-
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
-
మూడు వారాల తర్వాత కూలీగా...
జస్ట్ చిన్న బ్రేక్... ఆ తర్వాత కూలీగా కూల్గా సెట్లోకి అడుగుపెట్టడానికి రజనీకాంత్ ప్లాన్ చేసుకున్నారట. ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ని పూర్తి చేసిన రజనీకాంత్ ఓ మూడు వారాలు విరామం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత జూన్ 6 నుంచి తన మరో చిత్రం ‘కూలీ’ షూటింగ్లో పాల్గొంటారట.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్ రూపొందించారట. ఆ సెట్లోనే కొత్త షెడ్యూల్ ఆరంభించనున్నారని కోలీవుడ్ టాక్. కాగా ఈ చిత్రంలో శ్రుతీహాసన్ నటించనున్నారు. రజనీ కుమార్తె పాత్రలో ఆమె కనిపిస్తారట. ఈ పాత్ర కథకి కీలకంగా ఉంటుందని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. -
రజినీకాంత్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో ఇతర రాష్టాలకు చెందిన స్టార్స్ను తీసుకురావడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా జైలర్ చిత్రంతోనే ఇది మొదలైందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిసి జైలర్ చిత్ర విజయానికి కారణం అయ్యారనే చెప్పాలి. ఇకపోతే తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నటుడు రాణా వంటి వారు నటిస్తున్నారు.కాగా రజనీకాంత్ త్వరలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన 171 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ చిత్రానికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్ర టైటిల్తోపాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, టీజర్ను వరుసగా చిత్ర ప్రారంభానికి ముందే విడుదల చేసి హైప్ను తీసుకొచ్చారు. కాగా కూలీ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్కు జంటగా శోభన నటించనున్నారు.అలాగే నటి శృతిహాసన్ కూడా ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కూడా కూలీ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా నటుడు నాగార్జున ఇప్పటికే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం కుబేరాలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మరి కూలీ చిత్రంలో ఈయన పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. పలు ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇళయరాజా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ప్రముఖ సంగీ త దర్శకుడు ఇళయరాజా వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు ఆయన వ్యవహార ధోరణిని తప్పుబడుతున్నారు. తాజాగా నటుడు రజనీకాంత్ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. దీనికి రజనీకాంత్ ఎలా స్పందించారో తెలుసా?రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చి త్రం వేట్టైయాన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశా రు.కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్నే మార్చి రూపొందించారని.. అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్ను ప్రశ్నించగా.. అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. -
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
పాన్ ఇండియా రేంజ్లో రజనీకాంత్ బయోపిక్
సెలబ్రిటీల జీవిత చరిత్రలు వెండితెరకెక్కడం సహజమే. అలా ఇప్పటికే రాజకీయ రంగంలో మహాత్మాగాంధీ, కామరాజర్, జయలలిత,వైఎస్ఆర్.. క్రీడా రంగంలో మహేంద్రసింగ్ ధోని వంటి పలువురు బయోపిక్స్ సినిమాగా రూపొందాయి. ఇందిరాగాంధీ, సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్లు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ బయోపిక్ను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కర్ణాటకకు చెందిన శివాజీరావ్ గైక్వాడ్ అనే ఒక సాధారణ బస్సు కండెక్టర్ ఇవాళ దక్షిణ భారత సినీ రంగంలో సూపర్స్టార్గా రాణిస్తున్నారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే. రజనీకాంత్ జీవిత పయనం చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పాలి. కాగా ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా వార్త. హిందీలో పలు చిత్రాలను నిర్మించిన సుజిత్ నడియద్వాలా నటుడు రజనీకాంత్ బయోపిక్ను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయన ఇటీవల నటుడు రజనీకాంత్ను కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. ఆయన అనుమతితో ఈ స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ? రజనీకాంత్గా ఎవరు నటిస్తారూ? అన్న విషయాల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కనుందన్న ప్రచారం మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి ఇది హిందీలోనే రూపొందుతుందా? లేక పాన్ ఇండియా చిత్రంగా రానుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గత కొద్ది రోజులుగా విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రితమే హీరో ధనుష్తో విడిపోయిన ఆమె అప్పటినుంచి వేరుగా జీవిస్తోంది. మళ్లీ కలుస్తారని మధ్యలో ఊహాగానాలు వెలువడినా చివరకు విడాకులు తీసుకోవడానికే ఇద్దరూ మొగ్గు చూపారు. ఇందుకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.పిల్లలతో ఇదే ఇంట్లోఇదిలా ఉంటే ఐశ్వర్య కొత్తిల్లు కొన్నదంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నైలోని ఈ కొత్తింట్లోనే ఐశ్వర్య తన కుమారులిద్దరితో కలిసుండనుంది. ఇటీవలే గృహ ప్రవేశం జరగ్గా ఈ వేడుకకు తల్లిదండ్రులు లత-రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం పెద్ద హడావుడి లేకుండా ఎంతో సింపుల్గా జరిగినట్లు తెలుస్తోంది.డిజాస్టర్కాగా ఐశ్వర్య.. ధనుష్ను హీరోగా పెట్టి '3' సినిమా తీసింది. తర్వాత 'వాయ్ రాజా వాయ్' మూవీకి దర్శకుడరాలిగా వ్యవహరించింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 'లాల్ సలాం'తో మరోసారి దర్శకురాలి అవతారం ఎత్తింది. తన తండ్రి రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.చదవండి: నటుడి ఇంట మోగిన పెళ్లి బాజాలు.. వరుడి బ్యాక్గ్రౌండ్ ఇదే! -
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ప్రత్యకమైన స్థానం ఉంది. ఎందరో యువ సంగీత దర్శకులకు ఆయన ఒక ఆదర్శం. తన సంగీతంతో మూడు తరాల ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే, ఇళయరాజా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ 'కూలీ' సినిమా మేకర్స్కు ఆయన నోటీసులు పంపడం కూడా ఒకటి అని చెప్పవచ్చు.ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఎవరైనా ఉపయోగించుకుంటే వారికి కాపీరైట్, రాయల్టీ వంటి విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ తరచుగా కోర్టు నోటీసులు ఆయన పంపడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి స్టార్ సింగర్కు కూడా ఆయన గతంలో నోటీసులు పంపారు. మ్యూజికల్ కన్సర్ట్స్లో తన పాటలు వాడుకుంటున్నారని బాలుకు నోటీసులు పంపడం అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. తన పాటలతో ఉన్న ఒప్పందం గడువు ముగిసినా కూడా ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నాయని కొద్దిరోజుల క్రితం నోటీసులు పంపారు.తాజాగా ఇదిలా ఉంటే.. రజనీకాంత్ సినిమా 'కూలి' మేకర్స్కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన 'తంగమగన్' సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. 'వా వా పక్కం వా' అనే సాంగ్ 'కూలి' టీజర్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్లో సాంగ్ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది. -
తలైవా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం పేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వంటి ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024 -
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం తలైవార్171. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు. కూలీ పేరుతో టైటిల్ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు. రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ టీజర్ను ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ చేసిన పోస్ట్ కోలీవుడ్లో వివాదానికి దారితీసింది. రజనీకాంత్ కూలీ టీజర్ను ఉద్దేశించే వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కొందరు కొట్టి పారేయగా.. మరికొందరు ఖండించారు. ఇంతకీ వెంకట్ చేసిన పోస్ట్ ఏంటి? అసలు అది ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం.దళపతి విజయ్ హీరోగా గోట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కమర్షియల్ తమిళ సినిమా ట్రైలర్ ఫార్ములాపై చర్చించే రీల్ను ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. అందుకో కమెడియన్ కార్తీక్ కుమార్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాల ట్రైలర్స్ అన్ని ఓకే విధంగా ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ అల్ను వెంకట్ ప్రభు ఇన్స్టాలో పంచుకోవడంతో కాంట్రవర్సీగా మారింది.ఇదంతా రజనీకాంత్ కూలీ టీజర్ను ఉద్దేశించే పోస్ట్ పెట్టారని వెంకట్ ప్రభుపై నెటిజన్స్ మండిపడ్డారు. కూలీ టైటిల్ టీజర్ లక్ష్యంగా చేసుకున్నారని రజనీకాంత్ అభిమానులు ఆరోపించారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మద్దతుగా నిలిచారు. ఇదంతా జస్ట్ ఫన్నీ కోసమేనంటూ కొట్టిపారేశారు.తాజాగా తన పోస్ట్పై దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " కాదు.. ఇది మేమంతా చేస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కోసమే.! అతను చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. మనం రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్కు భిన్నంగా ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఫ్యాన్స్ కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు " అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి వెంకట్ ప్రభు తెరదించారు. కాగా.. గతంలో అట్లీ మూవీ మెర్సల్ను సమయంలోనూ ట్రోలింగ్కు గురయ్యారు. ఇదిలా ఉండగా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Breaking News 🚨 : Director @vp_offl reposted an Instagram story in which @Dir_Lokesh is being Mocked for #Coolie Title Teaser , Then Atlee .... Now Lokesh ... pic.twitter.com/AfN201kqGn— Let's X OTT GLOBAL (@LetsXOtt) April 28, 2024 -
Coolie: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా?
కాయకష్టం చేసుకుని బతుకును భారంగా ఈడ్చే వ్యక్తినే కూలీ అంటారు. అంతే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పని చేసేవారినైనా కూలీనే అంటారు. వీటిలో నటుడు రజనీకాంత్ ఏ కోవకు చెందుతారో తెలియదు గానీ, ఇప్పుడు కూలీ పేరు మాత్రం నలుమూలలా మారుమ్రోగుతోంది. సినీ పరిశ్రమలో కూలీ టైటిల్ సక్సెస్కు అడ్రస్ అనుకుంటా. హిందీలో అమితాబచ్చన్ ఇదే పేరుతో చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం కూడా సూపర్హిట్ అయ్యింది. అలాగే తమిళంలోనూ నటుడు శరత్కుమార్ కూలీ పేరుతో చిత్రం చేశారు.తాజాగా ఇదే టైటిల్తో సూపర్స్టార్ రంగప్రవేశం చేస్తున్నారు. అవును ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు లోకేకనకాజ్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నారని, మరో ముఖ్యపాత్రలో క్రేజీ నటి శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్సింగ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇది వరకే విడుదల చేయగా అందులో రజనీకాంత్ గెటప్ను చూసి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సమీప కాలంలో చిత్ర టైటిల్తోపాటు టీజర్ను విడుదల చేశారు. కూలీ టైటిల్, టీజర్లను చూస్తుంటే సరికొత్త రజనీకాంత్ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరపై ఆవిష్కరించనున్నారనేది సుస్పష్టం అవుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ కూలీ ప్రకంపనలు సృష్టిస్తోంది.లోకేష్ కనకరాజ్కు తన చిత్రాల షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్ను విడుదల చేసి, సెన్సేషనల్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ చిత్రం టీజర్లో ఆరంబిక్కలామా అనే డైలాగ్తో టీజర్ను రూపొందించి ఎగ్జైటింగ్కు గురి చేశారు. ఆ తరువాత విజయ్తో చేసిన లియో చిత్ర టీజర్లో బ్లడీ స్వీట్ అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు.తాజాగా రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్కనకరాజ్నే అవుతారు. కాగా కూలీ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్ర టైటిల్ను ప్రకటించగానే నటుడు ధనుష్ తన ఎక్స్ మీడియాలో మాస్ అని పేర్కొనడం మరో విశేషం. -
లోక్సభ పోలింగ్ : తమిళనాడులో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
రజినీకాంత్ కూతురిగా ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
సూపర్స్టార్ రజినీకాంత్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా దీని తరువాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్ను నిర్ణయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్ను, టీజర్ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందన్నారు. కాగా తాజాగా ఇందులో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. కోలీవుడ్లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించి 25 ఏళ్లు అవుతోంది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించనున్నడం విశేషమే. మరో విషయం ఏమిటంటే శృతిహాసన్ తమిళంలో నటించి చాలా కాలం అవుతోంది. లాభం చిత్రం తరువాత ఈమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తరువాత ఈ బ్యూటీకి కోలీవుడ్లో నటించే అవకాశం వచ్చిందన్న మాట. అయితే ఇటీవల ఈమె తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా శృతిహాసన్, రజినీకాంత్ 171 చిత్రంలో నటించే విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆ స్టార్ హీరో సలహా.. బ్లాక్బస్టర్ హిట్.. నా కోరిక ఏంటంటే?
నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్గా రాణిస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికీ ఆయనను తెలుగు చలనచిత్రసీమకు బాస్గా చెప్పుకుంటూ ఉంటారు. వయసు పైబడుతున్నా మాస్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024 కార్యక్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. '1983లో ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. అలాగే బాలచందర్గారితో రుద్రవీణ సినిమా చేశాను. ఈ చిత్రానికి నాలుగైదు జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికిగానూ నిర్మాతకు ఒక్కరూపాయి లాభం రాలేదు. దానికోసం ఎదురుచూస్తున్నా అలాంటి పరిస్థితులను నేను కోరుకోను. నిర్మాతలను కాపాడాలనుకుంటాను. ఎస్పీ బాలు.. 'ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేస్తావేంటి? దంగల్ లాంటి చిత్రాలు చేయొచ్చు కదా' అని అడిగేవారు. అలాంటివి చేయడమంటే నాకూ ఇష్టమే.. కానీ నిర్మాతలు నష్టపోతారు. అందుకే కమర్షియల్ సినిమాలే ఎంచుకుంటున్నానని సమాధానమిచ్చాను. ఇప్పుడు నేను మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఎలాంటి అంచనాలు లేవు. నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ నా సినిమాలు చూస్తూ పెరిగారు. కాబట్టి నేను ఏ మూవీలో, ఏ స్టైల్లో నటిస్తే జనాలకు నచ్చుతుందో వారికి బాగా తెలుసు. వాళ్లిప్పుడు లేరు వాళ్లు మాత్రమే నన్ను కరెక్ట్గా చూపించగలరు. కొంతకాలం క్రితం రజనీకాంత్ ఓ మాట చెప్పాడు. మనం పని చేయాలనుకున్న లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు లేరు. ఇప్పుడంతా కొత్త దర్శకులే.. మన అభిమానులే డైరెక్టర్స్ అయితే వారిపై ఆధారపడటం మంచిది. మనల్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న విషయం వారికే బాగా తెలుసు అని చెప్పాడు. ఇదే నిజం. నా అభిమాని బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తే బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇకపోతే జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్లో రామ్చరణ్, జాన్వీకపూర్ నటిస్తే చూడాలనుంది' అని చిరంజీవి తెలిపాడు. చదవండి: అవసరం ఉందేమో.. దొంగకు సాయం చేయండన్న నటుడు.. నెట్టింట ట్రోలింగ్ -
'జైలర్' ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. అదిరిపోయే టైటిల్తో సీక్వెల్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్కు జైలర్తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ వార్త వైరల్ అవుతుంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట. 'హుకుమ్' పేరుతో పార్ట్ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్లో ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారని టాక్ ఉంది. #Jailer2, #Hukum హ్యాష్ట్యాగ్లతో సోషల్మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్కు ఏప్రిల్ 22న టైటిల్ ఖరారు కానుంది. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. జైలర్లో కన్నడ నటుడు శివ రాజ్కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే.. వర్మన్గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. HUKUM... TIGER KA #HUKUM 🔥😎 Morattu excited for the re-entry of the character & combo 💥#Jailer2 #Vettaiyan #Thalaivar171 #ThalaivarNirandharam pic.twitter.com/VTdJI7leXq https://t.co/gBS4XMgze8 — Shreyas Srinivasan (@ShreyasS_) April 12, 2024 -
32 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్తో రజనీకాంత్ సినిమా
దళపతి చిత్రం కాంబో రిపీట్ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ము ట్టి, అరవిందస్వామి కలిసి నటించిన చిత్రం దళపతి. ఇందులో శోభన కథానాయకిగా నటించారు. 1988లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు రజనీకాంత్ ప్రస్తుతం వేటైయాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్, యువ నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా దీనికి 'కళుగు' అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చిత్రం టైటిల్, టీజర్ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు లోకేష్ ఇంతకుముందు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన సీనియర్ నటి, నృత్య కళాకారిణి శోభన నటించనున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. వీరిద్దరు కలిసి నటించిన దళపతి చిత్రం 1988లో విడుదలైన విషయం గమనార్హం. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంతా అన్నది తెలియాల్సి ఉంది. -
అక్టోబర్లో వేట్టయాన్
అక్టోబర్లో థియేటర్స్కు వస్తున్నాడు ‘వేట్టయాన్ ’. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వేట్టయాన్’. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ , జీకేఎమ్ తమిళ కుమరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వేట్టయాన్ ’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. -
ఇప్పుడిదే ట్రెండ్.. రజనీ రెండు సినిమాల్లోనూ..!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైభీమ్' ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం. ఇదిలా ఉంటే జూన్ నెలలో ప్రారంభం కానున్న రజనీ 171వ చిత్రానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారణం ఈ చిత్రానికి లోకేష్కనకరాజ్ దర్శకత్వం వహించడమే! సపోర్టింగ్ రోల్స్.. రజనీకాంత్ ఇటీవల కాలంలో తన చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల కోసం ఇతర భాషలకు చెందిన స్టార్ నటులను వాడుకుంటున్నారు. జైలర్ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్లు అతిథి పాత్రల్లో నటించారు. అలాగే తాజాగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షారుక్ 'నో'.. రణ్వీర్ 'ఓకే' త్వరలో సెట్పైకి వెళ్లనున్న రజనీకాంత్ 171 చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముందుగా షారుక్ ఖాన్ను నటింపజేయడానికి లోకేష్ కనకరాజ్ ప్రయత్నించగా, ఆయన నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రానికి కళుగు (తెలుగులో గద్ద) అనే టైటిల్ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్తో కలిసి బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఆయన ఇందులో సపోర్టింగ్ పాత్రను పోషిస్తారా?లేక ప్రతినాయకుడిగా నటిస్తారా? అన్నది సస్పెన్స్! చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
రజనీకాంత్ 171వ చిత్ర టైటిల్ ఇదేనా?
నటుడు రజనీకాంత్ చిత్రం అంటేనే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఇటీవల జైలర్ వంటి అదిరిపోయే హిట్ చిత్రానిచ్చిన ఈయన ప్రస్తుతం జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా తదుపరి ఈయన తన 171వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం గురించే పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ గెటప్ చూస్తేనే ఇదేదో డాన్ కథా చిత్రంగా ఉంటుందనిపించేలా ఉంది. వైరెటీగా రజనీకాంత్ చేతులకు వాచీలతో కూడిన భేడీలు వేసిన ఫొటో ఉన్న పోస్టర్కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇది టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి కథ కాదని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది మాదకద్రవ్యాలు, కిడ్నాప్కు సంబంధించిన కథ కూడా కాదని చెప్పారు. దీంతో ఈ చిత్ర కథపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రం టైటిల్ను ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు, షూటింగ్ను జూన్లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. కాగా విక్రమ్ చిత్రంతో నటుడు కమలహాసన్కు సంచలన విజయాన్ని అందించిన లోకేశ్కనకరాజ్, ఇప్పుడు రజనీకాంత్ను చాలా డిఫరెంట్గా చూపించడానికి యత్నిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్ను నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో రజనీకాంత్ విలన్గా నటించనున్నారనే ప్రచారం మరోపక్క సాగుతోంది. కాగా 'కళుగు' అంటే ఆంగ్లంలో 'ఈగిల్' అని అర్థం. కాగా ఇదే టైటిల్తో రజనీకాంత్ 1981లో కథానాయకుడిగా నటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
ఈ హీరో క్రేజ్, కలెక్షన్స్ చూసి రజనీకాంతే భయపడ్డారు!
సుమారు 12 ఏళ్ల గ్యాప్ తరువాత నటుడు రామరాజన్ హీరోగా నటిస్తున్న చిత్రం సామాన్యన్. ఆర్.రాకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రామరాజన్, ఇళయరాజా కాంబోలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా సుమారు 23 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న చిత్రం సామాన్యన్. నటి నక్సాచరణ్, స్మృతి వెంకట్, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో రాధారవి, ఎంఎస్.భాస్కర్, లియో శివకుమార్, రాజారాణి పాండియన్, మైమ్ గోపి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంతే భయపడ్డారు శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఆడియో లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కేఎస్.రవికుమార్, శరణసుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. సహయ దర్శకుడిగా 9 ఏళ్లు కష్టపడ్డప్పటికీ.. తనను దర్శకుడిని చేసింది రామరాజన్నేనని చెప్పారు. ఈయన నటించిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయని, ఒక సమయంలో రామరాజన్ గురించి నటుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ రామరాజన్ మాస్ ఫాలోయింగ్, వసూళ్లను చూస్తుంటే తనను మించి పోతారేమోనని భయంగా ఉందని అన్నారన్నారు. 23 ఏళ్ల తర్వాత.. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. వనవాసం ముగించుకుని వచ్చిన రామరాజన్కు ఇక పట్టాభిషేకమేనని పేర్కొన్నారు. ఆయన పరిగెత్తే గుర్రం కాదని, పలు గుర్రాలను పరిగెత్తించిన నటుడన్నారు. రామరాజన్ చిన్న మక్కళ్ తిలగం అని దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ పేర్కొన్నారు. 23 ఏళ్ల తర్వాత ఇళయరాజా, రామరాజన్ కలిసి పని చేస్తున్న ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం భాగ్యంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు రాకేశ్ అన్నారు. నటుడు రామరాజన్ మాట్లాడుతూ 2010లో పార్టీ మీటింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురయ్యానని, వెంట్రుక వాసిలో బతికి బయట పడ్డానని, ఇప్పుడు ఈ చిత్రంలో నటించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను మళ్లీ ప్రాణాలతో బయట పడ్డానన్నారు. చదవండి: కలెక్షన్స్తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే -
ఆ రోజే టైటిల్
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ టీజర్ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయన్నుట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
OTT: 'ఏజెంట్' బాటలో మరో భారీ డిజాస్టర్ సినిమా
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమాకు ఓటీటీ కష్టాలు ఉన్నట్లు సమాచారం. అఖిల్ 'ఏజెంట్' సినిమా మాదిరి ఈ చిత్రం కూడా ఓటీటీలోకి ఇక రాదని వార్తలు వస్తున్నాయి. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న విడుదలైన 'లాల్ సలామ్' వచ్చి నలభై రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. గతంలో డైరెక్టర్ ఇశ్వర్య రజనీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'లాల్ సలామ్ సినిమాకు సంబంధించి 21 రోజులు షూటింగ్ ఫుటేజీ పోయిందని చెప్పింది. అందులో రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్లపై 21 రోజుల పాటు కష్టపడి ఓ క్రికెట్ మ్యాచ్ సీన్ షూట్ చేశాం. 2500 మందితో 10 కెమెరాల సాయంతో ఎంతో ఖర్చుతో వాటిని చిత్రీకరించాం. కానీ, షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ పోయింది. దీంతో రీ షూట్ చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. సినిమాను అలానే విడుదల చేయడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది.' అని ఆమె తెలిపింది. ఇప్పుడు ఇదే హార్డ్డిస్క్ మిస్సింగ్ ప్రభావం ఓటీటీపై పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ముందుగానే నెట్ఫ్లిక్స్తో డీల్ కుదుర్చుకోవడం.. ఒప్పందం ప్రకారం నెట్ఫ్లిక్స్ను సంప్రదించకుండా సినిమా విషయంలో మేకర్స్ పలు నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు ఓటీటీ విషయంలో చిక్కులు వచ్చినట్లు సమాచారం. క్రికెట్ సీన్స్ రీ-షూట్ చేయాలనే నిబంధన ముందుగానే నెట్ఫ్లిక్స్ పెట్టినట్లు టాక్ ఉంది. అది ఇప్పుడు అవకాశం లేకపోవడంతో లాల్ సలామ ఓటీటీ విడుదలకు చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement