-
గట్ బ్యాక్టీరియా VS వ్యాయామం
-
హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నా
జహీరాబాద్: ‘హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నాను..’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఓ ఆలుగడ్డ రైతుకు ఫోన్ చేసి పంట గురించి ఆరా తీశారు. సం గారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్రెడ్డికి శనివారం సీఎం ఫోన్ చేశారు. నాలుగున్నర నిమిషాలపాటు సంభాషించారు. సంభాషణ సాగిందిలా.. సీఎం: మీ ప్రాంతంలో ఈ ఏడాది ఆలుగడ్డ సాగు ఎలా ఉంది? రైతు: పంట సాగు ఆశాజనకంగా ఉంది సర్.. సాగు విస్తీర్ణమేమీ తగ్గలేదు. సీఎం: ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు? రైతు: జహీరాబాద్ ప్రాంతంలో 166 రకం సాగు చేస్తారు. దీన్ని కుఫ్రీగా పిలుస్తారు. జ్యోతి, ఖ్యాతి రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ ప్రాంతంలో సాగు చేయడం లేదు. సీఎం: ఒక మొక్క బాగుంటే ఎన్ని గడ్డలు ఉంటాయి? రైతు: 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి. సీఎం: ఇంతమేర గడ్డలుంటే పంట దిగుబడి బాగా వచ్చినట్లా? రైతు: అవును సార్ సీఎం: ఎంత బరువు తూగుతుంది? రైతు: కిలో మేర తూగుతుంది. సీఎం: ఎకరాకు ఎన్ని బస్తాల విత్తనం ఉపయోగిస్తారు? రైతు: 15 నుంచి 16 బస్తాలు వాడుతాం. పంటను బెడ్ విధానంలో వేశాం. పంట వేసి 45 రోజుల వరకు అయింది. సీఎం: నేను 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశా. పంట బాగుంది. రైతు: ఎకరాకు 12 నుంచి 15 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ఒక బస్తా విత్తనానికి 16 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుంది. సీఎం: మార్కెట్లో ఆలుగడ్డ పంటకు ధర ఎలా ఉంది? రైతు: ప్రస్తుతం ధర తగ్గింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.2,000 మేర ధర పలుకుతోంది. కోహీర్ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నందున పంట ఎరుపురంగులో వస్తుంది. దీనికి ధర తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో వచ్చే పంట తెలుపు రంగులో ఉండటంతో ధర కొంత ఎక్కువ ఉంటుంది. సీఎం: ఎన్ని రోజుల్లో పంటను తీస్తారు? రైతు: 85 రోజుల్లో పంట చేతికొస్తుంది. పక్షం రోజుల ముందు నుంచే నీటి తడులు ఇవ్వడాన్ని నిలిపివేస్తాం. సీఎం: నేను ఇంకా పంట తీయలేదు. పంట తీసే సమయంలో పిలిపిస్తా. రైతు: సరే సార్.. నాలుగైదు మందిమి వస్తాం. సీఎం: థ్యాంక్యూ ఇదిలా ఉంటే, నాలుగు నెలల క్రితం రైతు నాగేశ్వర్రెడ్డితోపాటు మరో నలుగురు రైతులు సీఎం ఆహ్వానం మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లారు. వారితో సీఎం సుమారు ఆరు గంటల పాటు పంటల సాగు గురించి చర్చించిన విషయం తెలిసిందే. -
పోలీసుల ఆకస్మిక దాడి.. క్రికెట్ బుకీల అరెస్ట్
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో క్రికెట్ బుకీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలివీ.. కడప బాలాజీ నగర్లోని ఓ ఇళ్లు కేంద్రంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.14.11 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నామని సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వివరించారు. -
ఫుల్ ఎనర్జీ కథతో...
మంచు విష్ణు హీరోగా ‘దేనికైనా రెడీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. నాగేశ్వరరెడ్డి, ఆ తర్వాత మనోజ్ హీరోగా ‘కరెంట్ తీగ’ వంటి విజయాన్ని అందించారు. వరుసగా అన్నదమ్ములిద్దరితో రెండు విజయవంతమైన చిత్రాలు చేసిన నాగేశ్వరరెడ్డి మళ్లీ మనోజ్తో ఓ సినిమా చేయనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుస విజయాలు అందిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యాక్షన్, కామెడీ కలగలసిన కథాంశంతో సాగే ఈ చిత్రంలో మనోజ్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వినూత్న తరహా కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనీ, మనోజ్ ఎనర్జీ లెవల్స్కి తగ్గ కథ అనీ నిర్మాత తెలిపారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మూడంచెల పటిష్ట భద్రత
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్కు ఎంపిక
సింగరేణి ఎక్స్టర్నల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ
అమ్మో ఇవేం పరీక్షలు..?
ప్రభుత్వాస్పత్రిలో ఇంటి దొంగలు..!
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ప్లాంటేషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
తప్పక చదవండి
- ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement