-
Anasuya Birthday Photos: ఫ్యామిలీతో అనసూయ బర్త్డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్పై ట్రోల్స్ (ఫోటోలు)
-
తిరుపతి @894
సహజంగా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సెలబ్రెటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏనగరానికీ లేని పుట్టిన రోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం విశేషం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామ ఈశాన్యంలో (నాలుగుకాళ్ల మండపం) వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది. ఈ మేరకు శనివారం 894వ పుట్టిన రోజు వేడుకలకు తిరుపతి నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. తిరుపతి తుడా: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేధావులు, పండితులతో కలసి 2022లో ప్రకటించారు. చరిత్ర, పురాణ, ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యులు చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సామాజానికి చాటిచెప్పారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి నగర 894వ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 1130వ ఏటే పునాది శ్రీరామానుజాచార్యులు కంచి నుంచి తిరుమలకు వచ్చే క్రమంలో తన 112వ ఏట నిర్మానుష్యంగా ఉన్న పార్థసారథిస్వామి ఆలయం (నేటి గోవిందరాజస్వామి ఆలయం) ప్రాంతాన్ని ఓ గ్రామంగా నిర్ణయిస్తూ పునాది వేశారు. 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామానికి పునాది వేశారని స్పష్టమవుతోంది. కపిలతీర్థం సమీపంలో కొత్తూరు గ్రామం ఉండేది. వివిధ వ్యాధులతో ఆ గ్రామ వాసులు వరుసగా మృత్యువాత పడుతుండడాన్ని శ్రీరామానుజాచార్యులు గుర్తించారు. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంలోనే కొత్తూరు గ్రామ ప్రజలను సంరక్షించడం, నిర్మానుష్య ప్రాంతంగా ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు గరుడ ఆకారంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రామానికి హద్దులు పెట్టించి పునాది వేయించారు. ఆగమశాస్త్రోక్తంగా నాడు వేసిన పునాదే నేడు ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ క్రమంలోనే ఆ గ్రామానికి గోవిందరాజపట్నంగా నామకరణం చేశారు. ఆ తరువాత గోవిందరాజపట్నానికి రామానుజపురంగా స్థానికులు పేరును మార్పుచేశారు. కాలక్రమేణా 13వ శతాబ్దంలో తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది. హద్దులు ఇవే నాటి గోవిందరాజపట్నానికి కృష్ణాపురం ఠానా, నాలుగుకాళ్ల మండపం, రైల్వేస్టేషన్కు తూర్పు ప్రాంతం, బేరివీధి నాలుగు ప్రాంతాల్లో మండపాలను నిర్మించారు. ఆ తరువాత ఆయా ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాలుగుకాళ్లమండపం మాత్రమే చరిత్రకు సాక్షిగా మిగిలింది. తొలివీధి అదే నాడు తిల్లా గోవిందరాజస్వామిని ప్రతిష్టించే లఘ్నం ఖరారు కావడంతో యుద్ధప్రాతిపాదికన సున్నపు ముద్దలతో గోవిందరాజస్వామి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహంలో స్వామి వారి పొట్టలో దేవదాసి తిల్లా వద్ద ఉన్న లోహవిగ్రహాన్ని ప్రతిష్టించి తయారు చేశారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గోవిందరాజపట్నం గ్రామం ఏర్పడ్డాక రామానుజ తిరువీధి (గోవిందరాజస్వామి తూర్పుమాడావీధి) ఏర్పడింది. ఇలా తొలివీధి రామానుజ తిరువీధిగా చరిత్రలో నిలిచింది. కై కాల రెడ్లదే తొలిదర్శనం గోవిందరాజస్వామిని తొలినాళ్లలో దేవదాసి అయిన తిల్లా పూజిస్తూ స్వామివారి బాగోగులు చూసుకునేవారు. ఈ క్రమంలో దేవదాసి అయిన మహిళ పూజలు చేయడం ఏంటని ప్రశ్నించి అవమానించేవారు. ఈ క్రమంలోనే ఆమె కై కాల చెంగారెడ్డి అనే చిన్నారిని దత్తత తీసుకుంది. కై కాల చెంగారెడ్డి ద్వారా ఆలయంలో ఉత్సవాలు, సేవలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే నేటికీ కైకాల కులస్థులకు గోవిందరాజస్వామి ఆలయంలో తొలిదర్శనం కల్పిస్తున్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉత్సవాల్లోనూ ఈ వర్గానిదే ఆధిపత్యం. నాటి రాజావీధే నేటి గాంధీరోడ్డు గోవిందరాజపట్నం ఏర్పడ్డాక గ్రామానికి తొలివీధిగా రామానుజ తిరువీధితో పాటు పడమర, తూర్పు, దక్షిణ మాడావీధులు శ్రీవారి అర్చకులు, వారి బంధుమిత్రులకు ఆవాసాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తరువాత ఆ వీధికి బజారువీధిగా ఆపై మహాత్మాగాంధీ ఈ రోడ్డులో నడయాడంతో గాంధీరోడ్డుగా మార్పుచెందింది. సున్నం తయారు చేస్తున్న ప్రాంతం సున్నపువీధిగా, ఇసుక నిల్వ ఉంచిన ప్రాంతాన్ని ఇసుక వీధిగా నామకరణం చేశారు. బండ్లు నిలిపే ప్రాంతమే నేటి బండ్ల వీధిగా మారినట్టు తెలుస్తోంది. తొలి భక్తుడు ఆయనే శ్రీమన్నారాయనుడు శ్రీవేంకటేశ్వరుడిగా సప్తగిరులపై కొలువుదీరారు. శ్రీరామానుజాచార్యుల మేనమామ అయిన శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి తొలిభక్తుడుగా కీర్తిగడించారు. ఆయన అనుగ్రహంతోనే అడపురి(అలిపిరి) ఓ మహావృక్షం కింద శ్రీరామానుజాచార్యులు వారు ఆధ్వైత పురుషుడుగా, వైఖానస పండితులుగా ప్రసిద్ధి గడించారు. 904 ఏళ్ల క్రితం తిరుమల ఆలయ పరిరక్షణ కోసం జీయంగార్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదో చారిత్రక ఘట్టం ఏ నగరానికీ లేని పుట్టిన రోజు తిరుపతి నగరానికి మాత్రమే ఉంది. ఇది నగర ప్రజలకు దక్కిన గౌవరం. పుణ్య పురుషుడైన శ్రీ రామానుజాచార్యుల వారి చేత ఆ శ్రీమన్నారాయణుడే తిరుపతి పుణ్యక్షేత్రానికి పుణాది వేయించారు. ఈ చరిత్ర తెలియడం చారిత్రక ఘట్టమే. అందుకే తిరుపతి పుట్టిన రోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవడం మనందరి బాధ్యత. – భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ చైర్మన్. ఇప్పటికీ గోవిందరాజపట్నంగానే.. తమిళులు ఇప్పటికీ తిరుపతిని గోవిందరాజపట్నంగానే పిలుస్తుంటారు. కపిలతీర్థం సమీపంలోని కొత్తూరు గ్రామ ప్రజలను రక్షించడం, గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించడం, ఈ ప్రాంతం దేదీప్యమానంగా విరాజిల్లాలన్న సంకల్పంతో గరుడ ఆకారంలో గోవిందరాజ పట్ననికి హద్దులు నిర్ణయించారు. – ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ -
Vijay Sethupathi Unseen Photos: విజయ్ సేతుపతి చిన్ననాటి ఫోటోలు చూశారా..?
-
మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
దుబాయ్లో సీఎం జగన్ పుట్టినరోజు సంబరాలు
దుబాయిలో వందలాది జగనన్న అభిమానుల నడుమ అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యువ నాయకులు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, తరపట్ల మోహన్, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సయ్యద్ నాసర్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహన తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్లో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో నిర్వహించారు. ఈ వేడుకుల్లో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 600 మంది జగనన్న అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 400 మహిళలకు చీరల పంపిణీతో పాటు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, పవన్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ప్రవాసఆంధ్రులకు APNRTS బీమా పథకంకు ఆర్థిక సహాయం చేశారు.దాదాపు 100 మంది కొత్తవారిని వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రసన్న సోమిరెడ్డి, మహమ్మద్ జిలాన్ భాష, మోహన్ తరపట్ల ప్రసంగిస్తూ సీఎం జగన్ పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధిని,సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్సార్సీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, ఓగూరి శ్రీనివాస్, పాస్టర్ అనిల్, కొల్లే రవికుమార్, కటికితల ప్రకాశ్, పాలపర్తి నీలిమ, గోసంగి లక్ష్మి, విజయ, మేడిది శ్యామ్, కళ్యాణ్, శ్యామ్ సురేంద్రరెడ్డి, వెంకటరమణారెడ్డి, సయ్యద్ సలీమ్, షేక్ షోయబ్, వెంకటప్పరెడ్డి, ఆర్టీఏ జహీర్, గూడూరు విజయ్రెడ్డి, మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!
లండన్లోని వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి వచ్చిన జగన్గారి అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ప్రతీపేదవాడి కోసం జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు ఓబుల్రెడ్డి పాతకోట , అనంత్రాజు పరదేశి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, మన్మోహన్ యామసాని, జనార్ధన్ చింతపంటి, జయంతి, ప్రతాప్ భీమిరెడ్డి, సురేందర్రెడ్డి అలవల, శ్రీనివాసరెడ్డి దొంతిబోయిన, గాంధీ రెడ్డి పోలి, భాస్కర్రెడ్డి మాలపాటి, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా ప్రసంగిస్తూ.. రానున్న మూడు నెలల్లో ప్రతిఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి జగన్గారి గెలుపుకు కృషిచేయాలన్నారు. డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ "ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది లండన్కు వచ్చారు. ఇక్కడ మరింత మందికి సాయం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందికి సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారు. అండగా నిలుస్తున్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి మనవంతుగా ఎంతో కొంత సహకరిద్దాం. సోషల్మీడియాలో వచ్చే మూడు నెలల పాటు విధిగా సీఎం జగన్ కోసం పోరాడుదాం. జై జగన్.. హ్యాపీ బర్త్డే జగన్. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలి, ప్రజలకు అండగా ఉండాలి." (చదవండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు) -
బర్త్ డే కానుక?
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని, రజనీకాంత్– ఫాహద్ కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఈ సినిమా టీజర్ విడుదలకు వేళ అయిందట. ఈ నెల 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, ఫేక్ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లైకా ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అప్డేట్ కూడా ఈ నెల 12న రావొచ్చని టాక్. -
ఆత్మసంతృప్తి కోసం ఆ పని చేస్తున్నా: రాశీఖన్నా
తమిళసినిమా: నటి రాశీఖన్నా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న నటి ఈ బ్యూటీ. చాలా బోల్డ్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సినీ వర్గాల్లో అటెన్షన్కు గురిచేస్తున్న రాశీఖన్నా తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో ఎక్కువ దృష్టి సారిస్తోంది. కాగా తమిళంలో అరణ్మణై 4 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా బ్యూటీ గురువారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. పలువురు సినీ ప్రముఖులు అందించిన శుభాకాంక్షల్లో మునిగిపోయింది. కాగా ఈ సందర్భంగా ఆమె తన తోటలో కొన్ని మొక్కలను నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అందులో పేర్కొంటూ ‘నా కల్లను రంజింపజేసే విధంగా, నా ఆత్మను సంతృప్తి పరిచే విధంగా ఈ చిన్న బాధ్యతను తీసుకున్నాను. పలు కారణాలతో మొక్కలు పెంచుతున్నాను. ముఖ్యంగా చెట్టు నాకు సంతోషాన్ని పంచుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు’ అని పేర్కొంది. నాటిన మొక్కల ఫొటోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
సెట్లో బర్త్డే సెలెబ్రేషన్స్..చీరకట్టులో మరింత అందంగామేఘా ఆకాశ్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్లో మేఘా ఆకాశ్ ఒకరు. లై సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే..సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. నేడు(అక్టోబర్ 26) ఆ అమ్మడి పుట్టిన రోజు. ఈ సారి తన బర్త్డే సెలెబ్రేషన్స్ని సఃకుటుంబనాం సినిమా సెట్స్లో జరుపుకుంది. అచ్చం తెలుగమ్మాయిలా చీర కట్టుకొని.. చిత్రబృందం సమక్షంలో కేక్ కట్ చేసింది. అనంతరం యూనిట్ అంతా తనకు విషెస్ తెలియజేశారు. సఃకుటుంబనాం సినిమా విషయానికొస్తే.. ఇందులో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. హెచ్ఎన్జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదయ్శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ. రచ్చరవి, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రస్తుతానికి అందుబాటులో లేను!
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే. -
బర్త్డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్తోపాటు మరో 10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. -
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ
సాక్షి, కృష్ణా జిల్లా: తాను శ్రీరామ అనే పదం పలికినా టీడీపీ, జనసేనలకు బూతులానే వినపడుతుందని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని పేర్కొన్నారు. తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులున్నారని, తనకు చిరంజీవికి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు. 60 శాతం మంది చిరంజీవి అభిమానులే గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో కొడాలినాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను మెగాస్టార్ను విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తన వెంట ఉన్న 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనన్నారు. ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని పేర్కొన్నారు. అభిమానుల ముసుగులో టీడీపీ కుట్రలు సీఎం జగన్ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారని మండిపడ్డారు. ‘ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఆయనను అనేక సందర్భాల్లో కలిశాను. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం. చిరంజీవిని విమర్శించినట్లు ఎలా అవుతుంది? తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే నేను చెప్పాను. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా?...ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుంది’ అని కొడాలి నాని పేర్కొన్నారు. చదవండి: బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి -
Dhanush Rare & Unseen Photos: బెస్ట్ యాక్టర్ ధనుష్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రివర్యులు KTR జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యం లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు . ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో విశ్వామిత్ర మంత్రి ప్రగడ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా తెరాస ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్ లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ప్రవీణ్ లేదెళ్ళ, వేణు నాథ్ , సాయి యాదవ్ , ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల ,సురేష్ మండ, రాకేష్, సూర్య రావు ,అశోక్, బాలరాజు, మిస్కీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్పై కేసు నమోదు.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్లపై చిందించారు. (ఇది చదవండి: షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్) ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్సన్పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్లుక్, టైటిల్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) -
సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. నేడు(ఏప్రిల్ 27) బెక్కెం వేణుగోపాల్ బర్త్ డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్’, సుడిగాలి సుధీర్తో నరేష్ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. క్రికెట్ దేవుడు!
-
వేడుకగా చరణ్ బర్త్డే పార్టీ.. టాలీవుడ్ తారల సందడి
ఆర్ఆర్ర్తో గ్లోబల్ స్టార్గా మారాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో చరణ్ విశ్వ వేదికలపై మెరిసాడు. ఈ క్రమంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నాటు నాటు ఆస్కార్ గెలిచిన తరుణంలో టాలీవుడ్తో పాటు భారత సినీ పరిశ్రమ పండుగ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ మెగా రామ్ చరణ్ బర్త్డే రావడం విశేషం. ఈ నేపథ్యంలో చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకగా జరిగాయి. ఆయన భార్య ఉపాసన చరణ్ బర్త్డే పార్టీని ఘనంగా నిర్వహించింది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. చరణ్ బర్త్డే పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంత హంగామా చేశారు. అలాగే అమెరికాలోనూ చరణ్ పుట్టిన రోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్లో రామ్ చరణ్ అభిమానులు.. సర్ ప్రైజ్ గ్రీటింగ్స్ తెలిపారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ సైన్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే చరణ్ బర్త్డే సందర్భంగా సోమవారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ పార్టీలో టాలీవుడ్ తారలంతా సందడి చేశారు. ‘చందమామ’ కాజల్ భర్తలో కలిసి హాజరు కాగా.. కొత్త జంట మంచు మనోజ్ భార్య మౌనిక కలిసి పాల్గొన్నాడు. ఈ వేడుకలో కాజల్ జంట, మనోజ్ జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మంచు లక్ష్మి, ఎస్ ఎస్ రాజమౌళి విక్టరి వెంకటేశ్, శ్రీకాంత్, రానా దగ్గుబాటి, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అడవి శేష్, దిల్ రాజుతో పాటు ఇతర దర్శక-నిర్మాతలు చరణ్ బర్త్డే సెలబ్రెషన్స్లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తారలంతా ఒక్కచోట ఇలా కనిపించడం కనుల విందుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ డైరెక్టర్తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత -
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పుట్టినరోజు వారోత్సవాలు
-
సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(యూపీఏ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తో పాటు పలువురు నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు సందర్భంగా యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ ట్వీట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ సైతం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్కు సోనియా.. భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో కొనసాగుతున్న క్రమంలో గురువారం జైపూర్కు చేరుకున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రెండు రోజుల పాటు రాజస్థాన్లో పర్యటించనున్నారు. గురువారం జైపూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సవాయ్ మాధాపుర్కు చేరుకున్నారు. షేర్ బాఘ్ హోటల్లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు ప్రియాంక గాంధీ సైతం సవాయ్ మాధాపూర్కు చేరుకున్నారని చెప్పారు. ‘వారు రంథాంభోర్లో ఉంటారు. డిసెంబర్ 9న అక్కడే సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఉంటాయి. ’ అని తెలిపారు. ఇదీ చదవండి: ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం -
Warangal: బర్త్డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
థియేటర్లలో బిల్లా రీ రిలీజ్.. కృష్ణంరాజు కుమార్తె ఎమోషనల్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. పాన్ ఇండియా స్టార్ బర్త్డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హల్చల్ చేశారు. ఏపీలోని ఓ థియేటర్లో ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇవాళ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్లో ఉన్న సుదర్శన్ థియేటర్లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ షో చూసేందుకు కృష్ణంరాజు పెద్దకుమార్తె ప్రసీద హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని బిల్లా సినిమాను వీక్షించారు. ఫ్రభాస్ ఫ్యాన్స్ మధ్య థియేటర్లో సినిమా చూడడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నను, అన్నయ్యను స్క్రీన్పై చూడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్కు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?) కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద మాట్లాడుతూ...' ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా మళ్లీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యను, నాన్నను స్క్రీన్పై చూడడం సంతోషం కలిగించింది. మేమందరం చాలా బాగా సినిమాను ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీలయ్యాం. ' అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదన్నాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. -
విఘ్నేశ్ శివన్కు నయన్ బర్త్డే సర్ప్రైజ్.. ఏంటో తెలుసా..?
కోలీవుడ్ సమ్థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించింది నయన్. దుబాయ్లోని బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.. బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. బూర్జ్ ఖలీఫావద్ద కేక్ కటింగ్తో పాటు.. టపాసులుకూడా పేల్చుతూ.. విఘ్నేశ్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా మారింది. అటు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. ఇటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఆమె కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'లోనూ ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanthara (@nayantthara) . -
మోదీకి ఇంతకు మించి గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు!
న్యూఢిల్లీ: మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఎనిమిది చిరుతలు నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్కి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ... మోదీకి తాము ఇంతకు మించి గొప్ప బహుమతి ఇవ్వలేమని అన్నారు. అతిపెద్ద వన్యప్రాణులను జంబో జెట్ ద్వారా తరలించడం అనేది చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. దీని వల్ల కునో పాల్పూర్ ప్రాంతం పర్యాటకంగా వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. భారత్ గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్ చీతా అనే ఖండాంతర ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్ ఖండాంతర భారీ వైల్డ్ మాంసాహార ట్రాన్స్ లోకేషన్ ప్రాజెక్ట్ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ చిరుతలు భారత్లోని ఓపెన్ ఫారెస్ట్ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్ సీక్వెస్ట్రేషన్, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వస్తున్న 8 చిరుతలు మధ్యప్రదేశ్లోని గాల్వియర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడ నుంచి కునో నేషనల్ పార్క్కి హెలికాప్టర్లో తరలిస్తారు.ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి. (చదవండి: మోదీ పుట్టిన రోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?) డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే..
Pagination
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదు: ఆప్
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం
అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ఐటీ మంత్రి నివాళులు
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్ ?
పార్టీ శ్రేణులకు అండగా నిలవండి: వైఎస్ జగన్
ఎయిర్పోర్ట్లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
Advertisement