-
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్ మీడియాలో వెల్లడిరచింది. చాలా బాధాకరమైన ఎండోమెట్రియోసిస్నునిర్లక్ష్యం చేయకండి. దయచేసి గూగుల్లో ఎండోమెట్రియోసిస్ కోసం సెర్చ్ చేయండి. లక్షణాల గురించి తెలుసుకోండి అంటూ మహిళలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో, అది కలిగించే నొప్పి కారణంగా ఇది వైకల్యంలో భాగంగా ప్రకటించారట. ఈ నేపథ్యంలో అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతక వ్యాధా? ఇది మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గర్భధారణ సమస్యలొస్తాయా? తెలుసుకుందాం.ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?మహిళల గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. సాధారణంగా ఈ కణజాలం నెలసరి సమయంలో బయటకు వెళ్లిపోతుంది. కానీ, ఇలా వెళ్లకుండా కటి భాగంలో, అండాశయంలో, ఫాలోపియన్ నాళాల్లోకి చేరి, అక్కడ పెరిగిపోతే దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఎండోమెట్రియం కణాలు గర్భాశయం లైనింగ్ వెలుపల పెరుగుతాయి. ఫలితంగా గర్భాశయం, అండాశయాలు (పెరిటోనియం), ప్రేగు, మూత్రాశయం చుట్టూ ఉన్న కణజాలంలో గాయాలు ఏర్పడతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, వ్యంధత్వం(ఇన్ఫర్టిలిటీ) వంటి లక్షణాలు ఏర్పడతాయి.ఎండోమెట్రియోసిస్ వ్యాధికి కారణం తెలియదు. కానీ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు తేలికపాటి లక్షణాలుంటే, మరికొందరిలో విపరీతమైన నొప్పి, అధిక రక్త స్రావం ఉంటాయి. చాలామందిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు.ఎండోమెట్రియోసిస్ లక్షణాలుపెల్విక్ విపరీతమైన నొప్పిపీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పిఅధిక ఋతు రక్తస్రావం లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావంప్రేగు కదలిక నొప్పిమూత్రవిసర్జన సమయంలో నొప్పిసంతానలేమిసంతానోత్పత్తిపై ప్రభావంసాధారణంగా ఎండోమెట్రియోసిస్ తీవ్రతను బట్టి గర్భధారణ సమస్యఉండకపోవచ్చు. అయితే, ఎండోమెట్రియోసిస్ కలిగిన మహిళలకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే ముప్పు ఉంది. వీటిపై అవగాహన కలిగి ఉండాలి. గర్భం పోవడం, లేదా నెలలు నిండకముందే ప్రసవించే ముప్పు ఉంటుంది. నిపుణులైన గైనకాలజిస్ట్ పర్యవేక్షణ అవసరం.హార్మోన్ థెరపీహార్మోన్లతో చికిత్స చేయడం ఒక మార్గం. బర్త్ కంట్రోల్ పిల్స్ లేదా గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్లు ఎండోమెట్రియోసిస్ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. మరికొందరిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుంది. ఆపరేషన్ ద్వారా ఎండోమెట్రియోసిస్ కణాలను సమూలంగా తొలగిస్తారు. ఎండోమెట్రియోసిస్ స్టేజ్ని నిర్ధారించుకుని తగిన చికిత్స చేసుకోవాలి.ఎండోమెట్రియోసిస్కు చికిత్స ఏమిటి?హార్మోన్ థెరపీ సప్లిమెంటరీ హార్మోన్లను తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు .ఎండోమెట్రియోసిస్ పురోగతిని ఆపవచ్చు. ఎండోమెట్రియోసిస్ ప్రాణాంతకం కాదు. చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒక్కోసారి కొన్ని కేన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.నోట్ : లక్షణాలను గమనించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒత్తిడిని మరింత పెంచుతుంది. వైద్యుల పర్యవేక్షణలో రోగనిర్ధారణ, సరైన సమయం చికిత్స చాలా ముఖ్యం. -
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్ కేన్సర్ని జయించాడు!
కేన్సర్ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్ రిచర్డ్ స్కోలియర్ బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్ ..తన స్నేహితుడు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్ ట్రయల్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్ లాంగ్ అన్నారు. (చదవండి: 'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?) -
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉందని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరోసారి ఆయనకున్న జంతు ప్రేమను నిరూపించుకున్నారు.త్రిపురలోని కైలాషహర్ ప్రాంతంలో ఒక ఏనుగు అనారోగ్యంతో బాధపడుతోంది. దానికి సహాయం చేయాలని అనంత అంబానీని కోరారు. దీనికి సంబంధించిన వీడియో 'కుంతల సిన్హా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి అనంత్ అంబానీ స్పందించారు.అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి అనంత్ అంబానీ.. వైద్యుల బృందాన్ని అక్కడకు పంపారు. వైద్యుల బృందం సుమారు 3500 కిమీ ప్రయాణించి అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.Hats off to #AnantAmbani who acted promptly to save life of elephant and sent #Vantara medical team within 24 hours to Tripura.#Jamnagar #animallove pic.twitter.com/nvva96W6wm— AkashMAmbani (@AkashMAmbani) May 12, 2024 -
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్లో 70 రకాల టెస్ట్లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్లో ఉన్నవారు క్లినిక్స్కు రారు. స్లమ్స్లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
ఇక ఆ బాధలు నావల్ల కాదు : చిన్న వయసులోనే కఠిన నిర్ణయం
అనారోగ్య సమస్యల్ని, తీవ్రమైన బాధల్ని అనుభవించే సమయంలో ఈ బాధ భరించేకంటే చచ్చిపోవడం మేలు అని అనిపిస్తుంది. కానీ నిజంగానే చట్టబద్ధంగా మరణించేందుకు కొన్ని దేశాల్లో అనుమతి ఉంది. చికిత్స లేదు అనుకున్న సమయంలో, వైద్యులు, చట్టాలు పరిశీలించిన తరువాత చట్ట రీత్యా చనిపోవడానికి అనుమతి ఉంది. దాన్నే "కారుణ్య మరణం" (Euthanasia) అంటారు. అంటే సులభంగా నొప్పిలేకుండా, ఆ రోగికి శాశ్వతంగా విముక్తి కల్పించడం అన్నమాట. సరిగ్గా ఇలాగే చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్ల్యాండ్స్ యువతి జొరాయా టెర్ బీక్ (28) కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ది ఫ్రీ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం టెర్ బీక్ చాలా కాలంగా ఆమె డిప్రెషన్, ఆటిజమ్, బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని చికిత్సలు చేసినా విముక్తి లభించలేదు. అంతేకాదు ఇక ఎలాంటి ఇతర చికిత్సలూ లేవని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. దీంతో, బాధల నుంచి తప్పించుకునేందుకు ఆమె కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్లో దృశ్యాలు) ప్రేమించే స్నేహితుడు, పెంపుడు జంతువులున్నప్పటికీ, ఆమె కూడా తన మానసిక వ్యాధి చికిత్సకు లొంగదని భావిస్తుంది. నెదర్లాండ్స్లో ఎక్కువ మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలను భరించే బదులు వాటి బాధలను అంతం చేసుకోవాలని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో ఆమె కూడా కారుణ్యమరణానికి రంగం సిద్దం కావడం విషాదం. ఈ ప్రక్రియలో భాగంగా దీనికి ప్రకారం టెర్ బీక్ ఇంటి వద్దే వైద్యులు ఆమెకు తొలుత మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత గుండె కొట్టుకోవడాన్ని ఆపే మరో మందును ఇస్తారు. జోరాయా ఇంట్లో ఆమె ప్రియుడు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో అచేతన స్థితిలో ఆమె లోకానికి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడనుంది. నెదర్లాండ్స్లోని థియోలాజికల్ యూనివర్శిటీ కాంపెన్లోని హెల్త్కేర్ ఎథిసిస్ట్ స్టెఫ్ గ్రోన్వౌడ్ మాట్లాడుతూ గతంకంటే ఈ ధోరణి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2001లోనే నెదర్లాండ్స్ కారుణ్యమరణానికి చట్టబద్ధత కల్పించింది. 2022 నాటి లెక్కల ప్రకారం, నెదర్లాండ్స్ మొత్తం మరణాల్లో 5 శాతం కారుణ్య మరణాలే కావడం గమనార్హం. దీంతో ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై చాలా విమర్శలున్నాయి. -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి.ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది.ఎందుకు చేస్తారంటే..పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.గతంలో ఇలానే యూఎస్కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకు చేస్తారంటే.. పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గతంలో ఇలానే యూఎస్కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది. గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్గివర్గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్. ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థకు సి.ఇ.ఓ. దీపిక స్థాపించిన సంస్థ తాను డిప్రెషన్తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్ కూడా ఈ సంస్థ వల్ల పొందారు. గోల్ఫ్ ప్లేయర్ అనిషా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ ప్రఖ్యాత బాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్ క్రీడను ప్రొఫెషనల్ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్ లెవల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్ సూచన మేరకు ఫౌండేషన్ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా. స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది. ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స!
ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పోలీసులు మెడికల్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముక్తార్ అన్సారీ తనపై విషం ప్రయోగించేందుకు కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ ఉదంతంలో స్పందించిన కోర్టు అన్సారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బందా జైలులోని జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్ చేసింది. ఒక కేసులో ముఖ్తార్ అన్సారీ గత గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అన్సారీ తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి లేఖ పంపారు. మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారంలో విషపూరితమైన పదార్థాలు కలిశాయని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో రాశాడు. ఆ ఆహారం తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, తనకు చేతులు, కాళ్ల నరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆరోజు తాను చనిపోతానేమోనని భయపడ్డానని లేఖలో పేర్కొన్నాడు. ఘాజీపూర్ నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) అవ్నీష్ గౌతమ్ ముఖ్తార్ అన్సారీకి ఈ శిక్ష విధించారు. 2023లో జరిగిన ఒక హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముక్తార్కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు. -
పార్లర్కి వెళ్లకుండా.. ఇంట్లోనే సింపుల్ చిట్కాతో ఇలా...
పార్లర్లో ఫేషియల్తో పనిలేకుండా, ఖరీదైన క్రీములు కొనకుండా ముఖం చక్కగా మెరవాలంటే ఇంట్లోనే టొమాటో ఫేషియల్ను ప్రయత్నించండి. పెళ్లికూతురులా మెరిసిపోతారు. టొమాటోను గుండ్రని ముక్కలుగా కోయాలి. ఒక ముక్కను తీసుకుని పైన టీస్పూను పంచదార, టీస్పూను కాఫీ పొడి వేసి ముఖంపైన అద్దాలి. తరువాత చేతులతో సున్నితంగా మర్దన చేసి కడిగేయాలి. ఇప్పుడు మరో టొమాటో ముక్కపై టీస్పూను అలోవెరా జెల్ వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. ఈ మర్దన అయిన వెంటనే మరో టొమాటో ముక్కపై రెండు టీస్పూన్ల పసుపు వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. పసుపు పూర్తిగా ఆరాక నీటితో కడిగేసి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ టొమాటో ఫేషియల్లోని ప్రతి స్టెప్ను జాగ్రత్తగా అనుసరిస్తే ముఖం కాంతిమంతంగా మెరిసిపోతుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా కొబ్బరినూనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత మర్దన చేసి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్గా పనిచేయడమేగాక, చర్మానికి తేమనందిస్తుంది. ఇవి చదవండి: ఈ గ్రామాల్లో.. భారీగా హోలి వేడుకలు -
హెచ్ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..!
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV). తాజాగా ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఇకపై హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హైఐవీ వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతంఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు కానీ పూర్తిగా నివారించలేవు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవీని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవీ సోకిన కణాల డీఎన్ఏను తొలగింగచలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి "చెడు" భాగాన్ని తొలగిస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్హామ్ విశ్వ విద్యాలయంలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్-ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయనీ, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్, హెచ్ఐవికి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపి వేస్తే డీఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ప్రాణాంతకం కూడా. -
గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్తో చనిపోతున్నారు. గుండెపోటు గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు. ►గుండెల్లో మంట లేదా అజీర్ణం ►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం ►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం ► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి ►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. ► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు. ► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు. ►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మహిళల్లో, యువతుల్లో ఐరన్ లోపం సమస్య ఆందోళన రేపుతోంది.కానీ దీని గురించిపెద్దగా పట్టించుకోరు. తాజా లెక్కల ప్రకారం 90శాతం యువతులు ఇప్పటికీ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ టెక్నికల్ హెడ్, చీఫ్ పాథాలజిస్ట్ అపోలో డయాగ్నోస్టిక్స్ డాక్టర్ రాజేష్ బెంద్రే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. సమతులం ఆహారం, సప్లిమెంట్లపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణమన్నారు. ఐరన్తో కూడిన ఆహార వనరులు, ఆహార అవసరాలపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్ పేర్కొన్నారు. ఐరన్ లోపం, లక్షణాలు ► ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో పెరుగుదల లోపాలు కనిపిస్తాయి. అనీమియా వస్తుంది. ► తలనొప్పి, విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీలు కూడా ఇనుము లోపంతో బాధపడుతున్నారు. ►దాదాపు 50-60 శాతం మంది గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ► ఐరన్ లోపం పిండం ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని సమస్యలొస్తే ఇబ్బంది అవుతుంది. ► హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, రక్తహీనత, బలహీనత, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి ఐరన్ లోపం అనేది అనేక రోగాలకు పెట్టు. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండాలంటే సప్లిమెంట్లతో పాటు, పల్లీలు బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు, బచ్చలికూర, కొత్తిమీర పప్పులు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజల్లో బీన్స్, బఠానీల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. గుమ్మడి గింజల్లో ఐరన్ మాత్రమే కాదు విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. బ్రకోలి: బ్రకోలిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మన ఆహారంలో చేర్చుకోవాలి. టోఫూ: సోయా నుంచి తయారు చేసే పన్నీర్ టోఫు. ఇందులో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా. థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చేపలు: చేపల్లో ఐరన్తోపాటు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా ఉండేందుకు ,మెరుగైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దోహదపడతాయి. నట్స్ అండ్ ఫ్రూట్స్: బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి. -
జగనన్న చొరవ.. ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే.. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్కు ఫోన్చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
డైరెక్టర్ని పొట్టన పెట్టుకున్న జాండిస్? ఎందుకు వస్తుంది? లక్షణాలు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అకాలమరణం విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర్లు వ్యాధితో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలు ఏంటి? ఇది ప్రాణాంతకమేనా తదితర వివరాలను తెలుసుకుందాం. పచ్చకామెర్లు సరైన సమయంలో చికిత్స తీసుకోనట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధి. తొలి దశలోనే గుర్తించక పోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలోని లివర్ లేదా కాలేయం చాలా పనులను నిర్వరిస్తుంది. వైరస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగం, తదితర కారణాల చేత కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జాండిస్ వ్యాధి వస్తుంది. ఎసిటమైనోఫెన్, పెన్సిలిన్, గర్భనిరోధక మాత్రలు , స్టెరాయిడ్స్ వంటి మందులు కూడా కాలేయ వ్యాధికి కారణం కావచ్చు. ఈ కామెర్లు నవజాత శిశువులు మొదలు ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రధానంగా రక్తంలోని బిలిరుబిన్ను ఉత్పత్తి పెరిగిపోతోంది. ఫలితంగా కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. లక్షణాలు ♦ బరువు తగ్గడం, ఆకలి తగ్గుతుంది. మత్తుగా ఉండటం, ♦ శరీరం పసుపు పచ్చ కలర్లోకి మారిపోతుంది. కళ్ళు , మూత్రం కూడా పసుపు రంగులోకి మారతాయి. ♦ కడుపులో మంట ,కడుపు నొప్పి ♦ ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో బాగా నొప్పి , వికారం వాంతి వచ్చినట్టు ఉంటుంది. ♦ చలి, జ్వరం ♦ రక్తపు వాంతులు మద్యపానం, ఇతర కారణలు కొన్ని ఇతర కారణాలతోపాటు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లు వచ్చేందుకు దారి తీస్తాయి. కాలేయం నుంచి పేగుల్లోకి పైత్య రసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో రాళ్లు, నిర్మాణపరమైన లోపాలు, కేన్సర్ సోకినా కామెర్లకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు కామెర్ల వ్యాధిని నిర్లక్ష్యంచేస్తే రక్తపు వాంతులతోపాటు, రోగి కోమాలోకి వెళ్లి చనిపోయేప్రమాదం కూడా ఉంది. అందుకే అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం నోట్: సమతుల ఆహారాన్ని తీసుకుంటూ, మద్యపానం, ధూమపానం, గుట్కా లాంటి చెడు అటవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఎప్పటికపుడు గమనించుకుంటూ ఉండాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి సమయంకేటాయించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా, సమస్య ఏదైనా వైద్యుల ద్వారా నిర్ధరించుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. -
బట్టతలపై జుట్టు పెరిగేలా చెయ్యొచ్చు!
జుట్టు రాలడం అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య. ఇది హార్మోన్లు మార్పులు లేదా వివిధ మందుల వాడకం తదితర వైద్య పరిస్థితుల కారణంగా ఈ జుట్టు రాలడం సమస్య సంభవించొచ్చు. దీనివల్ల ఎదురయ్యే శారీరక, మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఇంతవరకు మార్కెట్లో జుట్టు రాలడం మందగించే మందులే ఉన్నాయి గానీ జుట్టు పెరిగేందుకు మందులు లేవు. ఇక ఇదీగాక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ శరీరంపై దుష్ప్రభావాలకు గురిచేసేవే. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనంలో జుట్టురాలు సమస్యకు చెక్పెట్టేలా సమర్థవంతమైన చికిత్సను అభిృవృద్ధి చేశారు. బట్టతల సమస్యతో బాధపడే వారి పాలిట ఈ పరిశోధన గొప్ప వరం.! అదేంటంటే..నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా పరిశోధనల్లో జుట్టు గ్రోత్ని పెంచే మైక్రోఆర్ఎన్ఏ(miRNA)ని గుర్తించారు. ఈ మైక్రోఆర్ఎన్ఏ (miR-218-5p) హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని. అందువల్ల దీన్ని ప్రోత్సహించేలా భవిష్యత్తులో ఔషధాలను అభివృద్ధి చేసే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని శాస్తవేత్తలు పేర్కొన్నారు. నిజానికి బట్టతల సంభవించే చోట ఈ హెయిర్ ఫోలికల్స్ అదృశ్యం కావని, తగ్గిపోవడం జరుగుతుందని అధ్యయనంలో గుర్తించారు. ఆ సైట్లో డీపీ కణాలను తిరిగి నింపగలిగితే ఫోలికల్స్ కోలుకోవచ్చు. త్రీడీ గోళాకార వాతావరణంలో కల్చర్డ్ డీపీ కణాలను టుడీ, త్రీడీ గోళాకారంలో తీసుకున్నారు. అయితే గోళాకార త్రీడీ కల్చర్డ్ కణాలు ప్రభావవంతంగా పనిచేసి జుట్టుని వేగవంతంగా పెరిగేలా చేస్తుండటాన్ని గుర్తించారు. ఈ చికిత్స విధానాన్ని ఎలుకలపై ప్రయోగించగా త్వరగా వెంట్రుకలు పెరగడం గమనించారు. జస్ట్ 20 రోజుల ట్రయల్స్లో ఈ త్రీడీ డీపీ కణాలతో ఎలుకలకు చికిత్స ఇవ్వగా, కేవలం 15 రోజుల్లోనే 15% వెంట్రుకల్ని తిరిగి పొందడం జరిగింది. గోళాకారంలోని త్రీడీ కణాలు జుట్టుగ్రోత్ని స్పీడ్అప్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అందువల్ల ఈ త్రీడీ కణాల సెల్ థెరపీ బట్టతలకి సమర్థవంతమైన చికిత్సగా పేర్కొన్నవచ్చు అన్నారు. ఈ చికిత్స విధానంలో 90% కోల్పోయిన జుట్టుని తిరిగి పొందొచ్చని అన్నారు. అలాగే జుట్టురాలు సమస్యను తగ్గించేలా హెయిర్ ఫోలికల్ గ్రోత్ని పెంచేలా miRNAకి సంబంధించిన క్రీమ్ లేదా లోషన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. అంతేగాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా ఈ miRNAపై దృష్టి పెడితే చాలని అన్నారు శాస్త్రవేత్తలు. జుట్లు రాలు సమస్యను ఎదుర్కొంటున్నవారిలో ఈ పరిశోధన కొత్త ఆశను చిగురించేలా చేస్తుందన్నారు. అలాగే ఇక ఈ చికిత్స విధానం ఎంతవరకు సురక్షితం అనే దిశగా కూడా మరిన్నీ పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. ఏదీఏమైన బట్టతలతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స విధానం వరం అని చెప్పొచ్చు. (చదవండి: ఊపిరితిత్తుల్లో బొద్దింక..కంగుతిన్న వైద్యులు) -
ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ. 17 కోట్ల సాయం కోసం ఎదురుచూపు!
రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలోని మణియన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారి నరేష్ చంద్ర శర్మ కుమారుడు హృదయాంశ్(22 నెలలు) అరుదైన జన్యుపరమైన వ్యాధి ఎస్ఎంఏ టైప్-2తో బాధపడుతున్నాడు. హృదయాంశ్ తన కాళ్లపై తాను నిలబడలేడు. చికిత్స లో భాగంగా ఆ చిన్నారికి రూ. 17.5 కోట్ల విలువైన ZOLGESMA ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. హృదయాంశ్కు రెండు నెలల వ్యవధిలోగా ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంత స్వల్ప వ్యవధిలో రూ. 17 కోట్ల భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం హృదయాంశ్ తండ్రి నరేష్ చంద్రకు సాధ్యంకాని పని. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ యూఆర్ సాహు దీనిపై పలువురు పోలీసు సూపరింటెండెంట్లకు నరేష్ చంద్ర శర్మకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ మెయిల్ చేశారు. తన కుమారుని వైద్యం కోసం అవసరమయ్యే సొమ్ము భారీగా ఉండటంతో సామాజిక సంస్థలు, సంఘాలు కూడా ముందుకువచ్చి సహాయం అందించాలని పోలీసు అధికారి నరేష్ చంద్ర శర్మ కోరుతున్నారు. -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్తో ముందుగా కేన్సర్ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
ప్రసాదం తెచ్చిన తంటా!.. రోడ్డుపైనే సెలైన్లు పెట్టి..
వందలాది మంది రోగులు నడి రోడ్డు మీదే చికిత్స అందించారు వైద్యులు. పైగా చెట్లకు తాళ్లు కట్టి..వాటికి సైలెన్స్ బాటిళ్లను వేలాడదీశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రాలోని బుల్దానాలో వారం రోజుల పాటు జరిగిన మత కార్యక్రమంలో అపసృతి చోటు చేసుకుంది. ఆఖరి రోజున ప్రసాదంగా తీసుకున్న ఆహారం కారణంగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అయితే అంతమందిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ బెడ్ల కొరత కారణంగా చాలామందిని రోడ్డుమీదే పడుకోబెట్టి చికిత్స అందించారు. వారందరికి చెట్లకు కట్టివేసిని తాళ్ల సాయంతో సైలెన్ వేలాడదీసి ఇవ్వడం జరిగిది. అయితే దాదాపు 300 మంది అస్వస్థకు గురవ్వగా, వారిలో30 మంది పరిస్థితి విషమంగా ఉదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 300 మంది అస్వస్థకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు బాధితులు మాట్లాడుతూ..సమయానికి ఆస్పత్రిలో వెద్యులు ఎవరూ లేరని వాపోయారు. రోగులకు వైద్యం చేయించేందుకు ప్రైవేట్ వైద్యులను పిలిపించల్సి వచ్చిందని అన్నారు. కాగా ఆ జిల్లా కలెక్టర్ కిరణ్ పాటిల్ మాట్లాడుతూ..మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇతర అవసరమైన వైద్య పరికరాలతో సహ వైద్యుల బృందాలతో సత్వరమే చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే ప్రసాదం నమునాలు ల్యాబ్కి పంపించి పరీక్షలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. (చదవండి: ఈ షర్ట్ చాలా కాస్ట్లీ గురూ!) -
డయాబెటిస్ లేకపోయినా..తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందా?
తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారిలో సహజంగానే ఇలా జరుగుతుంది. కనుక ఆ వ్యాధి ఉందో, లేదో చెక్ చేయించుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ లేకపోయినా మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ముఖం అంతా వాపులకు గురై ఉబ్బిపోయి కనిపిస్తుంది. కాలి మడమలు, కాళ్లు, పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి కిడ్నీ సమస్యలు ఉంటే తీవ్రమైన అలసట వస్తుంది. కొందరిలో రక్తహీనత సమస్య కూడా ఏర్పడుతుంది చర్మం పొడిగా మారి దురదలు పెడుతుంది ∙నోటి దుర్వాసన ఉంటుంది ∙కిడ్నీ సమస్యలు ఉంటే కొందరిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో వెన్ను నొప్పి వస్తుంటుంది వాంతి వచ్చినట్టుగా... వికారంగా అనిపిస్తుంది కిడ్నీ సమస్యలు ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి వాతావరణంలో ఉన్నప్పటికీ చలిగా అనిపిస్తుంది. కొందరు వణుకుతారు. పైన తెలిపిన లక్షణాలు కనుక ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తినాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. (చదవండి: ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!) -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
సూసైడ్ హెడేక్: ఈ 'తలనొప్పి'తో అంత ఈజీ కాదు!
బీపీ వల్లనో లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వల్లో కాస్త తల నొప్పిగా ఉంటుంది. కొంతమందకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న ఈ భయానక తలనొప్పిని అనుభవిస్తారు. తలలో కంతుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తిపుణ్యానికి వచ్చే తలనొప్పి ఒకటి ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే..భరించలేక ప్రజలు కెవ్వుకెవ్వుమని అరుస్తూనే ఉంటారట. కొందరైతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని వైద్యుల చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి బారినే డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి పడ్డాడు. దీంతో అతని జీవితం గందరగోళంగా మారిపోయింది. ఆఖరికి వైద్యులు సైతం దీనికి మందు లేదని జీవితాంత ఆ వ్యాధిని భరించాల్సిందేనని షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. యూకేకి చెందిన డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈనొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేసేవాడని తెలిపాడు. తలపై బేస్బాల్ బ్యాట్తో గట్టిగా కొడుతున్నట్లు, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లు ఆ నొప్పి ఉంటుందని ఈ 53 ఏళ్ల డారెన్ చెబుతున్నారు. ఆయన ఒక హార్టికల్చర్ఇంజనీర్. ఆయన ప్రతీక్షణం ఈ తలనొప్పి మళ్లీ ఎప్పుడూ వస్తుందో అన్న భయంతో బతుకుతున్నాడు. ఈ తలనొప్పి ఎప్పుడైన రావచ్చొనే సంగతి నాకు తెలుసు గానీ, ఇలా భయంతో బతకడం మాత్రం నరకంగా ఉందని ఆవేదనగా చెప్పారు డారెన్. ఆ నొప్పి 15 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ఉంటుందని చెప్పారు. ఇది మొదటగా తన తలకు ఎడమ కన్నుపై నుంచి ప్రారంభమై తర్వాత కన్ను నీరు కారడం మొదలవ్వుతుందని తెలిపారు. ఎవరో కంటిలోపల కత్తితో గుచ్చుతున్న భావన కలిగి, దిండుని పట్టుకుని తట్టుకోలేక అరుస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈనొప్పి వచ్చినప్పుడూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ బాధ మరింత ఎక్కువయ్యిందని అన్నారు. ఈ తలనొప్పిని వైద్య పరిభాషలో 'క్లస్టర్ తలనొప్పి లేదా సూసైడ్ తలనొప్పి' అంటారు. దీని కారణంగా అనుభవించే మానసిక వేదన చనిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు వచ్చింది. క్లస్టర్ హెడేక్స్ అంటే.. క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా. తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు. బాధితుడు డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం తాము నిధులు సమకూర్చుతున్నాం అని పరిశోధకుడు కేటీ మార్టిన్ చెబుతున్నారు. ఈ తలనొప్పి మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిసిస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు. నొప్పి వచ్చే తీరు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. అయితే నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు. నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. పైగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే దీనికి చికిత్స లేదని చెబుతున్నారు. ఇక్కడ డారెన్ కూడా జీవితాంతం ఆ తలనొప్పిని భరించాల్సిందే అని తెలిపారు. వైద్యుల దీనికి మంచి చికిత్స కనిపెట్టే క్రమంలో ఆయనపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఆ నొప్పి ఉశమించేలా స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే మందులను సైతం వైద్యులు సూచించినట్లు డారెన్ చెబుతున్నాడు. అయితే అవేమి పనిచేయ లేదని అన్నాడు. చివరికి వైద్యులు తనకు ఇంజెక్షన్ని సిఫార్సు చేశారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. ఒక్కోక్కసారి అది కూడా పని చేయదని బాధగా చెబుతున్నాడు. అలాగే మత్తుమందులు నరాలను మొద్దుబారేలా చేయగా, స్టెరాయిడ్స్ ఒక ఏడాది వరకు తలనొప్పి రాకుండా ఆపగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా డారెన్ వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. ప్రస్తుతానికి వైద్యులు చికిత్సలో భాగంగా ఆయనకు తలలో ఒక నర్వ్ బ్లాక్ను ఇంజెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు కూడా లేవు. ఇక్కడ డారెన్ వైద్యలు సరైన చికిత్సా విధానం కనుగొనేంత వరకు ఆయన ఈ తలనొప్పితో జీవించాల్సిందే. అయితే యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..) -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
రోగాలకు ‘గూగుల్ చికిత్స’ వద్దు
మాదాపూర్: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
నెట్వర్క్లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్లెస్ ట్రీట్మెంట్.. కానీ..
ప్రైవేటు ఆస్పత్రుల్లో నెట్వర్క్లోలేని హాస్పటల్స్లో కూడా ఇవ్వాళ్టి నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈమేరకు కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ తెలిపింది. బీమా తీసుకుని ఏదైనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారికి ఇకపై ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితేనే ఎలాంటి డబ్బు చెల్లించకుండా వైద్యం పూర్తయ్యేది. అయితే ఈరోజు నుంచి నెట్వర్క్ ఆసుపత్రులతోపాటు ఆ జాబితాలో లేని హాస్పటల్స్లో చేరినా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం వినియోగించుకోవాలంటే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకు రెండు రోజుల ముందు అంటే 48 గంటల ముందే సదరు వైద్యం గురించి తెలియజేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ సందర్భాల్లో నెట్వర్క్లోలేని ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్ వివరించింది. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే క్యాష్లెస్కు అనుమతి ఉండేది. క్యాష్లెస్ సదుపాయం లేనిచోట వైద్యానికి అయ్యే ఖర్చును పాలసీదారులే చెల్లించాలి. తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. దాంతో ట్రీట్మెంట్ అయిన ఖర్చు పూర్తిగా ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. ఫలితంగా పాలసీదారులు కొంత నష్టపోయే అవకాశం ఉండేది. దాంతోపాటు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండేవి. ఇదీ చదవండి: దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం! ప్రస్తుతం 63 శాతం మంది క్యాష్లెస్ సదుపాయం ఎంచుకుంటుంటే.. మిగిలినవారు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని కౌన్సిల్ ఎండీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ తపన్ సింఘాల్ తెలిపారు. క్లెయిం ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
విజయ మనదే.. ధీమాగా ఉండండి
ఓటర్లకు ఎమ్మెల్యే కేపీ కృతజ్ఞతలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement