-
రష్మిక ఓటమి.. సుమిత్ నగాల్ ర్యాంక్ 93...
ఫ్లోరిడా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–75 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో రష్మిక 3–6, 0–6తో అకాషా ఉర్హోబో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. సుమిత్ నగాల్ ర్యాంక్ 93... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ ర్యాంక్ దిగజారింది. తాజా ర్యాంకింగ్స్లో సుమిత్ 11 స్థానాలు పడిపోయి 93వ ర్యాంక్లో నిలిచాడు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్లో ఉన్నాడు. భారత్కే చెందిన యూకీ బాంబ్రీ 55వ ర్యాంక్లో, శ్రీరామ్ బాలాజీ 83వ ర్యాంక్లో, విజయ్ సుందర్ ప్రశాంత్ 98వ ర్యాంక్లో ఉన్నారు. -
పోరాడి ఓడిన సుమిత్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సుమిత్ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 80వ ర్యాంక్ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్గా సుమిత్ గుర్తింపు పొందుతాడు. -
Monte Carlo Masters Series: సుమిత్ సంచలనం
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నంబర్వన్ సుమిత్ నగాల్ మరో గొప్ప విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డిని బోల్తా కొట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 5–7, 6–2, 6–4తో అర్నాల్డిపై గెలిచి క్లే కోర్టు మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో రెండో రౌండ్కు చేరిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ తొలి సెట్ను కోల్పోయినా ఆందోళన చెందలేదు. రెండో సెట్లో అద్భుతంగా ఆడి అర్నాల్డి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సుమిత్ తన దూకుడు కొనసాగించి మూడో గేమ్లో, ఏడో గేమ్లో అర్నాల్డి సర్వీస్లను బ్రేక్ చేసి తన సరీ్వస్లను నిలబెట్టుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో సుమిత్ ఆడతాడు. రెండో రౌండ్లోకి ప్రవేశించడం ద్వారా సుమిత్ వచ్చే ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 80వ స్థానానికి చేరుకోనున్నాడు. ఈ ఏడాది సుమిత్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి రెండో రౌండ్కు చేరగా... చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
Monte Carlo Masters: 42 ఏళ్ల తర్వాత...
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది తన నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ... భారత టెన్నిస్ నంబర్వన్ సుమిత్ నగాల్ ప్రతిష్టాత్మక మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 7–5, 2–6, 6–2తో ప్రపంచ 55వ ర్యాంకర్ ఫాసుండో డియాజ్ అకోస్టా (అర్జెంటీనా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా ఈ టోరీ్నలో 42 ఏళ్ల తర్వాత సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన తొలి భారతీయ ప్లేయర్గా సుమిత్ గుర్తింపు పొందాడు. చివరిసారి భారత్ తరఫున 1982లో రమేశ్ కృష్ణన్ మోంటెకార్లో టోరీ్నలో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో ఓడిపోయాడు. -
పోరాడి ఓడిన సుమిత్
మరాకెష్ (మొరాకో): గ్రాండ్ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 6–1, 3–6, 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. సుమిత్ కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 16 వేలు) ప్రైజ్మనీ, 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూకీ జోడీ శుభారంభం ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 6–3, 6–4తో స్టీవెన్స్ (నెదర్లాండ్స్)–పెట్రోస్ సిట్సిపాస్ (గ్రీస్) ద్వయంపై గెలిచింది. -
సుమిత్ నగాల్ శుభారంభం
గ్రాండ్ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 4–6, 6–3, 6–2తో కొరెంటిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ఆరు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో సుమిత్ ఆడతాడు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో సుమిత్ 6–2, 2–6, 6–7 (4/7)తో సియోంగ్చన్ హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక టైబ్రేక్లో సుమిత్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. సుమిత్కు 14,400 డాలర్ల (రూ. 11 లక్షల 93 వేలు) ప్రైజ్మనీ, 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మెయిన్ ‘డ్రా’కు గెలుపు దూరంలో...
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. కాలిఫోర్నీయాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 101వ ర్యాంకర్ సుమిత్ 6–2, 6–2తో ప్రపంచ 580వ ర్యాంకర్ స్టెఫాన్ డొస్టానిక్ (అమెరికా)పై గెలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో కొరియా ప్లేయర్ సియోంగ్చన్ హాంగ్తో సుమిత్ తలపడతాడు. -
సూపర్ సుమీత్..
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం.. న్యూయార్క్లో టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్. ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ బరిలోకి దిగాడు. అతని ఎదురుగా ఉన్న 22 ఏళ్ల కుర్రాడికి అదే తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ డ్రాకి అర్హత సాధించాడు. అంతకు ముందెప్పుడూ అతను అంత పెద్ద స్టేడియంలో ఆడలేదు. సహజంగానే ఎవరూ ఆ మ్యాచ్లో ఫెడరర్ ప్రత్యర్థి గురించి పట్టించుకోలేదు. కానీ ఒక సెట్ ముగిసే సరికి అందరిలో చర్చ మొదలైంది. ఆ యువ ఆటగాడు తొలి సెట్ను 6–4తో గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. ఒక్కసారిగా షాక్కు గురైన ఫెడరర్ కోలుకొని ఆ తర్వాత తన స్థాయి ప్రదర్శనతో మ్యాచ్ను గెలుచుకున్నాడు. కానీ గ్రాండ్స్లామ్లో ఒక కొత్త ఆటగాడు అలా అందరూ గుర్తుంచుకునేలా పరిచయమయ్యాడు. ఆరంభం గుర్తుంచుకునేలా ఉన్నా.. ఆ తర్వాత ఆ కుర్రాడి కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆటలో ఓటములతో పాటు గాయాలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. టెన్నిస్ను కొనసాగించేందుకు కనీస స్థాయిలో కూడా డబ్బుల్లేని స్థితి. ఆటను వదిలిపెట్టేందుక్కూడా అతను సిద్ధమయ్యాడు. కానీ అతనిలోని పట్టుదల మళ్లీ పోరాడేలా చేసింది. సన్నిహితుల సహకారం మళ్లీ ఆటపై దృష్టి పెట్టేలా చేసింది. దాంతో వరుసగా చాలెంజర్ టోర్నీల్లో విజయాలు.. ఇప్పుడు సింగిల్స్లో వరల్డ్ టాప్–100 ర్యాంకింగ్స్లోకి ప్రవేశించిన అరుదైన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు. ఆ కుర్రాడి పేరే సుమీత్ నగాల్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ప్రస్తుతం భారత నంబర్వన్గా కొనసాగుతున్న ఈ ఆటగాడు మరిన్ని పెద్ద ఘనతలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొహమ్మద్ అబ్దుల్ హాది ‘నా బ్యాంకు ఖాతాలో 80 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏడాదంతా కలిపి 24 టోర్నీలు ఆడినా వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోవడం లేదు. నా జీతం, కొన్ని సంస్థలు చేసే ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా టెన్నిస్లోనే పెట్టేశా. అంతర్జాతీయ టెన్నిస్లో విజయాలు, రికార్డుల సంగతి తర్వాత.. కనీసం ఒక ఆటగాడిగా కొనసాగాలన్నా ఏడాదికి రూ. 80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చవుతుంది. ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్లను పెట్టుకునే స్థాయి లేక కేవలం ఒకే ఒక ట్రావెలింగ్ కోచ్తో టోర్నీలకు వెళుతున్నా. మన దేశంలో టెన్నిస్కు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం చాలా తక్కువ!’ కొన్నాళ్ల క్రితమే సుమీత్ నగాల్ వెలిబుచ్చిన ఆవేదన అది. ఆ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. అంతర్జాతీయ టెన్నిస్ చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. శిక్షణ, సాధన మొదలు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టోర్నీల్లో ఆడాలంటే చాలా డబ్బు కావాలి. టోర్నీల్లో ఆడితేనే ఫలితాలు, ర్యాంకింగ్స్ వస్తాయి. స్థాయి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జూనియర్ స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల కారణంగానే చాలామంది ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. నగాల్ తన కెరీర్లో ఇలాంటి దశను చాలాసార్లు ఎదుర్కొన్నాడు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్ను అమితంగా ప్రేమిస్తూ ఆటపైనే దృష్టి పెట్టాడు. అందుకే ఇప్పుడు అతను సాధించిన రికార్డు, గెలిచిన టోర్నీలు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభంలోనే వేగంగా ప్రపంచ ర్యాంకింగ్స్లో 130కి చేరి ఆపై రెండేళ్ల వ్యవధిలో 638కి పడిపోయిన నగాల్.. ప్రస్తుతం టాప్–100లోకి రావడం అతని ఆటలోని పురోగతిని చూపిస్తోంది. ప్రతిభాన్వేషణతో వెలుగులోకి వచ్చి.. నగాల్ది సాధారణ కుటుంబ నేపథ్యం. ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝఝర్ అతని స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఆరంభంలో తన ఈడు పిల్లల్లాగే క్రికెట్నే అతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. మిత్రులతో కలసి గల్లీ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులో టీమ్ ఈవెంట్ కాకుండా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో అతడిని చేర్పించాలనే తండ్రి ఆలోచన నగాల్ను టెన్నిస్ వైపు నడిపించింది. రెండేళ్లు స్థానిక క్లబ్లో అతను టెన్నిస్ నేర్చుకున్నాడు. అయితే పదేళ్ల వయసులో ఒక ఘటన నగాల్ కెరీర్ను మార్చింది. అప్పటికే భారత టాప్ టెన్నిస్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ భూపతి తన అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రతిభాన్వేషణ కార్యక్రమం నిర్వహించాడు. చాలా మందితో పాటు అతను కూడా సెలక్షన్స్కు హాజరయ్యాడు. అందరిలాగే హిట్టింగ్ చేస్తూ వచ్చాడు. కానీ భూపతి దృష్టి నగాల్పై పడలేదు. చాలాసేపటి తర్వాత ఆ పదేళ్ల కుర్రాడు ధైర్యం చేసి నేరుగా భూపతి వద్దకే వెళ్లాడు. ‘సర్, కాస్త నా ఆట కూడా చూడండి’ అని కోరాడు. ఆశ్చర్యపడ్డ భూపతి అతనిలోని పట్టుదలను గమనించి ప్రత్యేకంగా నగాల్తో ప్రాక్టీస్ చేయించాడు. వెంటనే అతని ఆట ఆకట్టుకోవడంతో తన ఎంపిక పూర్తయింది. ‘నేను ఆ ఒక్క మాట ఆ రోజు అనకుండా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోకపోయేవారేమో. ఎందుకంటే అంత డబ్బు పెట్టి మావాళ్లు టెన్నిస్ నేర్పించలేకపోయేవారు’ అని నగాల్ గుర్తు చేసుకుంటాడు. అది ఆ అకాడమీకి మొదటి బ్యాచ్. బెంగళూరులో రెండేళ్ల శిక్షణ తర్వాత భూపతి అకాడమీ కార్యకలాపాలు ఆగిపోయినా.. అప్పటికే మెరుగుపడ్డ నగాల్ ప్రదర్శన అతనికి సరైన దిశను చూపించింది. కుటుంబ మిత్రుల సహకారంతో విదేశాల్లో మరింత మెరుగైన శిక్షణతో అతని ఆట రాటుదేలింది. క్రికెట్పై తన చిన్ననాటి ఇష్టాన్ని వదులుకోని నగాల్.. తర్వాతి రోజుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నెట్స్లో క్రికెట్ ఆడి తన సరదా తీర్చుకోగలిగాడు. జూనియర్ గ్రాండ్స్లామ్తో.. 18 ఏళ్ల వయసులో నగాల్ ప్రొఫెషనల్గా మారాడు. హైదరాబాద్లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో విజయం సాధించి కెరీర్లో తొలి టైటిల్ని అతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక మేజర్ టోర్నీ విజయం నగాల్కు గుర్తింపు తెచ్చింది. 2015 జూనియర్ వింబుల్డన్ డబుల్స్లో (భాగస్వామి వియత్నాం ఆటగాడు హోంగా నామ్) నగాల్ విజేతగా నిలిచాడు. జూనియర్ గ్రాండ్స్లామ్ నెగ్గిన ఆరో భారత ఆటగాడిగా పేరొందాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో మూడేళ్ల వ్యవధిలో 9 ఐటీఎఫ్ ఫ్యూచర్ టైటిల్స్ను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చెప్పుకోదగ్గ మలుపు ఏటీపీ చాలెంజర్ టోర్నీ రూపంలో వచ్చింది. 2017లో బెంగళూరులో నగాల్ తన తొలి చాలెంజర్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లకు అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిరీస్ టోర్నీ రెండో టైటిల్ రూపంలో చేరింది. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. పరాజయాల బాటను వీడి.. నాలుగేళ్ల పాటు నగాల్ కెరీర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండేళ్లు కోవిడ్ సమయంలోనే వెళ్లిపోగా.. మిగిలిన రెండేళ్లలో అతనికి గాయాలు, వాటికి శస్త్రచికిత్సలు. ఫామ్ కోల్పోయి మానసికంగా కూడా కుంగుబాటుకు గురైన స్థితి. టోక్యో ఒలింపిక్స్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. వీటికి తోడు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నుంచి క్రమశిక్షణరాహిత్యం ఆరోపణలు. ఇలాంటివాటిని దాటి గత ఏడాది నగాల్ మళ్లీ సరైన దారిలో పడ్డాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 2023లో నగాల్ సాధించిన విజయాలు అతని కెరీర్లో ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి. ఇటలీ, ఫిన్లండ్ చాలెంజర్ టోర్నీ టైటిల్స్, మరో రెండు టోర్నీలు ఆస్ట్రియా, హెల్సింకీలలో రన్నరప్ నగాల్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఈ ఏడాదికి వచ్చే సరికి అతని ఆట మరింత పదునెక్కింది. గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ బబ్లిక్పై సంచలన విజయం సాధించిన నగాల్.. 1989 (రమేశ్ కృష్ణన్) తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీలో ఒక సీడెడ్æఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడిగా నిలవడం విశేషం. ఆపై కొద్దిరోజులకే చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో చాంపియన్గా సొంతగడ్డపై తొలి టైటిల్తో నగాల్ విజయనాదం చేశాడు. కొన్నాళ్ల క్రితం ఆటనే వదిలేయాలనుకున్న వ్యక్తి.. ప్రతికూలతలపై పోరాడి ఇప్పుడు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. ఆ పట్టుదలకున్న పదును అర్థమవుతోంది. ఇదే ఫామ్ను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా నగాల్ తన ప్రదర్శనతో మరిన్ని అద్భుతాలు చేయగలడని భారత టెన్నిస్ ప్రపంచం విశ్వసిస్తోంది. -
ప్రిక్వార్టర్స్లో సుమిత్ నగాల్
భారత నంబర్వన్ సుమిత్ నగాల్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 98వ ర్యాంకర్ సుమిత్ 6–2, 6–2తో జెఫ్రీ బ్లాంకానెక్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ప్రత్యర్థి సర్వి స్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో గంటా సాయికార్తీక్ రెడ్డి–మనీశ్ సురేశ్కుమార్ (భారత్) జోడీ 2–6, 6–7 (8/10)తో కుజ్మయిన్–జా న్విర్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఐదేళ్ల తర్వాత...
న్యూఢిల్లీ: నిరీక్షణ ముగిసింది. ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో మళ్లీ భారత ప్లేయర్ పేరు కనిపించింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్–100లోకి దూసుకొచ్చాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 26 ఏళ్ల సుమిత్ 630 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 98వ ర్యాంక్లో నిలిచాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఓ భారత టెన్నిస్ ప్లేయర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్లో టాప్–100లోకి రావడం విశేషం. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక భారత్ నుంచి టాప్–100లో నిలిచిన పదో ప్లేయర్గా సుమిత్ నగాల్ గుర్తింపు పొందాడు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం భారత్కే చెందిన రోహన్ బోపన్న వరల్డ్ నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతుండగా... గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్వన్ ర్యాంక్లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ విభాగంలో సానియా మీర్జా కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్లో, డబుల్స్ విభాగంలో నంబర్వన్ ర్యాంక్లో నిలిచింది. -
చెన్నై ఓపెన్ చాంపియన్ సుమిత్ నగాల్
భారత టెన్నిస్ నంబర్వన్ సుమిత్ నగాల్ స్వదేశంలో తొలిసారి ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ను సాధించాడు. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సుమిత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 121వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–4తో 114వ ర్యాంకర్ లుకా నార్డీ (ఇటలీ)పై గెలిచి తన కెరీర్లో నాలుగో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ సాధించాడు. విజేతగా నిలిచిన సుమిత్కు 18,230 డాలర్ల (రూ. 15 లక్షల 13 వేలు) ప్రైజ్మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Australian Open: పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్కు ఓవరాల్గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
అప్పుడు బ్యాంక్ ఖాతాలో కేవలం 80 వేలు.. ఇప్పుడు కోటి దాకా ప్రైజ్మనీ!
Australian Open 2024- మెల్బోర్న్: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడితే అద్భుతం చేయవచ్చని భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో 26 ఏళ్ల సుమిత్ చిరస్మరణీయ విజయంతో శుభారంభం చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 137వ స్థానంలో ఉన్న సుమిత్ వరుస సెట్లలో 6–4, 6–2, 7–6 (7/5)తో ప్రపంచ 27వ ర్యాంకర్, 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించి ఈ టోర్నీలో తొలిసారి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అంతేకాకుండా 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్పై గెలిచిన తొలి భారతీయ ప్లేయర్గా సుమిత్ గుర్తింపు పొందాడు. 1989 ఆ్రస్టేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో టాప్ సీడ్ మాట్స్ విలాండర్ (స్వీడన్)పై రమేశ్ కృష్ణన్ గెలుపొందాడు. బుబ్లిక్తో 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సుమిత్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక ఏస్ కొట్టిన సుమిత్ ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 29 విన్నర్స్ షాట్లతో రాణించిన సుమిత్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు దక్కించుకున్నాడు. మరోవైపు 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న బుబ్లిక్ 13 ఏస్లతో విరుచుకుపడ్డా... 9 డబుల్ ఫాల్ట్లు, 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఏఐటీఏ సహకరించకపోయినా... ఫిబ్రవరిలో పాకిస్తాన్తో జరగాల్సిన డేవిస్ కప్ మ్యాచ్లో తాను ఆడలేనని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు గత నెలలో సుమిత్ నగాల్ సమాచారం ఇచ్చాడు. దాంతో సుమిత్పై ఏఐటీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆసియా కోటా నుంచి భారత్కు అందుబాటులో ఉన్న ‘వైల్డ్ కార్డు’ కోసం సుమిత్ పేరును పంపించకూడదని ఏఐటీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుమిత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్ టోర్నీలో బరిలోకి దిగాడు. ఏఐటీఏ తనకు సహకరించకపోయినా సుమిత్ నిరాశపడకుండా తన శక్తినంతా ధారపోసి, ఏకాగ్రతతో, పట్టుదలతో ఆడి క్వాలిఫయింగ్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్లు గెలుపొందాడు. క్వాలిఫయర్ హోదాలో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 2021లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సుమిత్ ఈసారి మాత్రం గొప్ప విజయంతో రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ చేతిలో ఓడిపోయిన సుమిత్ 2020 యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకున్నాడు. 900 యూరోలతో... గత ఏడాది ఆరంభంలో సుమిత్ బ్యాంక్ ఖాతాలో కేవలం 900 యూరోలు (రూ. 80 వేలు) ఉన్నాయి. దాంతో తొలి మూడు నెలలపాటు తాను జర్మనీలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే అకాడమీకి వెళ్లలేకపోయాడు. ఈ దశలో అతని మిత్రులు సోమ్దేవ్ దేవ్వర్మన్, క్రిస్టోఫర్ మార్కస్, మహా టెన్నిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు. గతంలో తాను గెల్చుకున్న ప్రైజ్మనీ, తన ఉద్యోగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా లభించే వేతనాన్ని ఏటీపీ సర్క్యూట్లో చాలెంజర్ టోర్నీలు ఆడేందుకు సుమిత్ వెచ్చించాడు. తాను పాల్గొన్న 24 టోర్నీలలో నిలకడగా రాణించి సుమిత్ రూ. 65 లక్షల వరకు ప్రైజ్మనీ సంపాదించాడు. కొత్త ఏడాదిలో కాన్బెర్రా చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా ... ఆస్ట్రేలియన్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకోవడం ద్వారా సుమిత్కు కనీసం 1,85,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 1 కోటి) ప్రైజ్మనీగా రావడం ఖాయమైంది. యూకీ బాంబ్రీ జోడీ ఓటమి పురుషుల డబుల్స్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో యూకీ–హాస్ ద్వయం 6–1, 6–7 (8/10), 6–7 (7/10)తో నికోలస్ బారిన్టోస్ (కొలంబియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. అల్కరాజ్, స్వియాటెక్ ముందంజ పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో అల్కరాజ్ 7–6 (7/5), 6–1, 6–2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై గెలుపొందగా... స్వియాటెక్ 7–6 (7/2), 6–2తో సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)... మహిళల సింగిల్స్లో మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
Australian Open: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన సుమిత్
Australian Open 2024- Sumit Nagal First Indian In 35 Years: ఆస్ట్రేలియా ఓపెన్-2024లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ సంచలన విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్లో 137వ ర్యాంకర్ అయిన ఈ హర్యానా కుర్రాడు.. వరల్డ్ నెంబర్ 27 అలెగ్జాండర్ బబ్లిక్పై గెలుపొంది చరిత్ర సృష్టించాడు. భారత టెన్నిస్ చరిత్రలో 35 ఏళ్ల తర్వాత.. గ్రాండ్స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్ను ఓడించిన రెండో ఆటగాడిగా సుమిత్ రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ తాజా ఎడిషన్లో భాగంగా తొలి రౌండ్లో.. సుమిత్ నాగల్.. కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బబ్లిక్తో పోటీపడ్డాడు. ర్యాంకింగ్ పరంగా తనకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న అలెగ్జాండర్కు ఆది నుంచే గట్టి పోటీనిస్తూ చుక్కలు చూపించాడు సుమిత్. రెండో రౌండ్లో అడుగుపెట్టిన సుమిత్ మొత్తంగా రెండు గంటల 38 నిమిషాల పాటు పోరాడి ఆఖరికి 6-4, 6-2, 7-6తో విజయం సాధించాడు. అయితే, తొలి రెండు సెట్లలో తేలిగ్గానే తలవంచిన అలెగ్జాండర్ మూడో సెట్లో మాత్రం సుమిత్ను చెమటోడ్చేలా చేశాడు. ఈ క్రమంలో టై బ్రేకర్లో ఎట్టకేలకు పైచేయి సాధించిన సుమిత్.. ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నాగల్ ఆస్ట్రేలియా ఓపెన్లో రెండో రౌండ్కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతడు ఈసారి మాత్రం చారిత్రక విజయంతో మొదటి ఆటంకాన్ని అధిగమించాడు. రమేశ్ క్రిష్ణన్ తర్వాత అదే విధంగా.. రమేశ్ క్రిష్ణన్ తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీ సింగిల్స్లో సీడెడ్ ప్లేయర్ను ఓడించిన భారత రెండో ఆటగాడిగా సుమిత్ నాగల్ అరుదైన ఘనత సాధించాడు. కాగా 1989 నాటి ఆస్ట్రేలియా ఓపెన్లో రమేశ్ క్రిష్ణన్ ఆనాటి నంబర్ వన్ ప్లేయర్ మ్యాట్స్ విలాండర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ సుమిత్ ఆ ఫీట్ను నమోదు చేశాడు. పదేళ్ల వయసులోనే.. హర్యానాలో 1997, ఆగష్టు 16న జన్మించిన సుమిత్ నాగల్ 10వ ఏటనే టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. మహేశ్ భూపతి మిషన్ 2018 ప్రోగ్రాంలో భాగమైన అతడు.. 2015లో తొలిసారి ప్రతిష్టాత్మక విజయం సాధించాడు. వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ పోరులో తన వియత్నాం పార్ట్నర్ లీ హొంగ్ నామ్తో కలిసి విజేతగా నిలిచాడు. అయితే, 2019లో మొదటిసారి సుమిత్ నాగల్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. Well played Sumit Nagal💐💐💐.Although Sumit Nagal lost, But surely it was an exciting match . Winning a set against @rogerfederer is nothing less than an achievement. #FederervsNagal #USOpen pic.twitter.com/XN3WVuHDiq — Mahesh Kanakaraj🇮🇳 (@maheshmech06) August 27, 2019 ఏకంగా ఫెడరర్తోనే నాటి యూఎస్ ఓపెన్ టోర్నీలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్తో తొలి రౌండ్లో పోటీ పడ్డ సుమిత్.. తొలి సెట్ను 6-4తో గెలిచాడు. ఆ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఫెడరర్కు పోటీనిచ్చిన యంగ్స్టర్గా తనదైన ముద్ర వేయగలిగాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. The first Indian man in 3️⃣5️⃣ years to beat a seed at a Grand Slam 🇮🇳@nagalsumit • #AusOpen • #AO2024 • @Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/SY55Ip4JaG — #AusOpen (@AustralianOpen) January 16, 2024 -
మరొకటి గెలిస్తే మెయిన్ ‘డ్రా’లోకి...
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ ఫైనల్ రౌండ్కు అర్హత సాధించాడు. మెల్బోర్న్లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–3, 6–2తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ ఎడ్వర్డ్ వింటర్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 64 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సుమిత్ ప్రత్యర్థి సర్విస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 12 విన్నర్స్ కొట్టిన సుమిత్ 11 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్వద్దకు 14 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచాడు. 118వ ర్యాంకర్ మోల్కన్ (స్లొవేకియా)తో నేడు జరిగే ఫైనల్ రౌండ్ మ్యాచ్లో సుమిత్ నెగ్గితే రెండోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. సుమిత్ 2019, 2020 యూఎస్ ఓపెన్లో, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. -
Australian Open Qualifier: రెండో రౌండ్లో సుమిత్ నగాల్
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–3, 7–5తో జెఫ్రీ బ్లాన్కనెక్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అంకిత రైనా (భారత్) 1–6, 5–7తో సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. -
పాక్ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం?
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టెన్నిస్ స్టార్లు సుమిత్ నగాల్, శశికుమార్ ముకుంద్ పాకిస్తాన్లో డేవిస్ కప్ ఆడేందుకు నిరాకరించారు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’లో భాగంగా భారత్ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్తో తలపడాల్సివుంది. అయితే భారత్ తరఫున ఉత్తమ సింగిల్స్ ప్లేయర్లు అయిన సుమిత్ నగాల్ (141 ర్యాంకు), శశికుమార్ (477 ర్యాంకు) చిరకాల ప్రత్యర్థితో ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే వారిద్దరు వైదొలగేందుకు కారణాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగాల్ తనకు అంతగా అలవాటు లేని గ్రాస్ కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేనని అన్నాడు. అదే కారణమా? ఇక హార్డ్ కోర్టుల్లో రాణించే సుమిత్ ఈ కారణంతో పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోగా, శశికుమార్ ముకుంద్ మాత్రం ప్రత్యేకించి ఏ కారణం చెప్పకుండానే తప్పుకొన్నట్లు తెలిసింది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) దేశం తరఫున ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇలా చేయడం తప్పు ‘ఇది చాలా తప్పు. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినపుడు ఇలాంటి కారణాలు చూపడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఐటా ఉన్నతాధికారి తెలిపారు. సెమీస్లో శ్రీవల్లి రష్మిక బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6–1, 6–4తో భారత్కే చెందిన వైష్ణవి అడ్కర్పై సునాయాస విజయం సాధించింది. సెమీస్లో రష్మిక థాయ్లాండ్కు చెందిన రెండో సీడ్ లాన్లానా తారరుదితో తలపడుతుంది. క్వార్టర్స్లో ఆమె 6–1, 6–2తో ఏడో సీడ్ డిలెటా చెరుబిని (ఇటలీ)ని ఓడించింది. ఈ టోరీ్నలో హైదరాబాదీ యువతారతో పాటు మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు జీల్ దేశాయ్, రుతూజ భోసలే సెమీస్కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్ 3–6, 6–7 (8/2), 6–4తో అంటోనియా షమిడ్త్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. రుతూజ 7–6 (8/4), 1–6, 6–1తో కజకిస్తాన్కు చెందిన ఐదో సీడ్ జిబెక్ కులంబయెవాను కంగుతినిపించింది. -
సెమీఫైనల్లో సుమిత్
Sumit Nagal: హెల్సింకి ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 69వ ర్యాంకర్ ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 169వ ర్యాంకర్ సుమిత్ నెగ్గాడు. తొలి సెట్ను 6–3తో నెగ్గి, రెండో సెట్లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో ఎమిల్ గాయంతో వైదొలిగాడు. దాంతో సుమిత్ను విజేతగా ప్రకటించారు. రన్నరప్ నైశిక్ రెడ్డి జోడీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య జూనియర్ సర్క్యూట్ టోరీ్నలో తెలంగాణకు చెందిన గనగామ నైశిక్ రెడ్డి రన్నరప్గా నిలిచాడు. ఢాకాలో జరిగిన ఈ టోరీ్నలో నైశిక్ రెడ్డి–ప్రబీర్ ముకేశ్ చావ్డా (భారత్) ద్వయం బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో ఓటమి చవిచూసింది. తుది పోరులో నైశిక్–ప్రబీర్ జోడీ 2–6, 3–6తో భారత్కే చెందిన తవీశ్ పావా–అర్ణవ్ యాదవ్ జంట చేతిలో ఓటమి పాలైంది. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్ నగాల్
ఏటీపీ చాలెంజర్ యూరోపియన్ క్లే సీజన్లో భారత ఆటగాడు సుమీత్ నగాల్ జోరు కొనసాగుతోంది. రోమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్లో ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్ జోరిస్ డి లూర్ (బెల్జియం)పై విజయం సాధించాడు. 2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)తో నగాల్ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్ క్లే పై ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్ ఇప్పటి వరకు కెరీర్లో 3 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు సాధించాడు. -
Rome Challenger: సెమీఫైనల్లో సుమిత్ నగాల్
రోమ్ గార్డెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ సుమిత్ నగాల్ వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమిత్ 7-5, 6-0తో మాక్స్ హూక్స్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ తన ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు
రోమ్: ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ర్యాంకింగ్స్లో తనకంటే ఎంతో మెరుగైన స్థానిక ప్రత్యర్ధిని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో క్వాలిఫయర్గా బరిలోకి దిగిన ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 6–2, 6–4 స్కోరుతో ఇటలీ ప్లేయర్, ప్రపంచ 172వ ర్యాంకర్ ఫ్రాన్సెస్కో మాసరెలీపై విజయం సాధించాడు. 1 గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నగాల్ ఒక్క ఏస్ కూడా కొట్టలేదు. అయితే తన చక్కటి సర్వీస్తో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా లేకుండా చూసుకున్నాడు. ఇటలీ ఆటగాడు 3 ఏస్లు సంధించినా...6 డబుల్ఫాల్ట్లతో ఓటమిని ఆహ్వానించాడు. -
సుమీత్ నగాల్ అవుట్...
పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్లో ఫిలిప్ క్రజినోవిచ్ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్పై విజయం సాధించాడు. 2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్ కార్డ్’ సుమీత్ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్ 8 ఏస్లు కొట్టగా, నగాల్ 3 ఏస్లు నమోదు చేశాడు. మరో మ్యాచ్లో అమెరికాకు చెందిన మైకేల్ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్ ధమ్నేపై విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా జాతీయ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్లో జస్వీందర్ సింగ్ (ఢిల్లీ)ని తన నాకౌట్ పంచ్తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్ టోకస్ (రైల్వేస్) కూడా 5–0తో జై సింగ్ (ఛత్తీస్గఢ్)పై ఘన విజయం సాధించాడు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. న్యూయార్క్లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 464వ ర్యాంకర్ సుమిత్ 6–7 (2/7), 4–6తో ప్రపంచ 132వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు, 26 అనవసర తప్పిదాలు చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్కు 21,100 డాలర్ల (రూ. 16 లక్షల 87 వేలు) ప్రైజ్మనీ లభించింది. భారత్కే చెందిన రామ్కుమార్ రామనాథన్ కూడా తొలి రౌండ్లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ రెండో రౌండ్కు చేరుకున్నాడు. -
భారత డేవిస్ జట్టులో నగాల్కు చోటు
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టులోకి సుమిత్ నగాల్ తిరిగి ఎంపికయ్యాడు. గతేడాది మార్చిలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్లో పోటీపడిన నగాల్ తర్వాత డేవిస్ బరిలో దిగలేదు. తుంటి గాయంతో గత సెప్టెంబర్లో ఫిన్లాండ్తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. నవంబర్లో శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో ఈ ఏడాది మార్చిలో డెన్మార్క్తోనూ బరిలోకి దిగలేకపోయాడు. ఏప్రిల్లో ఏటీపీ సర్క్యూట్లో ఆడటం మొదలుపెట్టిన 24 ఏళ్ల హరియాణా టెన్నిస్ స్టార్ సుమిత్ ఈ సీజన్లో ఎనిమిది టోర్నీల్లో తలపడి నాలుగు మ్యాచ్ల్లో గెలిచాడు. సుమిత్ డేవిస్ జట్టులోకి రావడంతో డబుల్స్ స్పెషలిస్టు దివిజ్ శరణ్ను పక్కన బెట్టారు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో నార్వేతో భారత్ తలపడుతుంది. మ్యాచ్లు నార్వేలో జరుగుతాయి. రోహిత్ రాజ్పాల్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల భారత డేవిస్ జట్టును గురువారం ఎంపిక చేశారు. రామ్కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గునేశ్వరన్, యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్లతో పాటు వెటరన్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత్, నార్వే జట్లు తలపడటం డేవిస్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే–ఆఫ్లో భారత్ 4–0తో డెన్మార్క్పై ఘనవిజయం సాధించింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement