-
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్తో పాటు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్కుమార్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్గా పనిచేస్తూ నవీన్కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 70వ జన్మదిన వేడుకలను శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు కేటీఆర్ ఉదయమే తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల జీవిత బీమా కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలు, పది మంది దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు. కేసీఆర్ 70వ పుట్టినరోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్ను ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్లతో కలసి కేటీఆర్ కట్ చేశారు. తర్వాత కేసీఆర్ రాజకీయ జీవితం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూ పొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్తానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు బీఆర్ఎస్ సభ్యత్వం కలిగి.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కో ల్పోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు 70 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాయకులు సోమా భరత్కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీలు రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, నేతలు అనిల్ కుమార్ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీశ్రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వేడుకలు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా అసెంబ్లీ లాబీల్లోని పార్టీ శాసనసభాపక్ష కార్యాల యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని సమర్థవంతగా ఎదుర్కొన్నారని హరీశ్రావును పార్టీ ఎమ్మె ల్యేలు అభినందించారు. -
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియో
-
Redin Kingsley-Sangeeta Birthday Photos: పెళ్లయ్యాక నటుడి తొలి బర్త్డే.. భార్య సర్ప్రైజ్ పార్టీ (ఫోటోలు)
-
8ఏళ్ల పిల్లాడు,జీవితంలో మొదటిసారి.. క్లాస్టీచర్ చేసిన పనికి ఎమోషనల్
జీవితంలో ప్రతి ఒక్కరికి తమ బర్త్డేను స్పెషల్గా జరుపుకోవాలని కోరిక ఉంటుంది. పుట్టినరోజు వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. కానీ ఆ పిల్లాడి లైఫ్లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకునే అదృష్టం రాలేదు. విషయం తెలిసి, క్లాస్ టీచర్ అందించిన సర్ప్రైజ్కి ఆ బాలుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ క్లాస్ టీచర్ ఏం చేసిందంటే.. కొలంబియాకు చెందిన ఏంజెల్ డేవిడ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు జీవితంలో ఇప్పటివరకు పుట్టినరోజును జరుపుకోలేదు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితుల రీత్యా అతని తల్లి డేవిడ్ బర్త్డే వేడుకలను ఇంత వరకు సెలబ్రేట్ చేయలేకపోయింది. తండ్రి లేకపోవడం, ఏంజెల్ డేవిడ్ సహా నలుగురు పిల్లల బాధ్యత ఆమె ఒంటరిగా చూసుకునేది. దీంతో పేదరికం కారణంగా డేవిడ్కు ఎనిమిదేళ్లు వచ్చినా ఇంతవరకు పుట్టినరోజును నిర్వహించలేకపోయింది. విషయం తెలిసిన డేవిడ్ క్లాస్ టీచర్ అతని బర్త్డేను పెద్ద వేడుకలా చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కేక్, డెకరేషన్తో క్లాస్ రూమ్లోనే డేవిడ్కు తెలియకుండా సర్ప్రైజ్గా బర్త్డే వేడుకలను ఏర్పాటు చేసింది. క్లాస్లోకి డేవిడ్ అడుగుపెట్టగానే క్లాస్ టీచర్ సహా అతని క్లాస్మేట్స్ అందరూ హ్యాపీ బర్త్డే అంటూ సాంగ్స్ పాడుతూ అతన్ని క్లాస్రూంలోకి వెల్కమ్ చెప్పారు. ఊహించిన ఈ సర్ప్రైజ్తో డేవిడ్ ఆనందంతో ఏడ్చేశాడు. దీంతో పిల్లలంతా ఒక్కచోట చేరి డేవిడ్ను కౌగిలించుకొని బర్త్డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hear Her Stories 📣 (@hearherstories) -
Sekhar Master Daughter Sahithi Birthday: శేఖర్ మాస్టర్ కూతురు బర్త్ డే.. ఫోటోలు వైరల్!!
-
'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్గా ల్యాప్ట్యాప్స్
ప్రముఖ సినీ దర్శకుడు పి.వాసు శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను చైన్నెలోని లైకా సంస్థ కార్యాలయంలో జరుపుకున్నారు. ఈయన గత 40 ఏళ్లుకు పైగా దర్శకుడిగా రాణిస్తున్నారు. వివిధ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన చిత్రం చంద్రముఖి –2. (ఇదీ చదవండి: ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!) రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'చంద్రముఖి 2'.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో వడివేలు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు జన్మదిన వేడుకలను లైకా సంస్థ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో నటుడు రాఘవ లారెన్స్, లైకా సంస్థ ప్రధాన నిర్వాహకుడు జీకే ఎం తమిళ్ కుమరన్ పాల్గొని పి.వాసుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పి.వాసు తన అసిస్టెంట్ డైరెక్టర్స్కి ల్యాప్ట్యాప్లని కానుకగా అందించారు. (ఇదీ చదవండి: రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్పై నాగ్ సీరియస్!) -
హ్యాపీ బర్త్డే పీచెస్
విశాఖపట్నం: ఇందిరా గాంధీ జూ పార్కులో పీచెస్ అనే ఆడ తెల్ల పులి పుట్టిన రోజు ఘనంగా జరిగింది. తెల్ల పులుల ఎన్క్లోజర్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీఈ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పులి మాస్క్లు ధరించి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందనీ సలారియా కేకు కట్ చేసి సందర్శకులకు పంచిపెట్టారు. సీపీఈ కళాశాల యాజమాన్యం ఆ పులిని నెల రోజుల పాటు దత్తత తీసుకుంది. పీచెస్ పుట్టి ఐదేళ్లు పూర్తయిందని, ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించామని క్యూరేటర్ తెలిపారు. నెల రోజుల పాటు పీచెస్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన సీపీఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చ మత్తులో జోగుతున్న ఈనాడు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది. వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం. -
Lakshmi Manchu: ఘనంగా మంచు లక్ష్మీ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బర్త్ డే సెలెబ్రేషన్స్ చర్చనీయాంశం
-
అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి..
నల్గొండ: మరో పది రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఐశ్వర్యను అంతలోనే మృత్యువు కబలించింది. పుట్టిన రోజు వేడుక సన్నాహాల్లో భాగంగా షాపింగ్కు వెళ్లిన ఐశ్వర్య దుండగుడి తూటాలకు బలికావడం ఆమె కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఐశ్వర్య ఈ నెల 18న పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల నడుమ జరుపుకోవాలని భావించింది. అమెరికాలోని టెక్సాస్ లోని ఎలెన్ సూపర్ మార్కెట్కు షాపింగ్ కోసం వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చలాకీగా, సరదాగా ఉండే ఐశ్వర్య ఇక లేదని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆమె చదువు పూర్తి కాగానే అక్కడే ఫర్ఫెక్ట్ జనరల్ కాంటాక్టర్స్ కంపెనీలో మేనేజర్గా పని చేస్తోంది. ఇంకో నెల రోజుల్లో అదే కంపెనీకి సీఈవోగా నియమించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఉద్యోగోన్నతి పొందకుండానే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపో యింది. ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40 గంటలకు తల్లిదండ్రులు తాటికొండ నర్సిరెడ్డి–అరుణతో తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా షాపింగ్కు వెళ్తున్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. తల్లి దండ్రులతో అవే చివరి మాటలు. కాగా, ఐశ్వర్య భౌతికకాయం బుధవారం రాత్రికి హైదరాబాద్కు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేల పరామర్శ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దుండుగల తూటాలకు బలైన నేరేడుచర్ల మున్సిపాలిటీలోని పాత నేరేడుచర్లకు చెందిన ఐశ్వర్య కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని వారి నివాసంలో మంగళవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పరామర్శించారు. ఐశ్వర్య భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. -
రిషబ్ శెట్టి బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. కూతురి బర్త్డేలో కన్నడతారల సందడి (ఫొటోలు)
-
ఘనంగా సల్మాన్ ఖాన్ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
బడా హీరోలతో రెండు సినిమాలు తీస్తున్నా: ‘తీస్మార్ ఖాన్’ నిర్మాత
వచ్చే ఏడాదిలో రెండు భారీ చిత్రాలు నిర్మించబోతున్నట్లు ‘తీస్మార్ ఖాన్’ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ప్రకటించారు. నేడు(డిసెంబర్ 25) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాల విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా బ్యానర్లో ఇది వరకు వచ్చిన నాలుగు చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. వచ్చే ఏడాది రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తాం. ఆ రెండు చిత్రాల్లోనూ ప్రముఖ హీరోలు నటిస్తున్నారు. . త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం’అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాగం తిరుపతి రెడ్డి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది ఆయన నిర్మాణంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. -
ప్రజల్లో ఉండటం, సేవ చేయడంపైనే సీఎం జగన్ దృష్టి : సజ్జల
-
సీఎం బర్త్ డే తన నియోజకవర్గంలో జరగడం సంతోషమన్న మంత్రి
-
ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం అర్థం పర్థం లేని అంశం : సజ్జల
-
పోలీస్ స్టేషన్లో యువతి బర్త్ డే వేడుకలు.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జన్మదినం రోజు ఓ ఫిర్యాదురాలికి సుల్తాన్బజార్ పోలీసులు వినూత్న బహుమతి ఇచ్చారు. వివరాలు.. జియాగూడకు చెందిన జి.భార్గవి పుట్టిన రోజు సందర్భంగా బొగ్గులకుంటలోని రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది. టిఫిన్ చేసి బయటకు రావడంతో బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి సిబ్బందిని అలర్ట్ చేసి వెంటనే బైక్ను భార్గవికి అందజేశారు. దీంతో ఆమె పోలీస్స్టేషన్లో కేక్కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొంది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. (క్లిక్ చేయండి: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం) -
పని మనిషి బర్త్డే.. ఓనరమ్మ సర్ప్రైజ్
ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మధుర క్షణాలు పదిలంగా ఉండిపోతాయి. వాటి వెనుక చిన్న చిన్న చర్యలు కూడా ఉండొచ్చు!. తమ ఇంటి బండి నడిచేందుకు.. నాలుగు ఇళ్లలో పని చేసుకునే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లను గౌరవంగా చూసే ఓనర్లు ఎందరుంటారు?.. అయితే ఇక్కడ తమకు సాయంగా ఇంటి పనులు చేసే ఆమెను.. ఇంట్లో మనిషిగానే భావించింది ఆ ఓనరమ్మ. అందుకే.. ఆమె జీవితంలో ఏ పుట్టినరోజుకు అందుకోని సర్ప్రైజ్ ఇచ్చింది. వీళ్లకు విలువైన కానుకలు అక్కర్లేదు. ఇలాంటి ప్రత్యేక క్షణాల్లో ప్రేమ, ఆనందం పంచితే సరిపోతుంది. ఈ నగరంలో ఆమె భర్తతో ఒంటరిగా ఉంటోంది. అందుకే ఆమె పుట్టినరోజును ముఖంలో చిరునవ్వులు పూయించాలనుకున్నాం. మా మామగారు ఆమె కోసం కేక్ తెచ్చారు. అంతా కలిసి ఆమెను సర్ప్రైజ్ చేశాం. కొన్నిసార్లు ఎదుటివాళ్లను నవ్వించేందుకు.. మీరు చిన్న చిన్న పనులు మీతో ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ క్యాప్షన్ ఉంచింది సదరు ఓనరామె. అంతే మీ వల్లే మా ఇల్లు శుభ్రంగా, సొగసుగా ఉంటోందని.. హ్యపీయెస్ట్ బర్త్డే మౌషీ అంటూ క్యాష్షన్ ఉంచారామె. అంతేకాదు.. ఎప్పుడూ తన కోసం టీ పెట్టే ఆమె కోసం.. ఈసారి ఆ ఓనర్ ప్రత్యేకంగా టీ చేసి ఇచ్చింది. తన జీవితంలో ఇప్పటిదాకా పుట్టినరోజు జరుపుకోలేదని.. ఈ క్షణాలు తనకు ఎంతో భావోద్వేగాన్ని పంచాయంటూ కంటతడి పెట్టుకుందామె. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భార్య బర్త్డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్ లో కొడాలి నాని
-
బాయ్ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేషన్!.. అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్
Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai: హిందీ చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్లు, చెట్టాపట్టాలు వేసుకోని షికార్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ విషయాలపై కొందరు సూటిగా సుత్తిలేకుండా వారి రిలేషన్షిప్ గురించి బయటపెడితే, మరికొందరు గుట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాణీ తన బాయ్ఫ్రెండ్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈరోజు (జులై 31) కియారా అద్వానీ పుట్టినరోజు. తన బర్త్డేను బాయ్ఫ్రెండ్తో ఫారిన్లో జరుపుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన 30వ పుట్టినరోజును దుబాయ్లో ప్రియుడు సిద్ధార్థ్తో కలిసి జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలోని పలు పోస్ట్లను చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తాజాగా ఫ్యాన్స్తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: చివరిగా మమతా మోహన్ దాస్ను ఎంపిక చేశాం: డైరెక్టర్ అయితే వీరిద్దరూ అభిమానులతో విడివిడిగా ఫొజులివ్వడం మనం చూడొచ్చు. ఈ ఫొటోల్లో సిద్ధార్థ్, కియారా విడిగా ఫోజులిచ్చిన.. వారితో దిగిన ఫ్యాన్స్ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు. దీంతో కియారా తన బర్త్డేను సిద్ధార్థ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమని తెలుస్తోంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ View this post on Instagram A post shared by SidKiara (@siara_vogue) కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇటీవల కరణ్ జోహర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఎపిసోడ్లో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు అనన్య పాండే హింట్ కూడా ఇచ్చింది. కాగా మహేశ్ బాబు 'భరత్ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెప్పించిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. -
అమెరికాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. డల్లాస్లో టీఆర్ఎస్ పార్టీ నేత అభిషేక్ కొత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు కేక్ కటింగ్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిషేక్ కొత్తూర్ కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారని, ఆ విజయాల పరపరం కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్కు అభిషేక్ జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement