-
ఇండియాలో డేటా సెంటర్ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్లోనే వీటిని పరిచయం చేసింది. భారత్లో రీల్స్కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్ను నెరవేర్చలేమన్న మంత్రి -
USA: అమెరికాలో ‘టిక్టాక్’ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్టాక్ షార్ట్ వీడియో యాప్పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్టాక్పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో నిజాయితీ లేదని, టిక్టాక్ నిషేదం వల్ల ఫేస్బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్టాక్లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్బుక్ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో నష్టాలు చవిచూశాయి. అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్టాక్తో పాటు వి చాట్ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్టాక్ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్టాక్పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్డ్యాన్స్ కంపెనీ టిక్టాక్ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్టాక్కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి. ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్టాక్ యాప్ యాజమాని బైట్డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది. ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే -
ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్! ఒక్కో ఇన్స్టా పోస్టే లక్ష..!
ఇటీవల యువతరం సంపాదన ఇలా కూడా ఆర్జించొచ్చు అని చూపిస్తోంది. కొందరూ టిక్టాక్ స్టార్లుగా వచ్చి ఇన్స్టాగ్రాం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఓ రేంజ్లో ఫాలోవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సంపాదన కూడా కళ్లు చెరిరేలా ఐదెంకెల్లో ఆర్జిస్తుండటం విశేషం. అలాంటి కోవకు చెందిందే ఈ బ్యూటీఖాన్.. బ్యూటీ ఖాన్ అసలు పేరు మముదా ఖాతున్. సొంతూరు కోల్కతా. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే యమ లవ్వు. డ్రీమ్డ్ అబౌట్ డాన్సర్ కావాలని. టిక్ టాక్ (మన దగ్గర నడిచినప్పుడు) స్టార్ .. ఇన్స్టా సెలబ్రిటీ అయింది. ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యాక్ట్రెస్ కూడా. షార్ట్ వీడియో కంటెంట్కి ఫేమస్. ఆమె ఇన్స్టా హ్యాండిల్కి 12.4 మిలియన్స్కి పైనే ఫాలోవర్స్ ఉన్నారు. అకార్డింగ్ టు సమ్ వెబ్సైట్స్.. ఆమె ఒక్కో ఇన్స్టా పోస్ట్కి 50 నుంచి 1 ల్యాక్ ’ చార్జ్ చేస్తుందట. ఆమె ఆమ్దనీ నెలకు అప్రాక్సిమేట్గా రెండు లక్షల వరకు ఉండొచ్చని ఆ వెబ్సైట్స్ అంచనా. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, మోడలింగ్, యాక్టింగ్ .. ఆమె మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. సోషల్ మీడియానా మజాకా! (చదవండి: వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!) -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్ఫోన్కు అతుక్కుపోయేలా చేసే టిక్టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్లో వైరల్గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..
మనదేశంలో టిక్టాక్ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. యురోపియన్ యూనియన్లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్ఏ) ప్రకారం..ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, సెర్చ్ ఇంజిన్లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్టాక్తోపాటు మరో 18 ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలు యూరప్లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. -
అడవుల్లో బతికేస్తున్న పాపులర్ టిక్టాకర్
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పెద్దమనిషి కొంతకాలంగా అడవుల్లో సంచరిస్తూ గుహలలోనే తలదాచుకుంటూ బతికేస్తున్నాడు. గుహలలో తలదాచుకోవడానికి, అడవుల్లో సురక్షితంగా తిరగడానికి అవసరమైన మెలకువలు చెబుతూ సెల్ఫీ వీడియోలను ‘టిక్టాక్’లో షేర్ చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఈ ఆధునిక అడవి మనిషి పేరు డానీ డస్ట్. ‘టిక్టాక్’లో ఇతడికి ఏకంగా కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘గుహలలో తలదాచుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. తలదాచుకోవాలనుకున్న గుహ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. గుహలో ఏదైనా జంతువు విసర్జకాలు ఉన్నట్లయితే, అది ఆ జంతువు సొంతం. అలాంటి గుహలో తలదాచుకోవడం ప్రాణాలకే ప్రమాదం. అలాగే గుహల్లో ఉండే సాలెగూళ్లు, తేనెపట్లులాంటివి ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. గుహ పైభాగంలో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. పైభాగంలో పగుళ్లు ఉంటే, ఏ క్షణంలోనైనా పెళ్లలు విరిగి నెత్తిన పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ సజావుగా ఉన్న గుహను ఎంపిక చేసుకోవడం ఒక కష్టమైతే, అందులోని రాతి నేల మీద అలాగే పడుకోలేం. అందుకని తగినంత ఎండుగడ్డిని పోగు చేసుకుని, పరుచుకుంటే పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది’ అని చెబుతాడు డానీ. అడవుల్లో పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసంతోను, అడవిలో దొరికే పండ్లు కాయలతోనే కాలక్షేపం చేస్తూ ఇతడు తీసే వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుండటం విశేషం. View this post on Instagram A post shared by Überleben® (@uberleben.co) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) View this post on Instagram A post shared by Donny Dust (@donnydust) -
పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..
టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. అదోరకం వెర్రి.. సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. 75 హార్డ్ ఛాలెంజ్.. కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్బర్న్ అనే టిక్టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. అయినా బుద్ధి మారలేదు.. పాపం ఫెయిర్బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు.. -
పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది
దుబాయ్: అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమానిపై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది. అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికిచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Tierra Young Allen, Truck Driver TikTok Star, Is Detained in #Dubai! She is accused of ‘Screaming’ at a rental car agent. Will she get the #BrittneyGriner treatment and get her home sooner than later? 🤔 pic.twitter.com/GOIca0H58J — WOKEVIDEO (@wokevideo) July 16, 2023 ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. -
ఎంటెక్ చదివి.. టిక్టాక్తో మొదలెట్టి..
అతను ఎంటెక్ చదివాడు. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ అందరూ నడిచే దారిలో వెళ్లాలనుకోలేదు. తనకంటూ ప్రత్యేక ‘మార్గం’ ఉండాలని భావించాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. ఎంచుకున్న రంగం ఏదైనా పట్టుదల, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ..అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. అతనే ప్రశాంత్ అలియాస్ ప్రసూబేబీ. సాక్షి, అనంతపురం డెస్క్ : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనలో సత్తా చాటుతూ.. అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్ స్టార్గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిలుగా కని్పంచే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. ‘ప్రసూబేబీ’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రసూబేబీ ( (prashu_baby)) పేరిట ప్రశాంత్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్స్రై్కబర్లు ఉన్నారు. సంస్థలను మినహాయిస్తే వ్యక్తిగత విభాగానికి సంబంధించి రాష్ట్రంలో హర్షసాయి తర్వాత అత్యధిక సబ్స్రై్కబర్లు ఉన్నది ఈ చానల్కే. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు వీడియోలను రెగ్యులర్గా రూపొందించి ఇందులో అప్లోడ్ చేస్తున్నా . వీడియో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంటుకు కూడా 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కువైట్, అమెరికా,సౌదీ తదితర దేశాల ప్రజలు సైతం ప్రశాంత్ వీడియోలను వీక్షిస్తున్నారు. ధరణి, శిశిర, ప్రసూ కాంబినేషన్లో వచ్చిన వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంటెక్ చదివేందుకు అనంతపురం వచ్చిన ప్రశాంత్ ఇక్కడి నుంచే సీరియస్ ‘యాక్టింగ్’ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 30 మందికి పైగా తనతో కలసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి..వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీని గుర్తించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశాడు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. పెద్దసంస్థలతో కలసి ఇతర భాషల్లో సోషల్ మీడియా వేదికగా వినోదాత్మక వీడియోలు రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఎంటెక్ చదివి.. టిక్టాక్తో మొదలెట్టి.. ప్రశాంత్ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా..ప్రశాంత్ చిన్నోడు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. జేఎన్టీయూ (అనంతపురం)లో ఎంటెక్ చేశాడు. ఇంజినీరింగ్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో చిన్నచిన్న వీడియోలు సొంతంగా రూపొందించి ‘టిక్టాక్’లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబం ఇతివృత్తంగా వీడియోలు రూపొందించేవాడు. అవి బాగా ట్రెండింగ్కావడంతో లక్షల్లో సబ్స్రై్కబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్టాక్పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్పై మళ్లించాడు. ఇష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి.. ఏ పనైనా ఇష్టపడి చేయాలని నేను భావిస్తా. నేను ఇలా వీడియోలు చేయడాన్ని మొదట్లో స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టారు. కానీ సక్సెస్ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నా. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా వెబ్ సిరీస్లపై దృష్టి పెడుతున్నా. – ప్రశాంత్ -
కొంపముంచిన టిక్టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!
టిక్టాక్లో నెటిజన్ల మనసు దోచేయడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఈ విధంగానే ట్రై చేసిన టిక్టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం బొబ్బలతో నిండిపోయింది. 'జీవితంలో ఎదుర్కొన్న విపరీతమైన నొప్పి' అనే క్యాప్షన్తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆవిడ పేరు షాఫియా బషీర్(37). టిక్టాక్లో జనాలను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వంటకం వీడియో తీయాలనుకుంది. ఈ క్రమంలో గుడ్లను మైక్రోవేవ్లో ఉడకబెట్టింది. ఆ తర్వాత బాగా ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకు చల్లని చెంచాను మైక్రోవేవ్లో పెట్టింది. అంతే.. అందులో ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆమె ముఖం మీద పడ్డాయి. వెంటనే చల్లని నీటిలో ముఖం పెట్టినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా బొబ్బలు వచ్చాయి. ఇంకేముంది ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. ఒంటరి మహిళ అయినందున చాలా ఖాళీ సమయం దొరుకుతుందని.. ఆ క్రమంలో టిక్టాక్లో వంటల వీడియోలు చేస్తుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతం గాయం నుంచి కొలుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన తన జీవితంలో విపరీతమైన నొప్పిని కలిగించిందని తెలిపింది. టిక్టాక్ వీడియోలు చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చదవండి:‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం -
ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్ఖాన్కు నాలుగో భార్యనవుతా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్ అనే టిక్టాకర్ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ’’ అంటూ ఆ వీడియోలో జియా ఖాన్ కొంటెగా చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
టిక్టాక్ కార్ థెఫ్ట్ చాలెంజ్: రాజీకి వచ్చిన హ్యూందాయ్, కియా..
హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్టాకర్లు. ‘టిక్టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్టాక్లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) ప్రకారం.. ఛాలెంజ్తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి. దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్హెచ్టీఎస్ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశాయి. కార్ ఓనర్లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్లను అందించాయి. ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా? -
టిక్టాక్పై యూకే నిషేధం
లండన్: ప్రభుత్వ ఫోన్లలో టిక్టాక్ యాప్ వినియోగంపై బ్రిటన్ నిషేధం విధించింది. చైనా మూలాలున్న ఈ సామాజిక మాధ్యమ యాప్ను భద్రతాపరమైన కారణాలతో నిషేధిస్తున్నట్లు తెలిపింది. యూకే మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంట్లో ఈ విషయం ప్రకటించారు. ప్రభుత్వ డేటా, సమాచారాన్ని టిక్టాక్ వాడుకోవడం ప్రమాదకరమని ఆయన అన్నారు. టిక్టాక్పై ఇప్పటికే భారత్, అమెరికా, కెనడా, ఈయూ దేశాలు పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. యాప్ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకున్నట్లు వస్తున్న ఆరోపణలను టిక్టాక్ ఖండిస్తోంది. -
టిక్టాక్.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు
వాషింగ్టన్: టిక్టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు. గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్లో వీడియోలు చూడాలంటే పాస్కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు. -
టిక్.. టిక్.. టిక్.. షేరింగ్కు సమయం లేదు మిత్రమా!
మన దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన మొబైల్ ఫోన్ అప్లికేషన్(యాప్) టిక్టాక్. యాప్లో స్వయంగా వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టుచేసి, లైక్లు కొట్టేయడం, కామెంట్లు చూసుకొని మురిసిపోవడం ఒక మధురానుభూతి, ఒక జ్ఞాపకం. చైనాకు చెందిన ఈ యాప్పై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది. ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ను నిషేధిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో యాప్ వాడకాన్ని నిషేధించారు. అమెరికా సైనిక దళాల్లో యాప్పై నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరింది. జనానికి నచ్చిన టిక్టాక్ను ప్రభుత్వాలే వారి నుంచి దూరం చేస్తుండడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఎందుకీ నిషేధం? ► టిక్టాక్ను నిషేధించడానికి ప్రభుత్వాలు చెబుతున్న ప్రధాన కారణం దేశ భద్రత. ► యూజర్ల డేటాతో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ వంటి వివరాలు నేరుగా చైనా ప్రభుత్వానికి చేరే ప్రమాదం ఉందని వివిధ దేశాలు అనుమానిస్తున్నాయి. ► ఇతర దేశాలపై, అక్కడి ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేయడానికి టిక్టాక్ యాప్ చైనా చేతిలో ఒక ఆయుధంగా మారు తుందని భావిస్తున్నాయి. ► తప్పుడు ప్రచారం సాగించి, ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ► టిక్టాక్ వల్ల యూజర్ల డేటాకు భద్రత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఫోన్లలోనూ టిక్టాక్ వాడుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. ► విదేశాల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తే అక్కడి కంపెనీలు దాన్ని ఒక అవకాశంగా వాడుకొని లబ్ధి పొందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏయే దేశాలు నిషేధించాయి? ► 2021 జనవరిలో భారత్ టిక్టాక్ను పూర్తిస్థాయిలో నిషేధించింది. డేటా ప్రైవసీ, జాతీయ భద్రత కోసమంటూ చైనాకు చెందిన ఇతర యాప్లపైనా నిషేధం విధించింది. ► ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తాత్కాలిక నిషేధం విధించారు. నిర్ధారణ కాని, అనైతిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. ► అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఫోన్ల నుంచి టిక్టాక్ను తొలగించాలంటూ ఉద్యోగులకు ఇటీవలే ఆదేశాలు అందాయి. ► అమెరికాలో 50కిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్టాక్ను బ్యాన్ చేశారు. కేవలం ప్రభుత్వ ఫోన్లలోనే కాదు, సాధారణ ప్రజలు సైతం టిక్టాక్ వాడకుండా పూర్తిగా నిషేధించాలని అమెరికాలో కొందరు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ► అమెరికా సైనిక దళాల్లో టిక్టాక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు. ► తైవాన్లో ప్రభుత్వ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ కంప్యూటర్లలో టిక్టాక్ యాప్ ఉపయోగించడాన్ని 2022 డిసెంబర్లో నిషేధించారు. టిక్టాక్ వాదనేంటి? ► తమ యాప్ వల్ల డేటా భద్రత ఉండదన్న వాదనను టిక్టాక్ యాజమాన్యం ఖండించింది. ► యాప్ కారణంగా డేటా చౌర్యం జరుగుతోందని తేల్చడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ► యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశమే లేదని, యాప్ను నిశ్చింతగా వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది. ► కొన్ని దేశాలు టిక్టాక్ను నిషేధించడం విచారకరమని పేర్కొంది. డేటా ప్రైవసీకి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది. ► యాప్ను నిషేధించడం యాజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని యాజమాన్యం ఆక్షేపించింది. ► నిషేధం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. ► కొన్ని పాశ్చాత్య దేశాలు అభద్రతాభావంతో టిక్టాక్ను తొలగిస్తున్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రభుత్వం విమర్శిస్తోంది. యాప్పై నిషేధం విధించడం ఆయా దేశాల్లో వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం ఖాయమని తేల్చిచెప్పింది. అసలు ఏమిటీ యాప్? చైనాకు చెందిన బైట్డ్యాన్స్ అనే కంపెనీ ‘డౌయిన్’ పేరిట 2016 సెప్టెంబర్లో యాప్ను ప్రారంభించింది. తొలుత చైనాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయిలో డౌన్లోడ్లు జరిగాయి. దాంతో బైట్డ్యాన్స్ కంపెనీ 2017లో అంతర్జాతీయ వెర్షన్ను ప్రారంభించింది. దీనికి టిక్టాక్ అనే పేరుపెట్టింది. 2018 ఆగస్టు నుంచి యాప్ ప్రపంచమంతటా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. చైనాలో ఇది డౌయిన్ పేరిటే కొనసాగుతోంది. తక్కువ నిడివితో కూడిన వీడియోల షేరింగ్ కోసం టిక్టాక్ యాప్ను రూపొందించారు. ప్రాథమికంగా లిప్ సింకింగ్, డ్యాన్సింగ్ వీడియోలను ఇతరులతో పంచుకొనే వీలుంది. 3 సెకండ్ల నుంచి 10 నిమిషాల నిడివిల వీడియోలు ఉంటాయి. యూజర్ల అభిరుచులు, ఆసక్తిని బట్టి వీడియోలు ప్రత్యక్షం కావడం ఇందులోని మరో ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా భాషల్లో టిక్టాక్ యాప్ అందుబాటులో ఉంది. -
కెనడాలోనూ టిక్టాక్పై నిషేధం
టొరంటో: చైనాకు చెందిన టిక్టాక్పై కెనడా నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన మొబైల్ పరికరాలు వేటిలోనూ దాన్ని వాడకూడదని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులెవరూ దీన్ని వాడొద్దని ఆదేశించింది. ప్రైవసీకి, భద్రతకు ఈ యాప్ వల్ల చాలా రిస్కుందని కెనడా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ధారించినట్టు ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ మోనా ఫోర్టియర్ తెలిపారు. ఇది ప్రారంభమేనని, మున్ముందు మరిన్ని చర్యలుంటాయని ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. డెన్మార్క్లో ప్రభుత్వ మొబైళ్లు తదితరాల్లో టిక్టాక్ను నిషేధించాలని పార్లమెంటు పేర్కొంది. అమెరికా నెల రోజుల్లోపు ప్రభుత్వ మొబైళ్లు తదితర పరికరాల్లో నుంచి టిక్టాక్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. -
టిక్టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!
వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్తో కారు ఇంజిన్ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు. దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్తో వస్తున్నాయి. -
టిక్టాక్ సంచలన నిర్ణయం: వాళ్లందరిపైనా వేటు!
సాక్షి,ముంబై: సోషల్ మీడియా సంస్థ, ఇండియాలో బ్యాన్ అయిన టిక్టాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తున్న వారినందరికి ఉద్వాసన పలికింది. ఫలితంగా దాదాపు 40మంది ప్రభావితంకానున్నారు. నిషేధం తరువాత భారత్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో టిక్టాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మూడు సంవత్సరాల క్రితం నిషేధానికి గురైన టిక్టాక్ ఆఫీసులను కూడా మూసివేయనుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, బైట్డాన్స్ యాజమాన్యంలోని టిక్టాక్ ఈ వారం 40 మందికి పింక్ స్లిప్లను అందించింది. తొలగించిన ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతాన్ని చెల్లిస్తామని పేర్కొంది తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్కు సపోర్ట్ కోసం 2020లో భారత్లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్ను మూసివేయాలని నిర్ణయించామని టిక్టాక్ ప్రతినిధి ఒ్క ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు గత ఏడాది అమెరికాలోనూ అన్ని ఫెడరల్ ప్రభుత్వ డివైస్లలో టిక్టాక్పై నిషేధాన్ని ఆమోదించింది. టిక్టాక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుపై ఈ నెలలో ఓటింగ్ నిర్వహించాలని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ యోచిస్తోంది. భారత్లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్టాక్ ఇప్పటికీ భారత్లో కార్యాలయాన్ని కొనసాగిస్తోంది. భారత్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కట్ల కోసం పనిచేస్తున్నారు.తాజాగా వీరందరికి ఉద్వాసన పలికింది. చైనా కంపెనీ బైట్డాన్స్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను సరిహద్దు ఉద్రిక్తతలు, జాతీయ భద్రత కారణాలతో 2020లో కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
Nepal Plane Crash: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన
నేపాల్ విమానా ఘటన తర్వాత పలువురు గురించి వస్తున్న ఆసక్తికర విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఆ ఘటన బాధిత కుటుంబాలకు అంత తేలిగ్గా మర్చిపోలేని అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటన రోజు విధులు నిర్వర్తించేందకు వెళ్లిన ఫ్లైట్ అటెండెంట్ ఓషిన్ అలే మగర్ది మరో విషాద గాథ. ఆ ఫ్లైట్ అటెండెంట్ అలే మగర్ రెండేళ్లుగా యతి ఎయిర్లైన్స్లో పనిచేస్తోంది. ఆమె ఖట్మాండ్లో తన కుటుంబంతో నివశిస్తోంది. వాస్తవానికి ఆరోజు విధులు నిర్వర్తించాల్సింది కాదు. ఇంట్లో తండ్రి మోహన్ అలే మగర ఆమెను ఆరోజు డ్యూటీ మానేయమని, సంక్రాంతి పండుగ చేసుకుందామని చెప్పారు. అయినా సరే ఆమె పట్టుపట్టి మరీ ఆ రోజు విధులకు వెళ్లింది. పైగా తాను రెండు విమానాల్లో చేయాల్సిన డ్యూటీని ముగించుకుని సంక్రాంతి రోజుకల్లా వచ్చేస్తానంటూ వెళ్లిందన ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కచ్చితంగా సంక్రాంతి రోజున ఇంట్లోనే ఉంటానని హామీ ఇచ్చిందంటూ విలపించారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదనగా చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లే అయ్యిందని, ఆమె భర్త యూకేలో ఉన్నట్లు తెలిపారు. ఐతే ఇప్పుడూ ఆ ఫ్టైల్ అటెండెంట్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు ఆ యతి ఎయిర్లైన్స్ విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు చేసిన వీడియో అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇది గతేడాది సెప్టెంబర్ 11న రికార్డు చేసిన వీడియో అని, విమానం క్రాష్ జరగడానికి ముందు తీసినది కాదని ఆమె టిక్టాక్లో షేర్ చేసిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. కాగా, నేపాల్లో ఆదివారం యతి ఎయిర్లైన్ ఏటీఆర్ 72 విమానం కూలి సుమారు 68 మంది దాక మృతి చెందిన సంగతి తెలిసిందే. The Air hostess in #YetiAirlinesCrash Live life to the fullest as long as you are alive because death is unexpected! Just sharing TikTok video of Air Hostess Oshin Magar who lost her life in #NepalPlaneCrash today जहां भी रहो ऐसे ही रहो! Rest in Peace !!💐#Nepal #planecrash pic.twitter.com/Bh6DBDnhnt — Deep Ahlawat 🇮🇳🎭 (@DeepAhlawt) January 15, 2023 (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
టిక్టాక్కు భారీ షాక్.. యాప్పై అమెరికా ప్రభుత్వం నిషేధం!
భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టిక్ టాక్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం దేశ మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్లలో వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు. చైనా దేశం బైట్ డ్యాన్స్ సంస్థకు చెందిన టిక్టాక్ వినియోగడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ) టిక్ టాక్ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్ టాక్ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ డివైజ్లలో యాప్ను డిలీట్ చేయాలని కోరారు. ఇప్పటికే గత వారం టిక్ టాక్ యాప్ సాయంతో అమెరికన్లు, ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు..గవర్నమెంట్కు చెందిన డివైజ్లలో మాత్రమే యాప్ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశాయి. జో బైడెన్ సంతకంతో కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2023 వరకు ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విభాగాల నిర్వహణకోసం 1.66 ట్రిలియన్ డాలర్ల నిధుల విడుదల చేసేందుకు ఆమోదించింది. దీంతో పాటు టిక్టాక్పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్స్ మీద దేశాధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేస్తే.. నిషేధం వెంటనే అమల్లోకి రానుంది. అమెరికాలో యాప్ను నిషేధించాలని యాప్ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. కానీ జోబైడెన్ ప్రభుత్వం కేవలం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, వారి శాఖలకు చెందిన ఉద్యోగులు టిక్టాక్ వినియోగంపై ఆంక్షలు విధించింది. కాగా, అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ యాజమాన్యం బైట్డ్యాన్స్ స్పందించలేదు చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..!, ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్! -
పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది. బూగీ బీ షాపింగ్కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 43 ఏళ్ల బూగీ బీ.. టిక్ టాక్, ఇన్స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్ ఫైటింగ్కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్రెండ్స్తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
‘మీ4 టిక్ టిక్’ యాప్ లాంచ్.. టిక్ టాక్ను మరిపిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు. ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు. -
సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10 కోట్ల డీల్!
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్(42) హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
టిక్టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
సాక్షి, తిరుపతి: భర్త మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేదు భార్య. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భర్తకు ప్రియురాలిని ఇచ్చి భార్య దగ్గరుండి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో జరిగింది. టిక్టాక్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. వెతుక్కుంటూ వచ్చిన యువతితో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. ఈ అరుదైన వివాహం గురించి తెలుసుకుందాం రండీ... డక్కిలి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్టాక్లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు.. ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది. కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు.. తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement