-
PKL10: మనోళ్లు అట్టడుగున.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా పాంథర్స్
Pro Kabaddi League- పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–27తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఈ టోర్నీలో పింక్ పాంథర్స్కిది 12వ విజయం కావడం విశేషం. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో పింక్ పాంథర్స్ 71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తలైవాస్తో మ్యాచ్లో పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. అట్టడుగున తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 29–29తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్; గుజరాత్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. ఈ జట్ల సంగతి ఇలా ఉంటే.. తెలుగు టైటాన్స్కు మాత్రం ఈ సీజన్ కూడా కలిసిరాలేదు. ఆడిన పదిహేడింట కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. Panthers first team through to the #PKLSeason10 playoffs 💥🤩 After some fiery action on the mat 🔥 Here’s how the standings look like after the final day of the Patna leg ⚡#ProKabaddiLeague #ProKabaddi #PKL #HarSaansMeinKabaddi #PATvBLR #JPPvCHE pic.twitter.com/t3zYwuCwl0 — ProKabaddi (@ProKabaddi) January 31, 2024 -
యూపీ యోధాస్ను చిత్తు చేసిన తమిళ్ తలైవాస్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. యూపీ యోధాస్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 46–27తో గెలిచింది. యు ముంబా, హరియాణా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 44–44తో ‘డ్రా’ అయింది. ప్రస్తుతం పుణేరీ పల్టన్ (10 మ్యాచ్ల్లో 9 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింగ్ పాంథర్స్, యు ముంబ రెండు నుంచి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోరీ్నలో నాలుగో మ్యాచ్ ఆడిన జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. బుధవారం హోరాహోరీగా జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38–36 స్కోరుతో టైటాన్స్పై విజయం సాధించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్, రాబిన్ చౌదరి చెరో 7 పాయింట్లు సాధించారు. తలైవాస్ ఆటగాళ్లలో నరేందర్ 10, సాహిల్ 7 పాయింట్లతో జట్టు గెలిపించా రు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 32–30 తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. -
వారియర్స్ విక్టరీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ రెండో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 48–38 పాయింట్ల తేడాతో గెలిచింది. కెపె్టన్ మణీందర్ సింగ్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 13 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 35–33తో దబంగ్ ఢిల్లీ జట్టును ఓడించింది. -
Pro Kabaddi League 2023: తలైవాస్ శుభారంభం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు శుభారంభం చేసింది. మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టుతో ఆదివారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ జట్టు 42–31 పాయింట్ల తేడాతో గెలిచింది. తలైవాస్ తరఫున రెయిడర్స్ అజింక్య పవార్ 21 పాయింట్లు, నరేందర్ 8 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. దబంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ నవీన్ కుమార్ 14 పాయింట్లు సాధించాడు. రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 34–31తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ తరఫున సోను 12 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో జైపూర్ పింక్పాంథర్స్; బెంగళూరు బుల్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
PKL 2022: సెమీస్ చేరిన నాలుగు జట్లు ఇవే.. ఫైనల్ ఎప్పుడంటే!
Pro Kabaddi League 2022- Semi Finals: ప్రొ కబడ్డీ లీగ్-2022లో భాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ యూపీ యోధాస్ను ఓడించింది. ట్రై బ్రేక్(36-36) మ్యాచ్లో 6-4 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మరో ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్.. దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. 56- 24 తేడాతో ఢిల్లీని మట్టికరిపించి సెమీస్కు చేరుకుంది. కాగా అంతకుముందు జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాటి(డిసెంబరు 15) తొలి సెమీస్ మ్యాచ్లో జైపూర్తో... బెంగళూరు తలపడనుంది. అదే విధంగా రెండో మ్యాచ్లో పుణెరి పల్టన్తో తమిళ్ తలైవాస్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లలో విజేతగా నిలిచిన జట్లు డిసెంబరు 17న టైటిల్ పోరుకు సిద్దంకానున్నాయి. చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్.. Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో -
జైపూర్పై తలైవాస్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తలైవాస్ 38–27 స్కోరుతో జైపూర్ పింక్పాంథర్స్పై గెలుపొందింది. తమిళ్ జట్టు రెయిడర్లు నరేందర్ (13 పాయింట్లు), అజింక్యా పవార్ (6 పాయింట్లు) అదరగొట్టారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన పోరు 27–27తో టైగా ముగిసింది. హరియాణా జట్టులో మన్జీత్ (8), మీతు శర్మ (8) రాణించారు. పుణేరి జట్టులో లమోహిత్ గోయత్ 17 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. మూడో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–29తో యూపీ యోధాస్ను ఓడించింది. పైరేట్స్లో సచిన్ (11), రోహిత్ (7) చక్కని ప్రదర్శన కనబరచగా, యోధాస్ జట్టులో స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ (12) రాణించాడు. చదవండి: T20 WC 2022: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్ బ్యాటర్' -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం మూడు మ్యాచ్లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నాతో మ్యాచ్లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్తో మ్యాచ్లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్తో మ్యాచ్లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
తమిళ్ తలైవాస్, యు ముంబా మ్యాచ్ టై
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మూడో ‘టై’ నమోదైంది. తమిళ్ తలైవాస్, యు ముంబా జట్ల మధ్య సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ 30–30 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా తరఫున వి.అజిత్ కుమార్ 15 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ఖాతాలో ఇది రెండో ‘టై’ కావడం గమనార్హం. లీగ్ తొలి రోజు తెలుగు టైటాన్స్తో జరిగిన మ్యాచ్ను తమిళ్ తలైవాస్ 40–40తో ‘టై’ చేసు కుంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–29తో యూపీ యోధపై నెగ్గింది. నేడు పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్; తెలుగు టైటాన్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
తలైవాస్ చిత్తు
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తమిళ్ తలైవాస్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔటైంది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ జట్టు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో 50–21తో చిత్తుగా ఓడింది. గుజరాత్ రైడర్ సోను 15 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో హై–ఫై (5) సాధించిన పర్వేశ్ చక్కని సహకారం అందించాడు. మ్యాచ్లో గుజరాత్ ప్రత్యర్థిని మూడు సార్లు ఆలౌట్ చేసింది. తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (5) నిరాశ పరిచాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 30–37తో యూపీ యోధ చేతిలో ఓడింది. యూపీ తరఫున శ్రీకాంత్ జాధవ్ సూపర్ ‘టెన్’ (11 పాయింట్లు) చెలరేగాడు. నితేశ్ కుమార్, సురేందర్ గిల్ చెరో ఏడు పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
యూపీ యోధ గెలుపు
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్లో యూపీ యోధ తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 42–22తో తమిళ్ తలైవాస్ను చిత్తుచేసింది. యూపీ రైడర్ శ్రీకాంత్ జాధవ్ 8 పాయింట్లతో రైడింగ్లో మెరవగా...ట్యాక్లింగ్లో సమిత్ ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో జట్టును గెలిపించాడు. తలైవాస్ రైడర్ రాహుల్ (5 పాయిం ట్లు) నిరాశ పరిచాడు. జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్ల్లో యు ముంబాతో ఫార్చూన్ జెయింట్స్; బెంగాల్ వారియర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ విజయం
పట్నా: తమిళ్ తలైవాస్ ఖాతా ఆలస్యంగానే తెరిచింది. పుంజు కుంది ఆలస్యంగానే... చివరకు గెలిచింది మాత్రం దర్జాగా! రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రైడింగ్ ప్రదర్శనతో... ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35–28తో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి హరియాణా స్టీలర్స్ ధాటికి 19–10 స్కోరుతో తలైవాస్ వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో అటు రైడింగ్, ఇటు టాకిల్స్తో తమిళ్ జట్టు వేగం పెంచి గెలిచింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 20–41తో పుణేరి పల్టన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట మొదలై పది నిమిషాలైనా... ప్రత్యర్థి పుణేరి 14 పాయింట్లు చేసినా... పట్నా మాత్రం ఖాతా తెరువలేకపోయింది. రెండుసార్లు ఆలౌటై భారీ తేడాతో మూల్యం చెల్లించుకుంది. పుణేరి తరఫున అమిత్ 9, పంకజ్ 8, మన్జీత్ 6 పాయింట్లు చేసి జట్టును గెలిపించారు. -
తమిళ్ తలైవాస్కు పట్నా షాక్
ముంబై : దబాంగ్ ఢిల్లీపై విజయంతో మంచి జోరు మీదున్న తమిళ్ తలైవాస్కు పట్నా పైరేట్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఒక్క పాయింట్ తేడాతో తమిళ్ తలైవాస్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ జట్టు స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి(5) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ.. సారథి అజయ్ ఠాకూర్(1)లు పూర్తిగా నిరాశపరిచాడు. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తమిళ్ జట్టు 23-24 తేడాతో పట్నాపై పోరాడి ఓడిపోయింది. ఇరుజట్టు ఆది నుంచి ఆచితూచి ఆడాయి. దీంతో పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. తొలి అర్దభాగం ముగిసే సరికి 11-11తో సమంగా నిలిచాయ. అయితే రెండో అర్దభాగం మొదట్లో తమిళ్ జట్టు పొరపాట్లు చేయడంతో మూల్యం చెల్లించుకుంది. ఇక చివర్లో తమిళ్ జట్టు పోరాడినప్పటికీ అదృష్టం కలిసిరాక ఓటమిచవిచూసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్(1)ను కట్టడి చేసిన తమిళ్ ఢిఫెండర్లు.. జైదీప్(7)ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో పట్నా 7 రైడ్, 17 టాకిల్ పాయింట్లను సాధించగా.. తమిళ్ తలైవాస్ 9 రైడ్, 10 టాకిల్ పాయింట్లను సాధించింది. ఇరుజట్లు చెరో నాలుగు ఎక్సట్రా పాయింట్లను సాధించాయి. -
దబంగ్ను గెలిపించిన నవీన్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో హోరాహోరీ సమరం ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి నిమిషాల్లో అనూహ్యంగా ఢిల్లీ దూసుకొచ్చింది. ఎంతో దూరంలో ఉన్న స్కోరును క్షణాల వ్యవధిలోనే సమం చేసింది. చివరికి ఒకే ఒక్క పాయింట్తో తలైవాస్ గెలుపు తలుపుల్ని మూసేసింది. అప్పటిదాకా తొడగొట్టిన తమిళ్ తలైవాస్ను చావోరేవో రైడింగ్లో నవీన్ కుమార్ పడగొట్టాడు. దీంతో దబంగ్ ఢిల్లీ 30–29 స్కోరుతో తలైవాస్పై విజయం సాధించింది. రైడర్ నవీన్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. తొలి అర్ధభాగం ముగిసేసమయానికి తలైవాస్ 18–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా ఆధిక్యాన్ని కొనసాగించింది. 28–11తో గెలుపుబాటలో పయనించింది. అనూహ్యంగా ఆఖరి 4 నిమిషాలు తలైవాస్ను ముం చాయి. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ సూపర్ రైడ్ చేయడంతో మూడు పాయింట్లు వచ్చాయి. దీంతో దబంగ్ 27–29తో పోటీలో పడింది. మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరో రెండు నిమిషాల్లో 29–29తో స్కోరు సమమైంది. చావోరేవో (డు ఆర్ డై) రైడింగ్కు వెళ్లిన నవీన్... మంజీత్ను ఔట్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తమిళ్ తలైవాస్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 7 పాయింట్లు చేసినప్పటికీ రైడింగ్లో నాలుగుసార్లే సఫలమయ్యాడు. మరో రైడర్ అజయ్ కుమార్ 16 సార్లు కూతకెళ్లి 5 పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ మంజీత్ చిల్లర్ (5) రాణించగా, మిగతా వారిలో అజిత్, మోహిత్ చిల్లర్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్; పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
తలైవాస్ చేజేతులా..
హైదరాబాద్: ప్రొ కబడ్లీ లీగ్ సీజన్-7లో మరో హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఇరుజట్ల మధ్య విజయం దోబుచూలాడింది. విజేత ఎవరో తేలడానికి చివరి కూత వరకు వేచిచూడాల్సి వచ్చింది. చివరికి దబాంగ్ ఢిల్లీదే విజయం కాగా.. తమిళ్ తలైవాస్ చేజేతాలా ఓటమిపాలైంది. గురువారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో తమిళ్ తలైవాస్పై 30-29 తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయాన్ని అందుకుంది. బుధవారం తెలుగు టైటాన్స్పై కూడా ఢిల్లీ ఒకే ఒక పాయింట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందన్న వరకూ మంచి ఆధిక్యంలో ఉన్న తలైవాస్ జట్టు.. చివర్లో అనవసరపు తప్పిదాలతో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్ విజేతన డిసైడ్ చేసే చివర కూతలో మంజీత్ చిల్లర్ బాక్స్ దాటడంతో తలైవాస్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. దబాంగ్ ఢిల్లీ 13 రైడ్ పాయింట్లు, 9 టాకిల్ పాయింట్లతో అదరగొట్టగా.. తలైవాస్ జట్టు 12 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. -
పట్నా పైరేట్స్ గెలుపు
అహ్మదాబాద్: ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ ఏడో విజయం నమోదు చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 45–27తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ప్రదీప్ నర్వాల్ 13, దీపక్ నర్వాల్ 10 పాయింట్లతో సత్తా చాటారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పైరేట్స్ 16–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. తమిళ్ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 8 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో మన్జీత్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39–35తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్లో హరియాణా స్టీలర్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనుంది. -
తెలుగు టైటాన్స్, యూపీ యోధా మ్యాచ్ ‘డ్రా’
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం టైటాన్స్, యూపీ యోధా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు చివరకు 26–26తో ‘డ్రా’గా ముగిసింది. గత మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్లో ఆ జోరు కనబర్చలేకపోయింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (3 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టైటాన్స్ తొలి అర్ధభాగంలో 10–19తో వెనుకబడింది. రెండో సగంలో ఇటు రైడింగ్లో, అటు ట్యాక్లింగ్లో అద్భుతంగా చెలరేగిన టైటాన్స్ చూస్తుండగానే మ్యాచ్పై పట్టు సాధించింది. నీలేశ్, మొహ్సిన్, అబోజర్ నాలుగేసి పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున సచిన్ కుమార్ 5, శ్రీకాంత్, రిశాంక్ దేవడిగ చెరో 4 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–32తో హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి -
యూపీ యోధాపై తమిళ్ తలైవాస్ గెలుపు
గ్రేటర్ నోయిడా: రైడింగ్లో అజయ్ ఠాకూర్, సుఖేశ్ హెగ్డే... ట్యాక్లింగ్లో మన్జీత్ చిల్లర్, అమిత్ హుడా చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ ఆర్ సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 46–24తో యూపీ యోధాపై విజయం సాధించింది. అజయ్ సుఖేశ్ చెరో 9 రైడ్ పాయింట్లు ... మన్జీత్ 8, అమిత్ 6 ట్యాకిల్ పాయింట్లు సాధించారు. మ్యాచ్ ఆరంభం నుంచి తలైవాస్ దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 26–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలోనూ అధిపత్యం కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. యూపీ యోధా తరఫున ప్రశాంత్ కుమార్ రాయ్ 7 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. నేటి మ్యాచ్ల్లో యు ముంబాతో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ బోణీ
చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్–6లో శుభారంభం చేసింది. మంగళవారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), మోసిన్ (7 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 33–28తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. ఆట ఆరంభమైన తొలి పది నిమిషాలు ఇరు జట్లు హోరాహారీగా తలపడినా ఆ తర్వాత రాహుల్ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ్ తలైవాస్ జట్టు ఆలౌటైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 17–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తలైవాస్ పుంజుకొని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో అమిత్ (6 పాయింట్లు) సత్తా చాటాడు. జోన్ ‘ఎ’లో భాగంగా గుజరాత్ ఫార్చూన్జెయింట్స్, దబంగ్ ఢిల్లీల మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32తో ‘డ్రా’గా ముగిసింది. ప్రారంభంలో తడబడిన ఢిల్లీ రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకొని చివరకు మ్యాచ్ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఆట ఆరంభమైన ఏడు నిమిషాల లోపే ఢిల్లీ ఆలౌటైంది. ప్రత్యర్థి చక్కటి డిఫెన్స్కు తోడు తమ స్వీయ తప్పిదాలతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 12–17తో వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తేరుకొని ప్రత్యర్థికి గట్టి పోటీని చ్చింది. దబంగ్ ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 9 రైడ్ పాయింట్లతో చెలరేగగా... ట్యాకిల్లో రవీందర్ (3 పాయింట్లు) రాణించాడు. గుజరాత్ తరఫున సచిన్ 7 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... సునీల్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో యు ముంబా, తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్ జట్లు తలపడతాయి. -
పట్నా పైరేట్స్కు షాక్
చెన్నై: ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. క్షణాల్లో ఆధిపత్యం చేతులు మారే ఈ ఆటలో తొలి మ్యాచ్లోనే సంచలన ఫలితం నమోదైంది. అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని తమిళ్ తలైవాస్ 42–26తో ప్రదీప్ నర్వాల్ సారథ్యంలోని పట్నా పైరేట్స్ను బోల్తా కొట్టించింది. తమిళ్ తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ 14 పాయింట్లతో సత్తాచాటగా... ట్యాక్లింగ్లో అమిత్ హుడా రాణించాడు. పట్నా పైరేట్స్ తరఫున కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. పుణేరీ పల్టన్, యు ముంబాల మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32 వద్ద ‘డ్రా’గా ముగిసింది. రెండు జట్లు ప్రతీ పాయింట్కు తీవ్రంగా పోరా డాయి. ఫలితంగా పోరు చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పుణేరీ పల్టన్స్ తరఫున నితిన్ తోమర్ 15 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో గిరీశ్ మారుతి ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 14 పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో కెప్టెన్, ఇరాన్ ప్లేయర్ ఫజల్ సత్తాచాటాడు. నేడు జరుగనున్న లీగ్ మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లు రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. -
ఆసియన్ కబడ్డీ: అజయ్ ఠాకూర్కే పట్టం
హైదరాబాద్: దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీ గెలుచుకొని ఉత్సాహంగా ఉన్న భారత కబడ్డీ జట్టు మరో సమరానికి సిద్దమైంది. ఏడు సార్లు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత టీమిండియా మరోసారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆగష్టులో ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ గేమ్స్లో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది. ఆసియన్ గేమ్స్లో పాల్గోనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్) ప్రకటించింది. తమిళ్ తలైవాస్ సారథి అజయ్ ఠాకూరే మరోసారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లను పూర్తిగా పక్కకు పెట్టిన సమాఖ్య యువకులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీనియర్లు రాకేశ్ కుమార్, అనూప్ కుమార్, మంజీత్ చిల్లర్, సురేంద్ర నాడాలకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. మరోసారి.. ఆసియన్ గేమ్స్లో పోటీపడుతున్న పదిజట్లలో టీమిండియానే అన్ని విధాలుగా బలంగా కనిపిస్తోంది. మరోసారి విజేతగా నిలవాలని భారత్ జట్టు ఆశపడుతోంది. ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, రిషాంక్ దేవడిగ, రోహిత్ కుమార్, మోనూ గోయత్లతో రైడింగ్ విభాగం బలంగా ఉండగా.. దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్, గిరీష్ మారుతి ఎర్నాక్, మోహిత్ చిల్లర్, రాజు లాల్ చౌదరీ, మల్లేష్ గంగాధరిలతో ఢిఫెండింగ్ దుర్భేద్యంగా ఉంది. -
ఇంగ్లండ్ గెలవాలి: సచిన్
హైదరాబాద్: ఫిఫా ప్రంపకప్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫ్రాన్ ఫైనల్ చేరుకోగా.. మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లండ్- క్రోయేషియా తలపడనున్నాయి. ఎవరికి అందని అంచనాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టే కప్పు గెలవాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. ట్విటర్ వేదికగా బ్రిటీష్ జట్టుకు మద్దతు తెలుపుతూ సచిన్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇంగ్లండ్ మాజీ ఫుట్బాలర్, కేరళ బ్లాస్టర్ మేనేజర్ డేవిడ్ జేమ్స్ను ట్యాగ్ చేశాడు. ‘హాయ్ గాయ్స్, ఈ సారీ నేను పుట్బాల్లో ఇంగ్లండ్కు మద్దతు ఇస్తున్నాను.. కమాన్ ఇంగ్లండ్’ అంటూ సచిన్ వీడియోను చిత్రీకరించి పోస్ట్చేశారు. ఇప్పడా ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఇంగ్లండ్కు అభిమానుల మద్దతు మరింత పెరిగింది. ఇతర క్రీడలపై అభిమానం.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్కు క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలపై అభిమానం ఎక్కువే. ఫుట్బాల్ను సచిన్ అమితంగా ఇష్టపడతాడు కాబట్టే ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్కు సహ యజమానిగా వ్యవహరిస్తూ ఫుట్బాల్పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. టెన్సిస్ను కూడా ఇష్టపడే సచిన్ రోజర్ ఫెడరర్కు వీరాభిమాని. దేశంలో కబడ్డీని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రో కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్ను కొనుగోలు చేశారు. Come on England!! #FIFA18@JamosFoundation pic.twitter.com/S9PZ9EWQHk — Sachin Tendulkar (@sachin_rt) July 11, 2018 -
తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది. నిరాశాజనక ప్రదర్శనతో 13వ పరాజయాన్ని చవిచూసింది. జోన్ ‘బి’లో జరిగిన మ్యాచ్లో రోహిత్ కుమార్ (17 పాయింట్లు) రాణించడంతో బెంగళూరు బుల్స్ 45–35 స్కోరుతో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. 18 మ్యాచ్లాడిన బుల్స్కు ఇది ఐదో విజయం. రోహిత్ రైడింగ్లో కదం తొక్కాడు. 24 సార్లు కూతకు వెళ్లిన అతను 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు. తమిళ్ తలైవాస్ తరఫున స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ (15) మరోసారి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్పాంథర్స్తో గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా మంగళవారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ జట్టు 35–34తో విజయం సాధించింది. చివరి క్షణాల్లో తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ మూడు రైడింగ్ పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–34తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. బుధవారం జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్పాంథర్స్తో తెలుగు టైటాన్స్; యూపీ యోధాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
తలైవాస్ మళ్లీ ఓడింది
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో ఈ ఏడాది ప్రవేశించిన సచిన్ జట్టు తమిళ్ తలైవాస్ నిరాశజనక ప్రదర్శనను కొనసాగిస్తుంది. జోన్ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో తలైవాస్ 25–29 స్కోరుతో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. లీగ్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడిన తమిళ్ తలైవాస్కు ఇది ఆరో ఓటమి కాగా... ఒకే ఒక్క మ్యాచ్లో నెగ్గింది. మరోవైపు ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగాల్ వారియర్స్ ఆరో విజయాన్ని సాధించింది. రైడింగ్లో మణిందర్ సింగ్ (6) రాణించగా, డిఫెండర్ సుర్జీత్ సింగ్ టాకిల్లో 4 పాయింట్లు చేశాడు. జాంగ్ కున్ లీ 4, వినోద్ కుమార్, రాన్ సింగ్ చెరో 3 పాయింట్లు సాధించారు. తలైవాస్ జట్టు తరఫున అమిత్ హుడా 4, ప్రపంజన్, దర్శన్, అజయ్ ఠాకూర్ తలా 3 పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 31–25తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్పాంథర్స్, బెంగాల్ వారియర్స్తో హర్యానా స్టీలర్స్ తలపడతాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement