-
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్బాస్ ఏడో సీజన్కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
'కార్తీకదీపం' సీరియల్, 'బిగ్బాస్ 7' షోతో గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేసింది. సోమవారం గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్బాస్ షోలో తనతో పాటు పాల్గొన్న తేజ, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)కర్ణాటకకు చెందిన శోభాశెట్టి.. కన్నడలో పలు షోలు చేసింది. తెలుగులోకి 'కార్తీకదీపం' సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మోనిత అనే విలన్గా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ చేసింది. గతేడాది బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొన్న ఈమె.. ఫైనల్ వరకు వచ్చింది కానీ విజేత కాలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి అని పరిచయం చేసింది. వీళ్లకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది.ప్రస్తుతం శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఈ గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే షోలో పాల్గొన్న తర్వాత వచ్చిన డబ్బులతోనే శోభా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
హైదరాబాద్లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్బాస్ 7 తెలుగు సీజన్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్తో హైదరాబాద్లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్లోని అద్దె ఫ్లాట్లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ ) -
బిగ్ బాస్ అశ్విని శ్రీకి ఇంత గొప్ప అవార్డా? (ఫోటోలు)
-
Priyanka Jain HD Photos: తొలిసారి గ్లామర్ లుక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ 'ప్రియాంక' (ఫోటోలు)
-
విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్ అవుతారు. సీరియల్స్కు, సినిమాకు మధ్యలో బిగ్బాస్ ప్లాట్ఫామ్ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెగెటివిటీ అయితే బిగ్బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్ ద్వారా క్లిక్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ను మరింత క్యాష్ చేసుకునేందుకు బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండేళ్లు తిరిగాం ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్ అని ఓ వెబ్ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు.. -
Shobha Shetty Latest Photos: లంగా ఓణీలో మరింత అందంగా 'బిగ్బాస్' శోభాశెట్టి (ఫొటోలు)
-
మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం
'బిగ్బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
ప్రిన్స్ యావర్తో లవ్? క్లారిటీ ఇచ్చిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ షోలో పాల్గొంటే పాపులారిటీ ఎంతొస్తుందో.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి షోలో ఎటువంటి నెగెటివిటీ లేకుండా బయటకు రావడం చాలా కష్టం. కానీ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో ఫుల్ పాజిటివిటీతో బయటకు వచ్చింది నయని పావని. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన ఈమె ఒక్క వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. షో నుంచి బయటకు వచ్చాక బిగ్బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్తో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ వస్తోంది. ఇది చూసిన జనాలు.. వీళ్ల మధ్య ఏదో ఉందని అనుమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఆమె అభిమానులతో చిట్చాట్ చేయగా ఓ వ్యక్తి నువ్వు ప్రిన్స్ యావర్తో ప్రేమలో ఉన్నావా? అని అడిగేశాడు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయిన నయని.. అరేయ్, ఏంట్రా మీరు? ఇంకో ప్రశ్నే లేదా? మా మధ్య ఏం లేదు అని ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి అని రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. #NayaniPavani Clarifies Relation with #Yawar pic.twitter.com/KR5B1jT93x — BigBoss Telugu Views (@BBTeluguViews) February 21, 2024 చదవండి: ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేశా.. రెండోది త్వరలోనే.. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
అమర్ను సర్ప్రైజ్ చేసిన శోభ.. అతడి కోసం త్యాగం..
బిగ్బాస్ షోను డీల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కంటెస్టెంట్లను మెచ్చుకోవాలి. తప్పు చేసినవారిని సరిచేయాలి.. వారి నుంచి ఎంటర్టైన్మెంట్ రప్పించాలి.. ఎపిసోడ్ను జోష్గా ఉంచాలి.. ప్రేక్షకులు షో చూడగలిగేలా చేయాలి.. ఇలా చాలానే ఉంటాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా సరే బిగ్బాస్ను ఓ బాధ్యతగా భుజానెత్తుకున్నాడు కింగ్ నాగార్జున. వరుసగా ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎనిమిదో సీజన్కు కూడా ఆయనే యాంకర్గా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. శోభాకు టీషర్ట్ గిఫ్ట్ కాకపోతే నాగ్ ఎక్కువగా కోప్పడడు. అలాంటిది ఏడో సీజన్లో మాత్రం ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్కరు మారు మాట్లాడకుండా చేశాడు. అమ్మాయిలను మాత్రం సుతిమెత్తగానే వారించేవాడు. ఓ రోజు శోభా శెట్టి నాగ్ ధరించిన టీ షర్ట్ చూసి ముచ్చటపడింది. అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. అంత ప్రేమగా అడిగితే మన్మథుడు కాదంటాడా? షో అయిపోయిన వెంటనే ఆ టీ షర్ట్ను ఇచ్చేశాడు. కానీ అదే షోలో అమర్దీప్ అడిగితే మాత్రం నీకు ఇచ్చేదేంటన్నట్లుగా చూశాడు. ఫ్రెండ్ కోసం త్యాగం ఇక షో అయిపోయాక ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేసింది శోభ. అయితే స్నేహితుడి కోరిక గుర్తొచ్చి అతడి కోసం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నాగార్జున తనకు గిఫ్ట్గా ఇచ్చిన టీషర్ట్ను ఓ షోలో అమర్కు త్యాగం చేసింది. 'ఇది నాకెంతో విలువైన బహుమతి. కానీ ఆరోజు అమర్ నాగ్ సర్ను అడిగాడు, కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా' అని చెప్పింది. అది తీసుకుని మురిసిపోయిన అమర్ స్టేజీపైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. ఇది చూసిన జనాలు శోభను మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: షారుక్ ఖాన్ అంత ఆస్తి లేదు, భరణం ఎంతిచ్చానంటే? -
బిగ్బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్ఫ్రెండ్ సమాధానమిదే
బిగ్బాస్ 7 ఫేమ్ ప్రియాంక సహజీవనం చేస్తోంది. ఈమె గురించి పరిచయమున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఈ షో జరుగుతున్న టైంలోనే ప్రియాంక బాయ్ఫ్రెండ్ హౌసులోకి వచ్చాడు. బయటకు రాగానే పెళ్లి చేసుకుందామని ఆమెతో చెప్పుకొచ్చాడు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. దీంతో చాలామంది ప్రియాంకని పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. తాజాగా దీనిపై ఈమె ప్రియుడు స్పందించాడు. మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. తెలుగులో పలు సీరియల్స్లో హీరోయిన్గా చేసింది. 'జానకి కలగనలేదు' సీరియల్తో అనే సీరియల్తో కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. ఈమెకు సీరియల్ నటుడు శివకుమార్తో ప్రేమలో ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్లిద్దరూ చాన్నాళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)లో ఉన్నారు. గతేడాది బిగ్బాస్ షో వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ప్రియాంక బాయ్ఫ్రెండ్ పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) 'పెళ్లి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంక గ్రాండ్గా కొన్నిరోజుల పాటు పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. అంత గ్రాండ్గా చేసుకోవాలంటే డబ్బులు కావాలి. అందుకే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. పెళ్లి అవ్వకుండా ఎలా జీవిస్తున్నారు? మీ పేరెంట్స్ ఏం అనట్లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేం వాళ్ల అంగీకారంతోనే కలిసి ఉంటున్నాం. అయితే ఈ కామెంట్స్కి చెక్ పెట్టేందుకు ఒకానొక టైంలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఆలోచన ఒకటి వచ్చింది. కానీ తర్వాత దాన్ని విరమించుకున్నాం' అని ప్రియాంక బాయ్ఫ్రెండ్ శివ చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూసుకుంటే ప్రియాంక-శివకుమార్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలి అంటున్నారంటే మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి ఉండొచ్చని ఈ జంట క్లారిటీ ఇస్తున్నట్లే. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్) -
చాలాసార్లు మోసపోయా.. డబ్బులు తిరిగివ్వలేదు.. ఇన్నాళ్లకు!:శోభ
బిగ్బాస్ షో వల్ల పాపులారిటీ ఎంతొస్తుందో నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. షోలో ఏమాత్రం తడబడ్డా, గొడవలు పడ్డా వారిని సోషల్ మీడియాలో ఇట్టే ట్రోలింగ్ చేస్తుంటారు. అలా తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో శోభా శెట్టిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ప్రతీదీ తనకే కావాలన్న స్వార్థం, ఓటమిని అంగీకరించలేని తత్వం, చిన్నదానికీ గొడవపడే వైఖరి ఆమెను విమర్శలపాలు చేసింది. అదే సమయంలో శివంగిలా పోరాడే గుణం, స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్లే మంచి మనసు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల.. ఇక షో ముగిశాక తన పర్సనల్ లైఫ్పై ఎక్కువ ఫోకస్ చేసిందీ బ్యూటీ. ఈ మధ్యే తన ప్రియుడు యశ్వంత్తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు సాకారమైందని, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు(జనవరి 22న) కొత్తింటి తాళం తన చేతికొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. శోభా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ చూశాం. నచ్చడంతో అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాం. కానీ ఏవో కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. డబ్బులు తిరిగివ్వలేదు అప్పుడు మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. అలా చాలాసార్లు మోసపోయాం. ఈ క్రమంలో ఈ ఇల్లు కూడా కొంటానా? లేదా? అని టెన్షన్పడ్డాను, కానీ మొత్తానికి నా కల నెరవేరింది. బిగ్బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదు. రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశాము. కాకపోతే ఆలస్యంగా ఈ ఇంటి తాళం నా చేతికి వచ్చింది. మేము 15వ అంతస్థులో ఉన్న ఫ్లాట్ తీసుకున్నాం. ఇంటీరియర్ డిజైనింగ్కు మరో నాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్ అవుతాం' అని చెప్పుకొచ్చింది. -
తీవ్ర రక్తస్రావం.. పరీక్షిస్తే క్యాన్సర్..
-
బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ని ఇందులో స్కిట్గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ప్రియాంకకు చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా?
-
ఆ బ్యాడ్న్యూస్ ఇదేనా? ప్రియాంకకు దూరంగా..
సీరియల్ నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక జైన్. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైంది. ఇక బిగ్బాస్ హౌస్లోకి ఓసారి ప్రియుడు శివకుమార్ వచ్చినప్పుడు ఎమోషనలైంది నటి. పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడే, ఇక్కడే! అంటూ అతడిని క్షణం కూడా వదల్లేకపోయింది. అటు శివకుమార్ నీకో గుడ్న్యూస్, బ్యాడ్న్యూస్ రెండూ చెప్తానన్నాడు. షో అయిపోయాక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆ శుభవార్తను బయటపెట్టాడు. తాజాగా అతడు అమెరికా షిఫ్ట్ కాబోతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వీసా కోసం తిప్పలు అతడు చెప్తానన్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ప్రియాంకను వదిలి దూరంగా వెళ్లిపోతున్నాడా? అని అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక తన యూట్యూబ్ వీడియోలో వీసా పొందడానికి ఢిల్లీ వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడో వివరించాడు. శివకుమార్ మాట్లాడుతూ.. యూఎస్ ఎంబసీ ముందు వీడియోలు తీస్తే ఫోన్లు లాగేసుకుంటారట. అందుకని అక్కడ వీడియో చేయలేకపోయాను. కానీ మొదటి ప్రయత్నంలోనే వీసా వచ్చేసింది. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను. ప్రియాంకతో పాటు అమ్మ ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. 20 సెకన్లలోనే ఇంటర్వ్యూ అయిపోయింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఆమె న్యూయార్క్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అని అడిగింది. నేను తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. ఈ మధ్యే సీరియల్ అయిపోయింది. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నాను. ఈ సమయంలో న్యూయార్క్ వెళ్లి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. వార్షిక జీతం, ఎవరెవరు వెళ్తున్నారని అడిగింది. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. చివరకు వీసా అప్రూవ్ అని చెప్పడంతో సంతోషమేసింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది' అని చెప్పుకొచ్చాడు. అసలు శివకుమార్ అమెరికాకు వెకేషన్ వెళ్తున్నాడా? లేదంటే అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలున్నాయా? ఏంటనేది వీడియోలో స్పష్టంగా చెప్పలేదు. చదవండి: భర్తకు నళిని విడాకులు.. ఆ తర్వాత కూడా నాన్న కొట్టేవాడన్న నటి కూతురు -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్లో టాస్క్ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్లో భోలే షావళితో మంచి పెయిర్గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్లో నటించిన సమయంలో పవన్తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్లో ఉండేవాళ్లం. షూటింగ్కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
హీరోగా బిగ్బాస్ కంటెస్టెంట్.. పాటతో కుమ్మేసిన భోలె!
ఆట సందీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన పేరు ఆట సందీప్గా మారిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే కావడం విశేషం. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. చాలా వారాల పాటు హౌస్లోనూ తన ఆటతీరుతో మెప్పించారు. అయితే ప్రస్తుతం ఆట సందీప్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ది షార్ట్కట్ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. విజయానికి అడ్డదారులువండవు అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈ చిత్రాన్ని రామకృష్ణ కంచి దర్శకత్వంలో తోట రంగారావు, రజినీకాంత్ పున్నపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్లో బిగ్బాస్ కంటెస్టెంట్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈవెంట్కు హాజరైన వారిలో భోలె షావలి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అశ్విని, గౌతమ్ ఉన్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
తండ్రి అయిన ‘బిగ్బాస్’ అర్జున్.. ఏం పేరు పెట్టారంటే..?
బిగ్బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్బాస్ హౌస్లోనే చెప్పాడు అర్జున్. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్ చేసినట్లు ఓ వీకెండ్ ఎపిసోడ్లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అర్జున్-సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్.. బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. కానీ అర్జున్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్ 6 ప్లేస్లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
ఆపరేషన్ థియేటర్లో బిగ్బాస్ ప్రియాంక.. ఏమైందంటే?
సీరియల్ ద్వారా బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జైన్. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ ద్వారా జనాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన ఆటతో, మాటలతో టాప్ 5లో చోటు దక్కించుకుంది. త్వరలోనే తన ప్రియుడు, నటుడు శివకుమార్ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ సీరియల్ నటి ఆస్పత్రిపాలైంది. ఆమెకు ఆపరేషన్ జరిగిందంటూ శివకుమార్ యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏడో తరగతిలో సైట్.. 'ప్రియాంక బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. కళ్లు ఎర్రబడిపోయి, నొప్పితో విలవిల్లాడిపోయాను. లాసిక్ సర్జరీ చేశాక దాదాపు 8-10 గంటల పాటు కళ్లు తెరవలేము. ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటోంది' అని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. 'నాకు ఏడో తరగతిలో సైట్ వచ్చింది. అప్పటినుంచే కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇవి ధరించడం వల్ల ఇరిటేషన్ వస్తోంది. అందుకే సర్జరీ చేయించుకుందామనుకుంటున్నాను' అని చెప్పింది. కంటి ఆపరేషన్ సక్సెస్ తర్వాత తను ఆస్పత్రికి వెళ్లిన మొదటి రోజు నుంచి ఏమేం జరిగిందో వివరంగా వీడియోలో చూపించారు. శివకుమార్ ఆమె గురించి భయపడుతున్నా ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేసింది. చివరకు ఆస్పత్రిలో తన కంటి ఆపరేషన్ ఎలా చేశారన్నది కూడా వీడియోలో క్లియర్గా చూపించారు. మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రియాంకకు ఎట్టకేలకు దాన్నుంచి విముక్తి లభించింది. ఈ సర్జరీ విజయవంతమైందని, ఇక కళ్లజోడుతో తనకు పని లేదని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. చదవండి: ఒకప్పుడు జేబు నిండా నోట్ల కట్టలు.. చివరకు కారు డిక్కీలో తెలుగు కమెడియన్ శవం -
బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు: యాంకర్
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసిపోయింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో తెలియదు కానీ వివాదాలు మాత్రం భారీగానే ఉన్నాయి. బిగ్ బాస్ పేరుతో మోసం చేశారంటూ టాలీవుడ్ నటి, యాంకర్ స్వప్న చౌదరి ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'నమస్తే సేట్ జీ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి. యాంకర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా, అటూ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి బిగ్ బాస్కు వెళ్లాలని చాలారోజుల నుంచి కోరిక ఉంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకొచ్చింది. దీనినే కొందరు అదునుగా చూసుకొని ఆమె నుంచి రూ. 2.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఇదే విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలిపింది. 'నాకు బిగ్ బాస్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.. ఎంతలా అంటే నేను నిద్రపోతున్న సమయంలో కూడా బిగ్ బాస్లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ సీజన్ -1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్-7 సమయంలో నన్ను కంటెస్టెంట్గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్ సమయంలో నాకు కాస్ట్యూమ్స్ పంపిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బే కాకుండా ఫోటో షూట్ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి..చేతులెత్తేశాడు. ఆ సమయంలో నాకొక అగ్రిమెంట్ రాసిచ్చాడు. బిగ్ బాస్కు పంపించలేకపోతే డిసెంబర్ నెలలో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు.. జనవరిలో తప్పకుండా ఇస్తానన్నాడు.. తీరా ఇప్పుడు కాల్ చేస్తే నీకు నచ్చింది చేసుకో.. కావాలంటే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుకున్నాను. బిగ్ బాస్లోకి వెళ్దామనే నా ఆశను తుంచేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మి టీమ్గా పెట్టుకోకండి. వచ్చే సీజన్లో అయిన నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అని స్వప్న తెలిపింది. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐜𝐡𝐨𝐫 𝐒𝐰𝐚𝐩𝐧𝐚 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲 (@its_me_swapna_chowdary) -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఎగిరి గంతేసిన బిగ్బాస్ బ్యూటీ
విలనిజం పండించడం అంత ఈజీ కాదు. విలన్గా హీరోహీరోయిన్లను డామినేట్ చేయడమూ అంత ఈజీ కాదు. కానీ 'కార్తీక దీపం' సీరియల్తో మోనిత అలియాస్ శోభా శెట్టి అన్నీ సుసాధ్యమే అని నిరూపించింది. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్తో అవతలవారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది. నాగార్జునను అడిగేసిన శోభ ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటి తెలుగు బిగ్బాస్ 7లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో వచ్చిన ఈ సీజన్లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ జంకకుండా, తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్ చూసి ముచ్చటపడిపోయింది శోభ. అది తనకు కావాలని అడిగింది. దాన్ని సీరియస్గా తీసుకున్న నాగ్ నిజంగానే ఆ డ్రెస్ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. గుర్తుపెట్టుకుని మరీ బహుమతిచ్చిన నాగ్ 'బహుశా ఆరో వారంలో అనుకుంటా.. అప్పుడు నాగార్జున ధరించిన టీ షర్ట్ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్ అయ్యాను. నేను టీ షర్ట్ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్ అయిన రోజు నాగ్ సర్ స్వయంగా ఆ టీషర్ట్ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్ కూడా చేశాను' అంటూ తన షూట్ ఎలా జరిగిందో వీడియోలో చూపించింది. ఇది చూసిన జనాలు.. శోభా అనుకున్నది సాధించింది.. నువ్వు ఇలాగే డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి, మరిన్ని మంచి అవకాశాలతో కెరీర్లో పైకి ఎదగాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement