-
World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్తో జాగ్రత్త!
ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది. సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్గా నిలిచింది. ► సైబర్ ట్రాఫికింగ్లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది. సైబర్ ఫేక్... ► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు. ► సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి. ► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం. ► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. ► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డిజిటల్ వేగం వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది. అప్రమత్తతే అడ్డుకట్ట ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్లైన్లో బహిరంగ పరచకూడదు. ఆన్లైన్ అగ్రిమెంట్లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు. – అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్వేర్ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్వేర్ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
15 నిమిషాల ఛార్జ్తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్లోని గీలీ హోల్డింగ్ గ్రూప్కు చెందిన బ్యాటరీ ప్లాంట్లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
రంగంలోకి గూగూల్ ఏఐ ‘జెమినీ’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో టెక్ దిగ్గజం గూగుల్ కొత్త శకానికి నాంది పలికింది. 'గూగుల్ జెమిని' (Google Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఈ కొత్త ఏఐ ఎన్ని వేరియంట్లలో ఉంటుంది, దీని వల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ జెమిని అనేది టెక్ట్స్, ఫోటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలుస్తోంది. ఇది డేటా సెంటర్లలో, కార్పొరేట్ అవసరాలకు మాత్రమే కాకుండా మొబైల్ డివైజ్లలో కూడా పనిచేస్తుందని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) వెల్లడించారు. గూగుల్ జెమిని ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రోమ్ బ్రౌసర్ వంటి అన్ని గూగుల్ సర్వీసుల్లో ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వేరియంట్స్ గూగుల్ జెమిని మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి జెమిని నానో, జెమిని ప్రో, జెమిని అల్ట్రా వేరియంట్లు. జెమిని నానో జెమిని నానో అనేది మొబైల్ డివైజ్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ టెక్నాలజీ. ఇది గూగుల్ పిక్సెల్ 8 ఫోన్కు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ 4 వెర్షన్లో కూడా పనిచేస్తుంది. జెమిని నానో డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా చాట్, మెసేజింగ్ యూప్లు ఆఫ్లైన్లో కూడా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జెమిని ప్రో గూగుల్ బార్డ్ ఏఐకు జెమిని ప్రో అనేది అడ్వాన్స్డ్ వె ర్షన్. ఇది వేగవంతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఇది కూడా డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. జెమినీ అల్ట్రా గూగుల్ కొత్త ఏఐ టెక్నాలజీలో జెమిని అల్ట్రా అనేది శక్తివంతమైన వెర్షన్. ఇది కార్పొరేట్ సంస్థల అవసరాలకు కూడా ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. పైథాన్, జావా వంటి అనేక ప్రోగ్రామింగ్ భాషలను అర్థం చేసుకుని కావలసిన రిజల్ట్ అందిస్తుంది. ఇది 2024 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Everything you need to know about Gemini — Google’s largest and most capable AI model — in just 90 seconds. #GeminiAI pic.twitter.com/b7j08bV0YN — Google (@Google) December 7, 2023 గూగుల్ జెమిని స్పెషాలిటీ గూగుల్ జెమిని కేవలం కమర్షియల వినియోగాలకు మాత్రమే కాకుండా.. విద్యార్థులు హోంవర్క్ విషయంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్ హోంవర్క్ను ఫోటో తీసి జెమిని ఏఐలో అప్లోడ్ చేస్తే ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా గూగుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం!
Sweden Electrified Road: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఎదురవుతున్న ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా కొందరు ఫ్యూయల్ వాహనాలనే ఎంచుకుంటున్నారు. భారతదేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు రంగంలోకి దిగి, సంబంధిత సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే స్వీడన్ ఈ సమస్యకు కొత్త టెక్నాలజీతో చెక్ పెద్దటానికి సిద్ధమైంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ వేసుకుంటూ ఉండాలి, ఛార్జింగ్ తగ్గితే గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ముందుగానే ఫుల్ ఛార్జింగ్ చేసుకుని, దాని రేంజ్ ఎంతో.. అంత దూరం ప్రయాణించడానికి ప్లాన్ వేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్లాలంటే మళ్ళీ ఛార్జింగ్ వేసుకోక తప్పదు. తద్వారా ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ఇప్పుడు స్వీడన్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎలక్ట్రిఫైడ్ రోడ్స్' నిర్మిస్తోంది. వీటి ద్వారా కారు నడుస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడే ఛార్జ్ చేసుకోగలదు. ఛార్జింగ్ వేసుకోవడానికి ప్యత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. దీని కోసం సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టివ్ కాయిల్స్తో 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన జాతీయ రహదారి స్వీడన్ ప్రధాన నగరాలైన స్టాక్హోమ్, గోథెన్బర్గ్, మాల్మో మధ్యలో నిర్మితమవుతోంది. ఇది 2025 నాటికి వినియోగంలో రానున్నట్లు సమాచారం. -
స్కిల్ పెంచండి బాబులూ..!
స్కిల్స్ పలు రకాలు.. ఏ ‘స్కిల్’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్ చూడండి సరదాగా... సేల్స్.. స్కిల్ ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది ఆసక్తిగా అనిపించి ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు. ‘మూడువేల రూపాయలు. కానీ, నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు ‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు కాస్త రోషంతో. ‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి ‘‘ఏమిటా షరతు?’’ ‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’ ‘‘ఓకే ప్రామిస్!.. నేను ధైర్యవంతుడినే అయినా, చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్ థ్రిల్లర్ బుక్ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. చివరి పేజీ ఎందుకు చదవ వద్దన్నాడా పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని బాధ ఏముంటది? అని మనవాడికి డౌట్ వచ్చింది. చదువుదామని మనసు పీకింది. కాస్త భయం వేసింది. ప్రామిస్ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’ ఇదీ సేల్స్ స్కిల్... అంతే కదా? ... ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మేడిన్ ఇండియా! ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది. కొన్ని కవర్లు ప్యాక్ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్రే మెషీన్ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది. ఈ విషయం హైదరాబాద్ సబ్బుల కంపెనీలో మీటింగ్లో ప్రస్తావనకు వచ్చింది. ఆ అమెరికా కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్లో చాయ్ బిస్కట్ ఎంజాయ్ చేస్తున్న మనోడు లేచి,‘‘ఎందుకు సర్ 6 కోట్లు తగలేశారు. ఓ 3వేలు పెట్టి ‘పెడెస్టెల్ ఫ్యాన్’ కొని స్పీడ్గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి మళ్లీ చాయ్ బిస్కట్ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. – ఇదీ ఓ రకమైన జాబ్ స్కిల్లే కదా! నో స్కిల్... 81 పర్సెంట్... ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్పుట్ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట. ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్ స్కిల్స్లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి. – ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. – అప్లికేషన్ డెవలపర్లు, పవర్ యూజర్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది. స్కిల్ ఉంటేనే జాబులు... – సర్వేలో పాల్గొన్న చాలా సంస్థలు డెవలపర్, పవర్ యూజర్ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి. ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి. స్కిల్స్ పెంచేద్దాం... ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోనూ అంతే.. భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి వాటిని భారత్లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. సరికొండ చలపతి -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా?
సాక్షి, అమరావతి: ‘కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నట్టు తనకు గిట్టని ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడంలో, విష ప్రచారం చేయడంలో ఈనాడు రామోజీరావుది కూడా ఇదే తీరు. ఇందులో భాగంగానే బుధవారం తన విష పుత్రిక ‘ఈనాడు’లో ‘ఉచిత సాఫ్ట్వేర్ మాకొద్దు.. రూ.34 కోట్లిచ్చి కొంటాం’ అనే శీర్షికతో ఒక తప్పుడు కథనం వండివార్చారు. మారుతున్న ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతున్నా రామోజీ ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు సరికొత్తగా అత్యాధునిక సేవలు అందించడం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పాత టెక్నాలజీకి స్వస్తి పలకడం ‘ఈనాడు’కు కంటగింపుగా మారింది. కొత్త టెక్నాలజీ ముందుకు వస్తుంటే పాత టెక్నాలజీని వదిలించుకోవడం ఎక్కడైనా జరిగే సర్వ సాధారణమైన విషయం. అయితే ఇది ఘోర తప్పిదంలాగా కళ్ల నిండా పచ్చవిషం నింపుకున్న రామోజీరావుకు కనిపించింది. అందుకే ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారకుండా... కేంద్రం ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తోంది కాబట్టి దాన్నే వాడాలంటూ ఈనాడు తన కథనంలో వితండ వాదానికి దిగింది. అప్గ్రేడ్ చేసే స్థాయి వనరులు తనకు లేవన్న ఎన్ఐసీ 1999 నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ ఆధారిత సేవలు అందిస్తోంది. అప్పటి అవసరాలకనుగుణంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ).. సీఏఆర్డీ (కార్డ్) అప్లికేషన్ను రూపొందించినా ఆ తర్వాత ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోయింది. అప్పట్లో సంవత్సరానికి కేవలం 2 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు మాత్రమే ఈ అప్లికేషన్ను రూపొందించారు. ప్రస్తుతం ఏటా 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసే సామర్థ్యం లేక రెండు దశాబ్దాల నాటి కార్డ్ సాఫ్ట్వేర్ చతికిలపడింది. సర్వర్లు మొరాయించడం, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడడాన్ని ఈనాడు పలుసార్లు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులను తప్పించడానికి కార్డ్ అప్లికేషన్ను అప్గ్రేడ్ చేయడం అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కార్డ్ను కార్డ్ ++ గా అప్గ్రేడ్ చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్ఐసీ 2017లో అందుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం దాని అమలుకు రూ.13.14 కోట్లను మంజూరు చేసింది. ఆ అప్లికేషన్ కోసం రూ.11.82 కోట్లను ఎన్ఐసీ ఢిల్లీకి చెల్లించింది. డబ్బు తీసుకున్నా టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడంలో ఎన్ఐసీ విఫలమైంది. అనేకసార్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఎన్ఐసీతో చర్చలు జరిపినా తమకు ఆ స్థాయి వనరులు లేవని చెబుతూ వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ల సేవల్లో తరచూ అంతరాయాలు, ఇబ్బందులు తలెత్తేవి. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 వేల సచివాలయాల్లో ఆ సేవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కార్డ్ అప్లికేషన్ను అవసరాలకు తగ్గట్టు అత్యవసరంగా ఆధునికీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్డ్ ++ అప్లికేషన్ను అప్గ్రేడ్ చేయలేకపోయిన ఎన్ఐసీకి తాము ఇచ్చిన సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలని, కొత్త టెక్నాలజీ పార్టనర్ను చూసుకుంటామని రిజిస్ట్రేషన్ల శాఖ ఆ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఎన్ఐసీ రూ.6.20 కోట్లు వెనక్కి ఇచ్చేసింది. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ.. ఎన్ఐసీ చేతులెత్తేయడంతో గతేడాది రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీజీఎస్ ద్వారా కొత్త టెక్నాలజీ పార్ట్నర్ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో ఐదు కంపెనీలు పాల్గొన్నాయి. రూ.33.99 కోట్లతో ఎల్–1గా నిలిచిన క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ కొత్త పార్ట్నర్గా ఎంపికైంది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రైమ్ కార్డ్ అప్లికేషన్ను ఆ కంపెనీ రూపొందించింది. ప్రజలకు ఇబ్బందులు తప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని అభినందించాల్సింది పోయి తనకలవాటైన రీతిలోనే ‘ఈనాడు’ విషం చిమ్మింది. కేంద్రం ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తానంటే వద్దని ప్రభుత్వం రూ.34 కోట్లతో తమకు కావాల్సిన వారికి ఆ కాంట్రాక్టు ఇచ్చిందని అడ్డగోలు అబద్ధాలను తన కథనంలో వండివార్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలనే ఉద్దేశంతో ఎన్జీడీఆర్ఎస్ సాఫ్ట్వేర్ను కేంద్రం 2012లో తెచ్చింది. అప్పటికి 14 ఏళ్లకు ముందే మన రాష్ట్రంలో కార్డ్ అప్లికేషన్ ద్వారా అంతకుమించిన ఐటీ ఆధారిత రిజిస్ట్రేషన్ సేవలు అమలవుతున్నాయి. కేంద్రం ఇచ్చిన సాఫ్ట్వేర్ను ఉచితంగా తీసుకుంటే మళ్లీ మనం పాత టెక్నాలజీనే వాడాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజీ అప్పటికి ఐటీ సేవలు ప్రారంభించని రాష్ట్రాలకు ఉపయోగం తప్ప అప్పటికే టెక్నాలజీ సేవల్లో ముందున్న మన రాష్ట్రానికి కాదు. ఈ విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్రానికి చెప్పి తాము ఇంకా ఆధునిక టెక్నాలజీలోకి వెళుతున్నట్లు చెప్పగా అంగీకరించింది. కానీ ‘ఈనాడు’ మాత్రం పాత టెక్నాలజీనే వాడాలంటూ వింత వాదనలు చేస్తోంది. కొత్త టెక్నాలజీ ద్వారా అత్యాధునిక సేవలు.. రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా తెచ్చిన ప్రైమ్ కార్డ్ అప్లికేషన్ అత్యాధునిక టెక్నాలజీతో అన్ని అవసరాలను తీర్చేలా పనిచేస్తుంది. దీనిద్వారా త్వరలో ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందించబోతున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను ఆన్లైన్లో తామే తయారు చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. రెవెన్యూ, మున్సిపల్ శాఖల డేటాబేస్లకు అనుసంధానమై అత్యంత కీలకమైన ఆటోమ్యుటేషన్ విధానాన్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారానే అందుబాటులోకి తేనున్నారు. ఈ–సైన్, ప్రైమ్ మొబైల్ యాప్ల ద్వారా సరికొత్త రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ముంగిటకు రానున్నాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ చెల్లింపులు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నింట్లోనూ ఈ కొత్త టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలన్నింటినీ ఎన్జీడీఆర్ఎస్ సాఫ్ట్వేర్ ద్వారా, ఎన్ఐసీ పాత సాఫ్ట్వేర్తో చేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఆధునిక అవసరాలకు తగ్గట్టు ఈ సేవలన్నీ అందించేలా ప్రైమ్ కార్డ్ టెక్నాలజీని నడిపే సామర్థ్యం ఉండడం వల్లే క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ కంపెనీని టెక్నాలజీ పార్ట్నర్గా ఎంపిక చేశారు. ఇది ఈనాడుకు మింగుడుపడకే తన కథనంలో దుష్ప్రచారానికి దిగింది. -
పాఠశాల విద్యలో ఏఐ టెక్నాలజీతో పక్కాగా వివరాలు
-
రోబోటిక్స్పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్రంజన్ పేర్కొన్నారు. నానక్రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
భయపడుతున్న ఫోన్పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..
UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫోన్పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే? పేటీఎమ్, రేజర్పే, జస్పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ప్రస్తుతం ఫోన్పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
యంగ్ కమల్.. ఓ టెక్నిక్
పాతికేళ్ల క్రితం కమల్హాసన్ వయసుకు మించి కనిపించిన పాత్రల్లో ‘ఇండియన్’లో సేనాపతి, ‘భామనే సత్యభామనే’లో వృద్ధురాలి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఆరు పదుల వయసుకి మించి కమల్ కనిపించిన పాత్రలివి. ఇప్పుడు ఇంకో ఏడాదికి కమల్ ఏడు పదుల వయసుని టచ్ చేస్తున్న నేపథ్యంలో యువకుడిలా కనిపించాల్సి వస్తోంది. ‘ఇండియన్’లో కమల్ని యంగ్ అండ్ ఓల్డ్ పాత్రల్లో చూపించిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం సీక్వెల్ ‘ఇండియన్ 2’లో కూడా వృద్ధుడిగా, యువకుడిగా చూపించనున్నారు. యువకుడి పాత్ర కోసం సాంకేతిక సహాయం తీసుకుంటున్నారట. ప్రస్తుతం శంకర్ లాస్ ఏంజిల్స్లో ఉన్నారు. ‘‘లాస్ ఏంజిల్స్లోని లోలా వీఎఫ్ఎక్స్లో అధునాతన సాంకేతికతను పర్యవేక్షిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. కమల్ని యువకుడిగా చూపించడానికే లోలా సంస్థని శంకర్ సంప్రదించి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘డీ–ఏజింగ్’ (యంగ్గా చూపించడం) టెక్నాలజీకి లోలా పాపులర్. -
మీకు తెలుసా.. ఈ గిటార్ మడతపెట్టుకోవచ్చు
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్ది మంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్ను జాగ్రత్తగా బాక్స్లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?
సాక్షి, ముంబై: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా గాడ్జెట్స్కు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ల్యాండ్ ఫోన్లనుంచి ఫీచర్ ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఒక ఎత్తు అయితే. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా మరో ఎత్తు అని చెప్పవచ్చు. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీలు, రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా, 5జీ దాకా ఈ ప్రస్థానం చాలా గొప్పది. ఈ క్రమంలో భవిష్యత్తు ఫోన్లు ఎలా ఉంటాయో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. ఇవీ చదవండి: ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు ఐపీఎల్ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్ స్లిమ్ అండ్ స్లీక్ మాత్రమే కాదు. అత్యంత ట్రాన్సపరెంట్గా స్మార్ట్ఫోన్ లవర్స్ను ఇట్టే ఆకట్టుకుంటోంది. The Future of Smartphones!#Smartphone #mobile #gadgets pic.twitter.com/IDIgxyRwnx — The Pakistan Affairs (@ThePKAffairs) May 28, 2023 డోంట్ మిస్ టు క్లిక్ హియర్ సాక్షి బిజినెస్ -
రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ - ప్రత్యేకతలివే!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లు కొత్త కొత్త అవతారాలలో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ మార్కెట్లో విడుదలవుతున్నాయి. కానీ గూగుల్ సంస్థ మొదటి సారి తన ఫిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ దేశీయ విఫణిలోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మొబైల్ ప్రైస్, ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ భారతదేశంలో తన కొత్త ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసింది. 'గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్' అని పిలువబడే ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 1,47,500 & రూ. 1,57,300. ఈ మొబైల్స్ అమ్మకాలు ఫ్లిప్కార్ట్లో మొదలయ్యాయి. ఒబ్సిడియన్, పోర్సెలాయిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది. గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ OLED ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఔటర్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఈ డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో ఔటర్ డిస్ప్లే పొందుతాయి. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో మూడు రియర్ కెమెరాలను పొందుతుంది. అవి 48 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరా, 10.8 మెగాఫిక్సల్ అల్ట్రావైడ్, 10.8 మెగాఫిక్సల్ డ్యూయెల్ పీడీ టెలిఫోటో లెన్స్ కెమెరా. అయితే సెల్ఫీలు, వీడియోల కోసం ఔటర్ డిస్ప్లేకి 9.5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 8 మెగాఫిక్సల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక బ్యాటరీ, ఛార్జింగ్ వంటి విషయాలకు వస్తే.. ఇందులో 4821mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మొత్తం బరువు 283 గ్రాములు మాత్రమే. ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. -
యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!
ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి.. ‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్ దరఖాస్తులో పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్ డిస్ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్లోని రెండు స్క్రీన్లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్బీలు బిగ్ డేటా అనలైటిక్స్ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు సక్సెస్
సాక్షి, హైదరాబాద్: జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో కొత్త విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత ఉండదు. మరోవైపు ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచుకోక తప్పని పరిస్థితి. కొత్తలైన్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సరఫరా సామర్థ్యాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం. ఈ కోవలో చేపట్టిన 132 కేవీ నుంచి 220 కేవీకి ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యం పెంపు (అప్గ్రెడేషన్)కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ, ఎస్ఆర్పీసీ చైర్మన్ ప్రభాకర్రావు తెలిపారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా రెండు టవర్ల మధ్య ప్రస్తుత విద్యుత్ తీగల (కండక్టర్ల)ను తొలగించి వాటి స్థానంలో ‘హై టెంపరేచర్ లోసాగ్ కండక్టర్స్ (హెచ్టీఎల్ఎస్) తీగలను ఏర్పాటు చేయడంతో ఈ మేరకు విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో గచ్చిబౌలి నుంచి రామచంద్రాపురం వరకు 12 కి.మీ. పొడవునా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యాన్ని 220 కేవీకి పెంచే ప్రాజెక్టును చేపట్టామన్నారు. అదనపు స్థలాలు అవసరం లేకుండానే హెచ్టీఎల్ఎస్ తీగలతో సరఫరా లైన్ల సామర్థ్యం పెంచుకోవచ్చని ప్రభాకర్రావు వివరించారు. హెచ్టీఎల్ఎస్ తీగలు 210 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని అధిక సామర్థ్యంతో విద్యుత్ను ప్రసారం చేయగలుగుతాయి. సంప్రదాయ తీగలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కరిగిపోతాయి. ఎన్టీపీసీపై ఎస్ఆర్పీసీ అసంతృప్తి 2022 చివరిలోగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ హామీనిచ్చినా గడువులోగా పూర్తికాలేదని ప్రభాకర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు బయట నుంచి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఎస్ఆర్పీసీ చైర్మన్ హోదాలో ఆదేశించారు. -
సిమ్కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!
స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్లు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్లలో ప్రత్యేకంగా సిమ్ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. క్వాల్కామ్ (Qualcomm), థేల్స్ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్ను ప్రకటించాయి. దీంతో ఫోన్లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్ల ప్రధాన ప్రాసెసర్లో ఈ ఐ-సిమ్ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు. ఈ ఐ-సిమ్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్ల మాదిరిగానే డిజిటల్ సైనప్లు, సేఫ్టీ ఫీచర్స్ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్లను ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) జీఎస్ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్ టెక్నాలజీ.. తమ కస్టమర్లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు మొబైల్ తయారీదారులు, ఆపరేటర్లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని థేల్స్ మొబైల్ ఉత్పత్తుల విభాగం వైస్ ప్రెసిడింట్ గుయిలామ్ లాఫయిక్స్ పేర్కొన్నారు. -
Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?
లవర్స్ అంటేనే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచంలో గడిపేస్తారు. దూరంగా వున్న లవర్స్ అయితే రోజూ ఫోన్లో మాట్లాడుకోవడంతో సరిపోతుంది. ఇప్పుడు అలాంటి లవర్స్ కోసం కిస్సింగ్ డివైజ్ అనే కొత్త పరికరం పుట్టుకొచ్చింది. చైనాకు చెందిన 'జియాంగ్ జోంగ్లీ' కిస్సింగ్ డివైజ్ కనుగొన్నాడు. వర్చువల్గా రొమాన్స్ చేసుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. లాంగ్ డిస్టెన్స్ కపుల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్ ఒక యాప్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్ సిలికాన్తో తయారు చేసిన పెదాలను కలిగి ఉండటం వల్ల రియల్ కిస్ ఫీలింగ్ అందిస్తాయని చైనాలోని గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దీని కోసం ప్రెజర్ సెన్సార్లు, యాక్యురేటర్లు ఇందులో అమర్చబడి ఉన్నాయి. ఈ డివైజ్ పనిచేయాలంటే తప్పకుండా యాప్ ఉండాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఛార్జింగ్ పోర్టుకి ఈ డివైజ్ కనెక్ట్ చేయాలి. ఈ తరువాత వీడియో కాల్ చేసి పార్ట్నర్ డివైజ్కు కిస్లను పంపవచ్చు. ఇది నిజ అనుభూతిని అందిస్తుందని చైనాలోని కొంతమంది చెబుతున్నారు. మరి కొంతమంది ఇలాంటి డివైజెస్ అసభ్యకరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరికరాలు పిల్లల జీవితాలమీద ప్రభావం చూపుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Remote kissing device recently invented by a Chinese university student. The device is designed specifically for long-distance relationships and can mimic and transfer the kiss of a person to the "mouth on the other side" pic.twitter.com/G74PrjfHQA — Levandov (@blabla112345) February 23, 2023 -
వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?
సాధారణంగా చలికాలంలో దుప్పట్లు అవసరమవుతాయి. వేసవిలో ఏసీ గదుల్లో గడిపేవాళ్లు తప్ప మరెవరూ దుప్పట్లు వాడరు. అయితే ఏడాది పొడవునా వాడగలిగే దుప్పటిని అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ‘హిలు’ బ్రాండ్ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ దుప్పటి సాదాసీదా దుప్పటి కాదు, ఇది ‘థర్మో రెగ్యులేటింగ్ బ్లాంకెట్’. పూర్తి గ్రాఫీన్ ఫైబర్తో అడాప్టెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ దుప్పటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంచుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. చూడటానికి ఇది చాలా భారీగానే కనిపించినా, తేలికగా ఉంటుంది. పదేళ్ల వారంటీతో వివిధ సైజుల్లో లభించే ‘హిలు’ బ్లాంకెట్స్ 175 డాలర్లు (రూ.14,465) మొదలుకొని 550 డాలర్ల (రూ.45,464) వరకు వివిధ ధరల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్) -
ఇక చైనా ‘చాట్బాట్’.. రేసులో ఆలీబాబా!
చాట్జీపీటీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో మారుమోగుతున్న పేరు. గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాత చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా కూడా ఈ రేసులోకి వచ్చింది. తాము కూడా చాట్ జీపీటీ తరహా సాధనం తీసుకొస్తున్నామని, ఇప్పటికే దీనిపై తమ ఉద్యోగులు టెస్టింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆలీబాబా సంస్థ ప్రతినిధి ఏఎఫ్పీ వార్తాసంస్థకు తెలియజేశారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించేది స్పష్టం చేయలేదు. ఏఐ చాట్బాట్పై తమ టెస్టింగ్ వచ్చే మార్చిలో పూర్తవుతుందని మరో చైనీస్ సంస్థ.. సెర్చ్ ఇంజిన్ బైదు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆలీబాబా నుంచి ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు గూగుల్ కూడా ఈ చాట్ జీపీటీకి పోటీగా ‘బార్డ్’ పేరుతో ఏఐ చాట్బాట్ సర్వీస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ చాట్బాట్ సర్వీస్ను శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ రూపొందించింది. కోరిన అంశాలపై వ్యాసాలు, పద్యాలు, ప్రోగ్రామింగ్ కోడ్స్ను ఇది సెకండ్ల వ్యవధిలో అందిస్తోంది. మరోవైపు దీని ద్వారా విద్యార్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్థిక నేరాలు, వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే కూడా వ్యక్తమవుతున్నాయి. (ఇదీ చదవండి: Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..) -
ఆంగ్ల బానిసత్వం మనకొద్దు
అదాలజ్/గాంధీనగర్: ఆంగ్ల భాష పట్ల బానిస మనస్తత్వం నుంచి నూతన విద్యా విధానంతో దేశం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, స్మార్ట్ బోధనా రీతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీ బుధవారం ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు లబ్ధి తన స్వరాష్ట్రం గుజరాత్లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మరో 50,000 క్లాస్రూమ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్రూమ్లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మోదీ సంభాషించారు. రక్షణ స్వావలంబన గర్వకారణం ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్లో ‘డిఫెన్స్ ఎక్స్పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు. -
ఆధునిక టెక్నాలజీతో.. కొత్త ఫ్లైఓవర్
అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పటి వరకు మహానగరాల్లోనే నిర్మించిన విధంగా నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో వెంకటేశ్వరపురం, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి ప్రాంతాల్లో మూడు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. తాజాగా మినీబైపాస్లో హరనాథపురం సర్కిల్లో నాల్గో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఫ్లై ఓవర్ గతంలో నిర్మించిన మూడింటి కంటే సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో విభిన్నమైందిగా చెప్పుకోవచ్చు. నెల్లూరు (బారకాసు): నగరంలోని ముత్తుకూరురోడ్డులో రామలింగాపురం కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మార్గంలో నాలుగు వైపులా వాహనాల రాకపోకలను రెండు రోజుల నుంచి నిలిపివేసి పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తికావడంతో గడ్డర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానంగా ఫ్లై ఓవర్కు రెండు వైపులా ఎర్త్ వర్క్ పనులు ముమ్మరం చేశారు. నెల్లూరు నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా జనాభా సంఖ్య కూడా పెరగడంతో పాటు వాహనాల రాకపోకలు అధికమవుతున్నాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడం కారణంగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గుర్తించిన నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం మంజూరు చేయించి అవసరమైన నిధులు కూడా విడుదల చేయించింది. కరోనాతో పనులు ఆలస్యం 2020 ఆగస్టులో రూ.41.88 కోట్ల అంచనాలతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులు 2022 ఆగస్టు కల్లా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు ముందుకేశారు. అయితే ఓవైపు కరోనా, మరో వైపు వర్షాలు కారణంగా నిర్మాణ పనులు నెమ్మదిగా జరిగే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జరిగేలా తగు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పనులను పూర్తి చేసేందుకు మరో ఆరో నెలలు పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి కల్లా పూర్తి చేసేలా ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పూర్తికి మరో ఐదు నెలలు గడువు ఉన్నప్పటికీ అధికారులు మరో మూడు నెలల్లోపు పూర్తి చేయాలనే ప్రయత్నంతో పనుల్లో వేగాన్ని పెంచారు. ఆధునిక టెక్నాలజీతో.. రామలింగాపురం కూడలిలో జరుగుతున్న ఫ్లై ఓవర్ మొట్టమొదటి సారిగా మహానగరాల్లో నిర్మించిన ఆధునిక టెక్నాలజీ తరహాలో నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీతో ఫ్లై ఓవర్ వంతెనల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లై ఓవర్ టెక్నాలజీతో మహానగరాలైన హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లోనే జరిగాయి. ఈ వంతెన పొడవు 810 మీటర్లు. 10 పిల్లర్లు ఆధారంతో వంతెనను నిర్మిస్తున్నారు. ఒక పిల్లర్కు మరో పిల్లర్కు మధ్యలో (సెంటర్ స్పాన్) భీమ్లను డయాఫ్రంభీమ్లో అమర్చుతున్నారు. ఈ సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో 9 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయడం విశేషం. ఈ వంతెన నిర్మాణం పూర్తితో త్వరలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. త్వరతగతిన పూర్తికి చర్యలు నగరంలోని రామలింగాపురం సెంటర్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ త్వరతిగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. 2023 ఫిబ్రవరి కల్లా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనత త్వరగా మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతంగా జరిపిస్తున్నాం. త్వరతిగతిన వంతెన నిర్మాణం పూర్తికి మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. – అనిల్కుమార్రెడ్డి, డీఈఈ, ఎన్హెచ్ విభాగం, ఏపీ ఆర్అండ్బీ శాఖ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement