-
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
బంగారం ప్రియులకు శుభవార్త. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈ వారంలో వరుసగా తగ్గుముఖం పడుతుండడం కొనుగోలు దారులకు కలిసొచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయని, పసిడి కొనుగోలుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. ఇక తాజాగా, ఆదివారం (మే 26) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పసిడి ధర పెరిగితే..మరో రోజు స్వల్పంగా తగ్గతూ వస్తుంది. తాజాగా, శనివారం (మే 25) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,440 గా ఉంది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.72,600 కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,440గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పసిడి ధర పెరిగితే.. మరో రోజు స్వల్పంగా తగ్గతూ వస్తుంది. తాజాగా, శుక్రవారం (ఏప్రిల్ 24) పసిడి ధరల్లో అత్యంత స్వల్పంగా కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం) ధర రూ.67,290 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 73,410 గా ఉంది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,440 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.73,560గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.67,290 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ. 73,410కి చేరిందిచెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,490 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.73,630కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,290 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,410గా ఉంది. -
మహీంద్రా XUV700 కొత్త వేరియంట్.. ప్రత్యేకతలివే..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్డీ సూపర్స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.సాధారణంగా హై-ఎండ్ మోడల్లతో ఇలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్యూవీగా మారింది.మహీంద్రా ఇటీవలే MX వేరియంట్లో 7-సీటర్ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. -
నిమ్మ.. ‘ధర’హాసం
తెనాలి: నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆ రైతుల మోముల్లో ‘ధర’ హాసం కనిపిస్తోంది. దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ, మార్కెట్లో గరిష్ట ధరలకు క్రయ, విక్రయాలు సాగడంతో రైతులు దిల్ఖుష్ గా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏడు రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు ప్రసిద్ధి తెనాలి మార్కెట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు వేల ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజనులోనే ఉంది. కృష్ణా జిల్లాలో తిరువూరు ప్రాంతంలో 800 ఎకరాల్లో నిమ్మతోటలున్నాయి. ఆ జిల్లా రైతులు దగ్గర్లోని ఏలూరు మార్కెట్కు వెళుతుంటారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మ మార్కెట్లో ప్రతిరోజూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ్నుంచి ఉత్తర భారతదేశంలోని కాశీ, కోల్కతా, ఢిల్లీ, కాన్పూర్కు ఎగుమతి చేస్తున్నారు. సీజనులో 12 లారీలకుపైగా అన్ సీజనులో నాలుగైదు లారీల సరుకు ఎగుమతి అవుతుంటుంది. నికరమైన ఆదాయం నిమ్మతోటలు ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో మూడు కాపులనిస్తాయి. ఒక కాపు మూడేసి నెలలు దిగుబడి నిస్తుంటాయి. ప్రతి కాపునకు సుమారు 200 టిక్కీల వరకు కాయ దిగుబడి వస్తుంది. కాయ సైజు ఆధారంగా ఒక్కో టిక్కీకి 55 కిలోలు వస్తాయి. కొన్నేళ్లుగా నిమ్మతోటల రైతులకు నికరమైన ఆదాయం వస్తున్నందున, కౌలు ధరలు పెరిగాయి. ఎకరా కౌలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరిన సందర్భాలున్నాయి. ఎరువులు, పురుగు మందులు, నీటితడులకు కలిపి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సివస్తుంది. అయినా సరే నిమ్మసాగు లాభిస్తున్నందున మెట్ట ప్రాంతం నుంచి డెల్టా, మాగాణి భూములకు విస్తరించింది. ఈ ఏడాది భేషుగ్గా... గతంకన్నా ఈ ఏడాది నిమ్మ సాగు రైతులకు సంతృప్తినిచ్చింది. తెనాలి నిమ్మ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 మధ్య విక్రయాలు జరుగుతూ వచ్చాయి. గత ఏప్రిల్లో కనిష్ట ధర రూ.68, గరిష్టంగా రూ.80కి పైగా కొనుగోళ్లు జరిగాయి. ఏప్రిల్ 24న కిలో రూ.90లకు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 28 నుంచి కిలో రూ.65లపైన మార్కెట్ లావాదేవీలు కొనసాగుతూ వచ్చాయి. మే ఒకటో తేదీన గరిష్ట ధర రూ.78 పలికింది. ఫుల్ జోష్లో ఉన్న రైతులకు, సీజను ముగింపు దశలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ధరల్లో తగ్గుదల కొంత నిరాశపరిచింది. ఎన్నికల కోసం నాలుగు రోజులు సెలవులివ్వటం, తర్వాత వర్షాలు పడటంతో వ్యాపారులు రేటు తగ్గించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కిలో రూ.30కిపైగా కొనుగోళ్లు జరుగుతుండటం ఒకింత ఊరట. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు కౌలుకు తీసుకున్న రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జూన్లో వచ్చే ఏరువాక పౌర్ణమికి నిమ్మ తోటలకు రైతులు మళ్లీ కౌలు ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో తీవ్ర నష్టాలు లాభదాయకమైన నిమ్మతోటల సాగు 2017, 2018 సంవత్సరాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2017 ఏప్రిల్లో కిలో రూ.20–30 మధ్య పలికిన ధర, మరో నెలకు రూ.12–20 మధ్యకు దిగజారింది. జూన్లో మరింతగా పతనమై రూ.5 నుంచి రూ.10లకు పడిపోయింది. జులైలో రూ.7లకు మించలేదు. మళ్లీ 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. కిలో ఆరేడు రూపాయలకు మించటం లేదని రైతులు గొల్లుమన్నారు. కోత కూలీ కూడా దక్కదన్న భావనతో కాపు కోయకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కో నిమ్మకాయకు రైతుకు మిగిలేది కేవలం 10 పైసలు మాత్రమే. అప్పట్లో ఈ పరిణామాలు నిమ్మ తోటల కౌలు ఒప్పందాలపైనా నష్టాల ప్రభావం చూపాయి. ఎకరా కౌలు రూ.65 నుంచి రూ.70 వేలకు మించలేదు.కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి నిమ్మతోటల కౌలుదార్లను బెంబేలెత్తించింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలకు బ్రేక్ పడింది. తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్నుంచి ఆర్డర్లు లేకుండాపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకుని వారానికి మూడు రోజులు కొనుగోళ్లు చేసి, ఆదుకోవడంతో కొంతలో కొంత కోలుకోగలిగాం. అప్పట్లో కేవలం నెల రోజుల్లో 850 టన్నులను రైతుల్నుంచి కొనుగోలు చేసి ఎగుమతి చేసింది. లారీల సమ్మె రోజుల్లోనూ నిమ్మ రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిలకడగా మంచి ధర లభిస్తుండటంతో ఫర్వాలేదని చెబుతున్నారు.మిగులు గ్రాములు లెక్కిస్తే మేలు నిమ్మ కాపు కాస్త తగ్గినప్పటికీ నిమ్మకాయ ధరలు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులో మిగులు గ్రాములు లెక్కలోకి తీసుకోవటం లేదు. 10 కిలోల 500 గ్రాములు తూకం వస్తే 10 కిలోలకే లెక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు నష్టం. గ్రాములను కూడా పరిగణనలోకి తీసుకుంటే మాకు మేలు జరుగుతుంది. – కొత్త రమేష్ బాబు, నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం రోజు దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. -
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
దేశంలో బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు .. ఎలా ఉన్నాయంటే?
గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (మే 20) పసిడి అత్యంత స్వల్పంగా తగ్గింది.ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటేహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,390 వద్ద ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 74,610 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,540 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.74,760గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,610గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,490 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,7200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,610 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. -
ఆహార ధరల తీవ్రత
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్ ఆరి్టకల్స్లో పాటు, విద్యుత్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్లో సూచీ 0.79 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ⇒ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్లో 59.75 % ఎగశాయి. ⇒ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.38 శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది. ⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఏప్రిల్లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం. -
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?
దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,640గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,510గా ఉంది.కోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది. -
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందివైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430 గా ఉందిముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందికోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
ఈ మల్టీకలర్ ఫేస్మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్మాస్క్లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్లో మల్టీ కలర్స్ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్స్టయిల్కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
గత కొద్ది రోజులుగా పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండో రోజుల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో పెరిగిపోతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ అంశాలు,పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి విపరీమైన డిమాండ్ పెరుగుతోంది. ఒకానొక దశలో 10 రోజుల వ్యవధిలో రూ.10 వేలు పెరగడంపై బంగారం వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగే కొద్ది కొనుగోలు శక్తి తగ్గిపోవడం..ఫలితంగా వ్యాపారం సైతం కుంటుపడుతుందని అంటున్నారు. ఈ తరుణంలో పసిడి ధరలు స్థిరంగా ఉండడం కొనుగోలు, అమ్మకం దారులకు ఊరటనిచ్చినట్లైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్త చేస్తున్నారు. అంతేకాదు ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది -
బంగారం కొనుగోలు దారులకు ‘భారీ’ శుభవార్త
బంగారం కొనుగోలు దారులకు భారీ శుభవార్త. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటికి బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.760 తగ్గాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది -
పసిడి ధరలు పైపైకి.. త్వరలో తులం బంగారం లక్ష
ఢిల్లీ : గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫలితంగా ఉగాది పర్వదినం సందర్భంగా పసిడి ధరలు ఇంకాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి.. రూ.71,730 చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదారబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730 ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,880 బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? సాధారణంగా బంగారం, స్టాక్ మార్కెట్లో లాభాలకు సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం పెరుగుతున్నాయి. యుఎస్లో బంగారం ధరలు (ఏప్రిల్2 నాటికి) 2,250 డాలర్లకు పైగా ఆల్ టైమ్ హైని తాకాయి.2022లో చివరి కనిష్ట స్థాయి నుండి బంగారం ధర 38శాతం పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్1) ప్రారంభంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.70,000 కొత్త మైలురాయిని దాటాయి. ఊహాగానాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ ఇండెక్స్ పతనం, చైనాలో డిమాండ్,యూఎస్ వడ్డీ రేటు తగ్గుదల అంచనాలతో సహా అనేక అంశాలు కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తులం బంగారం రూ.లక్షకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఆర్ధిక నిపుణుల అంచన -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్కి పంజాబ్లోని జలంధర్లో రూ.15. అదే మధ్యప్రదేశ్లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్లో రూ.15 అయితే మధ్యప్రదేశ్లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్కు రూ.250, మటన్కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్హౌజ్లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
దేశంలో బంగారం ధరలు.. పెరిగాయా? తగ్గాయా?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి గత కొన్ని రోజులు నుంచి తగ్గుముఖం పడుతూ వస్తుంది. నేటి బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,850 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,470గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66820గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,400 ఉండగా.. 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,970గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,250 ఉండగా 10 క్యారెట్ల 24 గ్రాముల బంగారం ధర రూ.66,280గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 17న పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్ని ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,100గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,150 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,710గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100గా ఉంది -
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదేనా?
దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పది గ్రాముల బంగారం రూ.70వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పసిడి ధరల మార్పులకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు నిపుణులు. మార్చి నెల ప్రారంభం నుంచి గత గురువారం వరకు పసిడి ధర రూ. 2,700 కంటే ఎక్కువ పెరిగింది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,298కి ఎగబాకింది. అయితే ఇలా ఊహించని విధంగా బంగారం ధరలు పెరగడానికి ఈ ఏడాది జూన్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మదుపుర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. లాభాల్ని గడిస్తున్నారు. ఈ అంచనా ప్రకారం..జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం మదుపర్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది ఇది బంగారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. ఈ సందర్భంగా .. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ఆర్థిక రంగంలో అనిశ్చితి మధ్య ఈ సంవత్సరం బంగారం పెరుగుదల ధోరణి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈక్విటీ మార్కెట్లు క్రమంగా ఖరీదైనవిగా మారుతున్నందున పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపుకు మళ్లించవచ్చు అని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అన్నారు. -
ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా!
మన జీవితంలో మనం ఎన్నోరకాల, ఎంతో ఖరీదైన వస్తువల ధరలను విని ఉంటాం. అవసరమైతే ఆ వస్తువులను చూసుంటాం. అత్యంత ఖరీదైన ఆ వస్తువులలో బంగారం, ప్లాటినమ్ అనుకుంటే పొరబడినట్లే. మరి వాటన్నింటికన్నా మరింత ఖరీదైన వస్తువు(ఖనిజం) గురించి మీకు తెలుసా..! ఇక అదేంటో చూద్దాం. అత్యంత ఖరీదైన ఖనిజాలు బంగారం, ప్లాటినమ్ అని చాలామంది అనుకుంటారు. వీటన్నింటి కంటే అత్యంత ఖరీదైన ఖనిజం ఫ్రాంకియమ్. దీని ధర ఒక గ్రాముకు 100 కోట్ల డాలర్లు (రూ.8229 కోట్లు) ఉంటుంది. ఇవి కూడా చదవండి: ఫండే: పర్వతమే హోటల్! కాదు.. అదొక 'హిల్థ్రిల్'!! -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
రానున్న రోజుల్లో పసిడి ధరలు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.66,270 ఉండగా రానున్న కాలంలో అది కాస్త 70వేలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ప్రకారం, కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను రాబోయే సంవత్సరంలో 10 గ్రాముల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి రూ.70వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో మార్చి 10న దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,100గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,420గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 2న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరగగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,410 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,720గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,060 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,320గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement