-
పనులు త్వరగా పూర్తి చేయాలి
కలెక్టర్ రాహుల్రాజ్ చేగుంట(తూప్రాన్): అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చేగుంట బాలుర ప్రాథమిక పాఠశాల, రెడ్డిపల్లి కాలనీ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులను డీఈఓ రాధాకిషన్తో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో జరుగుతున్న విద్యుత్ పనులు, నీటి సరఫరా, మరుగుదొడ్ల పరిస్థితులపై ఆరా తీశారు. పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. అన్ని గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణపై నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వడియారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రం మూసివేయవద్దని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ గియాసున్నీసాబేగం, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్తో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. పురాతన కట్టడం పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం కొంటూరులో పురాతన మసీదును కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడానికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయా లని స్థానికులు సూచించగా.. పురావస్తు, వక్ఫ్బోర్డ్ అధికారులతో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని, హక్కుల సాధనకు సిద్ధం కావాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసరాల ధరలు ఆకాశనంటాయని వాపోయారు. దేశంలో దివ్యాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. జూలై 21, 22 తేదీల్లో జిల్లాలో 7వ మహాసభలు జరుగుతాయని ఎన్పీఆర్డీఓ గౌరవ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు యశోద, ఉపాధ్యక్షులు చంద్రం, శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు చింతకుంట శ్రీనివాస్, సంతోష్ కుమార్, నాయకులు శ్రీనివాస్, కిష్టయ్య, చంద్రమ్మ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి కౌడిపల్లి(నర్సాపూర్): విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు లాట్ నంబర్ ఉన్న బిల్లులు ఇవ్వాలని ఏడీఏ పుణ్యవతి తెలిపారు. శుక్రవారం కౌడిపల్లిలో ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని చెప్పారు. రైతుపేరు, స్టాక్ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఆన్లైన్ చేయాలని సూచించారు. రైతులు లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దని, ప్రభుత్వ గుర్తింపు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనాలన్నారు. విత్తనాలు మొలకెత్తకపోయిన, ఇతర నష్టం వచ్చిన నష్టపరిహారం తీసుకునేందుకు బిల్లులు అవసరం ఉంటాయని తెలిపారు. శనివారం నుంచి గ్రామాల్లో రైతులకు పంటల సాగు, విత్తనాల ఎంపికపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఏఓలు స్వప్న, శ్వేతకుమార్, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు. మొదటి రోజు 95 శాతం హాజరు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఐఈఓ సత్యనారాయణ తెలిపారు. ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు నిర్వహించినట్లు చెప్పా రు. జనరల్లో 959 మందికి గాను 914 మంది, ఒకేషనల్లో 29 విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యా హ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. 339 మందికి గాను 318 విద్యార్థులు, ఒకేషనల్లో 43 గాను 43 విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా విద్యార్థుల హాజరుశాతం 95గా నమోదైందని.. పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారని వివరించారు. ప్రశాంతంగా పాలిసెట్ మెదక్ కలెక్టరేట్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మెదక్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శ జూనియర్ కళాశాల, సిద్ధార్థ్ మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కోఆర్డినేటర్, మెదక్ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సువర్ణలత పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం 1,590 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,462 మంది హాజరైనట్లు తెలిపారు. 92 శాతం హాజరు నమోదైనట్లు చెప్పారు. -
వేతన వెతలు!
చిన్నశంకరంపేటలో రోడ్డును శుభ్రం చేస్తున్న కార్మికులుచిన్నశంకరంపేట(మెదక్): ఆరు నెలలుగా వేతనాలు రాక పారిశుధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. పస్తులుండి పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని వాపోతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు నిలిపివేసిన కార్మికులు వేతనం కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 1,710 మంది విధులు జిల్లాలో 1,710 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒకొక్కరికి రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.8,500 అందజేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి ఎనిమిది మంది వరకు పనిచేస్తున్నారు. పారిశుధ్య పనులతో పాటు మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. మరో వైపు మొక్కలకు నీరు పెట్టడం, నల్లా నీరు వదలడం లాంటి పనులు చేస్తున్నారు. అయితే సకాలంలో వేతనాలు రాకపోవడంతో కొంత మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు వేతనాలు అందించి పనులు సజావుగా సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పని తిప్పలు -
విత్తన మేళాకు రైతులు
మెదక్జోన్: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా రైతులు సందర్శించారని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపా రు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 21 మండలాల నుంచి 30 మంది రైతులు మేళాకు హాజరయ్యారన్నారు. మేలైన వంగడాలు సాగుచేయాలని వ్యవసాయ విశ్వవిద్యాల యం నిర్ణయించిందన్నారు. 16 పంటల్లో 67 రకాలకు సంబంధించి దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చడానికి శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
జిల్లా ప్రత్యేకాధికారి భారతి హొళికేరీనర్సాపూర్ రూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి భారతి హొళికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ మార్కెట్తో పాటు మండలంలోని కాగజ్ మద్దూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అదనంగా లారీలను ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని సూచించారు. ధాన్యంలో తేమశాతం లేకుండా తూకం వేయాలన్నారు. రైతుల వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కాగజ్ మద్దూర్ కొనుగోలు కేంద్రంలో 8,000 వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయని.. మూడు రోజులకు ఒక లా రీని పంపుతున్నారని రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అదనంగా లారీలను పంపించాలని మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ బ్రహ్మారావు, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి ఆర్ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ముడిసరుకుల ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ బడ్జెట్ అంచనాలు తారుమారవుతున్నాయి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబటం లేదని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, పీవీసీ విద్యుత్, ప్లంబింగ్ మెటీరియల్, కలర్స్, కూలీ రేట్లు ఇలా ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటే గతంలో కంటే అదనంగా ఐదారు లక్షల భారం పడుతోంది. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా సొంతింటి నిర్మాణం మొదలు పెట్టాలనుకునే వారు ధరలను చూసి సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు. ఇసుక రేట్లు డబుల్ ఇళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఎక్కువ. వీటిలో రెండు రకాలు ఉంటాయి. కట్టడానికి ఉపయోగించే ఇసుక టన్నుకు రూ.2800 వరకు పలుకుతోంది. ప్లాస్టింగ్కు వాడే సన్నరకం ఇసుక టన్నుకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం ఇసుక రేటు టన్నుకు రూ. 1300 ఉండగా ప్రస్తుతం డబుల్ అయ్యింది. ఇసుక కొరతతో పాటు ఓవర్ లోడ్కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పునాదులు, స్లాబ్కు ఉపయోగించే కంకర ధర కూడా పెరిగింది. టన్నుకు రూ.1500 నుంచి రూ. 2,500 వరకు విక్రయిస్తున్నారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కలర్, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయని వాపోతున్నారు. పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో ఉన్న ధరలు ప్రస్తుతం ఉన్నవాటికి చాలా వ్యత్యాసం ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని వాపోయారు. ఎరువులు, విత్తనాలు దొరకడం లేదన్నారు. సకాలంలో తూకం వేయకపోవడంతో ధాన్యం తడిసిందన్నారు. తరుగు పేరిట బస్తాకు నాలుగు నుంచి ఆరు కిలోల ధాన్యం తీసుకుంటూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నిరకాల వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వెంట వెంటనే డబ్బులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఏనాడు ఇబ్బంది పడలేదని గుర్తుచేశారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు రుణాలు లభించడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, నాయకులు సత్యంగౌడ్, జితేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, ప్రవీణ్, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీ‘జులుం’
శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యంమెదక్జోన్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో జిల్లాలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. జిల్లాలో 220 ప్రైవేట్ బడులు అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 220 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో నర్సరీకి ఫీజు రూ.19,000, అడ్మిషన్ ఫీజు రూ.1,000, షూ, యూనిఫాంకు కలిపి రూ.5 వేలు మొత్తంగా రూ.25,000 వసూలు చేస్తున్నారు. ఎల్కేజీకి ఫీజు రూ.28,000, యూకేజీ రూ.29,500, 6వ తరగతికి రూ.36 వేలు, 7వ తరగతి రూ.40 వేలు, 10వ తరగతికి రూ.62 వేలు తీసుకుంటున్నారు. ఇవి కాకుండా అదే పాఠశాలలో హాస్టల్లో ఉంటే ఏడాదికి రూ.40 వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అమలు కాని విద్యాహక్కు చట్టం! విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు వసూలు చేయొద్దు. కానీ జిల్లాలో రూ. వెయ్యి నుంచి మొదలుకుని రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించాలనే నిబంధన ఉంది. దానిని అమలు చేసిన దాఖలాలు లేవు. 2020లో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయినా అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాకుండా యూనిఫామ్స్, పుస్తకాలు, షూ ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల నిర్వాహకులు విక్రయించొద్దనే నిబంధన ఉంది. అయినా ఇవేమి పట్టించుకోవడం లేదు. ఏకంగా పాఠశాలల్లోనే విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఇటీవల పలు సంఘాల నాయకులు అదనపు కలెక్టర్ రమేశ్కు వినతిపత్రం అందజేశారు. అన్నివర్గాల పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యూస్రీల్చర్యలు తప్పవు ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేస్తామని చాలాకాలంగా చెబుతోంది. ఈ ఏడాది సైతం ఆ అంశం ప్రస్తావనకు వచ్చి ంది. ప్రైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు. – రాధాకిషన్, డీఈఓ మెదక్ -
ఆకాశాన్నంటుతున్న ధరలు
కొవిడ్ తరువాత ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి అవసరం పెరిగింది. అద్దెలు కట్టలేక తమకు ఉన్న స్థలాల్లో నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి మొదలైన ధరల మోత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా లేబర్ చార్జీలు పెరిగాయి. ఆ తరువాత మిగతా ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గత సంవత్సరం చదరపు అడుగు రూ.1400 నుంచి రూ.1500 వరకు ఖర్చు అయ్యేది. అదే కాంట్రాక్టుకు ఇస్తే రూ.1600 నుంచి రూ.1700 వరకు వ్యయం చేయాల్సి వచ్చేది. ఇంటీరియర్స్కు అదనం. ప్రస్తుతం పెరిగిన ధరలతో సొంతంగా ఇల్లు కట్టించుకున్నా రూ.1800 నుంచి రూ.1900 వరకు అవుతుండగా, కాంట్రాక్టుకు ఇస్తే రూ. 2000 నుంచి రూ.2200 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇసుక టన్ను ధర రూ.2800 వరకు పలుకుతోంది. స్టీల్ టన్ను రూ. 60 వేలకు పెరిగింది. సిమెంట్ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ. 360 వరకు ఉంది. కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. -
జొన్న రైతుకు మంచి రోజులు
రైతులతో పేట కొనుగోలు కేంద్రం కిటకిటపెద్దశంకరంపేట(మెదక్): జొన్న రైతులకు మంచి రోజులొచ్చాయి. అకాల వర్షాలతో నష్టపోయిన వా రిని ప్రభుత్వం ఆదుకునేందు కు ముందుకు వచ్చింది. జిల్లావ్యాప్తంగా దాదాపు 6,200 ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు. పెద్దశంకరంపేట వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ పరిధిలో అత్యధికంగా జొన్న సాగు చేస్తారు. గత మూడేళ్లుగా పెద్దశంకరంపేటలో మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను సేకరిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో జొన్నలకు రూ.2,600 నుంచి 2,800 వరకు ధర లభిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.3,180గా నిర్ణయించారు. ఇప్పటివరకు 210 మంది రైతులు దాదాపు 7 వేల క్వింటాళ్ల జొన్నలను పేట కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. యాసంగి సీజన్లో వ్యవసాయ అధికారులు నమోదు చేసుకున్న రైతుల జాబితా ఆధారంగా జొన్నలు సేకరిస్తున్నారు. ఇటీవలే రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లోనూ జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పేట పీఏసీఎస్ సీఈఓ రవీందర్ సూచించారు. -
మాడాపూర్లో తాగునీటి సమస్య
నర్సాపూర్ రూరల్: మండల పరిధిలోని మాడాపూర్లో వారం రోజులుగా తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్తులు గురువారం ఎంపీడీఓ కార్యాలయనికి వచ్చారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో ఇతర అధికారులతో తాగునీటి సమస్యపై మొరపెట్టుకున్నారు. గ్రామంలో ఉన్న బోరు మోటార్ వారంరోజుల క్రితం పాడైపోయిందని చెప్పారు. ఆ విషయాన్ని పలుమార్లు ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శికి విన్నవించిన పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రతీరోజు తాగునీటి కోసం మహిళలు సుదూర ప్రాంతంలోని వ్యవసాయ బోర్ మోటార్లకు వద్దకు వెళ్లి తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి రవిని వివరణ కోరగా.. త్వరగా తాగునీటి సమస్య లేకున్నా కొంతమంది కావాలని సమస్యను సృష్టిస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్న బోరు మోటార్కు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించడం విచారకరమన్నారు. -
చివరి గింజ వరకు కొంటాం
కలెక్టర్ రాహుల్రాజ్కొల్చారం(నర్సాపూర్): రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం మండలంలోని వరిగుంతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 34 బాయిల్డ్ బిల్లులు 31 రా మిల్లులకు ధాన్యం కేటాయించామన్నారు. జిల్లా నుంచి సిద్దిపేటకు 10 వేల మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్ జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ధాన్యం తరలించేందుకు సుమారుగా 600కు పైగా లారీలు అందుబాటులో ఉన్నాయని, మరో 150 లారీల వరకు తెప్పిస్తున్నామన్నారు. తద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, తహసీల్దార్ గఫూర్మియా, కొలుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది, రైతులు ఉన్నారు. పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలి అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా, సంగాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన మరమ్మతులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పాఠశాలలో చేపట్టిన పనులను నాణ్యతతో చేయించాలని, ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఎంపికై న 562 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటివరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. -
నెల రోజుల నుంచి నీటి తిప్పలు
నర్సాపూర్: మండలంలోని మాడాపూర్ గ్రామంలో నెల రోజుల నుంచి తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. గ్రామంలోని మంచినీటి ట్యాంకుకు నీటి సరఫరా చేసే బోరు మోటార్ నెల రోజుల క్రితం పాడైపోయిందన్నారు. బోరు మోటార్ మరమ్మతులు చేయించడంలో గ్రామ కార్యదర్శి, ప్రత్యేక ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడంతో తాము నీటికి ఇబ్బందుల పాలవుతున్నామని ఆరోపించారు. పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి నీటి సమస్యను తీసుకుపోయినా ప్రయోజనం లేదని అన్నారు. నల్లాల నుంచి నీరు రానందున వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు ఎత్తుకొచ్చుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు కిష్టయ్య, సంజీవ, మహెందర్, నర్సింలు, లింగయ్య, ప్రభాకర్, బ్యాగరి కిష్టయ్య ఉన్నారు. -
ప్రణాళికతో ముందుకు సాగాలి
మెదక్జోన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పదో తరగతిలో 10, 9.8, 9.5 జీపీఏ సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని కొనియాడారు. 10 జీపీఏ లక్ష్యంగా ప్రణాళికతో పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఎవరెవరు ఏ రంగంలో రాణిస్తారని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇంజినీర్లు, డాక్టర్లు, టీచర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అవుతామని చెప్పడంతో వారందరినీ అభినందించారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ ప్రణాళికతో విద్యనభ్యసించాలని సూచించారు. కార్యక్రమ ంలో డీఈఓ రాధాకిషన్, జిల్లా సై్న్స్ అ ధికారి రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మెదక్ కలెక్టరేట్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఐఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈసారి కూడా నిమిషం నిబంధన అమలులో ఉందని, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రైవేట్ కళాశాలలు హాల్టికెట్ల కోసం ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ కంట్రోల్ రూం 9603615652 నంబర్లో సంప్రదించాలని చెప్పారు. రైతులు అధైర్యపడొద్దు పాపన్నపేట(మెదక్): ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురు వా రం మండలంలోని కొడపాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దన్నారు. ధాన్యం రవాణా కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు వాహనాలు తెప్పించామని తెలిపారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. సకాలంలో చెల్లింపులు జరగాలి మెదక్ కలెక్టరేట్: ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగాలని డీఆర్డీఏ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఉపాధి పనులపై కూలీలకు అవగాహన కల్పించి, ఎక్కువ మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశంలో తాగు నీరు, షేడ్ నెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పనుల్లో నాణ్యత, నర్సరీ ఎస్టిమేషన్, అమృత్ సరోవర్ పనులపై సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నార్సింగిలో జిలుగు విత్తనాల పంపిణీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పెద్ద జనుము, జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఏఓ యాదగిరి కోరారు. గురువారం నార్సింగి మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీ ద్వారా పెద్ద జనుము, జిలుగు విత్తనాలు అందించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. నార్సింగి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలోఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నాయని, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తుందన్నారు. సబ్సిడీ పోను పెద్ద జనుము 40 కిలోల బస్తా రూ.1448, జిలుగు 30 కిలోల బస్తా రూ.1116 ధరను చెల్లించి కొనుగోలు చేయాలని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు గవ్వలపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీపై పెద్ద జనుము, జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏఓ లక్ష్మీప్రవీణ్ తెలినారు. -
ఉద్యోగ భద్రత ఏదీ?
సమగ్ర శిక్షా ఉద్యోగుల ఆవేదన మెదక్ కలెక్టరేట్: సమగ్ర శిక్షా ఉద్యోగుల వెతలు తీరడం లేదు. ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం గతేడాది సెప్టెంబర్లో ఆందోళన బాట పట్టారు. 24 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పనిభారం రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వేతనం మాత్రం తక్కువగా ఉందని వాపోతున్నారు. రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపికై న తాము కనీస వేతనం, ఉద్యోగ భద్రతకు నోచుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి, సీఎం అయిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 428 మంది విధులు జిల్లా విద్యాశాఖ పరిధిలో మొత్తం 448 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇందులో ప్రస్తుతం 20 పోస్టులు ఖాళీగా ఉండగా, మిగితా 428 మంది ఒప్పంద ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కేజీబీవీలో 200 మంది, ఐఆర్పీలుగా 25, మెసెంజర్స్ 15, ఎంఎస్ఐలు 28, సీఆర్పీలు 68, పీటీఐలు 92, సీసీఓలు 20 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని విభాగాల్లో వారే కీలకం విద్యాశాఖలో జిల్లా, మండల స్థాయి పాఠశాలల్లో వివిధ విభాగాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పేద విద్యార్థులకు విద్యను చేరవేస్తూ ప్రభుత్వ పథకాలు అమలుకు కృషి చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, రాగి జావ, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, విద్యార్థులకు కళా నైపుణ్యం, వ్యాయామ విద్య, ప్రశ్నపత్రాల పంపిణీ, పరీక్షల నిర్వహణ, మన ఊరు– మనబడి పాఠశాలల నిర్వహణ, ఎస్ఎంసీ ట్రైనింగ్, ఏకో ఉపాధ్యాయ పాఠశాల నిర్వహణతో పాటు హరితహారం, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం వరకు పనిచేస్తున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి సమీపంలోని ఓ చెట్టు కింద గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నిరసంగా పడిపోయి స్థానికులకు కనిపించాడు. ఆ వ్యక్తిని అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిస్తే నర్సాపూర్ సీఐ, ఎస్ఐ ఫోన్ నంబర్లకు 87126 57941, 87126 57940 సమాచారం ఇవ్వాలని కోరారు. -
మట్టిరోడ్డుతో నడకయాతన
మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. దీనితో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – నర్సాపూర్ రూరల్ మండలంలోని సీతారాంపూర్ – రుస్తుంపేటరోడ్డు ప్రతిపాదనలకే పరిమితమైంది. దీంతో సీతారాంపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, రేషన్ దుకాణం, పోస్ట్ ఆఫీస్, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, పశువుల ఆస్పత్రులు లేకపోవడంతో ప్రతీ అవసరానికి రుస్తుంపేట గ్రామానికి వెళ్లక తప్పదు. గతంలో సీతారాంపూర్ గ్రామం రుస్తుంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. పంచాయతీ కార్యాలయంతో పాటు ఇతర ఏ చిన్న అవసరమున్న గ్రామస్తులు రుస్తుంపేటకు పంట పొలాల గట్ల పైనుంచి వెళ్లి అవసరాలు తీసుకునేవారు. పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకులతో మొర పెట్టుకోగా.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో దివంగత రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ రెండు గ్రామాల మధ్య మట్టి రోడ్డుతో పాటు కంకర రోడ్డు వేయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలు ఉండడంతో నడవలేని స్థితికి చేరింది. అడుగు వేయలేని స్థితిలో.. వర్షాకాలంలో అయితే కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో రోడ్డు ఉంటుంది. పలుమార్లు గ్రా మస్తులు అధికారులు, రాజకీయ నాయకులతో తా రు రోడ్డు వేయాలని పలుమార్లు మొరపెట్టుకోగా.. పంచాయతీరాజ్ అధికారులు స్పందించారు. సీతారాంపూర్ – రుస్తుంపేటతో పాటు నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారి నుంచి సీతారాంపూర్ వర కు రీ బీటింగ్ రోడ్డు ఏర్పాటు కోసం సుమారు రూ. కోటి 80 లక్షలు అంచనావేసి ప్రతిపాదనలు పంపారు. పలుమార్లు నిధులు విడుదల చేస్తామని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇచ్చి మర్చిపోయాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షాకాలంలో తిరిగి ఇబ్బందులు ఎదుర్కొ వాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీనెల రేషన్ సరుకులు, ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువు లు, మహిళలు, ఆస్పత్రి అవసరాలకు, పశువుల ఆ స్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవని అంటున్నా రు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఏఈ స్వా మిదాస్ను వివరణ కోరగా.. ప్రతిపాదనలు పంపిన ట్లు చెప్పారు. విధుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అధ్వానంగా సీతారాంపూర్ దారి బీటీ ప్రతిపాదనలకే పరిమితం పట్టించుకోని అధికారులు,ప్రజాప్రతినిధులు తారు రోడ్డు వేయండి సీతారాంపూర్ – రుస్తుంపేట వరకు తారు రోడ్డు వేసి సమస్య పరిష్కరించాలి. వర్షాకాలంలో అన్ని అవసరాల కోసం గ్రామస్తులం అనేక తిప్పలు పడుతాం. అధికారులు, నాయకులు స్పందించి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి. – మన్నే భిక్షపతి, సీతారాంపూర్ గ్రామస్తుడు -
ఘనంగా గరుడసేవ మహోత్సవం
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన దొంతి వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి ఆలయ అధ్యక్షుడు వేణుగోపాలశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం గరుడసేవ మహోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని గరుడసేవలో భాగస్వాములయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు, అన్నదానం చేశారు. శుక్రవారం పొన్నసేవ జరుగుతుందని ఆలయ అర్చకుడు వేణు గోపాలశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అమరేందర్రెడ్డి, పవన్కుమార్రెడ్డి, మాజీ సర్పంచ్ ఫణిశశాంక్శర్మ, బాలనగర్ లయన్స్ క్లబ్ ఎల్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు లక్ష్మీకాంతారావు, పానగారి శ్రీనివాస్, యాదగిరి, తాటి నాగరాజు, అనంద్, తదితరులు ఉన్నారు. -
No Headline
● ఉచిత వైద్య శిబిరం శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని తిమ్మాపూర్లో గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మేడ్చల్ మెడిసిటీ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న 135 మందికి వైద్య పరీక్షలు నిర్వహిహించి మందులు ఇచ్చామని మార్కెటింగ్ ఇన్చార్జి కుమారస్వామి తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు వినయ్, శ్రేయ, పూజిత తదితరులు ఉన్నారు. ● ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి పెద్దశంకరంపేట(మెదక్): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ అవనీష్రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఇంటర్ ఫస్ట్ఇయర్లో 119 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 48 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది అభిలాష్, అంజయ్య తదితరులున్నారు. చిన్నశంకరంపేటలో.. చిన్నశంకరంపేట(మెదక్): ఇంటర్ సప్లిమెంటరి ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● గాలి బీభత్సం పాపన్నపేట(మెదక్): మండలంలో గురువారం వీచిన జోరు గాలితో పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. దీంతో రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లక్ష్మినగర్, యూసుఫ్పేట, కుర్తివాడ, మిన్పూర్ శివారులో వీచిన హోరు గాలికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీంతో వాహనాల రాక పోకలు కొంత నిలిచి పోయాయి. స్థానికులు, సిబ్బంది వాటిని తొలగించి రోడ్డు క్లియర్ చేశారు. ● ఆర్థికసాయం చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట గ్రామాంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ తప్పెట సాయికిరణ్ కుటుంబానికి తోటి స్నేహితులు రూ.28వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడికి భార్య ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కార్యక్రమంలో టెన్త్క్లాస్మెట్స్, ఎంపీటీసీ శివకుమార్ ఉన్నారు. ● దొంతిలో కళాజాత ప్రదర్శన శివ్వంపేట(నర్సాపూర్): నేరాల నియంత్రణలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గురువారం రాత్రి మండల పరిఽధిలోని దొంతి గ్రామంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిచితుల ఫోన్కాల్స్, సైబర్ మోసాలు, మత్తు పదార్థాల నియంత్రణ తదితర అంశాలపై కళాజాత బృందం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు. ● విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి టేక్మాల్(మెదక్): విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి చెందిన సంఘటన టేక్మాల్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... టేక్మాల్ గ్రామానికి చెందిన నడోల్ల శంకరయ్య, లక్కాకుల మల్లప్పకు చెందిన మూడు పాడి గేదెలు మేతకు వెళ్లాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలం వద్ద బుధవారం రాత్రి విద్యుత్ తీగలు తెగిపడగా సరిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. రూ.2లక్షల ఆస్తినష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. సంక్షిప్త వార్తలు -
మహిమానిత్వం వీరభద్రాలయం
టేక్మాల్(మెదక్): నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు భద్రకాళీ సమేత వీరభద్రాలయం ముస్తాబైంది. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మండలంలోని బొడ్మట్పల్లి గ్రామంలోని గుట్టపై భద్రకాళీ సమేత వీరభద్రుడు వెలిశాడు. ఉత్సవాల వివరాలు... నేటి నుంచి 31 వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి. 24న గణపతి పూజ, భద్రకాళీ సమేత వీరభద్రడుకి అభిషేకం, రాత్రి 7గంటలకు అగ్ని గుండాలు. 25న భద్రకాళీ సమేత వీరభద్రుడికి అభిషేకాలు, ఎదుర్కొళ్లు, స్వామివారి కల్యాణోత్సవం, సాయంత్రం షావ ఊరేగింపు. 26న ఉదయం గణపతిపూజ, అభిషేకం, గ్రామ దేవతలు దుర్గమ్మ, పోచమ్మలకు బోనాల ఊరేగింపు. 27న ఉదయం గణపతిపూజ, అభిషేకం, గ్రామ దేవతలకు బండ్ల ఊరేగింపు ఊరేగింపు. 28న ప్రత్యేక పూజలతో పాటూ కుస్తీ పోటీలు. 29న రథోత్సవం, 30న ప్రత్యేక పూజలతో పాటూ లంకాదహనం, 31న పాచిబండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. నేటి నుంచి 31 వరకు బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ సమష్టి కృషితో.. ఉత్సవాలు ప్రారంభం అయిన నాటి నుంచి ఉపవాసదీక్షతో పూజలు నిర్వహిస్తాం. ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. గ్రామస్తులు సమష్ట కృషితో ఆలయ అభివృద్ధికి పనిచేస్తున్నారు. – బస్వరాజ్, ఆలయ కమిటీ చైర్మన్, బొడ్మట్పల్లి ఇబ్బందులు రానివ్వం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నీటి వసతి, పారిశుధ్ధ్యం పనులు పూర్తి చేశాం. వసతుల కల్పనకు గ్రామస్తులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. – కృష్ణ, తహసీల్దార్, టేక్మాల్ -
ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు
వెల్దుర్తి(తూప్రాన్): ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, ప్రతీఒక్కరూ ఆధ్యాత్మిక భావన అలవర్చుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మండలంలోని శెట్టిపల్లికలాన్ గ్రామంలో గురువారం పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నర్సింలు, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్ పాల్గొన్నారు. -
బగలాముఖి ఆలయంలో పౌర్ణమి పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేటలో కొలువైన బగలాముఖి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోష్శర్మ ఆధ్వర్యంలో హరిద్వార్చన, విశేష పూజలు, హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, నిర్వాహకులు సూర్యకుమార్గౌడ్, పోచగౌడ్, కొండల్, నాగరాజు, వెంకటేశ్ తో పాటు తదితరులు ఉన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నర్సాపూర్: నర్సాపూర్లోని ఏడవ వార్డులోని బాల హనుమాన్ ఆలయంలో గురువారం ఆలయ ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అర్చకుడు హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, ఏడవ వార్డు కౌన్సిలర్ రుక్కమ్మ, భక్తులు శ్రీనివాస్యాదవ్, జగదీశ్వర్ తదితరులు పాల్గొని బాల హనుమాన్కు పూజలు చేశారు. రంగనాయకుడికి రథోత్సవం కొల్చారం(నర్సాపూర్): మండలంలో కొలువైన రంగనాయక స్వామి రథోత్సవం గురువారం కనుల పండువగా సాగింది. శేషతల్పంపై కొలువైన లక్ష్మీ సమేత రంగనాయకుడి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి పురవీధుల గుండా రథోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ, పవళింపు సేవ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మోడల్ విద్యార్థులకుప్రశంసా పత్రాలు చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం చేగుంట మోడల్ పాఠశాల పదోతరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ప్రశంసాపత్రాలను అందించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో 9.5పైగా జీపీఏ సాధించిన విద్యార్థులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందించినట్లు తెలిపారు. చేగుంట మోడల్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఘనంగా ఎల్లమ్మదేవి ఆలయ వార్షికోత్సవం చిలప్చెడ్(నర్సాపూర్): మండలంలోని చిట్కుల్లోని ఎల్లమ్మదేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నారాగౌడ్, యాదగిరిగౌడ్, ఈశ్వర్గౌడ్, రవీందర్గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్ శాఖ ఏఈ గణేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేగుంట నుంచి వచ్చే 132/33కేవీ లైన్లోని మర్మమతుల దృష్ట్యా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, నార్లాపూర్, కల్వకుంట సబ్స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. చేగుంట మండల కేంద్రంలో.. చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని 132 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కోసం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. చేగుంటతో పాటు అనంతసాగర్, కర్నాల్పల్లి సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదు అన్నారు. నేడు నార్సింగిలో .. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంతో పాటు సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ స్వామి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని132 కేవీ విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు ఉన్నందున నార్సింగి, జప్తిశివనూర్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరాపరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. తూప్రాన్ మండలంలో.. మండలంలోని ఇస్లాంపూర్, మల్కాపూర్ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 12 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడు తుందని విద్యుత్ ఏఈ వరహాలబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మల కత్తిరింపుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ తెలిపారు. -
పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి
మెదక్ కలెక్టరేట్: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్రాజ్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రమేశ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 15 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని.. ప్రతి పాఠశాల 25 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
- తాపీగా తప్పుడు కేసులు
- అమెరికాలో సుడిగాలుల బీభత్సం
- PM Narendra Modi: ‘ఇండియా’ కూటమి గెలిస్తే... హిందువులు రెండో తరగతి పౌరులే..
- పేదింట ఆర్థిక వెలుగుకు ఉపాధి హామీ జేగంట!
- 13 నిమిషాలు యథాతథం
- Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
Advertisement