్కకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
పథకం ప్రకారమే హత్యాయత్నం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతమొందించడమే లక్ష్యంగా పక్కా పథకం ప్రకారం హత్యాయత్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో క్యాటర్ బాల్ కంటే శక్తివంతమైన ఆయుధాన్ని వాడి ఉండొచ్చన్నారు. గురి తప్పకుండా కాల్చగల షార్ప్ షూటర్లే ఇలాంటి పనులు చేస్తారని చెప్పారు. ఎవరో శక్తివంతమైన వ్యక్తుల మద్దతు లేకుండా ఆగంతకులు ఈ పనిచేయరన్నారు. ఈ దారుణ ఘటనలో అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారని తెలిపారు. తాము అనుకున్నది జరగలేదు కాబట్టే టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంతటి దుర్ఘటనను కూడా ఆ పార్టీ డ్రామాగా కొట్టిపారేయడం దారుణమన్నారు. ఎవరైనా తమ సునిశిత శరీర భాగంలో దాడి చేయించుకుంటారా అని నిలదీశారు. చంద్రబాబును చేయించుకోమనండి చూద్దామన్నారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్పై దాడి చేయాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన పలు ప్రసంగాల వీడియో క్లిప్పులను మీడియాకు ప్రదర్శించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే.. సీఎం జగన్పై దాడిని దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇక్కడ చంద్రబాబు ఖండించినా.. ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు డ్రామా అంటూ హేళన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీళ్లు మనుషులేనా అని అనిపిస్తోంది.. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా ‘రాళ్లతో కొట్టి, ఫ్యాన్ గుర్తు లేకుండా చేయండి.. జగన్ను మసి చేయండి.. టీడీపీ మీతో ఉంటుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి సీఎం జగన్పై ఆయన హత్యాయత్నానికి పురిగొలిపినట్టనిపిస్తోంది. ఇవన్నీ ఎన్నికల సంఘానికి నివేదించి.. దాడులకు పురిగొలిపేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని తక్షణం అడ్డుకోవాలని కోరాం. గతంలో చంద్రబాబు అలిపిరి ఘటనను తానే చేసుకుని, సానుభూతి పొంది ఎన్నికలకు వెళ్లాలని చూశారా?.. నాడు చంద్రబాబు విషయంలో ఇలాంటి చిల్లర మాటలు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు సీఎం జగన్ను అనడానికి నోరెలా వస్తుంది? గతకొద్ది రోజులుగా చంద్రబాబు నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్పై విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్లే విజయవాడ సింగ్నగర్లో సీఎం జగన్పై ‘ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్’ జరిగింది. ఇది రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. అంతా షాక్కు గురయ్యారు. ఆగంతకుడు విసిరిన పదునైన వస్తువు తగిలి సీఎం జగన్కు ఎడమ కనుబొమ పైభాగాన తీవ్ర గాయమైంది. అదే కొంచెం కింద తగిలి ఉంటే కంటి చూపే పోయేది. కణతకు తగిలితే ప్రాణానికే ప్రమాదం జరిగేది. అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారు. బురదజల్లడమే టీడీపీ, జనసేన పని.. ప్రభుత్వంపై టీడీపీ, జనసేన బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే దానికి కూడా వక్రభాష్యం చెబుతున్నాయి. ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజువారీ కార్యకలాపాల నుంచి ప్రభుత్వం దూరం జరిగింది. చంద్రబాబులా మేమెప్పుడూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించి, దబాయించ లేదు. ఇలాంటప్పుడు ఎవరినీ ప్రభావితం చేసి, ప్రలోభపెట్టే అవకాశమే లేదు. రాత్రి 8 గంటల సమయంలో సీఎం జగన్పై హత్యాయత్నం జరిగితే.. గంటన్నర తర్వాత ఫొటోలు బయటకు ఇచ్చాం. ఇది ఆకతాయిల పనికాదని గాయం తీవ్రత చూశాకే తెలిసింది. షార్ప్ షూటర్లతోనే ఇలాంటివి సాధ్యం.. సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి పదునైన వస్తువును చేతితో విసరడం, క్యాటర్ బాల్ వాడటం కంటే మరేదో శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించి ఉండొచ్చు. సీఎంను అంతమొందించే కుట్రతోనే కణతను లక్ష్యంగా చేసుకుని పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. గురి తప్పకుండా కొట్టగలిగే షార్ప్ షూటర్లు మాత్రమే ఇలాంటివి చేయగలరు. దీనికి శక్తివంతమైనవారి మద్దతు ఇవ్వకుండా ఇదంతా సాధ్యపడదు. సింగ్నగర్ ప్రాంతంలో సీఎం జగన్ యాత్ర వెళ్తుందని తెలుసుకుని.. పక్కా ప్రణాళిక ప్రకారం ఓ ప్రైవేటు పాఠశాల వెనుక నక్కిన ఆగంతకులు సీఎం కణతపై గురిపెట్టి పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. సీఎం జగన్ టక్కున తల తిప్పడంతో ప్రాణాపాయం తప్పింది. పదునైన వస్తువు చాలా వేగంగా రావడంతోనే సీఎం ఎడమ కనుబొమ పైభాగాన బలంగా తగిలి.. పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికీ తీవ్ర గాయమైంది. వెలంపల్లి కంటి కార్నియాకు బలంగా తాకడంతో 48 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. ఒక వస్తువు ఇద్దరు వ్యక్తులను బలంగా గాయపరిచిందంటే.. ఎంతటి శక్తివంతమైన ఆయు«దాన్ని ఉపయోగించారో తెలుస్తోంది. ఇవన్నీ దర్యాప్తులో బయటపడతాయి. నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నేతలెవరూ కోరలేదు సీఎం జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఎవరూ కోరట్లేదు. చంద్రబాబు సైతం సీఎం త్వరగా కోలుకోవాలని కాకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సీఎం తన రోడ్షోలో కరెంటు తీయించుకుని ఆయనే చేతులారా ఈ ఘటనకు కారణమయ్యారని టీడీపీ నేతలు అనడం దారుణం. రోడ్షోల్లో చంద్రబాబు బస్సు ఎక్కినా కరెంట్ తీస్తారు.. లేదంటే ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సీఎం జగన్పై హత్యాయత్నాన్ని భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆ విషయాన్ని పోలీసు శాఖ, ప్రభుత్వం చూసుకుంటుంది. చంద్రబాబుపై అలిపిరి ఘటన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘీభావంగా వెళ్లి మౌన దీక్ష చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా విభేదించాలి తప్ప ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదు. కానీ, టీడీపీ వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి దుశ్చర్యలను సీఎం జగన్ ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారు. సోమవారం నుంచి యధావిధిగా బస్సుయాత్ర ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తుంది. ఎన్నికల సంఘానికి, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి ఘటనలో టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం సచివాలయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఐటీడీపీ.. వివేకం సినిమా సీన్లను పోస్టు చేసి దుష్ప్రచారం చేస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో డీజీపీని వైఎస్సార్సీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం, గొడ్డలితో పోస్టులు పెట్టడం, టీడీపీ పాటలు సహా పలు అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలకు టీడీపీ చేస్తున్న ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్లు, బల్క్ మెసేజ్ల గురించి డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సీఎం, వైఎస్సార్సీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయాలని కోరామని తెలిపారు. సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం వెనుక టీడీపీ గూండాల హస్తం ఉందని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా చంద్రబాబు పదేపదే చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు హత్యాయత్నానికి మూలకారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేష్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, రావెల కిశోర్బాబు, మనోహర్రెడ్డి ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిని మింగేసిన బాబు భూదందా
సినిమా క్లైమాక్స్లో విలన్ తన ఆచూకీని హీరోకు చెప్పే ముందు ముప్పుతిప్పలు పెడుతుంటాడు.. ఇక్కడున్నాను.. అబ్బే.. మరోచోట ఉన్నానంటూ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.. చంద్రబాబు తీరు కూడా అచ్చం ఇలానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు ఈ పెద్దమనిషి కూడా రాష్ట్ర ప్రజానీకంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలో ఎక్కువగా నష్టపోయింది బాబు మాయాజాలం తెలియని సామాన్య రియల్టర్లు, ప్రజలే. అదిగో అక్కడే రాజధాని.. అరెరె కాదు కాదు.. దొనకొండ.. అబ్బే అక్కడా కాదు.. నూజివీడు..తూచ్.. అక్కడొద్దన్నారు.. ఏలూరు సమీపంలో పెడుతున్నాం..లేదు నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మేలు.. అక్కడే ఫిక్స్.. ఇలా తన ఎల్లో మీడియాకు రోజుకో లీకు ఇచ్చి కథనాలు రాయించారు.. చివరికి లోపాయికారీగా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బ్రోచర్ సిద్ధం చేసుకుని.. మన రాజధాని ‘అమరావతి’ అంటూ బాంబు పేల్చారు.. బాబు అండ్ గ్యాంగ్, ఆయన వంది మాగధులంతా సూపర్.. డూపర్.. అంటూ కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయసాగారు.. ఇదంతా బాబు అండ్ కోకు మాత్రమే వినోదం. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో వారికి ముందే తెలుసు కనుక, వారు ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల భూములను కొనేశారు. అదీ రూ.2 లక్షల కోట్ల విలువైన భూములపై పచ్చదండు భూ దండయాత్ర చేసింది. చంద్రబాబు కుట్రలు గ్రహించలేని రియల్టర్లు దారుణంగా మోసపోయి, కోట్లకు కోట్లు నష్టపోయారు. కొందరి జీవితాలు విషాదాంతంగా మిగిలాయి. బాబు అండ్ కో మాత్రం తమ పాచిక పారినందుకు.. రూ.లక్షల కోట్ల భూములను చౌకగా కొట్టేయగలిగినందుకు పగలబడి నవ్వుకుంటూ డబ్బులు లెక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రకాలుగా భూ దోపిడీకి పాల్పడవచ్చో ప్రపంచానికి చాటారు. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్టదాఖలు చేశారు. స్విస్ చాలెంజింగ్ విధానం అంటూ ఊడ్చేశారు. సినిమా సెట్టింగుల్లో పేరుగాంచిన దర్శకుడు రాజమౌళిని రప్పించి ఇదిగిదిగో రాజధాని అంటూ గ్రాఫిక్స్తో మాయ చేశారు. మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. రాజధాని విషయంలో నాడు బాబు అండ్ గ్యాంగ్ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా, అశాస్త్రీయంగా వ్యవహరించిందో గుర్తు చేస్తూ ఆ బాగోతాలను రేపటి నుంచి ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్లోని మాదాపూర్ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ? -
ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తథ్యమని స్పష్టం కావడంతో చంద్రబాబు కోటరీ బెంబేలెత్తుతోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త పన్నాగాలు పన్నుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఫోన్ ట్యాపింగ్ కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉన్న చంద్రబాబు తిరిగి అవే ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఐ ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయడం ఆ కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే అసలు ఫోన్లు ట్యాపింగ్ చేసే టెక్నాలజీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల స్పష్టంగా చెప్పింది. అసలు వాస్తవానికి వస్తే డాటా చోరీ, ఫోన్ల ట్యాపింగ్లో చంద్రబాబే సిద్ధహస్తుడు. ఇందుకోసం ఆయన సీఎంగా ఉండగా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ 2019ను కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఇజ్రాయెల్కు చెందిన పెగసస్తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీవీ బృందం ఇజ్రాయెల్లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రత చట్టాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి, వాటిని టీడీపీ కార్యాలయాల్లో పెట్టుకుంది. 35 లక్షల మంది డేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల సమాచారం మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్నకు అనుసంధానించారు. ఇలా రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసన సభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వం చేసిన డేటా చౌర్యంపై విచారణకు శాసన సభ ఉప సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్నకు బదీలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసన సభా ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసన సభకు సమరి్పంచింది. ఐ ఫోన్ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోమ్ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐ ఫోన్లను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపింది. ఆ టెక్నాలజీ కేంద్ర హోం, రక్షణ శాఖల వద్దే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి లోకేశ్ ఐ ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని యాపిల్ కంపెనీ అలెర్ట్ మెస్సేజ్ పంపిందని టీడీపీ అంటోంది. అంటే లోకేశ్ ఫోన్ను ట్యాప్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, బీజేపీనిగానీ ప్రశ్నించే ధైర్యం టీడీపీకి ఉందా? బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆ సమయంలోనే వారిని లోకేశ్ ఫోన్ ట్యాపింగ్పై నిలదీయవచ్చు. చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తారా? లేకపోతే తాము వైఎస్సార్సీపీపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్తారా? చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసన సభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించినా, తిరస్కరించినట్టు వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని ఆమె చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. -
టీడీపీలో కోట్లకు సీట్లు
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కోట్లుకు టికెట్లు’ వ్యవహారం రచ్చకెక్కింది. కోరినన్ని కోట్లిస్తేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు చోట్ల డబ్బు డిపాజిట్ చేస్తేనే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’.. అన్న తరహాలోనే ఇప్పుడూ పెద్ద నేతకు ‘బ్రీఫింగ్’ వెళ్తేనే టికెట్ ఖరారవుతోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీకి విధేయులుగా ఉండే నేతలు సైతం ఈ డబ్బు దందాపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు వేలం పాట పెట్టి మరీ సీట్లు అమ్మేసినట్లు టీడీపీ నేతలు వాపోతున్నారు. వారి ఆవేదన హద్దులు దాటి దాడులు చేసే స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్ సీటును అక్కడి ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్కి ఇవ్వడంపై అనంతపురం టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టి, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను దహనం చేస్తున్నారు. ఈ సీటును లోకేశ్ రూ.30 కోట్లకు అమ్మేసినట్లు పార్టీ నేతలు మీడియాలోనే చెబుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ సీటును కూడా ఇలాగే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఇన్ఛార్జి జితేంద్రగౌడ్కి మొండిచేయి చూపి అప్పటికప్పుడు పార్టీలో చేరిన జయరాంకి ఇచ్చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు, లోకేశ్కి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. దర్శి సీటు స్థానికేతరురాలికి ఇవ్వడం వెనుక ! ఒంగోలు జిల్లా దర్శి సీటును కూడా వేరే ప్రాంతానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. నిజానికి ఈ సీటును చాలాకాలం క్రితమే బేరం పెట్టినా కొనేందుకు ఎవరూ రాలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీటు ఆశించిన డాక్టర్ లక్ష్మి కుటుంబానికి ఆ సీటు కాకుండా దర్శి కేటాయించారు. నిర్దేశించిన రేటు ముట్టజెప్పడంతో స్థానికేతరురాలు అయినా ఆమెకు సీటు ఇచ్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ సీటూ ఇవ్వకూడదనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న భీమిలి సీటు ఇవ్వడం వెనుకా భారీ డీల్ ఉన్నట్లు తెలుస్తోంది. గంటాను విశాఖ నుంచి పూర్తిగా దూరంగా పంపడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అన్నారు. విశాఖ జిల్లాలోనే ఏదో ఒక సీటు కావాలని కోరారు. అందుకు మొదట ఒప్పుకోని చంద్రబాబు.. మొదటి మూడు జాబితాల్లోనూ అవకాశం కల్పించలేదు. ఇక ఆయనకు సీటు రాదనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే గంటా ఇచ్చిన భారీ ఆఫర్కి చంద్రబాబు, లోకేశ్ తలొగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేనకు ఇవ్వాల్సిన భీమిలి సీటును పొత్తులో లేకుండా చేసి మరీ ఆఖరి జాబితాలో గంటాకు కట్టబెట్టారని సమాచారం. ఒంగోలు లోక్సభ సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వడం వెనుకా డబ్బు డీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడాన్నిబట్టి దానికి గట్టి రేటు పెట్టి డబ్బు దండుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అరెస్టయి బెయిల్పై ఉన్న వ్యక్తికి టికెట్టిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇలా అంతకుముందు ప్రకటించిన లోక్సభ సీట్లకు సైతం పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ రేటు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఎంపీ సీట్ల ఖరారు వెనుక వందల కోట్ల డీల్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎంపీ సీటు కోసం రూ.100 నుంచి రూ.200 కోట్ల డీల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పని చేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సీట్లు ఇవ్వడానికి డబ్బు తప్ప మరో కారణం లేదని తెలుస్తోంది. సగానికిపైగా అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. రెండు రకాల డిపాజిట్లు చేస్తేనే కాని సీటు ఖరారు కాలేదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయారు. ఒక డిపాజిట్ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, మరొకటి చినబాబుకు చేశాకే చాలామంది సీట్లు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తే సీట్లతోపాటు తమను కూడా అమ్మేస్తున్నారని వాపోతున్నారు. అందుకే పలుచోట్ల కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారిని బూతులు కూడా తిడుతున్నారు. -
చంద్రబాబు, లోకేష్ దమ్ముంటే గుడివాడలో పోటీ చెయ్యండి: Kodali Nani
-
టీడీపీలో ఆగ్రహ జ్వాల
సాక్షి నెట్వర్క్: టీడీపీలో మూడోవిడత టికెట్ల జాబితాపై ఆపార్టీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టికెట్ మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్ వస్తుందని ఆశపెట్టుకున్నవారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళనబాట పట్టారు. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారి అనుయాయులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మంటల్లో వేసి తగులబెట్టారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన వ్యతిరేక పవనాలు పార్టీ అధిష్టానం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణను కాదని రూ. కోట్లు ముట్టచెప్పినవారికి టికెట్లు ఇచ్చారంటూ టీడీపీలోని సీనియర్ కేడర్ రగిలిపోయింది. పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. ‘తెలుగుదేశం పార్టీ వద్దు.. సైకిల్ గుర్తు అసలొద్దు.. టీడీపీ జెండాలు.. చంద్రబాబు అజెండా మనకొద్దు’ అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలితో లేచారు. ఏ మాత్రం పట్టులేని గొండు శంకర్కు టికెట్ ఇచ్చి, సీనియర్లకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను ధ్వంసం చేసి, మంటల్లో తగలెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని గుండ ఫ్యావిులీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. లేదంటే వైఎస్సార్సీపీలో చేరాలని కోరారు. శుక్రవారం సాయంత్రం తన అనుయాయుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్గా పోటీకి దిగనున్నట్టు మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. అప్పలసూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్గా ఎంపీగా బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. పది కార్లు వేసుకుని, పదిమందిని వెంట బెట్టుకుని, నియోజకవర్గంలో షో చేసిన మామిడిగోవిందరావుకు టికెట్ ఇవ్వడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్ఎన్పేట, కొత్తూరులో కలమటకు మద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. పార్టీ మండలాధ్యక్షులు సైతం రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరుల ఫ్లెక్సీలను మంటల్లో దహనం చేశారు. నిరసన ర్యాలీలు చేసి, కలమట అనుచరులంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంపకృష్ణ రాజీనామా విజయనగరం జిల్లా శృంగవరపుకోట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును ఖరారు చేయడంతో ఇప్పటివరకూ అక్కడి టికెట్కోసం ఎదురుచూసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్గా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు వేపాడ, కొత్తవలస, జామి మండలాల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంపకృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఉన్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును పెయింట్తో చెరిపేశారు. అమలాపురంలో అసంతృప్తి జ్వాలలు అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావును, పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. ఆనందరావుకు సీటు రాకుండా రాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు ఆధ్వర్యంలో పరమట శ్యామ్కుమార్ గట్టి ప్రయత్నం చేశారు. అయినా ఆయనకే టికెట్ కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిలో జనసేన నాయకులు కూడా ఉండటం గమనార్హం. ఆదిమూలంను మార్చాలని డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ప్రకటించడంపై సత్యవేడు, నాగలాపురం మండలాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మదనంబేడులో శుక్రవారం సాయంత్రం పంచాయతీ పరిధిలో తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. ఆదిమూలం టీడీపీ కార్యకర్తలపై చిన్నపాటి గొడవలను భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నాగలాపురంలో కూడా పలువురు తెలుగు తమ్ముళ్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. రగిలిపోతున్న పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశిస్తున్న పోతిన మహేష్ భంగపాటుకు గురయ్యాడు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కంగుతిన్న మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మించి మోసం చేశారని, ఇలాగైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. పురందేశ్వరి కోసం మమ్మల్ని బలి చేస్తారా? విపక్ష కూటమిలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిత్వం కలకలం రేపుతోంది. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు లేకపోవడంపై ఆ వర్గం నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఆయనకు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదుకోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే అదీ దక్కే అవకాశం కనిపించకపోవడంతో ఆ వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని రాజమహేంద్రవరం ఎంపీగా బరిలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతూండటంతో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఎక్కడ ‘పుట్టా’వో మాకెందుకు? ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, టీటీడీ మాజీ చైర్మన్, కడప జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ను ఎంపిక చేయడంపై అక్కడి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టికెట్ ఇస్తామని సింగపూర్లో ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఉపయోగించుకున్నారని, టీడీపీ జెండా మోయటానికే జనాలు ముందుకు రాని సందర్భంలో ఏడాది పాటు కష్టపడి పనిచేశానని ఎన్ఆర్ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ చెప్పారు. తన అసంతృప్తిని వీడియో రూపంలో విడుదల చేశారు. బీసీలంటే యనమల కుటుంబం ఒక్కటేనా, ఆయన కుటుంబంలోనే మూడు టికెట్లు ఇస్తారా, మిగతా వెనకబడిన కులాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా గ్రేట్ అని.. ఆయన ధైర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటానని, తాను ఆయనపై ఏమైనా విమర్శలు చేసి ఉంటే పార్టీ పరంగా తప్ప వేరేగా కాదని వివరించారు. ఈ నెల 25న కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ‘కడప నేత వద్దు– స్ధానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాల’ని పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గాది రాంబాబు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నేతలు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. స్థానిక అశోక్ నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏలూరు టికెట్ విషయంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు పునరాలోచన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్పోస్ట్ సెంటర్లో గోరుముచ్చు గోపాల్ యాదవ్ మద్దతుదారులు శుక్రవారం రాత్రి టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
'మత్తు' చుట్టూ చుట్టాలే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్ (విజయవాడ సెంట్రల్)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు: విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒకపక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతోపాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. కింగ్ పిన్ కోటయ్య చౌదరి.. డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది. పొత్తుతోనే బరితెగింపు.. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఈస్ట్ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రెండు నెలల్లో డ్రగ్స్ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్ కౌన్సిల్కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. కూనం కుటుంబం కథ... విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది. కాకినాడ తీరంలో కలకలం డ్రగ్స్ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. చీరాలకు లింకు? డ్రగ్స్ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ పరీక్ష డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్ను సీజ్ చేశారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే బ్యాగులను సీజ్ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘ఆలపాటి’ ఆర్థిక బంధం విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్ఆర్ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు అరండల్పేట విజయా బ్యాంకు బ్రాంచ్లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు. దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/2021) రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
చీరాల టీడీపీలో నాలుగు స్తంభాలాట
చీరాల: చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. పార్టీ అధిష్టానం ఆశావాహులందరికీ అనేక ఆశలు పెడుతోంది. ఇందులో చంద్రబాబు దగ్గరకు కొందరు వెళ్లి బీసీ కార్డు చూపుతుంటే మరికొందరు మాత్రం సామాజిక సమీకరణాల పేరుతో లోకేష్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రతి ఎన్నికల మాదిరిగానే చీరాల్లో టీడీపీ టికెట్ చివరి వరకు దోబూచులాడుతూనే ఉంది. తండ్రీ, కొడుకులు ఆశావాహులకు గంపెడాశలు పెట్టడంతో చీరాల్లో టీడీపీ మూడు వర్గాలు.. ఆరు ముఠాలుగా మారింది. రెండేళ్ల కిందట నుంచి కందుకూరు ప్రాంతానికి చెందిన ఎంఎం కొండయ్యను చీరాల టీడీపీ ఇన్చార్జిగా నియమించారు. చీరాల టీడీపీ టికెట్ నీకేనని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కొండయ్యను విజయవాడ, హైదరాబాద్ తిప్పుతున్నారే కానీ టికెట్ ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే చేనేతలకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన మునగపాటి బాబు, సజ్జా హేమలత, మంగళగిరికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావులు పట్టుబడుతున్నారు. చీరాల టికెట్ ఇస్తే చేనేతలకే ఇవ్వాలని శుక్రవారం రజనీబాబాతో కలిసి చంద్రబాబును కలిశారు. అయినప్పటికీ వారికి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సర్వేలు, ఆర్థిక బలాలు, కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ కబురు పెడుతామని, టికెట్ ఆశిస్తున్న బీసీ నేతలను తండ్రీ, కొడుకులు వెనక్కి పంపించారు. తల పట్టుకుంటున్న ఆశావహులు.. అయితే అద్దంకికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, తనయుడు కృష్ణచైతన్య వైఎస్సార్ సీపీని వీడి చీరాల టీడీపీ కోసం ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా చీరాలలోని కొంతమంది ప్రముఖులు మాజీ మంత్రి పాలేటిని వెంటబెట్టుకుని కలుస్తున్నారు. దీంతో చీరాల సీటు ఓసీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? బీసీల్లోని చేనేత వర్గానికి ఇస్తారా? అని డోలాయమానంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఓ అధికారి యాదవ సామాజికవర్గానికి సీటు ఇస్తే తనకే కేటాయించాలని చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ మాత్రం చీరాల నుంచి ఎవరూ పోటీ చేస్తారో అనే సందేహంతో నాయకులు, కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికి చీరాల టీడీపీ అభ్యర్థి వ్యవహారంలో చంద్రబాబు మైండ్ గేమ్ ప్రదర్శించడం చీరాల ఆశావాహులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఉంది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. -
తగ్గేదే లే.. తాడోపేడో!
సాక్షి నెట్వర్క్: పొత్తుల కత్తులు తెలుగుదేశం పార్టీని రోడ్డున పడేసింది. చంద్రబాబు, లోకేశ్ డబ్బుకు అమ్ముడు పోయారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసిన వారికి వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు, లోకేశ్పై తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. తన స్వలాభం కోసం పొత్తు అంటూ తమను నట్టేట ముంచారని, డబ్బు సంచులతో వచ్చిన వారికి, పక్క పార్టీలు చెత్త అని పక్కన పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు కట్టబెడతారా? అంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. నమ్మించి గొంతుకోసిన బాబుకు బుద్ధి చెబుతామని, రెబల్గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి పార్టీ జెండాలు పీకేసి నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్లయ్యింది. బుజ్జగింపుల పర్వానికి పిలుపునిచ్చినా.. అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గేది లేదనడంతో బాబుకు గుబులు పట్టుకుంది. స్వయంగా చంద్రబాబు రమ్మని పిలిచినా చాలా మంది ముఖం చాటేశారు. వచ్చినవారు ఎంత బతిమిలాడినా తగ్గేదే లేదని.. తాడేపేడో తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. నేను పోటీ చేయడం ఖాయం! తాను కచ్చితంగా పోటీలో ఉంటానని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించారు. కొవ్వూరులో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది మాటలు విని చంద్రబాబు తనను పక్కన పెట్టారని, పైరవీలు చేసిన వారికి ప్రాధాన్యం కల్పించారని ఆరోపించారు. ప్రజలను, నాయకులను నమ్ముకున్నానని, క్యాడర్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇల్లు అమ్ముకున్నానని, పౌల్ట్రీ వేలానికి వెళ్లిందని, అన్ని రకాలుగా ఆర్థికంగా దెబ్బతిన్నానని చెప్పారు. టీడీపీలో పెత్తందారులదే రాజ్యమని.. జిల్లా నాయకులు కుట్రలు చేసి తప్పు చేయకపోయినా తనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీడీపీ నాయకురాలు పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందంటూ శుక్రవారం వీడియో విడుదల చేశారు. ఎన్నారైలు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎన్నికలయ్యాక వెళ్లిపోతారని చెప్పారు. చంద్రబాబు చుట్టూ బ్రోకర్లే.. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎన్.రాఘవేంద్రరెడ్డిని ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం మంత్రాలయంలో అనుచరులతో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి టైర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి మాట్లాడుతూ చంద్రబాబు చుట్టూ బ్రోకర్లు ఉన్నారని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానన్నారు. కృష్ణాలో ఆరని మంటలు విజయవాడ వెస్ట్ సీటు తనకే ఖరారయ్యిందని జనసేన నేత పోతిన మహేష్ ఇంటింటికి ప్రచారం చేశారు. పోతినకు టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి పవన్ హైదారాబాద్ వెళ్లిపోయారు. దీంతో మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు బోరున విలపించారు. పవన్ తీరుపై పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని మహేష్ హెచ్చరించారు. పెనమలూరు టికెట్ ఇవ్వడం లేదని బోడే ప్రసాద్కు అధిష్టానం చెప్పగా.. చంద్రబాబు పిలుపు మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి కలిశారు. బాబు ఆయనకు సృష్టమైన హామీ ఇవ్వలేదు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా బోడె ప్రసాద్ వెనక్కితగ్గలేదు. నమ్మకున్న వారికి ద్రోహం చేసి పార్టీని ఎలా గెలిపించుకుంటారని చంద్రబాబును ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. సీటు లేదు.. ఓటు వేయండంటూ యనమలకుదురు నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరం టీడీపీ ఇన్చార్జి దేవినేని ఉమాను గురువారం రాత్రి కూడ బాబు పిలిపించినట్లు సమాచారం. వసంతకు సహకరించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన రగిలిపోతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పిలుపునకు పలకని వర్మ పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో అక్కడి టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తన నివాసానికి రావాలని పిలిచినా ముఖం చాటేశారు. తనను బుజ్జగించే కంటే సీటు ఇస్తేనే పరిస్థితి సద్దుమణుగుతుందని వర్మ గట్టిగా చెప్పారు. సీటు దక్కక పోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి తన సత్తా చూపిస్తానని సవాల్ విసిరారు. పెదకూరపాడులో గెలుపు ఎలా సాధ్యం? పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్కు కేటాయించగా.. అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను ఎలాగైన ఒప్పించి, ప్రవీణ్కు సహకరించేలా ఆయనను చంద్రబాబు దగ్గర తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. అసలు గెలుపు ఎలా సాధ్యమని శ్రీధర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరుకూడా రెండో జాబితాలో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. చంద్రబాబు బుజ్జగించి..చీపురుపల్లి వెళ్లాలని సూచించినప్పటికీ అంగీకరించలేదని సమాచారం. నమ్మించి గొంతు కోశారు కష్టకాలంలో పార్టీని, కేడర్ను కాపాడుకుంటూ వచ్చానని, అయినా తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్రెడ్డి అన్నారు. కొడవలూరులో ఆత్మీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించి చివరికి నడిబజారులో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దినేష్రెడ్డి ఇండిపెండెంట్గా పోటీచేయాలని కార్యకర్తలు కోరారు. యాదవులపై చిన్నచూపు పుంగనూరు నుంచి తానే పోటీలో ఉంటానని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆశించగా.. టీడీపీ నాయకుడు చల్లా రామచంద్రారెడ్డినే ఖరారు చేయటంతో యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి టికెట్ ఈ సారి బీసీలకు కేటాయించాలని మస్తాన్ యాదవ్, మరి కొందరు చేనేత కార్మికులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండో భార్య కుమార్తె లక్ష్మీసాయి ప్రియ పేరును ప్రకటించటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన వారంతా రగిలిపోతున్నారు. డాలర్ దివాకర్రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేయాలని కొంత కాలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో హంగామా చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పులివర్తి నానికి కేటాయించటంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏలూరు బీజేపీలో ముసలం ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరికి షాకివ్వడంతో ఆయన అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం ఏలూరు మినీ బైపాస్లోని క్రాంతి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వలస పక్షుల మాదిరిగా రాబందులు డబ్బు సంచులతో వాలిపోతారని, గెలిస్తే ఢిల్లీలో ఉంటారని, లేకపోతే అడ్రస్ ఉండరని ఘాటుగా విమర్శించారు. ఆరు నూరైనా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. చోడవరంలో జనసేన ఆగ్రహ జ్వాల చోడవరం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జనసేన సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐదేళ్లుగా అనేక ఉద్యమాలు చేశామని, తమకు కాకుండా టీడీపీకి ఎలా కేటాయిస్తారని సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ అభ్యర్థికి పనిచేయడానికి జనసేన సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. జనసేన నేతలకు అవమానం చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించారు. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా.. పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే చిత్తూరు నుంచి చీరలు, గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారని జనసేన నేత కిరణ్రాయల్ పార్టీ అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఆరణికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు. పార్టీ పదవులకు పరుచూరి రాజీనామా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పరుచూరి భాస్కరరావు చెప్పారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే పవన్కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కొత్తగా వచ్చిన కొణతాలకు టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. వంతలకు భంగపాటు రంపచోడవరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. వారికి భంగపాటు ఎదురైంది. బాబును కలిసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని ధ్వజమెత్తారు. నలుగురికి చంద్రబాబును కలిసే అవకాశం రాగా.. శిరీష భర్త మఠం భాస్కర్పై వారు ఫిర్యాదు చేశారు. రెబల్గా పోటీ చేస్తా! ‘చంద్రబాబు గారు.. మేం చేసిన పాపం ఏమిటి? భార్య బిడ్డలను వదిలి పార్టీ కోసం కష్టపడి పనిచేశా. సత్యవేడు సీటు ఎందుకు ఇవ్వలేదు. ఆదిమూలం చెత్త అని వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఆ చెత్తను మనం ఎందుకు నెత్తిన వేసుకోవాలి. నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. కోనేటి ఆదిమూలాన్ని ఓడించి తీరుతాను’ అని సత్యవేడు టీడీపీ మాజీ ఇన్చార్జి జేడీ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. జేడీ రాజశేఖరరెడ్డి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2019 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలుపొందాక.. కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. తాను వ్యాపారం చేసుకునేదానిని, టీడీపీ గెలుపు కోసం అన్నీ వదిలేసి కష్టపడి పనిచేశాని జేడీఆర్ కుమార్తె మౌనిక కన్నీరు మున్నీరైంది. సత్యవేడు సీటు కోసం నాలుగేళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ మనస్తాపంతో నివాసానికే పరిమితమయ్యారు. ఎంపీ ఇంటి ముందు అర్ధనగ్న ప్రదర్శన శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఎంపీ రామ్మోహన్నాయుడు ఇంటి ముందు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఇంటి గేటు ముందు బైఠాయించడంతో పాటు కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లక్ష్మీదేవి అభ్యర్థిత్వం ఖరారు కాకపోతే ఎంపీ రామ్మోహన్నాయుడు గెలవరంటూ నినాదాలు చేశారు. విజయవాడ వెళ్లి పరిస్థితులను చంద్రబాబుకు వివరిస్తానని రామ్మోహన్నాయుడు తెలిపారు. అమలాపురంలో నువ్వా.. నేనా అమలాపురం అసెంబ్లీ స్థానంపై సర్వేలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ చేశారు. మధ్యాహ్నం నుంచి సీన్ మారింది. మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరావు కుమార్తె పాము సత్యశ్రీ అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే మొదలైంది. ఒకే రోజు ఇద్దరి పేర్లపై సర్వేతో పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంది. మరోవైపు జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్లు తమకే టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడం జనసేనలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వారు అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఆందోళనకు దిగారు. అమలాపురం సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని, లేకుంటే పొత్తు పక్కన పెట్టి టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్బాబుకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్కుమార్రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
కొడుకు కళ్లెదుటే తండ్రి ఉరేసుకుని
కౌడిపల్లి (నర్సాపూర్): ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాలుగేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్(34), అతని తల్లి లలిత వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. నవీన్ భార్య.. కుమారుడు లోకేష్ పుట్టిన తర్వాత వీరికి దూరంగా వెళ్లిపోయింది. కాగా, ఇటీవల లలిత కాలుకు గాయమై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొలుత మెదక్లో వైద్యం చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో వైద్యులు.. గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని, తొలగించాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో నవీన్ అప్పులు చేశాడు. దీంతో రోజురోజుకూ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉదయం నవీన్ తన కొడుకు లోకేష్తో కలిసి చింతకాయలు తెంపుకొద్దామని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో కొడుకు చూస్తుండగానే.. చింతచెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఏడుస్తుండటంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘సిద్ధం’కాని సైకిల్
సాక్షి, అమరావతి: ఒకవైపు ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి మొదటి దశను దిగ్విజయంగా పూర్తి చేసే దశలో ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా ఆ ఘట్టాన్ని ప్రారంభించలేక సతమతమవుతున్నారు. సీట్ల ఖరారు నుంచి, ఎన్నికల సన్నాహక సభల వరకు ఏ విషయంలోనూ ఆయన అధికార పార్టీకి కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడుతున్నారు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేననే భయంతో ఇంకా పొత్తుల కోసం పాకులాడుతుండడం ఆయన బేలతనాన్ని స్పష్టం చేస్తోంది. ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారో తెలియక, అసలు పోటీ చేసే స్థానాలు ఏవో అర్థంకాక టీడీపీ నేతలు క్షేత్ర స్థాయిలో తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నా ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేకపోవడం కచ్చితంగా వెనుకబాటేనని, వైఫల్యానికి ఇది నాంది అని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులు దొరక్క సతమతం అభ్యర్థుల ఎంపిక కోసం తాను ఇంతగా ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు దొరక్క ఇతర పార్టీల నేతలు, ఎన్ఆర్ఐలు, పారిశ్రాకవేత్తల వైపు ఆశగా చూస్తుండడం టీడీపీ దీన స్థితిని తెలియజేస్తోంది. వైఎస్సార్ సీసీ వరుసగా అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నా టీడీపీ అభ్యర్థుల జాబితాలపై చర్చ కూడా లేక క్యాడర్ నీరుగారిపోవడంతో అప్పటికప్పుడు జనసేనతో కలిసి తొలి జాబితా చంద్రబాబు విడుదల చేశారు. దానిపైనా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో టీడీపీ మరింత ఇరకాటంలో పడింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవడాన్ని టీడీపీ నాయకులు జీరి్ణంచుకోలేక రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. ఈ కారణంతోపాటు క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోవడంతో పలువురు సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో వారి నుంచి తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు వారిని బుజ్జగించలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయడం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూస్తుండడం, ఆ పార్టీ ఏ విషయాన్ని ఇంకా తేల్చకపోవడంతో టీడీపీలో అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ పొత్తు కోసం కీలకమైన ఎంపీ స్థానాలు, పలు ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముక్కీమూలిగి ఎలాగోలా కొందరు ధనబలం ఉన్న అభ్యర్థులను పట్టుకున్నా బీజేపీతో పొత్తు తేలకపోవడంతో ఏ విషయాన్ని తేల్చలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ ఆందోళనలో మునిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా పొత్తులు కొలిక్కి రాకపోవడం, అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. సభలు విఫలంతో విలవిల మరోవైపు ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహించిన సభల వైఫల్యం టీడీపీ వాస్తవ బలాన్ని తేటతెల్లం చేసింది. ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక సభ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినా దాన్ని అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సభకూ జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో చంద్రబాబు అక్కడి నేతలపై రుసరుసలాడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. 20కిపైగా నిర్వహించిన సభల్లో చంద్రబాబుకు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి. కేవలం టీడీపీ మాత్రమే సభ పెడితే జనం రావడంలేదని జనసేనతో కలిసి ఇటీవల తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన కేతన జెండా’ పేరుతో ఉమ్మడి సభ నిర్వహించారు. కానీ ఆ సభనూ జనం పట్టించుకోలేదు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో నిర్వహించిన యాత్ర టీడీపీ గాలిని పూర్తిగా తీసివేసింది. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవుతున్నా టీడీపీ, జనసేన సభలు విఫలమవడం క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. వీటన్నింటి కంటే ముందు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోనూ జనం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల పేర్లనే మార్చి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి అభాసుపాలయ్యారు. ఈ పరిస్థితుల్లోనూ జనం నమ్మడం లేదని అర్థమై బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అయినా రేసులో నిలబడి పోటీ ఇవ్వవచ్చనే ఉద్దేశంతో చేస్తున్న యత్నాలు ఫలితాన్ని ఇవ్వడంలేదు. వరుస వైఫల్యాలతో ఎన్నికలకు సిద్ధంగా లేని చంద్రబాబు దు్రష్పచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా అండతో వైఎస్ జగన్పై కనీవినీ ఎరుగని రీతిలో అబద్ధాలు, విష ప్రచారాలకు దిగారు. తాను అధికారంలో లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం నాశమైనపోయిందనే రీతిలో తన మేనేజ్మెంట్ నైపుణ్యంతో ప్రచారం చేస్తున్నా జనానికి మాత్రం వాస్తవం కళ్లెదుటే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేక తన పాతకాలపు వ్యూహాలను నూరుతూనే ఉన్నారు. -
బాబు, లోకేష్, పవన్ ల అబద్దాలు వినాల్సిన అవసరం లేదు: ఎంపీ మోపిదేవి
-
Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?
కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు. రాజ్యసభలో సైకిల్ మాయం రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది. పొత్తులుంటాయి.. కానీ..! కరకట్ట మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. (వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు) ఇంకా మారని తీరు చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది. లోకేష్తో లాభమా? నష్టమా? ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం. పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.? బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. -
మోదీ, షా కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ఈ దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి చంద్రబాబు. మోదీని తిట్టి, నల్ల జెండాలు ఎగురవేశాడు. మళ్ళీ ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. మోదీని దేశంలో లేకుండా చేస్తానని చంద్రబాబు గతంలో అన్నాడు. అమిత్ షాపై తిరుమలలో చంద్రబాబు రాళ్లు వేయించాడు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి తన కొడుకు లోకేష్ను పంపాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే నష్టం’ అని రోజా దుయ్యబట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్ జగన్.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement