-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
‘ఆ మాట చెప్పడానికి నువ్వెవరయ్యా?’
హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కోసం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం మరో వేషం కట్టారు. ఇప్పటిదాకా టీడీపీ అనుకూల స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్న ఈ పచ్చ చిలుక.. ఇప్పుడు స్వయంగా ఏపీ రాజకీయాల్లోకి దిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ పార్టీ రెబల్స్ను బుజ్జగించేందుకు ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించారు చంద్రబాబు. అయితే ఇక్కడే పీకేకు ఘోరమైన భంగపాటు కలిగింది. కూటమి పేరుతో టికెట్ల డ్రామా ఆడించిన చంద్రబాబు.. ఆ పార్టీ సీనియర్లకు, గత ఐదేళ్లుగా కష్టపడ్డవాళ్లకు మొండి చేయి చూపించారు. కార్యకర్తల మద్దతు కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని, సామాజిక వర్గాల ప్రతిపాదికన కూడా టికెట్లు ఇవ్వకపోవడం దారుణమంటూ బహిరంగంగానే కొందరు అసంతృప్తి వెల్లగక్కారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఆ పార్టీ నేతలు రెబల్స్గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో(ఏప్రిల్ 29).. బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి వీళ్ల విషయంలో టీడీపీ అధిష్టానం మొదటి నుంచే బుజ్జగింపులు చేస్తోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి వాళ్లతో చర్చలు జరిపారు. కొందరు వెనక్కితగ్గగా.. మరికొందరు మెత్తబడుతూ వస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం నేరుగా తగ్గబోమంటూ ముఖం మీదే చెప్పేశారు. దీంతో చివరి అస్త్రంగా ఈ ఎన్నికల్లో తమకు పని చేస్తున్న పీకేతో.. ఆ రెబల్స్కు చంద్రబాబు ఫోన్లు చేయిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు కష్టంగా ఉందని, పోటీ నుంచి తప్పుకుని కాస్తైనా పార్టీకి సహకరించాలని పీకే ఇప్పుడు వాళ్లను బతిమాలుతున్నట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, అవసరమైతే పదవులు కూడా ఇస్తుందని పీకే టీడీపీ రెబల్స్తో చెబుతున్నారట. అయితే.. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి పీకేకు దిమ్మతిరిగే సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అసలు టీడీపీ అధిష్టానం బదులుగా ఫోన్లు చేయడానికి మీరెవరంటూ ప్రశాంత్ కిషోర్ను వాళ్లు నిలదీస్తున్నారట. అంతేకాదు.. టీడీపీ ఇంకా అధికారంలోకే రాలేదని, అధికారంలోకి వచ్చేది అనుమానాలు ఉన్నప్పుడు పదవులు ఇస్తామని మీరెలా చెబుతున్నారంటూ నిలదీశారట. దీంతో భంగపడ్డ పీకే.. ఆ ఫోన్ సంభాషణల సారాంశాన్ని చంద్రబాబుకు చెప్పుకుని ఫీలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ టీడీపీ కోసం ఎలాగైనా వాళ్లను ఒప్పించాలని చంద్రబాబు బతిమాలడంతో.. వాళ్లకు ప్రత్యామ్నాయ ఆశలు కలిగించేందుకు మరోసారి ఫోన్లలో మాట్లాడేందుకు పీకే సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ గుట్టు విప్పిన మమతా బెనర్జీ
సాక్షి, అమరావతి: ప్రశాంత్కిశోర్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. ప్రశాంత్ కిశోర్ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని చేయకున్నా.. చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్కిశోర్ తెర వెనక పనిచేస్తున్నారని.. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్కిశోర్కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయన్నారు. "బెంగాల్లో ప్రశాంత్ కిశోర్ టీఎంసీ కోసం పనిచేయడం లేదన్నారు" మమతా. ప్రశాంత్ కిశోర్ తక్షణ కర్తవ్యం చంద్రబాబు, మోదీనేనని తెలిపారు. డామిట్ కథ అడ్డం తిరిగింది పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్ సంస్థ నుంచి తప్పుకుని.. బీహార్లో రాజకీయ అరంగేట్రం చేశాడు పీకే. తొలుత బీహార్ సీఎం నితీష్కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ తేడా కొట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. వివాదాల పీకే సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలకు సలహాలతో అప్పట్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా నేలకు దిగివచ్చాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న సంబంధాలన్ని తెగిపోవడంతో తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుడు కావాలనుకున్న కల కాస్తా చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులకు ఆశపడి పొలిటికల్ బ్రోకర్గా మారాడన్న ఆరోపణలు ఢిల్లీలో వెల్లువెత్తాయి. కరకట్ట ఇంట్లో ప్యాకేజీ చర్చలు ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు విసిరిన ప్యాకేజీకి పీకే పడిపోయాడని తెలుగుదేశంలో ప్రచారం ఉంది. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ను విజయవాడకు తీసుకువచ్చిన లోకేష్.. నేరుగా కరకట్ట ఇంట్లో మీటింగ్ పెట్టించాడు. ఆ సమావేశంలో ఏం జరిగిందో కానీ.. ఏపీలో కూటమి గెలుస్తుందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు పీకే. తన వ్యాఖ్యలకు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కానీ, లాజిక్ గానీ చూపించకుండా.. తన పాత బ్రాండ్ను వాడుకుని ప్రచారం చేసుకునే పనిలో పడ్డాడు. అయితే విశ్వసనీయత కోల్పోవడంతో పీకే మాటలు ఎవరూ పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. "నోటు" మాటలు ప్యాకేజీ ఎంత ముట్టిందో గానీ, బాకా ఊదడంలో పీకే ముందుంటున్నాడు. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ అసలు రంగును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టడం.. పీకే వ్యాఖ్యల డొల్లతనం బయటపడ్డట్టయింది. -
జోస్యం తెల్వని సిలుక పీకే పై విజయశాంతి ఫైర్
-
ప్యాకేజీ కి బాబు పల్లకి మోస్తున్న పీకేలు
-
బాబు గూట్లో బిహారీ బాబు
బాబు గ్రాఫ్ దిగజారింది.. పెయిడ్ క్యాంపెయినర్లు దిగిపోయారు పెన్షన్ల ఇష్యూతో పాతాళానికి పడిపోయిన బాబు గ్రాఫ్ వెంటనే రంగంలోకి పెయిడ్ క్యాంపెయినర్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ పచ్చగూటి చిలుకగా మారిపోయాడా ? పేమెంట్ కు తగ్గట్టుగా పెర్ఫామెన్స్ చూపిస్తున్నాడా ? బాబు గ్రాఫ్ ఉన్నదే అంతంతమాత్రం. అది కూడా అమాంతం పడిపోయింది. అవ్వాతాతలు ఉసురు పోసుకుంటేం.. గ్రాఫ్ పడిపోక.. పరుగులు పెడుతుంందా ఏంటి ? అందుకే కరకట్ట కన్నింగ్ బాబు మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తన గూటిలోని చిలుకను బయటకు వదిలాడు. జోతిష్యం చెప్పమన్నాడు. అర్థమైందిగా.. పచ్చగూటిలో ఆ చిలుక ఎవరో..! పేరు ప్రశాంత్ కిషోర్. బిహార్ లో జన్ సురాజ్ పార్టీ పెట్టి.. బిజినెస్ లేక ప్యాకేజీలకు అలవాటు పడి భారతదేశంమొత్తం తిరుగుతున్నాడు. బాబుగారి పెయిడ్ క్యాంపెయినర్ల లిస్టులో చేరిపోయాడు. ఇదిగో.. అవ్వాతాతల అగచాట్లు, వారి శాపనార్థాలు, వారి మరణాలు.. చంద్రబాబును ఆయన గ్రాఫ్ ను పాతాళంలోకి తొక్కేశాయి. వెంటనే రంగంలోకి దూకేశాడు ప్రశాంత్ కిషోర్. జగన్ గెలవరు.. సంక్షేమాలు గెలిపించవు అంటూ పాత స్ర్కిప్ట్ ను కొత్తగా మళ్లీ చదివి వినిపించాడు. పచ్చ మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించింది. డైవర్ట్ పాలిటిక్స్ అమ్మా డైవర్ట్ పాలిటిక్స్. ఇందులో చంద్రబాబును మించినోళ్లు ఎవ్వరూ లేరు. అయినా ఒక టీమ్ లేదు.. సర్వేలు చేయడం లేదు.. ఒక స్ట్రాటజిస్ట్ కాడు.. ఒక రాజకీయ నాయకుడు కాదు.. అలాగని విశ్లేషకుడు కాదు.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో.. అందుతున్న సంక్షేమం ఎంతో.. అతనికి పూర్తిగా అవగాహన లేదు. అయినా జగన్ సర్కార్ పై విషం చిమ్ముతున్న మిస్టర్ బిహారీ బాబు నువ్వు బాబు గూటిలో బీహారీ బాబులా మారిపోయావని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే నిన్ను ఓ పది ప్రశ్నలు అడుగుతున్నారు.. వాటికి తెలిస్తే తెలుగులో సమాధానం చెప్పు.. లేదా బీహారీలో చెప్పు.. ట్రాన్స్ లేట్ చేసుకుని మేమే అర్థం చేసుకుంటాం...! 1. తన గ్రాఫ్ దిగజారుతున్న ప్రతిసారి బాబు పెయిడ్ ఆర్టిస్టులను దింపుతాడు.. అందులో భాగమే నువ్వు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 2. అవ్వాతాతల మరణంతో పాతాళానికి పడ్డ బాబు గ్రాఫ్ ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 3. 2023 డిసెంబర్ 23న బాబును కలిసినప్పటి నుంచి నువ్వు టీడీపీ గూటి చిలకగా మారిపోయావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 4. 2024 మార్చి 3న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో బాబు నిన్ను రహస్యంగా కలిశాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 5. అదే రోజు ఓ నేషనల్ మీడియాలో బాబు స్క్రిప్ట్ ప్రకారమే జగన్ సర్కార్ పై విషం చిమ్మావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 6. 2024 ఏప్రిల్ 3న పీటీఐలో బాబు సూచనలతో జగన్ సర్కార్ టార్గెట్ గా మరోసారి విషం కక్కాక్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 7. వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారడంతో దాన్ని డైవర్ట్ చేయడానికే బాబు నిన్ను మరోసారి దింపాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 8. ఏపీలో అభివృద్ధి లేదు అనడానికి నీ దగ్గర డేటా లేదు.. నువ్వెప్పుడూ ఏపీలో పర్యటించలేదు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 9. నీకంటూ టీమ్ లేదు.. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలియదు.. అయినా స్ట్రాటజిస్ట్ లా మాట్లాడుతావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 10. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే బిగ్ క్వశ్చన్ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు.. -
ప్రశాంత్ కిషోర్ ను ఏకిపారేసిన మంత్రి బొత్స
-
పీకేకు బాబు భారీ ప్యాకేజీ
-
ప్రశాంత్ కిషోర్ను ఏకిపారేసిన ఏపీ మంత్రి బొత్స
-
ప్రశాంత్ కిషోర్ను ఏకిపారేసిన ఏపీ మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్నింటా ముందజలోనే ఏపీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదేళ్లల్లో అన్నిరంగాల్లోనూ ముందుంది. గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం ఇలా అన్నిరంగాల్లోనూ చేపట్టి విప్లవాత్మక సంస్కరణల ఫలితం రాష్ట్ర అభివృద్ధి సూచికలను నిర్దేశిస్తున్నాయి. నీతి అయోగ్ విశ్లేషణ, కేంద్ర నివేదికలు, జీడీపీలోనూ ఎందులో చూసినా, గతంలో 17 నుంచి 18 స్థానాల్లో ఉండే రేటింగ్ ఇప్పుడు 4, 5 స్థానాలకు వచ్చింది. గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనాతీరే ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి ఫోకస్డ్గా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదల ఇవన్నీ రాష్ట్ర పురోగతి సూచికలను తెలియజేస్తున్నాయి. జగన్ రియల్ లీడర్.. బాబు ప్రొవైడర్ ప్రశాంత్ కిశోర్ (పీకే) అనే రాజకీయ వ్యూహకర్త ఏపీ అభివృద్ధి గురించి ఏదేదో పిచ్చిపట్టినట్టు మాట్లాడారని ఇవాళ పత్రికల్లో చూశాను. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఒక లీడర్. కాగా.. లీడర్కు, ప్రొవైడర్కూ తెలియని వ్యక్తి పీకే. లీడర్, ప్రొవైడర్కు తేడా అంటే ఏంటో నన్నడిగితే నేను సమాధానమిస్తా పీకే..?. ప్రజలకు సంబంధించిన అంశాలను దీర్ఘకాలికమైన వ్యూహంతో ఆలోచన చేసి విప్లవాత్మక సంస్కరణలతో అమలు చేసేవాడిని లీడర్ అంటారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్రెడ్డి నూటికి నూరుపాళ్లూ చేస్తున్నది అదే. అందుకే, ఆయన్ను లీడర్గా ప్రజలంతా ఆరాధిస్తున్నారు. అదే పీకే చెబుతున్న ప్రొవైడర్ ఎవరంటే, అది చంద్రబాబు నాయుడు. ఆయన తన హయాంలో చేసిందంతా మేనేజ్మెంట్. బ్రోకరిజం. అలాంటి పనులు చేసేవాడ్ని ప్రొవైడర్ అంటారు. కాబట్టే, గత ఐదేళ్లకు ముందున్న అభివృద్ధి పారామీటర్స్ కంటే ఈ ఐదేళ్లలో మారిన పారామీటర్లే ఇందుకు నిదర్శనం. పావర్టీలైన్, జీడీపీ ఏం చెప్పాయో చూడు పీకే..? చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పేదరిక శాతం ఎంత..? ఇప్పుడెంత ఉంది..? పావర్టీలైన్ తెలుసుకో..విద్యలో ఇవాళ ఏపీ కేరళ రాష్ట్రాన్ని అధిగమించిన సంగతి వాస్తవమా..?కాదా..? జీడీపీ అంశం తీసుకుంటే 16వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది నిజం కాదా..? నిజమైన అభివృద్ధి జరగకపోతే, ఇవన్నీ ఎలా వస్తాయి..? పాతాళభైరవి సినిమాలో మాదిరిగా మంత్రం వేస్తే వస్తాయా..?. పీకే.. నువ్వు చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకో.. మాకేంటి అభ్యంతరం..? ఆయన్ను ఇంద్రుడు చంద్రుడని పొగుడుకో.. కానీ, నీ భాష మీద మాత్రం పట్టుండాలని తెలుసుకో.. లీడర్కూ ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు. పీకేవి.. ప్యాకేజీ మాటలు పీకేకు మీడియా ద్వారా చెబుతున్నదేమంటే, నీకు చంద్రబాబు మీద అభిమానం ఉంటే నీ తాళం, బాజాభజంత్రీలు బహిరంగంగా వాయించుకో.. అంతేగానీ, వారి అసమర్ధతను మా నాయకుడిపై రుద్దితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు గారు సహించరు. నీ మాటల్ని ఖండిస్తున్నాం. చంద్రబాబులా అక్కడా ఇక్కడా మధ్యవర్తిత్వం చేసి మేనేజ్మెంట్లతో పొత్తులు పెట్టుకునే దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఆయన రియల్ లీడర్. అందుకే, అంత ధైర్యంగా, మీకు మంచి జరిగితేనే.. భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంటేనే నన్ను మరోసారి దీవించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. నువ్వు ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబుకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలని, నువ్వెంత ఆరాటపడినా.. దుష్ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులేమీ కాదు. బీహార్ ప్రజలు నిన్నెందుకు తరిమారు..? అసలు, ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నావు..? నీ ఉద్దేశంలో నీకు ప్యాకేజీ ఇచ్చినోడే నీకు ఇంద్రుడు.. చంద్రుడా..? నువ్వు బీహార్ను పరిపాలిస్తానని పాదయాత్ర చేశావుగా.. నిన్నెందుకు పనికిరావని అక్కడి ప్రజలు పక్కకు తరిమారు..? నీలాంటి బ్రోకర్లును పెట్టుకుని నాయకుడిగా ఎన్నుకోవడానికి ప్రజలేం అమాయకులనుకుంటున్నావా..? బీహార్ నుంచి నిన్నెందుకు తరిమేశారో సమాధానం చెప్పు. చంద్రబాబు లాగా అన్ని పోసుకోలు మాటలు మాట్లాడటం పరిపాలన కాదు. మేనేజ్మెంట్ చేసేవాళ్లను, బ్రోకర్లను ప్రజలు భరించలేరు గనుకే ఓడించి ఇంటికి పంపుతారు. మాటిచ్చి నిలుపుకోవడమే జగన్ నాయకత్వ లక్షణం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గానీ.. ప్రజల సంక్షేమం గురించైనా వాగ్దానాలు చేయడం ఈజీనే. అమలు చేయడమే చాలా కష్టం. మాట ఇవ్వడం ఈజీనే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆచరణలో చూపడమే చాలా కష్టం. అదే మా జగన్మోహన్రెడ్డి గారు ఏదైతే చెబుతారో.. దాన్ని చేసి చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు గనుకే ప్రజా నాయకుడయ్యారు. అదే, జగన్ గారి నాయకత్వంలో ఉన్న ముఖ్య లక్షణం. అదే ఆయనలో ఉన్న బ్యూటీ ఆఫ్ సీక్రెట్. కాబట్టే.. ఇవాళ రాష్ట్రంలో ఏ రంగం చూసినా, పురోగతి బాటలో నడుస్తూ కనిపిస్తోంది. ఏపీపై ఎవడో వాగితే మీడియాలో ప్రధాన శీర్షికలా..? ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవడుబడితే వాడు వాగడం.. వాటిని పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించడం.. ఏంటీ ఈ నాన్సెన్స్..? పాత్రికేయ సోదరులకూ, ఆయా పత్రికల యాజమాన్యాలకూ రాష్ట్ర జీడీపీ, పావర్టీలైన్, విద్య, వైద్యం, వ్యవసాయంపై నీతిఅయోగ్ నివేదికలు ఇవన్నీ తెలియవా ..? అవన్నీ అధికారికంగా కనిపించే అంశాలే కదా..? వాటిని ఎవరు తారుమారు చేసి ప్రచారం చేసుకుంటారు...? కనుక, ఎవడో వాగిన వాంతిని పత్రికల్లో ప్రధాన శీర్షికలతో పెట్టి దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సబబు..? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని భావిస్తున్నాను. ప్రజలకు భరోసానిచ్చే లీడర్ జగన్ లీడర్ అంటే ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఓటేసే ఓటరుకు ఒక భరోసా.. అది ఈ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి గారు కల్పించారు. అదే లీడర్ అంటే ఒక మాయ, ఒక మేనేజ్మెంట్, ఒక మోసం, ఒక వెన్నుపోటు కాదు. అవన్నీ చేసే బ్రోకర్ చంద్రబాబు నాయుడు. సో, అందరూ వీరిద్దరి మధ్య తేడా ఏంటనేది ఆలోచించాలి. ఆయా వ్యక్తుల పరిపాలనా తాలూకూ వాస్తవాలే వారేంటో చెబుతాయి..? చంద్రబాబు హయాంలో అభివృద్ధి సూచికలు ఎలా ఉన్నాయి..? దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పరిపాలనలో ఎలా ఉన్నాయి..? ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఎలా ఉన్నాయో తేడా చూసుకోమనండి..? వాస్తవాల ఆధారంగా మాట్లాడితే ఏపీకి నిజమైన నాయకుడు ఎవరనేది తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం ధర్మమా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బుర్రను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారా...? లేక ఆమెనే స్వంతంగా ఆలోచించి పిచ్చిపనులు చేస్తుందా..? రాష్ట్రంలో 22 మంది ఐపీఎస్లపై అవినీతి బురద జల్లి వారిని మార్చాలం టూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తుందా..? బుద్ధుందా..? పూర్తి అసత్య నిరాధారమైన ఆరోపణలతో అంతమంది ఐపీఎస్లను చిన్నబుచ్చడం సంస్కారమేనా..? మొన్నటిదాకా వాలంటీర్లపై టార్గెట్ పెట్టి చంద్రబాబు, పవన్కళ్యాణ్, పురందేశ్వరి నోటికొచ్చిందల్లా వాగడం.. ఎల్లోమీడియా వాటిని హైలెట్ చేయడం, వారిపై లేఖలు రాయడం జరిగింది. మొత్తానికి పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేసి ఆ మూడు పార్టీలు గోతిలో పడ్డాయి. ప్రజాగ్రహం దెబ్బకు తాము చేసిన తప్పిదానికి చెంపలు వాయించుకోలేక, ఇప్పటికీ వారి ఎల్లోమీడియాలో ఏవేవో సాకులు రాయించుకుంటున్నారు. సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లంటే జగన్ గారి హయాంలో నియామకమైనోళ్లు కాబట్టి మీరు హడావిడి చేశారనుకుందాం. మరి, ఐఏఎస్లు, ఐపీఎస్లను టార్గెట్ చేస్తున్నారంటే.. వారు కూడా జగన్మోన్రెడ్డి గారి హయాంలోనే అపాయింట్మెంట్లు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా..? వాళ్ల సర్వీసులో చాలామంది చంద్రబాబు హయాంలోనూ పనిచేసిన వారే కదా..? మరి, మీ పట్ల అంత అంకితభావం లేకుండా.. జగన్గారి పట్ల అంకితభావం ఉండటానికి గల కారణమేంటి..? ఒక ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను చులకనగా చూడటం భావ్యమా..? దానికి కొన్ని పత్రికలు పుంఖాను పుంఖానులుగా కథనాలు రాయడం ధర్మమా..?అది ఆ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కాదా..? ఎన్నికల నిర్వహణ మార్గదర్శి మేనేజర్లకు అప్పగించాలని లేఖ రాసుకోండి ఈనాడు యాజమాన్యానికి నేను చెప్పినట్టు, నాదొక సలహా చెప్పండి. చంద్రబాబు, పురందేశ్వరిల చేత ఎలక్షన్ కమిషన్కు ఓ లేఖ రాయించుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ, ప్రభుత్వ సర్వీసు అధికారులపై మాకు నమ్మకం లేదు. కనుక, ఎన్నికల ప్రక్రియను మాకోసం ఈనాడు, మార్గదర్శి మేనేజర్లతోనే నిర్వహించమని కోరండి. ఒక్కో జిల్లా ఎన్నికల బాధ్యతను ఒక్కో మేనేజర్కు అప్పగించి జరుపుకోండి. బూత్లలో ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి కొట్టి బయట పారేస్తారు. ఎన్నికలంటే, చంద్రబాబు, పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతికి అంత ఆటలుగా ఉందా..? ప్రజాస్వామ్యంలో ఎన్నికల యంత్రాంగం పట్ల మీరు మరీ అంత నమ్మకం లేకుండా ఉండటం సరికాదు. అదే మా నాయకుడు జగన్గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులపై, వ్యవస్థలపై, ప్రజలపై నమ్మకం ఉంది. గౌరవం ఉంది. చంద్రబాబు, పవన్కళ్యాణ్, పురందేశ్వరితో ఎల్లోమీడియా ఇప్పటికైనా తాము చేస్తున్న తప్పులేంటో తెలుసుకుని ఐపీఎస్లు, ఐపీఎస్లుకూ, ప్రజలకు క్షమాపణలు చెప్పి, ఇకనైనా బుద్ధిగా నడుచుకోవడం మేలు... అని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. -
పీకే స్క్వేర్.. అట్లుంటది బాబు చెత్తరాజకీయంతోని!
ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల వ్యూహకర్త. ఆయన స్కెచ్ వేశాడంటే.. ఆ పార్టీ ఎలాగైనా అధికారంలోకి వచ్చి తీరాల్సిందే!. ఒక పార్టీకో, ఒక కూటమికో అనుకూలం అని కాకుండా.. పరిస్థితుల్ని బట్టి ఆ సమయానికి ఐ-ప్యాక్(Indian Political Action Committee) అనే రాజకీయ వ్యవహారాల విభాగంతో ఫలానా పార్టీకి పని చేసి విజయాల్ని అందిస్తూ వచ్చిన వ్యక్తి. కానీ, ఇదంతా గతం. ఇప్పుడాయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు. దిగితే ఫర్వాలేదు.. చంద్రబాబు లాంటి వాళ్లతో చేతులు కలిపి మకిలి అంటించుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కొన్ని నెలల కిందట.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ గంటన్నరకు పైగా భేటీ అయ్యాడు. ఆ చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గత ఎన్నికలకు వైఎస్సార్సీపీ కోసం, వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం పని చేసిన పీకే.. ఈసారి చంద్రబాబు కోసం పని చేయబోతున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ అనుకూల వెబ్సైట్లు బిల్డప్పులు అల్లేసి తెగ రాసేశాయి. ఆ ఊకదంపుడు మీడియా రాతల్ని ఐ-టీడీపీ పేజీలు, జనసేన సోషల్ మీడియా విభాగాలు తెగ ప్రచారం చేశాయి. చివరకు తాను చంద్రబాబుకి పని చేయబోవడం లేదంటూ పీకే క్లారిటీ ఇచ్చేదాకా ఆ ప్రచారం కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే ఆ తర్వాతి నుంచే పీకే ఇక్కడి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తున్నాడు. ‘‘చంద్రబాబు ఎప్పటి నుంచో నన్ను కలవాలని అనుకుంటున్నారట. ఓ కామన్ ఫ్రెండ్ పదే పదే ఒత్తిడి చేయడంతో వెళ్లి కలిశాను. ఈసారి జరగబోయే ఎన్నికలకు నన్ను పనిచేయమని అడిగారు. కానీ, నేను ఇప్పుడు అలాంటి పనులు(ఎన్నికల వ్యూహకర్త) చేయడం లేదని చెప్పాను’’ అని ప్రశాంత్ కిషోర్ పచ్చ మీడియా అల్లిన కథలకు చెక్ పెట్టాడు. అయితే.. ఇద్దరు పీకేలతో చంద్రబాబు ఆడిస్తున్న చెత్త రాజకీయ డ్రామాలు ఇప్పుడు ఎల్లో మీడియా సాక్షిగా బయటపడింది. ఐ-ప్యాక్కు గుడ్బై చెప్పి రాజకీయ వ్యూహాలకు దూరమైన ప్రశాంత్ కిషోర్.. రాజకీయ రొంపిలోకి దిగి కుట్రలను మాత్రం అలవర్చుకున్నట్లు అవగతమవుతోంది. బీహార్ రాజకీయాల్లో జన సూరాజ్ పేరిట ఆయన చేసిన హడావిడినే అందుకు నిదర్శనం. రాజకీయంగా వేసిన ప్రతి అడుగు తప్పటడుగాయి నైరాశంలో ఉండిపోయాడు. అయితే అది అంతగా వర్కవుట్ కాకపోవడంతో.. ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే.. పలు పార్టీలకు అనుకూలంగా ప్రైవేట్ ఇంటర్వ్యూలలో స్టేట్మెంట్లు ఇవ్వడం!. తాను రాజకీయ వ్యూహాలకు శాశ్వతంగా దూరమైనట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించుకున్నారు. కానీ, వరుస పెట్టి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మాత్రం ఆయన ఆ హోదాతోనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ వ్యాఖ్యలనే ఆయా పార్టీల అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రకటించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుతోనూ ‘ఏదో’ డీల్ కుదిరినట్లు ఆయన వరుసగా ఏపీ రాజకీయాలపై ఇస్తున్న ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు.. అప్పటికే ఉన్న దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ టీడీపీ కోసం ఎంతలా పని చేస్తున్నాడో చూస్తూన్నదే. కూటమి పేరిట బీజేపీ, టీడీపీని చేర్చే క్రమంలో జనసేన తరఫున పవన్ ఎన్నో త్యాగాలు చేశాడట. చివరకు బాబులాంటి వాడితో పొత్తు కోసం నీ రాయబారం ఏంటయ్యా? అని బీజేపీతోనూ తిట్లు తిన్నాడట. స్వయంగా ఈ ప్రకటనలు చేసిన పవన్ కల్యాణ్.. అయినా సరే బాబుకు ఊడిగం చేయడంలో ఆల్టైం రికార్డు క్రియేట్ చేశాడు. నమ్ముకున్నవాళ్లను, పదేళ్లుగా పార్టీ వెంట నడుస్తున్న వాళ్లకు వెన్నుపోటు పొడుస్తూ.. 21 సీట్లతో సర్దిపుచ్చుకుని ప్యాకేజీకి న్యాయం చేయడంలో సార్థక నామధేయుడిగా నిలిచాడు. వచ్చే ఎన్నికల్లో తాను, తన పార్టీ, కూటమిగా వచ్చినా గెలవలేదనే విషయం చంద్రబాబుకు అర్థమైంది. ఒకవైపు పవన్ కల్యాణ్ సినీ గ్లామర్ను మరోసారి వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు.. సీఎం జగన్, వైఎస్సార్సీపీ ఓడిపోతారంటూ పీకే ద్వారా నాలుగు మాటలు చెప్పిస్తున్నాడు. మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పించాడు. తాజాగా పీటీఐ వార్తాసంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం కష్టమంటూ ప్రశాంత్ కిషోర్ ఓ ప్రకటన ఇచ్చాడు. ఇంకేం.. ఎల్లో మీడియా సంబురాలు చేసుకుంటోంది. ఆ ఇంటర్వ్యూను ఎగ్గొట్టి దిగ్గొట్టి రకరకాలుగా కథనాలు ఇస్తోంది. గతంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన పీకే.. ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలోనే ఇది రెండోసారి. అదీ.. చంద్రబాబును కలిశాకే. కొత్తగా @ncbn నుంచి ప్యాకేజీ అందుకున్న కృతజ్ఞతతో అలా అంటున్నావు కానీ రాష్ట్రాభివృద్ధికి ఎవరేం చేశారన్నది కేంద్ర గణాంకాలు చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి ప్రశాంత్ కిషోర్. విద్య, వైద్యం, ప్రజల తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో వృద్ధి, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఏపీ సీఎం వైయస్… pic.twitter.com/T5GL7SKi2q — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 అయినా ఒకప్పుడు ప్యాకేజీలు తీసుకుని పార్టీల కోసం సలహాలు, సూచనలు ఇచ్చిన వ్యూహకర్త.. ఇప్పుడు పొలిటీషియన్గా జెన్యూన్ స్టేట్మెంట్లు ఇస్తారని అనుకోగలమా?. పైగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు ఎలాంటి సర్వేలు చేయడం లేదు. పైగా ఆయన వేస్తున్న అంచనాలు ఘోరంగా తప్పుతున్నాయి. ఉదాహరణకు.. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలుస్తుందని చెప్పిన అంచనా బోల్తా కొట్టింది. కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా అనుభవం, కాస్త పైత్యాన్ని రంగరించే వరుస ప్రకటన చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి పదే పదే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఏపీ రాజకీయాలపై ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే.. ఎల్లో మీడియా కూడా ఆ కథనాలనే ప్రముఖంగా ప్రచురిస్తుంటే ఏపీ ప్రజలుప్రజలు అర్థం చేసుకోలేరా?.. పైగా కరకట్ట నివాసం భేటీ తర్వాతే పీకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే అనుమానాలు రావా?.. ఇద్దరు పీకేలు, ఇద్దరూ ప్యాకేజీ స్టార్లతో యాంటీ జగన్ వేవ్ను సృష్టించేందుకు నడుస్తున్న పచ్చ కుట్రలను అర్థం చేసుకోలేరా?.. అసలు చంద్రబాబు నుంచి విలువలతో కూడిన రాజకీయాన్ని.. అది ఎన్నికల సమయంలో ఆశించడం అత్యాశే అవుతుందేమో కదా!. -
బయటపడ్డ ప్రశాంత్ కిషోర్ కుట్ర కోణం..!
-
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్
-
నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ చేస్తాం: విజయసాయిరెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాలుగు సంవత్సరాల పదినెలల కాలంలో ప్రజలకు అందించిన సుపరిపాలనే కారణమని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గ సమన్వయ కర్త వి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు పట్టణంలో రామ్మూర్తి నగర్ లో బుధవారం క్యాంపు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను నెల్లూరులో పుట్టానని, ఇక్కడే పెరిగానని, విద్యాభ్యాసం చేసానని తాను పుట్టిన గడ్డకు రుణం తీర్చుకునే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరుకు రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నప్పటికీ ఎయిర్ కనెక్టివిటీ లేదని, ఇక్కడ పరిశ్రమలు, అక్వా రంగం, వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఎయిర్ కనెక్టివిటీ సదుపాయం కల్పించడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. తాను పార్లమెంటులో టూరిజం, ట్రాన్స్ పోర్టు, కల్చర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఉన్నందున దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణానికి మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నెల్లూరు జిల్లా వాసిగా ఇక్కడి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే తన ప్రణాళిక వెల్లడిస్తానని అన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఈ మేరకు కందుకూరు నుంచి నెల్లూరు వరకు దారి పొడవునా ప్రజలు చూపించిన అభిమానమే ఇందుకు నిదర్శనమని అన్నారు. చదవండి: ‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’ సంక్షేమంలో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం అభివృద్దిలో వెనుకబడిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గత చంద్రబాబు పరిపాలనతో పోల్చుకుంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలనతో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగిందని సూచికలు చెబుతున్నాయని అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి జీవన ప్రమాణాలు పెంచారని అన్నారు. సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, మేనిఫెస్టో అన్ని అంశాల్లోనూ సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి ఫేస్తో తాము ఎన్నికలకు సిద్దమని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చేస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల అనుభవంతో రెట్టింపు సంక్షేమ పాలన 2019నుంచి 2024వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలన, అన్ని వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఐదేళ్ల అనుభవంతో రానున్న ఐదేళ్లలో రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందిస్తారని అందుకు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. వాస్తవ పరిస్థితులకు విరుద్దంగా ప్రశాంత్ కిషోర్ అబిప్రాయం ప్రశాంత్ కిషోర్ వెల్లడించిన అభిప్రాయానికి ఏమాత్రం లాజిక్ లేదని, స్వార్థ ప్రయోజనాలతో వ్యక్తపరిచిన స్వంత అభిప్రాయం మాత్రమేనని, ఆయన అభిప్రాయాలకు లాజికల్ ఆధారాలేవీ లేవని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ అతని మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని అందుకు సీఎం జగన్పై చూపిస్తున్న అభిమానమే సాక్ష్యమని అన్నారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,నెల్లూరు మేయర్ స్రవంతి, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో విజయసాయి రెడ్డికి ఘనస్వాగతం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన అనంతరం బుధవారం నెల్లూరుకు చేరుకున్న ఎంపీ విజయసాయి రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం ఉలవపాడు జాతీయ రహదారి వద్ద కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త బుర్రా మధుసూదన్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి వాహనాలతో ర్యాలీగా తరలివచ్చారు. అలాగే కావలి నియోజకవర్గం రుద్రకోట వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామం వద్ద ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం కోవూరు నియోజకవర్గం రాజుపాలెం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన అనంతరం నెల్లూరు నగర పరిధిలోని అయ్యప్ప దేవాలయం వద్ద పూజ నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో విజయసాయి రెడ్డి ఇతర నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. -
Babu - PK : బాబుకు దొరికిన కొత్త పావు పీకే
'బీహారు రాజకీయ నేత, ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత కిషోర్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయ్యారా? ఆయన ఏపీలో జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి అప్ డేట్ అవకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేలా మాట్లాడారా? సర్వేలు చేయడమే మానుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ జోస్యం చెప్పడంలో కుట్ర కోణం కనిపించడం లేదా?' చంద్రబాబు తనను బీహారు డెకాయిట్ అని గతంలో దూషించిన సంగతి మర్చిపోయి, ఇప్పుడు ఆయనతో రహస్య ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? ఇలాంటి అనేక సందేహాలు వస్తున్నాయి. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం సహజంగానే కలకలం రేపుతుంది. హైదరాబాద్లో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో కీలకమైనది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రాజకీయ జోస్యం. ఆయన చిత్తశుద్దితో ఏపీలో పర్యటనలు చేసి, లేదా తన మనుషులతో ప్రజాభిప్రాయం తెలుసుకుని ఏమైనా వ్యాఖ్యానించి ఉంటే అది వేరే సంగతి. అప్పుడు ఆయన అభిప్రాయంపై విభేదించవచ్చు. లేదా సపోర్టు చేయవచ్చు.కానీ ఆయన అలా కాకుండా బీహారు నుంచి ఒక రోజు కార్యక్రమం కోసం హైదరాబాద్కు వచ్చి, ఏపీపై మాట్లాడడం కాస్త అసహజంగానే ఉంటుంది. కొంతకాలం క్రితం ప్రశాంత కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. అదేదో కామన్ మిత్రుడు ఒత్తిడి చేస్తే వెళ్లి కలిశానని చెప్పారు. చంద్రబాబుకు ఉండే నెట్ వర్క్ అలాంటిదన్నమాట. ఎవరినైనా ట్రాప్ చేయగల సత్తా ఆయన సొంతం. చంద్రబాబు నివాసంలో కలిసిన తర్వాత ఏమి రాజకీయ చర్చలు జరిగాయో కానీ, రోజువారిగా టీడీపీ చేసే విమర్శలనే ఆయన మాట్లాడినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ తర్వాత ప్రశాంత కిషోర్ వాటి గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు సడన్గా హైదరాబాద్లో ప్రత్యక్షమై వైఎస్ జగన్మోహన్రెడ్డిను వ్యతిరేకంగా మాట్లాడి ఏపీలోని పెత్తందారుల కూటమిలో ఆయన కూడా జాయిన్ అయ్యారన్న అభిప్రాయాన్ని కలిగించారు. కరకట్ట ఇంటికి ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చేందుకు నారా లోకేష్ ఏకంగా ఓ ప్రత్యేక విమానాన్నే తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఏపీ ప్రజలెవరూ మరిచిపోలేదు. ఇదే ప్రశాంత కిషోర్పై 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేసింది అందరికి తెలుసు. కానీ ఇప్పుడు అదే ప్రశాంత కిషోర్ గొప్పవాడికింద ఈ మీడియా ప్రొజెక్టు చేసే పనిలో పడింది. ఆయన చెబితే అన్నీ జరిగిపోతాయన్నట్లుగా పిక్చర్ ఇస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రశాంత కిషోర్ చేసిన రాజకీయ జోస్యాలన్నీ విఫలం అయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందని కిషోర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. చత్తీస్ గడ్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన అంచనా వేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2022 లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలవదని చెబితే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత కిషోర్ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలం అవుతున్నారని తెలిసిపోతుంది. ఆయన ఐ పాక్ అనే సర్వే సంస్థ గతంలో ఉండేది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థతో అన్ని బంధాలు వదులుకున్నానని పలుమార్లు చెప్పారు. దాంతో ఏపీకి ఆయనకు కాంటాక్ట్ పోయినట్లయింది. అయినా పర్వాలేదు. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల బలబలాలను పరిశీలించి పోల్చి విశ్లేషణ ఇస్తే పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. ఆయన అలా చేయలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓడిపోవడానికి చెప్పిన ఆయన చేసిన వాదన అర్ధరహితంగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కితేనే ఓట్లు పడవని అన్నారు. కాసేపు ఆయన చెప్పింది నిజమే అనుకుందాం! వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న స్కీములకు సుమారు ఏభైవేల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతోంది. దానికి మూడు నుంచి నాలుగు రెట్ల మేర అంటే ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లను తాను బటన్ నొక్కుతానని చంద్రబాబు అంటున్నారు కదా! చంద్రబాబు, ఎల్లో మీడియా కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీములను ఎద్దేవ చేసి ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఆరోపించేవి. అదే చంద్రబాబు మూడు రెట్లు డబ్బు పంచుతానని అంటుంటే మాత్రం వీరు ఆహా, ఓహో అంటూ ప్రచారం చేస్తున్నాయి. అంతే తప్ప చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తే మూడు లేదా నాలుగు శ్రీలంకలు అవుతుందని చెప్పడం లేదు. పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు శరాలను వదలుతున్నాడని పచ్చ మీడియా సంబరపడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల గురించి ఏమంటారు? ప్రజలు వాటికి ఎందుకు ఆకర్షితులయ్యారు? ఈ విషయాలను ప్రశాంత కిషోర్ పరిగణనలోకి తీసుకున్నారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా సంక్షోభ సమయం రెండేళ్లలో ఎలాంటి కార్యాచరణ అమలు చేసింది ప్రశాంత కిషోర్ ఎన్నడైనా గమనించారా? ఈ ఐదేళ్లలో ఏపీలో ఎన్ని కొత్త వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చింది ఆయన తెలుసుకున్నారా? వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించడం వాస్తవం కాదా! గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పరిపాలన చేరువ చేయలేదా? రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇలా అనేక మార్పులు వచ్చింది ఆయన చూడలేదా! వృద్దులకు పెన్షన్లను ఇళ్లవద్దకే తీసుకువెళుతున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాదా! స్కూళ్లు బాగు చేయడం అభివృద్ది కాదా! స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు, అంతర్జాతీయ సిలబస్ తీసుకు వస్తున్నది నిజం కాదా? అలాగే, ఆస్పత్రులను బాగు చేసి ప్రజలకు ఆరోగ్య సురక్ష క్యాంపులను పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన తప్పేమిటి? అభివృద్ది విషయానికి వస్తే వీటన్నిటిలో అభివృద్ది కనిపించడం లేదా? ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 800 గ్రామాలకు నీటి పథకం, నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు మెడికల్ కాలేజీలు, విజయవాడ వద్ద వరద రాకుండా పెద్ద గోడ నిర్మాణం, వెలిగొండ టెన్నెల్ పూర్తి, అవుకు రెండో టన్నెల్ పూర్తి, కుప్పంకు నీరు, ఓర్వకల్ వద్ద గ్రీన్ కో ప్లాంట్, కొప్పర్తి పారిశ్రామికవాడ, రామాయంపట్నం వద్ద కొత్త పరిశ్రమలకు ఏర్పాట్లు, విశాఖ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ తదితర ఐటి కంపెనీలు, నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్శిటీ మొదలైనవీ ఏవీ అభివృద్ది కాదని ప్రశాంత కిషోర్ అనుకుంటున్నారా! ఏదో ఒక చోట ఒక భారీ భవంతి కడితేనే అభివృద్ది.. గ్రామాలలో ఏభైవేల భవనాలు కడితే అభివృద్ది కాదని ఈయన కూడా అనుకుంటున్నారా? ఇలా.. అసలు ఏపిలో తిరగకుండానే, పేదల, దిగువ మధ్య తరగతి ప్రజల మనో భావాలు తెలుసుకోకుండా ప్రశాంత కిషోర్ ఎలా మాట్లాడతారు? పోనీ వీటిలో ఏ ఒక్కటైనా చంద్రబాబు టైమ్ లో జరిగాయా? నిజంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు జనసేనతో పొత్తు కోసం ఎందుకు తహతహలాడారు?అది చాలదన్నట్లుగా బీజేపీతో పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నట్లుగా పెత్తందారుల కూటమిలో ఈయన కూడా చేరారా? బీహారులో సొంత పార్టీ పెట్టి పాదయాత్రలు చేసినా ఎందుకు ప్రజాదరణ పొందలేకపోతున్నారు? ఇవన్ని పరిశీలిస్తే ప్రశాంత కిషోర్ ఏదో రహస్య ఎజెండాతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డికు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన సలహాదారుగా పనిచేశారు. అప్పుడు రూపొందించిన నవరత్నాల కార్యక్రమంలో ఈయనకు కూడా బాగస్వామ్యం ఉంది కదా! దానినే ఇప్పుడు తప్పు పడుతూ ఎలా మాట్లాడతారు? అంటే ఇది కపటత్వం కాదా? ప్రజలు వీటన్నిటిని గమనించకుండా ఉండరు. కృత్రిమమైన వ్యతిరేకత సృష్టించడానికి ఈయన వ్యాఖ్యలను టీడీపీ, ఎల్లోమీడియా ప్రచారం చేయవచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టడం కూడా పెద్ద కష్టం కాదు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఐప్యాక్కి పీకేకు సంబంధం లేదు: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఒక పీకే(పవన్ కల్యాణ్) అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చాడంటూ.. మంత్రి జోగి రమేష్ విసుర్లు విసిరారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి జోగి రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రశాంత్ కిషోర్కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా?.. అతను సర్వేలెప్పుడు చేశాడు?. ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్నే పీకే చదువుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. .. ‘చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
ప్రశాంత్ కిషోర్ సర్వేకి కొమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
-
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కేశినేని ఫైర్
-
Actor Vijay: విజయ్ పార్టీ కోసం పని చేస్తారా?
చెన్నై: స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తర్వాత.. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉంది. ఈలోపే విజయ్ ‘‘తమిళగ వెట్రి కళగం’’ TVK ఎవరితో చేతులు కలుపుతుంది? ఏ మేర ప్రభావం చూపెడుతుందంటూ డిబేట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రవేశంపై విజయ్ ప్రశాంత్ కిషోర్తో సైతం చర్చలు జరిపినట్లు వార్తలు వినవచ్చాయి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్కు దీనికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. విజయ్ అడిగితే ఆయన పార్టీ కోసం పని చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘విజయ్ నాతో టచ్లో లేరు. ప్రస్తుతం ఎన్నికల వ్యహకర్త వ్యవహారాలను నేను చూడడం లేదు. ఒకవేళ ఆయన నన్ను అడిగినా.. ఆ పని చేయలేను. కానీ, ఆయన కోరుకుంటే మాత్రం సలహాలు ఇచ్చి సాయం చేయగలను. ఎందుకంటే.. నన్ను గౌరవించే వాళ్లకు సలహాలు ఇవ్వడం నాకు అలవాటు’’ అని పీకే క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఇదే ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై స్పందించిన పీకే.. అక్కడి రాజకీయాల్లో విజయ్ ప్రభావంపైనా మాట్లాడారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తేలికగా తీసుకోవద్దని ఇతర పార్టీలకు సూచించారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకు 60 నుంచి 65 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. -
చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్
-
పీకే క్లారిటీ.. పచ్చ బ్యాచ్ గుండె బద్దలు
సాక్షి, హైదరాబాద్: నిజంగా పచ్చ బ్యాచ్ గుండె బద్ధలయ్యే వార్త ఇది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పని చేస్తారని యెల్లో బ్యాచ్ గంపెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేశారాయన. చంద్రబాబు, లోకేష్తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తోంది యెల్లో మీడియా. ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు అల్లుకుంటూ వస్తోంది. అయితే తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారాయన. డిసెంబర్ చివరి వారంలో ఒకే ఫ్లైట్లో నారా లోకేష్తో కలిసి విజయవాడకు వెళ్లిన విషయాన్ని యాంకర్ ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబును కలవడానికే తాను విజయవాడకు వెళ్లానని చెప్పారాయన. అయితే చంద్రబాబుకి తనకు కామన్ స్నేహితుడైన ఓ పెద్ద నేత.. చంద్రబాబు తనను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే విజయవాడకు చంద్రబాబును కలవడానికి మాత్రమే వెళ్లానని చెప్పారాయన. గతంలో తాను వైఎస్సార్సీపీ జగన్మోహన్రెడ్డికి మద్ధతుగా పని చేశానని, ఈసారి తమ కోసం కోసం పని చేయాలని ఆ మీటింగ్లో చంద్రబాబు తనను కోరారని పీకే వివరించారు. అయితే అందుకు తాను కుదరని స్పష్టం చేశానని పీకే వివరించారు. అంతేకాదు ఈసారి ఏపీలో అటు ప్రభుత్వానికి.. ఇటు ప్రతిపక్షానికి ఏ పార్టీకి తాను పని చేయబోనని క్లారిటీ ఇచ్చారాయన. తాను ఎన్నికల వ్యూహకర్త పనికి దూరంగా ఉంటున్న విషయాన్నే తమ కామన్ స్నేహితుడికి చెప్పానని.. అయితే అదే విషయాన్ని చంద్రబాబుని స్వయంగా కలిసి చెప్పాలని ఆయన సూచించారని.. అందుకే తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని పీకే స్పష్టత ఇచ్చారు. దీంతో ఇంతకాలం గంపెడు ఆశలు పెట్టుకున్న యెల్లో బ్యాచ్ ఢీలా పడిపోతోంది. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను - #PrashantKishor దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG — Actual India (@ActualIndia) January 23, 2024 Video Credits:Actual India ఇదీ చదవండి: కష్టం... నేనిప్పుడు ఏమీ చేయలేను -
సీఎం జగన్కు ఒక రకంగా లాభమే.. కారణం ఇదే..
ఏపీలో ఎలా విజయం సాధించాలో తెలియక తెలుగుదేశం పార్టీ అనేక తంటాలు పడుతోంది. తాజాగా తాను బీహారు డకాయిట్ అని విమర్శించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ను తెచ్చుకుని సంప్రదింపులు జరిపిన తీరు చూస్తే, ఆ పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తానే పెద్ద వ్యూహకర్తనని భావించేవారు. ఆయన వ్యూహంతోనే తన మామ ఎన్ టి రామారావును పదవిచ్యుతుడిని చేశారని , ఆ తర్వాత 1999లో భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్లి విజయం సాధించారని టీడీపీ నేతలు చెబుతుండేవారు. తదుపరి 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తులోకి వెళ్లి సఫలం కాకపోయినా, 2014 నాటికి మళ్లీ నరేంద్ర మోదీతో ఎలాగొలా స్నేహం చేసి తిరిగి బీజేపీతో కూటమి కట్టుకుని, అలాగే పవన్ కళ్యాణ్ను తనదారిలోకి తెచ్చుకుని ,రైతు రుణమాఫీ హామీని ఇచ్చి మళ్లీ అధికారంలోకి రాగలిగారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ✍️అప్పట్లో కేవలం ఎస్.వి.యూనివర్శిటీకి చెందిన ఒక ఫ్రొఫెసర్ నాయకత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని సర్వేలు చేయించుకుని రాజకీయం చేసేవారు. మరి అప్పటి వ్యూహ నైపుణ్యత ఏమైందో? లేక ఆయన కుమారుడు లోకేష్ ఈయనను పాత చింతకాయ పచ్చడి కింద భావిస్తున్నారేమో తెలియదు కాని ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్ లను పెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారు. వీరెవరూ చాలరని ప్రశాంత కిషోర్ ను లోకేష్ ప్రత్యేక విమానంలో ఎక్కించుకుని వచ్చారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆద్వర్యంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రశాంత కిషోర్ కీలకంగా ఉన్నారని భావిస్తారు. ఆ తర్వాత కాలంలో కిషోర్ ఈ వ్యాపకానికి దూరంగా బీహారు రాజకీయాలు చేసుకుంటున్నారు. అయినా అప్పుడప్పుడూ ఈ రంగంలోకి వస్తుండవచ్చు. ✍️కాని నలభైఐదేళ్ల సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వీరిపై ఆదారపడవలసి రావడంతో ఆయన లో వ్యూహరచన నైపుణ్యం తగ్గిందని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల నుంచే చంద్రబాబు ఏమని అనేవారు. తనను ఓడించినందుకు ప్రజలంతా బాదపడుతున్నారని చెబుతుండేవారు. కొందరు మహిళలను పెట్టుకుని వచ్చి వారంతా ఏడుస్తున్నట్లు కూడా డ్రామాలు ఆడించారు. అయినా జనం పెద్దగా పట్టించుకోలేదు. తదుపరి స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఆయన చెప్పే డాంబికాలను ప్రజలు నమ్మడం లేదని అర్ధం అయింది.ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రేమ లేఖలు పంపుతున్నట్లు మాట్లాడేవారు. బీజేపీతో పొత్తులో ఉన్న ఆయనను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. నిజానికి పవన్ ను చంద్రబాబే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్ డి ఏ లోకి పంపారని అంటారు. ✍️అది వేరే సంగతి. ఆ తర్వాత కాలంలో జనసేన, టీడీపీ కలుస్తాయని ప్రకటించగానే, ఇంకేముంది.. వైఎస్సార్సీపీ పని అయిపోయింది అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి మీడియా సైతం ఆహా, ఓహోఅంటూ ప్రచారం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు ఉన్న జైలుకు వెళ్లి పరామర్శ చేసి , ఆ వెంటనే పొత్తు ప్రకటించారు. దాంతో ఏపీ ప్రజలంతా తమ కూటమివైపే ఉన్నారని చెప్పడం ఆరంభించారు. ఈలోగానే రాబిన్ శర్మ అనే వ్యూహకర్త సేవలను వాడుకున్నారు. అలాగే సునీల్ కనుగోలు వంటి మరికొందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ,కర్నాటక లో అమలు చేసిన గ్యారంటీ స్కీములను, అమ్మ ఒడి వంటి జగన్ స్కీములను కూడా కాపీ కొట్టి మినీ మానిఫెస్టోని ప్రకటించారు. దాంతో వైఎస్సార్సీపీ ఓడిపోతుందని బీరాలు పోయేవారు. ఇన్ని చేసిన సీనియర్ రాజకీయ నాయకుడు చివరికి ప్రశాంత కిషోర్ ను కూడా శరణు చొచ్చారు. అంటే ఏమిటి దీని అర్ధం. ✍️ తెలుగుదేశం ఇంతగా కృషి చేస్తున్నా బలపడడం లేదనే కదా! పవన్ కళ్యాణ్ను లొంగదీసుకున్నా ప్రయోజనం ఆశించిన రీతిలో రావడం లేదనే కదా! కమ్మ, కాపు సామాజికవర్గాల కాంబినేషన్ అని చెప్పుకున్నా, ఆయా వర్గాలు విశ్వసించడం లేదనే కదా! ఇప్పటికే ఇద్దరు వ్యూహకర్తలను కోట్ల రూపాయల వ్యయంతో నియమించుకున్నా ఫలితం రావడం లేదనే కదా! జనంలో మార్పు కనిపించడం లేదనే కదా! ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాదాకృష్ణ , టివి 5 నాయుడు వంటివారు అబద్దాలు ఊదరగొడుతున్నా జనం పట్టించుకోవడం లేదనే కదా! ప్రశాంత కిషోర్ ఉండవల్లిలో చంద్రబాబు తో భేటీ అయిన తర్వాత కేవలం సీనియర్ నేత కనుక మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కాని ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు రోజూ చేసే ప్రసంగాలన్నిటిని ప్రశాంత్ కిషోర్ నోటిలో పెట్టి , అవన్ని ఆయనే అన్నట్లుగా రాసేశాయి. ప్రచారం చేసేశాయి.జగన్ ప్రభుత్వంపై ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుగుదేశం మీడియా చెబుతోంది. ✍️ ఇందులో నిజం ఉంటే కిషోర్ భేటీ తర్వాత బయటకు రాగానే చెప్పి ఉండాలి కదా! అలా ఏమీ చేయలేదంటేనే ఎల్లో మీడియా ఎప్పటి మాదిరి కల్పిత కధనాలను ఇచ్చిందని అర్దం చేసుకోవచ్చు. మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యాఖ్యచేశారు. మెటీరియల్ ఉంటేనే కదా మేస్రీ పనిచేయగలిగేది అని అన్నారు. అందులో వాస్తవం ఉంది. కేవలం వ్యూహకర్తల వల్లే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాదు. కాకపోతే ఆ పార్టీ విదానాలు , అధినేత తీరుతెన్నులు, ప్రజలలో విశ్వాసం కల్పించడానికి జరిగే కృషి మొదలైనవాటిపై ఆదారపడి ఫలితాలు వస్తుంటాయి. కాకపోతే అవన్ని సానుకూలంగా ఉంటే వ్యూహకర్తల ఐడియాలు కూడా కొంత పనిచేస్తాయి. ఇందులో నాయకుడి చిత్తశుద్ది కూడా ముఖ్యం. ఉదాహరణకు వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తారు అని అభిప్రాయం సర్వత్రా ఉంది. ✍️ దానికి కారణం ఆయన 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేశారు కనుక. ఆయన తీసుకు వచ్చిన సంస్కరణలు,చేస్తున్న అభివృద్ది, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగని విదంగా చేస్తుండడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. అయినా ప్రభుత్వం అన్నాక కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. కాని ప్రభుత్వం చేసిన మంచి పనులతో పోల్చితే ఈ లోటుపాట్లు తక్కువగా ఉంటే జనం పెద్దగా పట్టించుకోరు. జగన్ కనుక తాను చెప్పిన హామీలను అమలు చేయకుండా ఉంటే ఈ పాటికి బదనాం అయి ఉండేవారు.ఏ వ్యూహకర్త ఏమి చేసినా ఇబ్బంది వచ్చేది. జగన్ అలాకాకుండా అన్నీ చేశారు కనుకే ఇంత బలంగా ఉన్నారు నుకోవాలి. ఈ నేపథ్యంలోనే లోకేష్ పనికట్టుకుని ప్రశాంత కిషోర్ను తీసుకు వచ్చారన్న అభిప్రాయం ఉంది. ✍️నిజంగా చంద్రబాబుకు ఇష్టమయ్యే ఇలా చేశారా? లేదా లోకేష్ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది తెలియదు .కాని జరిగిన హడావుడి చూస్తే ఇదంతా లోకేష్ చేసిన హడావుడినేనని భావిస్తున్నారు. అందువల్లే బహుశా పవన్ కళ్యాణ్ ను కూడా పిలవకుండా వీరు ముగ్గురే భేటీ అయి ఉంటారని భావిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇదే ప్రశాంత కిషోర్ ను బీహారు డెకాయిటీ అని, కుల చిచ్చు పెడతారని, బీహారు రాజకీయాలు ఇక్కడ నడవవని, ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబు దూషించారు. ✍️అయినా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో నేర్పరి అయిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రశాంత కిషోర్తో సిగ్గుపడకుండా మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఇది టీడీపీ బలహీనతను చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ను తీసుకు రావడం ద్వారా తెలుగుదేశం, జనసేన కూటమికన్నా వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నది తెలిసిందని చెప్పవచ్చు. ఇది కూడా జగన్ కు ఒకరకంగా మంచిదే! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆటలో అరటిపండు అయ్యిందెవరు..?
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
విజయ మనదే.. ధీమాగా ఉండండి
ఓటర్లకు ఎమ్మెల్యే కేపీ కృతజ్ఞతలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement