-
హైదరాబాద్ : కైలాస్, మహిక వివాహ వేడుకలో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
నాగచైతన్య తండేల్ సినిమా టీజర్
-
జర్నలిస్ట్గా నాగ చైతన్య.. వరుస హత్యలను ఎలా ఛేదించాడు
అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ 'దూత' డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నేడు (నవంబర్ 23) చైతూ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కె. కుమార్ తాజాగా దూత అనే వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దూతలో నాగ చైతన్య జర్నలిస్ట్గా కనిపిస్తాడు. సమాచార్ అనే దినపత్రికలో సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ నటించాడు. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్ పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనుగొంటాడు. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జర్నలిస్ట్గా చైతన్య చేసిన సాహాసాలు ఎలాంటివి..? ఈ క్రమంలో అతని మీదే నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే డిసెంబర్ 1న అమెజాన్లో చూడాల్సిందే. -
పిల్లలను దత్తత తీసుకోనున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది. తన ట్రీట్మెంట్లో భాగంగా కొద్దిరోజుల క్రితం భూటాన్లో ఆయుర్వేద చికిత్సను తీసుకుంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆమె ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. సమంత హీరోయిన్గా మాత్రమే గుర్తింపు పొందలేదు.. తనలో మంచి సేవాగుణం ఉందని కొందరికే తెలుసు. దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార కొన్నేళ్ల క్రితం ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది. గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందేలా సమంత చూశారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇదంతా తను ఏర్పాటు చేసిన ప్రత్యూష సపోర్టు అనే స్వచ్చంద సహకారంతో ఆమె చేశారు. సమంత సుమారుగా 11 ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతోంది. ఈ సంస్థ మహిళలు, బాలబాలికల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ కారణంగానే సామ్ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎందరో చిన్నారులకు అండగా నిలబడిన సమంత... త్వరలో ఇద్దరు చిన్నారలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలన చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సమంత మాత్రం ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంత పలు కారణాల వల్ల 2021 నుంచి ఆయనతో దూరంగా ఉంటున్నారు. ఐదారేళ్లుగా ప్రేమించుకుని తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ జంట అభిమానులకు భంగపాటు కలిగించింది. వారిద్దరూ విడిపోయాక సమంతపై కొందరు ట్రోల్స్ చేస్తూ ఆమెను క్షోభకు గురిచేశారు. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకోవాలని సమంత తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరిగింది. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని సమంతను వారు సూచించినా ఆమె సున్నితంగా వద్దని చెప్పారట. అలా రెండో పెళ్లి ఆలోచనే లేదని తల్లిద్రండ్రులకు సమంత చెప్పేసిందని ప్రచారం జరిగింది. ఈ విషయం పట్ల కూడా సమంత ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. -
Naga Chaitanya: చై గొప్ప మనసు.. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారులకు బహుమతులు (ఫోటోలు)
-
అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్పై రైడ్!
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారు. చందు మొండేటి డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా నాగచైతన్య తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. అయితే తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీంతో అతని బైక్ నడపడమే కాకుండా.. తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తే వాటిని తన గ్యారేజ్లోకి తీసుకురావాల్సిందే. హైదరాబాద్ రోడ్లపై అప్పుడప్పుడు బైక్ రైడ్స్ చేస్తూ కనిపిస్తుంటారు. View this post on Instagram A post shared by Sai (@always__about__akkineni) (ఇది చదవండి: లెస్బియన్స్గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) -
తాను లెజెండరీ యాక్టర్..!
-
టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?
తన సినీ ఆరంగేట్రం టాలీవుడ్లోనే మొదలైంది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో తెరకెక్కిన మూవీ రంగం ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్తో పాటు మలయాళం, తమిళంలోనూ నటించింది. (ఇది చదవండి: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!) ఇంతకీ ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదండీ.. సీనియర్ నటి రాధ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక నాయర్. ఇవాళ తన బర్త్డేను పురస్కరించుకుని రాధ షేర్ చేసిన ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా ఇవాళ కార్తీకా బర్త్డే కావడంతో కూతురికి స్పెషల్ విషెస్ చెప్పింది సీనియర్ నటి రాధ. తన కూతురి చిన్ననాటి ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. కాగా.. రాధ కార్తీకతో పాటు తన పిల్లలైన తులసి, విఘ్నేశ్ ఫోటోలను పంచుకుంది. కార్తీక 1992 జూన్ 27న చెన్నెలో జన్మించింది. ఇవాళ 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బాల్యంలో కార్తీక ఫోటోలు చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్) View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
‘కస్టడీ’ మూవీ ట్వీటర్ రివ్యూ
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కస్టడీ’ సినిమా ఎలా ఉంది? కానిస్టేబుల్గా నాగచైతన్య ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. (చదవండి: ఆ విషయం ఓ సవాల్గా మారింది : నాగచైతన్య) ‘కస్టడీ’చిత్రానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. నటన పరంగా నాగచైతన్య, అరవింద స్వామి ఇరగదీశారని చెబుతున్నారు. అయితే కథ, కథనం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు ఆకట్టుకునేలా లేవని కామెంట్ చేస్తున్నారు. #Custody One Word Review: This movie has a 50-50 odds of winning at the box office but This gonna be a #NagaChaitanya memorable movie in his career. This remains to be one of the UNDERRATED Movie from tollywood if not recognized today. Mark my words 🔥#CustodyReview… pic.twitter.com/enUNpXNAOK — ReviewMama (@ReviewMamago) May 12, 2023 సినిమా నెమ్మదిగా మొదలై.. ప్రిడిక్టబుల్ నెరేషన్ తో సాగుతుందట ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50ః50 శాతం విజయం సాధించే అవకాశం ఉంది. కానీ నాగచైతన్య కెరీర్లో ఓ మెమరబుల్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Custody Overall a Below Par Action Thriller! Interesting plot point with a few well designed scenes that work but the rest is tiresome. Film is dragged in many places with repetitive actions scenes and narrated in a flat way. BGM is ok but songs are awful. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) May 11, 2023 కస్టడీ ఓవరాల్గా బిలో యావరేజ్ పార్ యాక్షన్ థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా సీన్స్ గత సినిమాల్లో చూసినట్టుగా ఉంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. కానీ పాటలు ఆకట్టుకోలేకపోయాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు. #Custody career best acting career best movie 3.789/5 — Vv (@babbar5her_) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody an excellent first half and good second half Overall a must watch movie - 3.25/5 👌 — AkkineniBOupdates (@AkkineniBO) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody First half police station scene 🔥🔥🥳 Second half forest fight 🔥🔥🔥 Kummaru — Toride (@Toride17Toride) May 12, 2023 Just Now Completed My show 🤩 1st Half average, 2nd Half Mathram 💥💥💥 Screenplay +BGM Mamuluga Undav 💥🥵🥵🥵 Chai acting Aithay Un expected💥 Overall ga Block Buster Kotesadu @chay_akkineni Anna 😍#Custody #NagaChaitanya pic.twitter.com/cSd29CzokA — Srinivas (@srinivasrtfan2) May 12, 2023 #CustodyFromTomorrow #CustodyOnMay12 #CustodyMovie #custody 1st half good. It wd have even more gripping but still good 1st half. Chay superb perf 👌 Vennela kishore hilarious 👌 Ilayaraja bgm creates nostalgia 🙏 https://t.co/wmcUQ0NYOk — BayArea MegaFan 💪 (@Twittarodu) May 12, 2023 -
నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తన సొంతం టాలెంట్తోనే పేరు సంపాదించాడు. జోష్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు చైతూ. ఆ తర్వాత ఏమాయ చేశావే మూవీతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. (ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల) వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో నాగ చైతన్య పోలీస్గా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి బాధకరమైన సంఘటనలు లేవు. నాకు ఎదురైన ప్రతి సంఘటన ఏదో ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సినిమాల విషయంలో బాధపడ్డా. వాటిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. ఆ విషయంలో మాత్రం బాధపడుతుంటా. మూడు చిత్రాల విషయంలో అలా జరిగింది.' అని చెప్పుకొచ్చారు. కాగా.. కస్టడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య చివరిసారిగా అమిర్ ఖాన్తో కలిసి లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశకు గురి చేసింది. (ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో) -
చివరి షెడ్యూల్ షురూ
‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్ని శుక్రవారం ప్రారంభించారు. ‘‘నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో మా ‘కస్టడీ’ ఒకటి. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన గ్లింప్స్లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాని ఈ ఏడాది మే 12న విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్, సమర్పణ: పవన్ కుమార్. -
అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్
అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్ 2’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇదే షోలో ఆయనతోపాటు మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'థియేటర్లు పడిపోతున్న సమయంలో ఆయా థియేటర్ల యజమానులు వాటిని పైకి రావాలనుకుంటారు. వాటిని మామూలు స్థితికి తీసుకురావడం, సినిమాలు కొనుక్కోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. దాన్ని భరించలేక ‘థియేటర్లను మీరే రన్ చేయండి.. మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వండి’ అని థియేటర్ల ఓనర్లు నిర్మాతలను కోరారు. అలా మేం వాటిని తీసుకొని కొన్ని కోట్ల రూకపాయలతో మంచిగా తీర్చిదిద్దాం. అన్ని వసతులు ల్పించాం. అలా థియేటర్లను ఆధునికీకరించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మీలాంటి పెద్ద హీరోలకు అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం.' అని తెలిపారు. దీనిపై సురేశ్ స్పందిస్తూ.. దీని వల్ల కొందరికి థియేటర్లు దొరక్కపోవడంతో పలు సందర్భాల్లో విమర్శించారన్నారు. అందరూ కలిసి సినిమాను బతికించారని అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించాలనుందనే తన కోరికను బయటపెట్టారు. -
స్టార్ హీరో కుమార్తెతో నాగచైతన్య.. ఇంతకీ ఎవరో తెలుసా?
అక్కినేని నాగచైతన్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక సామ్తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్ లైఫ్పై అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరో కుమార్తె నాగచైతన్యతో కలిసి ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అందులో ఆమె ఓ స్పెషల్ ఫుడ్ తయారుచేసి చైతూకు తినిపించింది. ఆ వీడియోకు తెగ లైక్స్, కామెంట్స్తో అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరనే కదా మీ సందేహం. ఆ స్టార్ హీరో కుమార్తె మరెవరో కాదండి. విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత దగ్గుబాటి. ఆమె ప్రస్తుతం యూట్యూబ్లో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల వంటకాలను తన వ్లాగుల్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఈసారి ఆమె ప్రోగ్రామ్కు బావా నాగచైతన్య గెస్ట్గా హాజరయ్యారు. చైతూతో కలిసి పలు రకాల వంటకాల తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - అక్కినేని నాగ చైతన్య
-
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
రెండు భాషల్లో నాగ చైతన్య ‘దూత’.. అమెజాన్లో రిలీజ్
మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది. -
తంతడి బీచ్లో నాగచైతన్య సందడి
అచ్యుతాపురం(అనకాపల్లి): అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మితమవుతున్న నూతన చిత్రం షూటింగ్ తంతడి బీచ్లో ప్రారంభమైంది. తీరంలోని రెండు కొండల మధ్య ఏర్పాటు చేసిన సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. పది రోజులపాటు కష్టపడి సెట్టింగ్ నిర్మించారు. గురువారం ఉదయం నుంచి షూటింగ్ జరుగుతుందని తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు నాగ చైతన్యను చూసేందుకు తరలివచ్చారు. మరో మూడు రోజులపాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. చదవండి: మహారాజా సుహేల్ దేవ్గా రామ్చరణ్! -
ఏడేళ్ల తర్వాత జత కడుతున్న చైతూ, పూజా హెగ్డే!
ఒక్కసారి ఏడేళ్లు వెనక్కి వెళదాం. అప్పుడు వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాను గుర్తు చేసుకుందాం. అందులో నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూజ నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. అంతకుముందు తమిళ ‘ముగముడి’ తెలుగు అనువాదం ‘మాస్క్’లో కనిపించారీ బ్యూటీ. ఇక ఏడేళ్ల క్రితం ‘ఒక లైలా కోసం’లో జోడీగా నటించిన చైతూ–పూజ మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం. నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా అనుకుంటున్నారన్నది తాజా టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరి.. చైతూ–పూజా మళ్లీ జంటగా కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
మాస్ సాంగ్తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్
Bangarraju Movie Wrap The Shooting: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. 'సోగ్గాడు మళ్లీ వచ్చాడు' అనేది సినిమా క్యాప్షన్. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన ‘వాసివాడి తస్సాదియ్యా’ ఫుల్ లిరికల్ సాంగ్ విశేషంగా అలరిస్తోంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ 'ఫరియా అబ్దుల్లా' కనువిందు చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. బంగార్రాజు సినిమా షూటింగ్ గురువారంతో (డిసెంబర్ 23) పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో నాగ చైతన్య, కృతీ శెట్టిలపై తీసిన పెప్పీ మాస్ సాంగ్తో చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా ‘‘మరో పెప్పీ డ్యాన్స్ నంబర్ రెడీ అవుతోంది. షూటింగ్ చివరి రోజు ఇది. పండగలాంటి సినిమా. ‘బంగార్రాజు’ కమింగ్ సూన్’’ అని గురువారం నాగార్జున ట్వీట్ చేశారు. చైతన్య, కృతీల ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Last day of the shoot!! Another peppy dance number loading.!! పండగ లాంటి సినిమా!! 💥బంగార్రాజు coming soon💥#Bangarraju#BangarrajuComing@chay_akkineni@kalyankrishna_k @iamkrithishetty@anuprubens@AnnapurnaStdios @ZeeStudios_ pic.twitter.com/zq1R2pHjKM — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 23, 2021 ఇదీ చదవండి: బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్.. 'నా కోసం నువ్వు' అంటూ -
సమంత- నాగచైతన్య జంట సొంత సంపాదన ఎంతో తెలుసా?
టాలీవుడ్ బెస్ట్ కపూల్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. ఎలాంటి వివాదాలు లేకుండా జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే వృత్తిపరంగా రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సీరీస్లో నటిస్తుంది. త్వరలోనే ఈ సీరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగచైతన్య నటించిన ‘లవ్స్టోరీ’ సినిమా గతనెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు చై. కరోనా సెకండ్వేవ్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చై-సామ్ల సంపాదన హాట్ టాపిక్గా మారింది. పెళ్లి తర్వాత వీరిద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవల వీరిద్దరు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారట. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. గత పదేళ్ల నుంచి టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సామ్.. ఆస్తులను బాగానే కూడబెట్టిందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ఆమె రెండు స్టార్టప్లను కూడా కలిగి ఉంది. వాటిలో ఒకటి ఏకామ్ అనే ఫ్రీ స్కూల్ కాగా, మరొకటి ఫ్యాషన్ లేబుల్ సాకి. వీటి ద్వారా కూడా బాగే సంపాదిస్తుంది సమంత. ఆమెకి రూ.76 లక్షల విలువపై విలాసవంతమైన బీఎమ్డబ్ల్యూ కారు కూడా ఉంది. వీటన్నింటితో కలిపి సమంత మొత్తం ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్లోనే ఆయన రూ.40 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం. అలాగే ఖరీదైన కార్లు, బంగ్లాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ జంట సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల విలువ రూ.125కోట్ల వరకు ఉంటుందని సినీ పండితుల అంచనా వేస్తున్నారు. -
‘మనం’ దర్శకుడితో చైతూ కొత్త సినిమా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు హీరో నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించారు. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. దర్శకుడు విక్రమ్ విభిన్న కథను సిద్ధం చేసుకొని దానిని నాగ చైతన్యకు వినిపించగా..కథ ఎంతో నచ్చడంతో ఈ సినిమాకు చైతూ ఓకే చెప్పాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే అక్కినేని కుటుంబం మొత్తంతో విక్రమ్ మనం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలాగే అఖిల్తోనూ ‘హలో’ సినిమాను తీశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కినేని వారితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం చైతూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తున్నారు. కరోనావైరస్ లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. అంతేగాక ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్స్టోరి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన అనంతరం ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవిల మధ్య వచ్చే కొన్ని సీన్లను ఈ మ్యూజికల్ ప్రివ్యూలో ప్రధానంగా చూపెట్టారు. సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్ మంచి పాటను అందించినట్టుగా అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. వేసవిలో విడుదల కానుంది. -
‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు
రియల్ లైఫ్ మామ-అల్లుడు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్లో కూడా అదే పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకెళుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా వెంకీ మామ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్, నాగచైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే డైరక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర) అభినందనలు తెలిపారు. ‘వెంకటేశ్ తనదైన స్టైల్లో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ సీన్స్తో ప్రేక్షకులను మెప్పించాడు. చాలా కాలం తర్వాత వెంకటేశ్ యాక్షన్ సీన్స్లో వావ్ అనిపించాడు. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా చక్కగా నటించాడు. దర్శకుడు బాబీ తనదైన టేకింగ్, ట్రీట్మెంట్, స్ర్కీన్ప్లేతో సినిమాను చక్కగా రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బాబీ, నాగచైతన్యలు ట్విటర్ వేదికగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘వెంకీ మామ గురించి ఇంత అద్భుతమైన మాటలు చెప్పిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఒక అభిమానిగా ఆయన నోటి వెంట ఈ మాటల వినడం.. నా జీవితంలో మరచిపోలేని రోజు’ అని బాబీ ట్వీట్ చేశారు. మహేష్ బాబు కూడా వెంకీ మామ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వెంకటేశ్, నాగచైతన్యల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పారు. తాను ఈ చిత్రంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. కాగా, సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Here's what MEGASTAR Chiranjeevi garu had to say after watching #VenkyMama https://t.co/CAIA3wlzMI#MegastarAboutVenkyMama #BlockbusterVenkyMama #VictoryVenkatesh | @chay_akkineni | @dirbobby | @RaashiKhanna | @starlingpayal | @MusicThaman | @SureshProdns | @peoplemediafcy — Venky Mama (@VenkyMama) December 18, 2019 -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వెంకీమామ
రియల్ లైఫ్ మామ- మేనల్లుడు అయిన హీరోలు వెంకటేశ్- నాగచైతన్య రీల్ లైఫ్లోనూ అదే పాత్రలు పోషించిన చిత్రం ‘వెంకీమామ’కు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. కేవలం మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.(వెంకీమామ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Venky Mama gives oxygen to TFI box office, which was dry in last 2 months! #VenkyMama #VictoryVenkatesh, @chay_akkineni, @dirbobby, @SureshProdns @peoplemediafcy @SBDaggubati @vivekkuchibotla @RanaDaggubati pic.twitter.com/FXIl8SeAJD — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) December 16, 2019 -
వెంకీ మామ : మూవీ రివ్యూ
టైటిల్: వెంకీ మామ జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు : వెంకటేశ్, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్పుత్, నాజర్, రావు రమేశ్, ప్రకాశ్రాజ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గీత, కిషోర్ సంగీతం : థమన్ సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురేళ్ల దర్శకత్వం: బాబీ (కేఎస్ రవీంద్ర) నిర్మాతలు: సురేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటులు తెరమీద ఆడిపాడి.. అలరిస్తే చూడాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన కాంబినేషన్ విక్టరీ వెంకటేశ్, యువసామ్రాట్ నాగచైతన్య. ఈ ఇద్దరూ రియల్లైఫ్లో మామ-అల్లులు. రీల్లైఫ్లోనూ అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్ సినిమాపై మంచి క్రేజ్ ఉంటుంది. ‘గురు’, ఎఫ్-2 సినిమాలతో మంచి జోష్లో వెంకీ, ‘మజిలీ’ సూపర్హిట్ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’.. మరీ ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా ఏంటి? తమ అనుబంధంతో ప్రేక్షకులను ఏమేరకు కట్టిపడేశారు? తెలుసుకుందాం పదండి. కథ: రామనారాయణ (నాజర్) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా అన్నట్టు దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేశ్) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్.. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్ ఆర్మీలో మేజర్గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? ఇది మిగతా కథ. నటీనటులు: సీనియర్ నటుడు వెంకటేశ్ తెరమీద కనిపిస్తేనే నవ్వులు విరబూస్తాయి. తన మ్యానరిజమ్స్, డైలాగ్స్తో ప్రేక్షకులను కట్టిపడేయంలో దిట్ట ఆయన. మిలటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం పాత్రలో మరోసారి వెంకీ అదరగొట్టాడు. ఫస్టాఫ్ అంతా వెంకీ తన సహాజమైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్లో గంభీరమైన పాత్రను అంతే అలవోకగా పోషించాడు. అల్లుడు కార్తీక్ పాత్రలో నాగచైతన్య తనదైనశైలిలో చక్కని అభినయం కనబర్చాడు. ‘మజిలీ’లో గంభీరమైన పాత్ర పోషించిన చైతూ.. ఈ సినిమాలో చలాకీ యువకుడిగా, మామకు తగ్గ అల్లుడిగా, ఆర్మీ మేజర్గా మెచ్యూర్డ్ ఫర్ఫార్మెన్స్ కనబర్చాడు. వెన్నెల, హారిక పాత్రల్లో పాయల్ రాజపుత్, రాశి కన్నా తమ పరిధి మేరకు నటించారు. సహజంగానే కామెడీ, పాటలు మినహా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాజర్, గీత, ప్రకాశ్ రాజ్, రావూ రమేశ్, కిషోర్, హైపర్ ఆది తమ పాత్రలతో మెప్పించారు. విశ్లేషణ: మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్గా, రోటిన్గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. ఫస్టాప్ అంతా కామెడీతో ఎంటర్టైనర్గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్ అలాగే అనుకోవడం, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్, బ్రేకప్ వంటి సీన్లతోపాటు కామెడీతో, పాటలతో ఫస్టాప్ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ సీన్లు బోర్ కొట్టకపోయినా.. సెకండాఫ్లో కొంత లాజిక్ తప్పిన విషయాన్ని ప్రేక్షకుడు గుర్తిస్తాడు. సెకండాఫ్ కొంత రోటీన్గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందే సినిమాటిక్ క్లైమాక్స్ ఇవన్ని రోటిన్ ఫీలింగ్ కలిగించవచ్చు. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? అంటే సినిమాలో వాటిని నమ్మించేరీతిలో కథను బలంగా చూపించడం కనిపిస్తుంది. ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు. ఏపీ నుంచి కథను అమాంతం కశ్మీర్కు తీసుకెళ్లి.. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సీన్లతో కొంత లాజిక్ తప్పినట్టు అనిపించినా.. దర్శకుడు బాబీ తాను అనుకున్న కథను చక్కగా తెరపై చూపించాడు. ప్రసాద్ మురేళ్ల సినిమాటోగ్రఫి బావుంది. కశ్మీర్ అందాలు, అక్కడ తెరకెక్కించిన సీన్లు బావున్నాయి. మిలటరీ నాయుడు పాటతో అదరగొట్టిన థమన్... నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్ అయ్యాడు. డైలాగులు అక్కడక్కడా పేలాయి. సినిమాస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు. బలాలు వెంకటేశ్, నాగచైతన్య నటన ఫస్టాప్, కామెడీ సినిమా నిర్మాణ విలువలు బలహీనతలు సెకండాఫ్ ఒకింత రోటిన్గా అనిపించడం సినిమాటిక్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement