-
సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
సాక్షి, హసన్పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ సూసైడ్ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్ఫోన్, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తిహన్మకొండ - పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని అదృశ్యమైన వ్యక్తి.తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపణ. తన… pic.twitter.com/WFHGs1Qkea— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024 Video Credit: Telugu Scribeఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యూఎస్ ప్రెసిడెంట్
న్యూయార్క్: ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి... ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నని తెలిపారు. 1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్... తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.ఆ బాధలో తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ, తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అదే విధంగా మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్తో డిబేట్ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్ సైతం ప్రతిస్పందించారు. ‘ నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్తో డిబేట్కు అంగీకరిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఇక.. అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి. -
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురై మృతి చెందారు. 2019లోక్సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
ఎంత మానసిక క్షోభ అనుభవించావో అమ్మా..!
తణుకు అర్బన్: తన ఇద్దరు కుమార్తెలను వదిలి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటే.. ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు అంజలి ఘటిస్తూ తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన తెలిపింది. ఈ కార్యక్రమానికి మంత్రి కారుమూరి సంఘీభావం తెలిపి మాట్లాడారు. తనకు సొంతిల్లు వచ్చిందని.. జగనన్న తన కల నెరవేర్చాడని తెనాలికి చెందిన గీతాంజలి ఒక యూట్యూబ్ చానల్కు ఎంతో భావోద్వేగంతో తెలిపిన తీరును ప్రజలంతా స్వాగతించారని, అది ఓర్వలేని టీడీపీ పచ్చ దొంగలు ఆమైపె సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మటమే కాకుండా అసభ్యకరంగా పెట్టిన పోస్టులకు చలించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గీతాంజలి విషయంలో స్పందించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయంతోపాటు అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఐటీడీపీ పేరుతో పెడుతున్న పోస్టులు ఎంతోమంది జీవితాలను చిదిమేస్తున్నాయని గీతాంజలి ఒక్క విషయమే బయటపడిందని చెప్పారు. ఒక మహిళ ప్రభుత్వం వలన తనకు జరిగిన మంచిని చెప్పుకోవడం వలన ఇలా జరిగిందంటే ప్రతిపక్షాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముందుగా గీతాంజలి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మనన్ నత్తా కృష్ణవేణి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి రాము, తణుకు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, ఉండ్రాజవరపు గీత, ఎం.లలిత, ఫహీమా, కొఠారు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేనవి నీచ రాజకీయాలు బుట్టాయగూడెం: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ, జనసేన పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన నాలుగో విడత చేయూత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్స్ను తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల భర్త, పిల్లలు అన్యాయమైపోతారని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గీతాంజలి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు. నడిపల్లిలో రాస్తారోకో పెదవేగి : గీతాంజలిది ఆత్మహత్య కాదని టీడీపీ, జనసేన సోషల్మీడియా చేసిన హత్యగా పరిగణించి కారకులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టేటి స్టాలిన్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం నడిపల్లిలో గీతాంజలి మృతికి నిరసనగా రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ఉక్కుర్తి నాగేశ్వరరావు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడు ఎం. గోపాలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవాపురంలో ర్యాలీ చింతలపూడి: గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ గిరి భోగారావు డిమాండ్ చేశారు. బుధవారం చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ పడమటి ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి గీతాంజలి మృతికి శ్రధ్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో చుండూరి కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన వల్లే గీతాంజలి చనిపోయింది తణుకు అర్బన్: టీడీపీ, జనసేన సామాజిక మాధ్యమాల్లో వేధించడం వల్లే తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని తణుకు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పొడుగు రామాచారి (రాము) అన్నారు. గీతాంజలి మృతికి బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రభుత్వం తనకు దస్తావేజులతో కూడిన ఇంటిపత్రాలు ఇచ్చారని సంతోషంగా చెప్పిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన గీతాంజలిని ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించడం దారుణమని అన్నారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా తనకు అందిన సౌకర్యాన్ని చెప్పుకున్నందుకు ఆమె చనిపోయేంతగా వేధిస్తారా అని నిలదీశారు. వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గొల్తి హరికృష్ణప్రసాద్, కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, ఉపాధ్యక్షులు టేకు రాజు, ధవళేశ్వరపు సుబ్బారావు, కోరుమిల్లి సుబ్బారావు, నాగమల్లి సాయి, తమిరి శివకుమార్, ఉప్పరాపల్లి బాలు పాల్గొన్నారు. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. కాబోయే భర్త మాట్లాడి వెళ్లి కొద్ది సేపటికే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. సోమవారం సాయంత్రం హస్టల్లోని బాత్ రూమ్కు వెళ్లిన ఆమె బయటికు రాకపోవడంతో రూమ్మేట్స్ తలుపులు తెరిచి చూడగా. టవల్తో షవర్ రాడ్కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు ఆమె సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్ పూర్తి చేసింది. బుధవారం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హస్టల్ వద్దకు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాషింగ్టన్ ఇజ్రాయెల్ ఎంబసీ.. యూఎస్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
వాషింగ్టన్: అమెరికా ఎయిర్ఫోర్స్ ఉద్యోగి ఒకరు వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు తాను మంటలంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. మంటలంటించుకునే మందు అతడు మాట్లాడుతూ ‘గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఇక ఏ మాత్రం నేను భాగం కాను. ఇందుకే నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’అని చెప్పాడు. ఈ వీడియో ట్విట్చ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది. వెంటనే అధికారులు వీడియోను డిలీట్ చేయించారు. ఘటన అనంతరం మంటలార్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యూనిఫాం వేసుకుని తనను తాను కాల్చుకున్న వ్యక్తి అమెరికాలోని టెక్సాక్కు చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగి అని అధికారులు నిర్ధారించారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ఇదీ చదవండి.. దుస్తులపై వివాదం.. మహిళపై మూకదాడికి యత్నం -
జీవితంపై విరక్తితో తల్లీకూతురు ఆత్మహత్య
యశవంతపుర: ఎంత కష్టం వచ్చిందోగానీ తల్లీకూతురు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగి జిల్లా శహబాద్ దగ్గర కాగిణా నదిలో జరిగింది. కలబురగి నగరంలోని ఎంబీ నగరలో నివసించే తల్లి సుమలత (45), కూతురు వర్ష (22) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. రాత్రి కాగిణా నదిలో దూకారు. మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శహబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారింట్లో కుటుంబ కలహాలు ఉన్నట్లు ఇరుగుపొరుగు చెప్పారు. -
ఇద్దరు ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి, భువనగిరి క్రైం: భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైరంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పట్టికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం హృదయవిధారకంగా ఉందని చెప్పారు. వారి సూసైడ్ లెటర్ పలు అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు. హాస్టల్ పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలన్నారు. హాస్టల్కు తరచూ బయటి వ్యక్తులు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం… హాస్టల్ వార్డెన్ , వాచ్మాన్ ,ఆటో డ్రైవర్పై తమకు అనుమానాలు ఉన్నాయని భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో హ్యాండ్ రైటింగ్ తమ పిల్లలది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ విషయంలో చిన్న ఘటన జరగగా తమ దృష్టికి వచ్చిందని, ఇది పక్కా హత్యే అని వారు మండిపడ్డారు. హాస్టల్లో ఇంతా జరగుతున్న వార్డెన్, యాజమాన్యం ఏం చేస్తున్నారని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వాచ్ మ్యాన్,ఆటో డ్రైవర్, వార్డెన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
యువకుడు ఆత్మహత్య.. కొన్నాళ్లుగా మహిళతో చనువు...
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అశోక్రోడ్కు చెందిన మహ్మద్ ఖాసీం కుమారుడు సల్మాన్ (30) స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అశోక్రోడ్ రోడ్లోనే ఉంటున్న ఓ మహిళతో కొంతకాలం చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత సదరు మహిళ కాదనడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 22న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో పురుగుల మందు తాగాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా బంధువులకు సమాచారం అందించాడు. గమనించిన స్థానికులు 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఎండీ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గోదావరిఖని వన్టౌన్ ఎస్సై స్వామి తెలిపారు. -
తల్లి మందలించడంతో ఇంటర్ యువతి తీవ్ర విషాదం..
నల్గొండ: తల్లి మందలించిందనే కారణంతో గడ్డిమందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల యాదయ్య, సైదమ్మల నాలుగో కుమార్తె పూజిత(17) సూర్యాపేటలోని సాయిగౌతమి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో పూజిత శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. చదువు విషయమై తల్లి సైదమ్మ కూతురు పూజితను మందలించింది. ఈ కారణంతో పూజిత వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న గడ్డి మందు సేవించింది. చుట్టుపక్కల వారు చూసి సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి.అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి.ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మానసికంగా కృంగిపోయి..
కరీంనగర్: ఆరోగ్యం సహకరించడం లేదని, ఆ స్పత్రుల్లో చూపించుకున్నా నయం కావడంలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని గోధూర్లో చోటుచేసుకుంది. మౌస్మి(17) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తరచూ అనారోగ్యం బారిన పడుతున్న ఆమె చదువులో వెనుకబడుతున్నానని మానసికంగా కృంగిపోయింది. గత నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఉమాసాగర్ బుధవారం తెలిపారు. మృతురాలి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఊయలే.. ఉరితాడై -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
విజయవాడరూరల్: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీసు స్టేషన్ పరిధి శాంతినగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పాయకాపురం శాంతినగర్కు చెందిన అంబటి ప్రతాప్కుమార్ ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య అంబటి సాయికన్య(32) చీటీల వ్యాపారం చేస్తుంటుంది. వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరిగిపోవడంతో, అవి తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి బెడ్రూమ్లో పడిపోయారు. వారి పిల్లలు చూసి పక్కింటివారికి చెప్పగా వారు వచ్చి దంపతులిద్దరినీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారిని పరిశీలించి సాయికన్య చనిపోయిందని నిర్ధారించారు. మృత్యువుతో పోరాడుతున్న ప్రతాప్కుమార్కు చికిత్స అందిస్తున్నారు. ప్రతాప్కుమార్ అన్న ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. నేనేం పాపం చేశాను!
అయిజ: భార్యపై అనుమానంతో రెండేళ్ల కుమా రుడిని పొట్టనపెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. వివరా లిలా.. అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో 2019లో వివాహమైంది. వీరికి కుమార్తె నయనిక, కుమారుడు నందకిశోర్(2) ఉన్నారు. కొంతకాలంగా భార్యను అనుమా నిస్తూ భార్గవ తరుచూ గొడవ పడుతున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పదిరోజుల క్రితం కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లేందుకు శ్రావణి ప్రయత్నించగా.. అడ్డు కున్న భార్గవ.. కుమారుడు నందకిషోర్ను లాక్కున్నాడు. దీంతో ఆమె కూతురు నయనికను తీసుకొని వెళ్లిపోయింది. నందకిషోర్ ప్రతిరోజూ అమ్మ కావాలని ఏడుస్తుండడంతో.. భరించలేక పసివాడికి నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టాడు. పదిరోజులుగా భార్య లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్గవ వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన అతని తల్లి వడ్లకుమారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. దీంతో కోలుకున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భార్గవ రెండేళ్ల తన కుమా రుడు నందకిషోర్కు ఎలుకల మందు తాగించి, తానూ తాగాడు. గురువారం ఉదయం తల్లి కుమారి నిద్ర లేచేసరికే కొడుకు, మనవడు అపస్మారక స్థితిలో ఉండడం గమనించి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భార్గవ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నా.. పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. శాంతినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్లో
సంగారెడ్డి: జులాయిగా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోలు మండలం ఎల్కల్లో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్సై అరుణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కల్కు చెందిన ఎల్లొల్ల చంద్రం కుమారుడు వినయ్ (16) చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. స్నేహితులతో జులాయిగా తిరగొద్దని, ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ డిసెంబర్ 29న గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గడ్డిమందు తాగాడు. విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. గమనించి స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇవి చదవండి: బర్త్డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం!
కరీంనగర్: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందుకు ఆ ముగ్గురే కారణం..’ అంటూ ఓ యువకుడి సూసైడ్నోట్ సిరిసిల్లలో సోమవారం కలకలం సృష్టించింది. బాధితుడు మీడియా ప్రతినిధులకు నేరుగా వాట్సాప్లో పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన ఓ ప్రముఖుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. ఎన్నికల్లో అతని విజయం కోసం ఆ యువకుడితోపాటు అతని స్నేహితులు పనిచేసేందుకు రూ.లక్ష పారితోషికం మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో అతను.. లేదంటే ఓ జాతీయ పార్టీ ప్రతినిధి గెలుస్తారని.. మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపైనే కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయాడు. చేసిన పనికి డబ్బులు రాక తనతోపాటు స్నేహితులు కూడా ఇబ్బందుల పడుతున్నారని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేగా పోటీచేసిన సదరు అభ్యర్థి, అతని సడ్డకుడు, పద్మశాలి వర్గానికి చెందిన మరో నాయకుడు కలిసి మోసం చేశారని, తన ఆత్మహత్యకు వారే కారణం అంటూ ఆ నోట్ రాసుకొచ్చాడు. ఈ విషయంపై సిరిసిల్ల పోలీసులు విచారణ చేపడుతున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం! -
ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి..
సంగారెడ్డి: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో మహిళ మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ.నరేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మళి మహాదేవి(35), భర్త శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రతి రోజూ తాగేవాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ రెండు నెలల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మహాదేవి డిప్రెషన్లోకి వెళ్లింది. మనోవేదనకు గురై నిత్యం బాధపడుతున్న ఆమె ఆదివారం గ్రామ శివారులోని ఎల్లమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని బావిలో నుంచి తీసి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి అత్త మామ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాగుడుకు బానిసై.. ఇదే గ్రామానికి చెందిన ఆలిగే నర్సింలు(44) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేవాడు. వారం రోజుల నుంచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని సత్వార్ వ్యవసాయ బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నాడని భావించి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నరేశ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెతికినా దొరకలేదు. బావిలో నిండుగా నీరు ఉండడంతో రెండు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇవి చదవండి: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం! -
అన్నీ సంచలనాలే.. ‘టీఎస్పీఎస్సీ’ కేసుతో కరీంనగర్కు లింకు!
కరీంనగర్: 'ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ ఏడాది పలు సంచలన సంఘటనలకు వేదికైంది. హత్య, ఆత్మహత్య, మిస్సింగ్, చోరీలు, కాల్పులు, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ, అవినీతి, అరెస్టు, టీచర్ల బయోమెట్రిక్ డుమ్మా, తిరుపతికి ప్రయాణికుల ఇక్కట్లు.. ఇలా ఏ రకమైన వార్త తీసుకున్నా అది రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. వీటన్నింటిపై 'సాక్షి' దినపత్రిక స్పాట్ వార్తలతో పాటు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం వెంటవెంటనే చర్యలు తీసుకుంది. పలుశాఖల అధికారుల అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. బాధ్యులను విధుల నుంచి తప్పించారు.' - సాక్షిప్రతినిధి, కరీంనగర్ జనవరి 1–2023: ఆత్మహత్యలు కావు హత్యలే.. గతేడాది కొత్త సంవత్సరం రోజున గంగాధరలో ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు, తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణాల గుట్టు నూతన సంవత్సరం రోజునే వీడింది. తండ్రే తన పిల్లలకు, భార్యకు ఎన్ఏఓహెచ్ అనే రసాయనం కలిపి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తొలుత ఈ విషయాన్ని ‘సాక్షి’ వెల్లడించింది. ఆ తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మూసివేశారు. జనవరి 05: సరసమైన ధరలకే విరాసత్.. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయంలో వారసత్వ భూములు విరాసత్ చేసే విషయంలో ఫోన్ పే ద్వారా రూ.లక్షల లంచాలు తీసుకున్నారు. అయినా పని చేయకపోవడంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడంతో విచారణ జరిపిన కలెక్టర్ కార్యాలయం తహసీల్దార్ను బదిలీ చేసి, వీఆర్ఏ, వీఆర్వోలను సస్పెండ్ చేసింది. జనవరి 21: పల్లెల్లో సహారా కలకలం.. అధిక వడ్డీ రేట్ల ఆశచూపి, డిపాజిట్లు సేకరించిన సహారా సంస్థ కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. ఈ విషయం గోప్యంగా ఉంచి వారిని మభ్యపెడుతూ వస్తున్నారు. ఈ కుంభకోణం ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనంతో వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు చేసి, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 03–2023: తల్లీపిల్లలను కలిపిన సాక్షి.. కరీంనగర్ మంకమ్మతోట నుంచి ఓ మహిళ ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి, మహారాష్ట్ర తీసుకెళ్లింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో పోలీసులు ఆ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి, నిందితురాలిపై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 24: కొండగట్టు ఆలయంలో బీదర్ దొంగల చోరీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయంలో బీదర్ నుంచి వచ్చిన దొంగలు చోరీ చేశారు. పలు వెండి ఆభరణాలు, తాపడాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ‘సాక్షి’ ముందుగానే ఎక్స్క్లూజివ్గా పాఠకులకు అందించింది. మార్చి 15: ‘కట్టా’ను పట్టుకున్న సాక్షి.. నకిలీ అర్హతలతో 34 ఏళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో కొలువు చేస్తున్న కట్టా విష్ణువర్దన్ అనే ఉద్యోగి నిర్వాకంపై ‘సాక్షి’ వరుస పరిశోధన కథనాలు వెలువరించింది. వీటికి ఉన్నతాధికారులు స్పందించి, ఆయన అక్రమాలు నిజమేనని తేల్చారు. అనంతరం సస్పెన్షన్ వేటు వేశారు. మార్చి 16: టీచకుడు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తోటి మహిళా టీచర్లను వేధిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. పకడ్బందీగా ఆయన వికృత చేష్టలను లోకానికి చూపించడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సస్పెన్షన్ వేటు వేశారు. మార్చి 18: టీఎస్పీఎస్సీ కలకలం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలలీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్రెడ్డిది జగిత్యాల జిల్లానే. దీంతో సిట్ బృందం పలు మార్లు జిల్లాకు వచ్చి విచారణ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లోనూ లీకేజీకి లింకుందని గుర్తించారు. ఆ తర్వాత ఓ ప్రముఖ కాలేజీలో పనిచేసే సిబ్బందిని కూడా అరెస్టు చేశారు. ఏప్రిల్ 1: పోలీసులకు శాశ్వత ఫోన్ నంబర్.. పోలీసులందరికీ ఒకే శాశ్వత నంబర్ను కేటాయిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని కరీంనగర్ నుంచే అమలుకు నిర్ణయించింది. డిపార్ట్మెంట్లో చేరిన వ్యక్తి రిటైరయ్యే వరకు ఒకే నంబర్ ఉంటుంది. దాన్నే పీఎఫ్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానిస్తారు. ఏప్రిల్ 4: బండి సంజయ్ అరెస్టు.. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఎంపీ బండి సంజయ్ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి, హనుమకొండకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎంపీ సెల్ఫోన్ పోయింది. ఇంతవరకూ దొరకలేదు. ఏప్రిల్ 20: మానకొండూర్లో కాల్పుల కలకలం.. మానకొండూర్ మండల కేంద్రంలో కాల్పులు జరిగాయన్న వార్త కలకలం రేపింది. అరుణ్ అనే యువకుడిపై గోదావరిఖనికి చెందిన సాయితేజ్, అతని మిత్రులు కలిసి హత్యాయత్నం చేశారు. నాటు తుపాకీతో కాల్చగా అది పేలలేదు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మే 24: నా కోడిని చంపేశారు.. తన టర్కీ కోడిని పొరుగింటి వ్యక్తి చంపాడంటూ ఓ వ్యక్తి కరీంనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఈ వార్త ‘సాక్షి’లో ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. జూన్ 27: ఉగ్రకేసులో తండ్రీకూతుళ్ల అరెస్టు.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో రామగుండంలో తలదాచుకున్న ఓ తండ్రీకూతుళ్ల ను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్కి చెందిన ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులతో చాటింగ్ చేసినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నా రు. తండ్రి గతంలో హైదరాబాద్లో జరిగిన ఓ పే లుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడని సమాచారం. జూలై 03: దళితబంధులో మామూళ్ల పర్వం.. దళితబంధు పథకంలో మామూళ్ల పర్వంపై ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరో ఉద్యోగి సస్పెన్షన్ భయంతో లీవు మీద వెళ్లారు. జూలై 04: డుమ్మా మాస్టార్లు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు బయోమెట్రిక్ ఉన్నా డుమ్మా కొడుతున్న వైనాన్ని ‘సాక్షి’ డుమ్మా మాస్టార్లు పేరిట కథనం ప్రచురించింది. దీనికి కరీంనగర్ డీఈవో స్పందించి, ఆలస్యమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జూలై19: పోలింగ్ కేంద్రాల సమస్యలపై జూలైలో ‘సాక్షి’ వరస కథనాలు ప్రచురించింది. స్పందించిన ఉన్నతాధికారులు తప్పులను సరిదిద్దారు. డిసెంబర్లో కొత్తపోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 14: బాలిక మృతి కేసులో కొత్త ట్విస్ట్.. పెద్దపల్లి శివారులో నివసించే మధ్యప్రదేశ్కు చెందిన ఓ బాలిక గాయపడి, అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఆమైపె సామూహిక లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా.. దర్యాప్తులో ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో కేసు మిస్టరీ వీడింది. సెప్టెంబర్ 08: రైతుబీమా ఐడీలలో జాప్యం.. రైతు బీమా, ఎల్ఐసీ ప్రీమియం పొందాలంటే ఐడీలు తప్పనిసరి. కానీ, ఈ–జెనరేట్ కాక పలువురు మరణించిన రైతుల కుటుంబాలకు బీమా జాప్యమైంది. విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు. సెప్టెంబరు 20: స్పౌజ్ కోటా దుర్వినియోగం.. దంపతులిద్దరూ ప్రభుత్వ టీచర్లయితే ఒకేచోట పని చేసేందుకు ఉద్దేశించిన స్పౌజ్ కోటాను పలువురు టీచర్లు కేవలం హెచ్ఆర్ఏ కోసం దుర్వినియోగం చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన విద్యాశాఖ వారిపై చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 29: తప్పుడు ర్యాంకులతో పదోన్నతులు.. పదోన్నతులు, బదిలీల్లో టీచర్లు ర్యాంకులను తప్పుగా చూపించారు. 317 జీవో సమయంలో ఒకలా, ఇప్పుడు మరోలా చూపించిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీంతో స్పందించిన విద్యాశాఖ తప్పుడు ర్యాంకులతో పదోన్నతులు, బదిలీ చేయించుకున్న వారిపై చర్యలు చేపట్టింది. అక్టోబర్ 31: కలెక్టర్ నివాపంలో చోరీ.. అక్టోబర్ 30న రాత్రి కరీంనగర్ కలెక్టర్ బి.గోపి నివాసంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన పగిడిపల్లి ప్రసాద్ చొరబడ్డాడు. కలెక్టర్కు సంబంధించిన ల్యాప్టాప్, చార్జర్, బ్యాగు, పెన్డ్రైవ్ను ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నవంబర్ 7న అతన్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. డిసెంబర్ 22: తిరుపతికి ఇక వారానికి నాలుగు రైళ్లు.. కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండుసార్లు ఉన్న బైవీక్లీ ఎక్స్ప్రెస్ను ఇకపై నాలుగుసార్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయాణికుల ఇక్కట్లపై ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన ఎంపీ బండి సంజయ్ సర్వీసుల సంఖ్య పెంచుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. డిసెంబర్ 27: ఎల్పీసీ సమర్పించాలి.. లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ (ఎల్పీసీ) సమర్పించకుండానే పలువురు ఇంజినీర్లు కరీంనగర్లో ఉద్యోగం చేస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నగరపాలక కమిషనర్ స్పందించారు. అధికారులందరూ వెంటనే ఎల్పీసీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి చదవండి: అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు.. -
చేతిలో డబ్బు లేక తీవ్ర మనస్తాపానికి గురై.. యువతి తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: మండల కేంద్రానికి చెందిన మేకల ఆర్థిక(17) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇంటర్ వరకు చదివింది. సునీత–పర్శరాములు దంపతులకు మూడో కూతురు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా శిక్షణ పొందుతోంది. తన తండ్రి పర్శరాములుకు పక్షవాతం, క్యాన్సర్ వ్యాధితో సంవత్సర కాలంగా మంచానికే పరిమితమయ్యాడు. వ్యాధిని నయం చేయించేందుకు చేతిలో డబ్బు లేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్థిక.. గురువారం సాయంత్రం సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040- 66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా..
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని పటేల్గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి? -
పెళ్లైన ఐదు రోజులకే.. గోదావరిలోకి దూకిన నవదంపతులు
పెనుగొండ, పశ్చిమ గోదావరి: ఏ కష్టం వచ్చిందో తెలియదు. నవ దంపతులు గోదావరిలో దూకారు.. వరుడు ప్రాణాలతో బయట పడగా.. వధువు కోరాడ సత్యవతి మృతి చెందింది.. అయితే వరుడుపై వధువు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి(19)ని తండ్రి లేకపోవడంతో తాతే పెంచి ఈ నెల 15న ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే శివరామకృష్ణతో వివాహం జరిపించాడు. వీరు మంగళవారం రావులపాలెం సినిమాకు అని చెప్పి వెళ్లారు. శివరామకృష్ణ కథనం ప్రకారం ఇద్దరూ సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రిడ్జి నుంచి ఆర కిలో మీటరు దూరంలో ఉన్న శివరామకృష్ణ కేదారీఘాట్ సమీపంలో రక్షించమని అరవడంతో మత్స్యకారులు కాపాడారు. విషయాన్ని వధువు బంధువులకు చెప్పి తణుకు ప్రభుత్వాసుపత్రికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లిపోయాడు. వధువు గల్లంతు కావడంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శివరామకృష్ణను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వధువు కోరాడ సత్యవతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. శివరామకృష్ణ హత్య చేశాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వడలి గ్రామస్తులు భారీగా పెనుగొండ పోలీస్ స్టేషన్కు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సత్యవతి హత్య చేసి గోదావరిలో పడేయడమో చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్లు గ్రామస్తులకు సర్ధి చెప్పి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాలు పెట్టుకోవద్దంటూ భరోసా ఇచ్చారు. -
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్ల్లో, యాప్ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
అటవీశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వేధింపులు భరించలేక ఓ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బీట్ ఆఫీసర్ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత ఇటీవల సెక్షన్ ఆఫీసర్ రాందాస్తో కలిసి వెంచవెల్లి బీట్లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇందుకుగాను సెక్షన్ ఆఫీసర్ రాందాస్ రూ.2 లక్షలు కూలీల వేతనాలు, ప్లాంటేషన్ నిర్వహణకు ఇచ్చారు. అయితే ఇవికాకుండా అదనంగా రూ.1.50 లక్షలను కూలీలకు చెల్లించాల్సి ఉందని, బిల్లు ఇవ్వాలని ఎఫ్ఆర్వో రవిని లత కోరగా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె శుక్రవారంరాత్రి మంచిర్యాలలోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లత భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డీఎఫ్వోకు ఒడిశా కూలీల ఫిర్యాదు ప్లాంటేషన్ పనులు చేసిన ఒడి శా కూలీలు కూలి డబ్బులు ఇవ్వాలని ఎఫ్ఆర్వోను కోరగా ‘కూలి లేదు, డబ్బులు లేవు, దిక్కున్నకాడ చెప్పుకోండి’అని బెదిరించారు. దీంతో వారంతా జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీశ్ సింగ్కు ఫిర్యాదు చేయగా ఎఫ్ఆర్వోను మందలించారు. ఈ విషయా న్ని మనసులో పెట్టుకొన్న రవి శుక్రవారం తనను కా ర్యాలయానికి పిలిపించి దుర్భాషలాడారని లత ఆ రోపించారు. కాగా, వేధింపుల విషయమై ఎఫ్ఆర్వో రవిని సంప్రదించగా, తాను బీట్ ఆఫీసర్ లతను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు. -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: క్షణికావేశంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముత్నూర్లో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్సై దు బ్బాక సునీల్ తెలిపిన వివరాల ప్రకారం బోథ్ మండలంలోని వజ్జర గ్రామానికి చెందిన కవిత (26)కు ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన గేడం జ్యోతిరాంతో 2021 లో వివాహమైంది. గురువారం ఉదయం జ్యోతిరాం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కవిత ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త రలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు తండ్రి సిడాం లక్ష్మణ్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement