-
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
ఇంద్రాణి ట్రైలర్ బాగుంది
‘‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో రూపొందిన ‘ఇంద్రాణి’ చిత్రం విజయం సాధించాలి’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం దర్శకత్వంలో వెరోనికా ఎంటర్టైన్ మెంట్స్పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సుధీర్ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, కేకే రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ఫ్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ‘ఇంద్రాణి’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలున్న సైన్స్ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. రాబోయే 50 సంవత్సరాల్లో ఇండియా సాంకేతిక పరంగా ఎంత ముందుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు స్టీఫెన్ పల్లం. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్ మాధవనేని. -
గామి మూవీ ట్రైలర్
-
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్
-
ఏలియన్ మూవీ ట్రైలర్ రిలీజ్
-
ఈగల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
-
వ్యూహం... నేను నమ్మిన రియాలిటీ
‘‘నేను తీసినటువంటి విభిన్న రకాలైన సినిమాలు ఎవరూ తీయలేదు. రాజకీయ నాయకులు, పోలీసులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. నాకు పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్లు తీయడం అంటే ఇష్టం’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘వ్యూహం: 1’ ఈ నెల 29న విడుదల కానుంది. మలి భాగం ‘శపథం’ పేరుతో జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘వ్యూహం: 1’ రెండో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ‘వ్యూహం’ సినిమా రిలీజ్ను ఎవరూ ఆపలేరు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నేను, కిరణ్గారు కలిసి నిరూపించాం. క్లీన్ యూతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? అనేది సీక్రెట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి 2023 వరకు ‘వ్యూహం’ సినిమా మొత్తం కథనం ఉంటుంది. వైఎస్ జగన్గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ తొలి భాగంలో ఏవైనా సందేహాలు కలిగితే అవి రెండో భాగంలో నివృత్తి అవుతాయి. నిజ జీవితంలోని వ్యక్తులు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కానీ నేను నమ్మిన రియాలిటీతోనే ‘వ్యూహం’ ఉంటుంది. సినిమా అంటేనే నాటకీయత. కాబట్టి ఈ సినిమాలో ఆ నాటకీయత కూడా ఉంటుంది. ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ సినిమాలో కామెడీ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ‘వ్యూహం’ తరహా సినిమాలను నేను తీస్తానా? అంటే చెప్పలేను. ఎందుకంటే నా మాటపై నేను నిలబడను’’ అని అన్నారు. ‘‘రామ్గోపాల్ వర్మగారితో నేను గతంలో ‘వంగవీటి’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ ్రపాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతి వారం థియేటర్స్లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. అన్నింటికీ థియేటర్లు దొరుకుతాయి. మా ‘వ్యూహం’ సినిమాను ఎక్కువ థియేటర్స్లోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్. ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్గారితో నాకు పరిచయం లేదు. అయితే జగన్గారంటే నాకు పాజిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. సీబీఎన్గారంటే కూడా నాకు ఇష్టమే. విలన్స్ అన్నా నాకిష్టమే. ‘నా వెనక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు (ఓ పాత్రధారి).. తన ఊపు చూస్తుంటే ఏదో కొత్త పార్టీ పెట్టేసేలా ఉన్నాడు (మరో పాత్రధారి). క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఊరికే అనలేదు పెద్దలు (ఓ పాత్రధారి)’ అనే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటే... చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో పని చేసినవారిని సంప్రదించి, నేను నమ్మిన అంశాలతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టాం. అసలు.. జనసేనలో పవన్కల్యాణ్ టీడీపీ కోవర్ట్గా పని చేస్తున్నాడని నా అభిప్రాయం. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతన్ని అభిమానిస్తున్నట్లుగా మాట్లాడాను. కానీ అతనిలో స్థిరత్వం లేదు. ఇక తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరెవరు నిలబడుతున్నారు? వారు ఏమేం హామీలు ఇస్తున్నారనే రాజకీయ పరిజ్ఞానం నాకు లేనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడం కరెక్ట్ కాదని, ఓ బాధ్యత గల పౌరుడిగా నేనిప్పటి వరకూ ఓటు వేయలేదు. – రామ్గోపాల్ వర్మ -
హారరా? థ్రిల్లరా?
భాను శ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకత్వంలో శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘కలశ’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హారరా? అనే సందేహం కలిగేలా ట్రైలర్ను కట్ చేశారు. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కలశ’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. థియేటర్స్లో చూడండి’’ అని యూనిట్ పేర్కొంది. -
అడవి అందంగా ఉంటుంది
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత రామ్గోపాల్ వర్మ, నటుడు శివాజీరాజా, నిర్మాత రామారావు అతిథులుగా హాజరై పాటలు, ట్రైలర్ను విడుదల చేశారు. రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు అందమంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్స్, ఫైట్లు చేస్తుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నటనకు స్కోప్ ఉన్న ‘తలకోన’లాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు అప్సరా రాణి. ‘‘ప్రకృతిలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేశ్. ‘‘చాలా రిస్క్ చేసి, ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాం’’ అన్నారు దేవర శ్రీధర్ రెడ్డి. -
వ్యూహం మూవీ ట్రైలర్ విడుదల
-
‘బ్రో’ మూవీ ట్రైలర్
-
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
సర్దార్ నాకు పోటీ వచ్చినా పర్లేదు..‘మిస్టేక్’ హిట్టుకొట్టాలి: శ్రీకాంత్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి. -
పిల్లి బొమ్మ వస్తుంది!
‘నెక్ట్స్ టెన్ డేస్లో చాలా పెద్ద డీల్ ఉంది. దుబాయ్ నుంచి ముంబైకి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్గా మన దగ్గరకు చేర్చాలి’ అనే డైలాగ్తో ‘నారాయణ అండ్ కో’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘నారాయణ అండ్ కో’ రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ట్రైలర్
-
నిజం కచ్చితంగా గెలుస్తుంది
‘నిన్ను సీఎం సెక్యూరిటీకి అని పంపిస్తే.. నువ్వు ఆవిడ బండినే ఆపేస్తావా?’ అనే డైలాగ్తో ‘కస్టడీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ని శుక్రవారం విడుదల చేశారు. ‘నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను.. లేకపోతే ట్రై చేస్తూ చస్తాను’, ‘ఒక్కసారి న్యాయం పక్క నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’, ‘నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ (నాగచైతన్య), ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్లు.. లేకపోతే నా చావు నేను చస్తా’ (కృతీ శెట్టి) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రిగా, అరవింద్ స్వామి విలన్గా, శరత్ కుమార్ పోలీసాఫీసర్గా నటించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కతీర్, సమర్పణ: పవన్ కుమార్. -
Rudhrudu: కనిపెట్టాలి.. కొట్టాలి!
‘‘కూర్చున్న చోటే స్కెచ్ వేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటకు లాక్కొచ్చాడంటే వాడెంత తోపై ఉంటాడు’’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్. దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఒకడి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి’, ‘మావ.. మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతోంది రా.. మనమే వెతకాలి. మనమే కనిపెట్టాలి. మనమే కొట్టాలి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు లారెన్స్. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్కుమార్ అతని లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలవుతాయి. అయినప్పటికీ దృఢంగా నిలబడి, క్రిమినల్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ను బాలయ్య రిలీజ్ చేశారు. కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్లు కీలక పాత్రలు పోషించారు. -
అజిత్ హీరోగా నటిస్తున్నతెగింపు సినిమా ట్రైలర్ రిలీజ్
-
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్’ సినిమా సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. నవీన్ బేతిగంటి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్. ఫైర్ ప్లై ఆర్ట్స్పై రజినీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్ను శేఖర్ కమ్ముల విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తన కోసం కష్టపడిన వారిని ఆ నాయకుడు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే మంచి కథని తీసుకున్నప్పుడే నవీన్ సక్సెస్ అయ్యాడు’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది’’ అన్నారు నవీన్. నటులు శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ గీల పాల్గొన్నారు. -
Anukoni Prayanam: నా మనసుకు నచ్చింది
‘‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ. నా మనసుకు నచ్చింది. నా చిత్రాల్లో ది బెస్ట్గా నిలుస్తుంది. ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ నాలో మొదలైంది’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో డా.జగన్మోహన్ డీవై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’లో నాది సీరియస్ పాత్ర. అందుకే ఆ సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. కానీ, అందరూ నవ్వి నవ్వి వంద రోజులు చూశారు. ఇప్పుడు ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నరసింహ రాజు. ‘‘కరోనా సమయంలో ఈ కథ రాశాను’’ అన్నారు డా.జగన్ మోహన్ డీవై. ‘‘ఈ చిత్రం అందరి హృదయాలను టచ్ చేస్తుంది’’ అన్నారు వెంకటేష్ పెదిరెడ్ల. ‘‘అనుకోని ప్రయాణం’ సంచలన విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి . ‘‘ఈ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. దర్శకులు కె.విజయభాస్కర్, నందినీ రెడ్డి, వీరభద్రం, నటుడు సోహైల్ పాల్గొన్నారు. -
'బ్రేక్ అవుట్'మూవీ ట్రైలర్ విడుదల చేసిన అల్లు అర్జున్
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు. టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా సర్వైవల్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. Happy to launch the trailer of #BreakOut. The concept of the movie looks interesting. It’s good to see a young team in TFI experimenting with such stories. My best wishes to #RajaGoutham, director @its_Subbu4U and the whole cast & crew.https://t.co/sJ6BlKpa4N — Allu Arjun (@alluarjun) August 29, 2022 -
'ఓ మంచి రోజు చూసి చెప్తా' అంటున్న నిహారిక, విజయ్ సేతుపతి
Niharika Vijay Sethupathi O Manchi Roju Chepta Will Stream On Aha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మెగా డాటర్ నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". ఈ చిత్రం తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్తో రిలీజైంది. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు అప్పట్లో క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఇప్పుడు తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో అలరించడానికి రెడీ అయింది. దీనికి సంబంధించిన తాజా ట్రైలర్ను విడుదల చేసింది ఆహా. అయితే విజయ్ సేతుపతికి, నిహారికకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నిహారిక, విజయ్తోపాటు గౌతమ్ కార్తిక్ మరో కీలక పాత్ర పోషించాడు. ఇందులో విజయ్ దొంగతనాలు చేసే యముడిగా వేషం కట్టాడు. అతడిని నిహారిక మామయ్య అని పిలుస్తుంటుంది. ఈ క్రమంలో ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అతడు నోరు తెరిచి అడగ్గా చేసుకుంటాను మామయ్యా.. అంటూ సంతోషంగా సమాధానమిచ్చింది. వినోదాన్ని పంచుతున్న ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఆగస్టు 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. -
‘బుజ్జి ఇలా రా’ ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లరి నరేశ్
సునీల్, ధన్రాజ్ హీరోలుగా చాందినీ అయ్యంగార్ హీరోయిన్గా నటింన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్ప్లే అందింన ఈ త్రానికి ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్గా చేశారు. రపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ని హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వర రెడ్డిగారు నాకు ‘సీమశాస్త్రి, సీమటపాకాయ్’ లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు. అంజి కెమెరామేన్ అవ్వకముందే నాకు తెలుసు. అంతమంచి టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అందిం, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖ్చతంగా ఈ సినివ టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అందించి, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనడానికి నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది సీరియస్ రోల్’’ అన్నారు ధన్రాజ్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన మూవీ ఇది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘ఈ సినిమా ఆడకపోతే నా స్నేహితులు నాగిరెడ్డి, జగదీశ్, సంజీవ్ రెడ్డి నష్టపోతారు.. కాబట్టి ఆదరించండి’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘మా సినిమాని థియేటర్లోనే చూడాలి’’ అన్నారు నాగిరెడ్డి, సంజీవరెడ్డి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement