-
IPL 2024 RCB Vs MI: బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన సిరాజ్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్సీబీని మట్టికరిపించింది. తొలుత బౌలింగ్లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. సరదాసరదాగా సాగిన ఈ మ్యాచ్లో చాలా ఆసక్తికర సన్నివేశాలు తారసపడ్డాయి. అభిమానులు హార్దిక్ను గేలి చేస్తుంటే విరాట్ అడ్డు చెప్పడం.. దిగ్గజ క్రికెటర్లు విరాట్, రోహిత్ మధ్య సరదా సంభాషణ.. రోహిత్ దినేశ్ కార్తీక్ను ఆట పట్టించడం (మరో వరల్డ్కప్ ఆడాలని ఉందా అని).. ఇలా మ్యాచ్ మొత్తం సరదాసరదాగా సాగింది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్ చేసుకోవడం చూపరులను ఆకట్టుకుంది. - Rohit and Bumrah handshake. 🤝 - Virat Kohli hugging Hardik. 🫂 - Siraj bowed down to Bumrah. 🙇♂️ MI DEFEATED RCB IN MUMBAI. 💥 pic.twitter.com/UCAMxQRjaS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 సిరాజ్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టడం హైలైట్గా నిలిచింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగినందుకు గాను సిరాజ్ బుమ్రాకు సలాం కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. హార్దిక్ను కోహ్లి వెనకేసుకురావడాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్, రోహిత్, స్కై, హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచి అవకాశలున్న మ్యాచ్ను ప్రత్యర్దికి పూలల్లో పెట్టి ఇచ్చారు. -
చివరి టెస్టుకూ కేఎల్ రాహుల్ దూరం
ధర్మశాల: తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్టుకూ దూరమయ్యాడు. మొదటి నుంచీ అతను ఈ మ్యాచ్లో ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అందుకే జట్టును ఎంపిక చేసిన సమయంలో ‘ఫిట్నెస్కు లోబడి’ అంటూ బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. అతను 90 శాతం వరకు కోలుకున్నా... ఇంకా పూర్తి ఫిట్ కాకపోవడంతో మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్లో హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో మాత్రమే రాహుల్ బరిలోకి దిగాడు. ‘రాహుల్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతని పరిస్థితిని బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఈ విషయంలో తదుపరి చికిత్సకు సంబంధించి లండన్లో ఉన్న వైద్యులతో వారు సంప్రదిస్తున్నారు’ అని బోర్డు పేర్కొంది. రాంచీ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్ బుమ్రా మార్చి 7 నుంచి జరిగే చివరి టెస్టులో బరిలోకి దిగుతాడని బోర్డు ప్రకటించింది. రాహుల్ గైర్హాజరులో రజత్ పటిదార్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 6 ఇన్నింగ్స్లలో కలిపి 63 పరుగులే చేసిన పటిదార్కు తుది జట్టులో చోటు దక్కేది సందేహమే. పటిదార్ స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశముంది. టీమ్తో ఉన్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను బీసీసీఐ విడుదల చేసింది. రేపటి నుంచి ముంబైతో జరిగే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు తరఫున అతను బరిలోకి దిగుతాడు. లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్న పేసర్ షమీ కోలుకుంటున్నాడని... త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీలో అతని రీహాబిలిటేషన్ మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్లు ముగిసిన ఈ సిరీస్లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్స్టర్ సిరాజ్కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
బుమ్రా కూల్చేశాడు
విశాఖ స్పోర్ట్స్: హైదరాబాద్లో మన స్పిన్ కుదర్లేదు. మ్యాచ్ చేతికందలేదు. కానీ వైజాగ్లో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్లో తొలి ద్విశతకం సాధించడంతో... ఓవర్నైట్ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌటైంది. అశ్విన్ (20; 4 ఫోర్లు) ఏడో వికెట్గా పెవిలియన్ చేరగా, డబుల్ సెంచరీ పూర్తయ్యాక జైస్వాల్ నిష్క్రమించాడు. కాసేపటికే బుమ్రా (6), ముకేశ్ (0)లు నిష్క్రమించడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. అనంతరం ఇంగ్లండ్ను బుమ్రా పేస్ (15.5–5–45–6) రెండు సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది. జాక్ క్రాలీ (76; 11 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ స్టోక్స్ (47; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171కి చేరింది. బ్యాట్ వదిలేసి... చేతులెత్తేశాడు! తొలి సెషన్లో ఇంగ్లండ్ కేవలం 6 ఓవర్లే ఆడింది. కానీ ఓపెనర్లు క్రాలీ, డకెట్ ఎదురుదాడికి దిగడంతో చకచకా 32/0 స్కోరు చేసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికి డకెట్ (21)ను కుల్దీప్ అవుట్ చేయడంతో 59 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యం ముగిసింది. జట్టు స్కోరు వంద దాటేవరకు క్రాలీ, ఒలీ పోప్ (23; 2 ఫోర్లు) చక్కగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా పేస్కు ఎదురునిలిచి వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన క్రాలీని అక్షర్ బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి బుమ్రా పేస్ ఆటను మలుపు తిప్పింది. రివర్స్స్వింగ్తో రూట్ (5), బుల్లెట్లా దూసుకెళ్లిన యార్కర్తో ఒలీ పోప్లను బుమ్రా అవుట్ చేయడంతో ఒకదశలో 114/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ టీ బ్రేక్కు 155/4తో ఆత్మరక్షణలో పడింది. ఆఖరి సెషన్లో కుల్దీప్ స్పిన్ జత కలవడంతో ఇంగ్లండ్ కుదేలైంది. బుమ్రా ఇన్స్వింగర్కు బెయిర్స్టో (25; 4 ఫోర్లు) వికెట్ సమర్పించుకోగా... ఫోక్స్ (6), రేహన్ (6) కుల్దీప్ ఉచ్చులో పడ్డారు. చివరి సెషన్లో కెప్టెన్ స్టోక్స్ వికెట్ హైలైట్గా నిలిచింది. బుమ్రా ఆఫ్స్టంప్ దిశగా వేసిన కట్టర్ను స్టోక్స్ డిఫెన్స్ ఆడలేక క్లీన్బౌల్డయ్యాడు. ఆ క్షణంలో బ్యాట్ వదిలేసి చేతులెత్తేయడం చూస్తే ఆ బంతినెదుర్కోవడం స్టోక్స్ వల్ల కాలేదని స్పష్టమవుతుంది. ఈ వికెట్ల పరంపరలో బుమ్రా... హార్ట్లీ (21), అండర్సన్ (6)లను పడేశాడు. యశస్వి గ్రే ‘టెస్ట్’ ఇన్నింగ్స్.... తొలిరోజు కెప్టెన్ రోహిత్తో భారత ఇన్నింగ్స్ను ఓపెన్ చేసిన 22 ఏళ్ల యశస్వి రెండో రోజు డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన స్కోరు 396 అయితే... అతనిదొక్కడిదే 209! అంటే సగానికిపైగా పరుగులు జైస్వాలే చేశాడు. ఇంకా చెప్పాలంటే మిగతా పది మందిలో ఏ ఒక్కరు కనీసం అర్ధసెంచరీ అయినా చేయలేదు. అయినాసరే తనతో జోడీకట్టిన బ్యాటర్తో తన డబుల్ సెంచరీని సాకారం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ద్విశతకాన్ని ఓ పటిష్టమైన ప్రత్యర్థిపై సాధించడం విశేషం. వినోద్ కాంబ్లీ (21 ఏళ్లు), సునీల్ గావస్కర్ (21 ఏళ్లు) తర్వాత పిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్ జైస్వాల్. తక్కువ ఇన్నింగ్స్ (10వ)ల్లో డబుల్ సెంచరీ బాదిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కరుణ్ నాయర్ (3), కాంబ్లీ (4), మయాంక్ (8), పుజారా (9) ముందున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) అయ్యర్ (బి) అక్షర్ 76; డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21; పోప్ (బి) బుమ్రా 23; రూట్ (సి) గిల్ (బి) బుమ్రా 5; బెయిర్స్టో (సి) గిల్ (బి) బుమ్రా 25; స్టోక్స్ (బి) బుమ్రా 47; ఫోక్స్ (బి) కుల్దీప్ 6; రేహన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 6; హార్ట్లీ (సి) గిల్ (బి) బుమ్రా 21; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 6; బషీర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 9; మొత్తం (55.5 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–59, 2–114, 3–123, 4–136, 5–159, 6–172, 7–182, 8–229, 9–234, 10–253. బౌలింగ్: బుమ్రా 15.5–5–45–6, ముకేశ్ కుమార్ 7–1–44–0, కుల్దీప్ 17–1– 71–3, అశ్విన్ 12–0–61–0, అక్షర్ పటేల్ 4–0–24–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 15; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 13; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. బౌలింగ్: అండర్సన్ 2–0–6–0, బషీర్ 2–0–17–0, రేహన్ 1–0–5–0. -
బుమ్రా బిహేవియర్ పై ఐసీసీ వార్నింగ్
-
IND VS ENG 1st Test: నిర్జీవమైన పిచ్పై నిప్పులు చెరిగిన బుమ్రా
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. బ్యాటింగ్కు, స్పిన్నర్లకు అనుకూలిస్తూ నిర్జీవంగా ఉన్న పిచ్పై నిప్పులు చెరిగే బంతులు సంధించి ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. ఈ మ్యాచ్లో బుమ్రా రెండు ఇన్నింగ్స్ల్లో (2/28, 4/41) కలిపి మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మినహా ఈ మ్యాచ్లో మరే ఇతర పేసర్ వికెట్లు పడగొట్టలేకపోయాడు. సహచరుడు సిరాజ్, ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేని పిచ్పై బుమ్రా బుల్లెట్ లాంటి బంతులు సంధించి వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక పేసర్తో బరిలోకి దిగగా.. భారత్ బుమ్రాతో పాటు సిరాజ్ను కూడా బరిలోకి దించింది. అయితే సిరాజ్ ఆశించినంతగా రాణించలేకపోయాడు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు, రెండో ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లు మాత్రమే వేశాడు. మరోవైపు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (196) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. బుమ్రాతో పాటు అశ్విన్ (3/126), జడేజా (2/131), అక్షర్ పటేల్ (1/74) రాణించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు 230 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్గా నిలిచాడు.భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో 3 వికెట్లు.. అక్షర్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులు చేసి ఆలౌటైంది. జడేజా (87), కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4, రెహాన్ అహ్మద్, హార్ట్లీ తలో 2 వికెట్లు, లీచ్ ఓ వికెట్ పడగొట్టారు. -
బుమ్రా బౌలింగ్ కి ఖంగుతిన్న బెన్ స్టోక్స్..
-
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
వరల్డ్ కప్ కి బుమ్రా రెడీ...ఆ ముగ్గురు కూడా...
-
బుమ్రా రీ ఎంట్రీ కన్ఫర్మ్
-
ఐపీఎల్-2023కు దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు వీరే..!
మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ను ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా, ప్రతి సీజన్లో దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్ పండుగ ఈసారి కాస్త కలావిహానంగా మారనుంది. గాయాల కారణంగా చాలామంది స్టార్లు సీజన్ మొత్తానికే దూరం కానున్నారు. కొందరేమో లీగ్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. గాయాల కారణంగా ఐపీఎల్ 16వ ఎడిషన్ మొత్తానికే దూరం కానున్న స్టార్ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది... జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్) కైల్ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్) విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జై రిచర్డ్సన్ (ముంబై ఇండియన్స్) అన్రిచ్ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్) ప్రిసిద్ధ్ కృష్ణ (రాజస్తాన్ రాయల్స్) జానీ బెయిర్స్టో (పంజాబ్ కింగ్స్) సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ముకేశ్ చౌదరీ (చెన్నై సూపర్ కింగ్స్), మొహిసిన్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్), జోష్ హాజిల్వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్-2023లో పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది. -
సిరాజ్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ బుమ్రా స్థానంలో షమీ
-
బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్కు చోటు
-
IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా?
ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. వీరిద్దరి 150 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టు విజయంపై కన్నేసింది. చేతిలో 7 వికెట్లతో చివరి రోజు ఆ జట్టు మరో 119 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో చివరి రోజు భారత్ ఏదైనా అద్భుతం చేయగలదా...ప్రత్యర్థిని కుప్పకూల్చగలదా! బర్మింగ్హామ్: భారత్తో ఐదో టెస్టులో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తోంది. 378 పరుగులను ఛేదించే క్రమంలో ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. జో రూట్ (112 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), బెయిర్స్టో (87 బంతుల్లో 72 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 125/3తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్ (86 బంతుల్లో 57; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. పంత్ అర్ధసెంచరీ... నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది. అదిరే భాగస్వామ్యం... భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు లీస్, క్రాలీ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు ఆకట్టుకునే షాట్లతో పరుగులు రాబట్టారు. ధాటిగా ఆడిన లీస్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే భాగస్వామ్యం 100 పరుగులు దాటడంతో భారత బృందంలో ఆందోళన మొదలైంది. అయితే బంతి ఆకారం దెబ్బ తినడంతో మరో బంతిని తీసుకున్న భారత్ అదృష్టం కూడా మారింది. బుమ్రా బంతిని అంచనా వేయడంలో పొరపడిన క్రాలీ క్లీన్బౌల్డయ్యాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు 21.4 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత భారత్ మళ్లీ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి బంతికే పోప్ (0) అవుట్ కాగా, రూట్ పొరపాటుతో లీస్ రనౌటయ్యాడు. ఈ దశలో పరిస్థితి చూస్తే ప్రత్యర్థిని కూల్చడానికి భారత్కు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే రూట్, బెయిర్స్టో భాగస్వామ్యం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఆరంభంలో రూట్ చక్కటి షాట్లు ఆడగా, కుదురుకున్న తర్వాత బెయిర్స్టో దూకుడు పెంచాడు. మన బౌలర్లు పూర్తిగా పట్టు కోల్పోవడంతో ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు చేసిన రూట్, బెయిర్స్టో విజయానికి బాటలు వేస్తూ పటిష్ట స్థితిలో రోజును ముగించారు. 14 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో బెయిర్స్టో ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284; భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (సి) లీస్ (బి) బ్రాడ్ 66; విహారి (సి) బెయిర్స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (సి) రూట్ (బి) లీచ్ 57; శ్రేయస్ (సి) అండర్సన్ (బి) పాట్స్ 19; జడేజా (బి) స్టోక్స్ 23; శార్దుల్ (సి) క్రాలీ (బి) పాట్స్ 4; షమీ (సి) లీస్ (బి) స్టోక్స్ 13; బుమ్రా (సి) క్రాలీ (బి) స్టోక్స్ 7; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 19; మొత్తం (81.5 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75, 4–153, 5–190, 6–198, 7–207, 8–230, 9–236, 10–245. బౌలింగ్: అండర్సన్ 19–5–46–1, బ్రాడ్ 16–1– 58–2, పాట్స్ 17–3–50–2, లీచ్ 12–1–28–1, స్టోక్స్ 11.5–0–33–4, రూట్ 6–1–17–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (బ్యాటింగ్) 76; బెయిర్స్టో (బ్యాటింగ్) 72; ఎక్స్ట్రాలు 9; మొత్తం (57 ఓవర్లలో 3 వికెట్లకు) 259. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 13–0–53–2, షమీ 12–2–49–0, రవీంద్ర జడేజా 15–2–53–0, సిరాజ్ 10–0–64–0, శార్దుల్ ఠాకూర్ 7–0–33–0. -
IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో (పింక్ బాల్ టెస్ట్) శ్రీలంక జట్టు ఓటమి దిశగా సాగుతుంది. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/24) ఐదేయడంతో లంకేయులు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలారు. ఓవర్ నైట్ స్కోరు 86/6 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదంటే ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బుమ్రాకు జతగా అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించడంతో లంక తొలి రోజు స్కోర్కు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది. ఫలితంగా టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెరీర్లో 29వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, లంక ఇన్నింగ్స్లో ఏంజలో మాథ్యూస్ (43), డిక్వెల్లా (21), ధనంజయ డిసిల్వా (10)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మయాంక్ అగర్వాల్ (22) వికెట్ను కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి, ఓవరాల్గా 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహిత్ శర్మ (20), హనుమ విహారి క్రీజ్లో ఉన్నారు. చదవండి: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక! -
స్థిరంగా రోహిత్.. దూసుకెళ్తున్న కోహ్లి
దుబాయ్: ఇటీవలే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన విరాట్ కోహ్లి తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ 8 రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ.. ఐదో ర్యాంక్ను నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్లో అద్భుత శతకంతో చెలరేగిన రిషబ్ పంత్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్కు చేరుకున్నాడు. 🔹 Travis Head continues his rise 🔥 🔹 Big gains for Kagiso Rabada ↗️ 🔹 Virat Kohli soars 🏏 🔹 Andy McBrine shoots up ☘️ Some big movements in the @MRFWorldwide ICC Player Rankings for the week 📈 Details 👉 https://t.co/gIWAqcmxeT pic.twitter.com/sJqByzFZgM — ICC (@ICC) January 19, 2022 మరోవైపు యాషెస్లో వరుస సెంచరీలతో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 7 స్థానాలు ఎగబాకి రోహిత్తో పాటు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలువగా, లబూషేన్ టాప్లో, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. అశ్విన్(839 రేటింగ్ పాయింట్లు) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, బుమ్రా 763 పాయింట్లు సాధించి టాప్-10లోకి చేరాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో పర్వాలేదనిపించిన బుమ్రా.. 3 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ జాబితాలో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇండియాతో సిరీస్లో రాణించిన రబాడ 2 స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్కు చేరుకున్నాడు. చదవండి: అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..! -
దేశం కోసం ఆడేటప్పుడు తగ్గేదేలే.. బుమ్రాతో వాగ్వాదంపై సఫారీ బౌలర్ స్పందన
Jansen On Altercation With Bumrah: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ను 1-2తేడాతో కోల్పోయిన టీమిండియా రేపటి(జనవరి 19) నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతుంది. మ్యాచ్ వేదిక అయిన బోలాండ్ పార్క్లో ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేసిన భారత జట్టు.. కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ ద్రవిడ్ల ఆధ్వర్యంలో కఠోరంగా శ్రమిస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా సైతం ప్రాక్టీస్లో బిజీబిజీగా గడుపుతోంది. టెస్ట్ సిరీస్ గెలిచిన ఊపులో వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. టెస్ట్ సిరీస్లో 19 వికెట్లతో చెలరేగిన సఫారీ లెఫ్ట్ ఆర్ పేసర్ మార్కో జన్సెన్ వన్డే సిరీస్లోనూ సత్తా చాటేందుకు చమటోడుస్తున్నాడు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జన్సెన్ మీడియాతో మాట్లాడుతూ.. రెండో టెస్ట్లో బుమ్రాతో జరిగిన వాగ్వాదంపై స్పందించాడు. బుమ్రా, నేను మంచి స్నేహితులమంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడుతున్నప్పుడు బుమ్రా తనకు బాగా సహకరించాడని గుర్తు చేసుకున్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ మైదానంలో ఎదురెదురు పడ్డప్పుడు, దేశం కోసం ఆడుతున్నప్పుడు మాత్రం తగ్గేదే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో బుమ్రా సైతం ఇలానే వ్యవహరిస్తాడని అన్నాడు. జొహన్నెస్బర్గ్ టెస్ట్లో వాగ్వాదం వేడి మీద జరిగిందని, ఆ విషయాన్ని తామిద్దరం అప్పుడే వదిలేశామని, మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని వివరించాడు. ఇక, వన్డే సిరీస్ గురించి మాట్లాడుతూ.. టెస్ట్ సిరీస్ నెగ్గామని తాము రీలాక్స్ కావడం లేదని, టీమిండియా ప్రపంచంలో మేటి జట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదని, ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా, 21 ఏళ్ల జన్సెన్ టీమిండియాతో వన్డే సిరీస్ ద్వారా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. చదవండి: కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర కామెంట్! -
టెంపర్ కోల్పోయిన బుమ్రా.. ఆరున్నర అడుగుల బౌలర్పైకి దూసుకెళ్లాడు..!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా పేసర్ బుమ్రా.. ఆరున్నర అడుగుల దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్పైకి దూసుకెళ్లాడు. భారత రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్లో చోటు చేసుకున్న ఘటనలో ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బాహాబాహికి దిగినంత పని చేశారు. అయితే అంపైర్ జోక్యంతో ఇద్దరు సర్దుకుపోయారు. pic.twitter.com/g3g0gjZnHo — Addicric (@addicric) January 5, 2022 వివరాల్లోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 230/8 వద్ద ఉండగా జన్సెన్.. బుమ్రాను టార్గెట్ చేస్తూ వరుస బౌన్సర్లను సంధించాడు. ఈ క్రమంలో వరుసగా కొన్ని బంతులు బుమ్రా శరీరాన్ని బలంగా తాకాయి. దీంతో చిర్రెతిపోయిన భారత పేసు గుర్రం.. జన్సెన్ వైపు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఇరువురు మాటామాటా అనుకున్నారు. అయితే అంపైర్ సర్ధిచెప్పడంతో ఇద్దరు మిన్నకుండిపోయారు. ఈ కోపంతో రబాడ వేసిన మరుసటి ఓవర్లో బుమ్రా సిక్సర్ బాదాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఇంగ్లండ్ సిరీస్లోనూ బుమ్రా- ఆండర్సన్ల మధ్య ఇలాంటి బాహాబాహి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించని 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఆఖరి సెషన్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. చదవండి: Ind vs Sa: కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం... కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్! -
ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..!
ICC Test Rankings: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో అద్భుతమైన శతకం(123)తో అదరగొట్టి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో సైతం సత్తా చాటాడు. ఈ వారపు ర్యాంకింగ్స్లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్పాట్కు ఎగబాకాడు. ఇదే టెస్ట్లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11వ ప్లేస్కు, రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న రహానే 25వ స్పాట్కు చేరుకోగా, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి రెండు ర్యాంకులు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. Latest ICC Test Rankings for Batting!#Cricket #ICCRankings pic.twitter.com/fl10mW6QV5 — InsideSport (@InsideSportIND) January 5, 2022 pic.twitter.com/L5F5cKWGER — Krikut Expert Rohit (@_rohitjangra_) January 5, 2022 ఈ జాబితాలో భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ స్పాట్ను నిలబెట్టుకోగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ జాబితాలో సైతం టీమిండియా బౌలర్లు తమ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి టెస్ట్లో ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా టాప్-10(9వ స్థానం)లోకి చేరుకోగా, ఇదే మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనతతో పాటు ఎనిమిది వికెట్లతో సత్తా చాటిన షమీ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్పాట్ను కాపాడుకోగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ టాప్లో కొనసాగుతున్నాడు. చదవండి: Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా.. మరో ముగ్గురికి కూడా -
ఆ ముగ్గురు భారత పేసర్లు పాక్ దిగ్గజాలతో సమానం..
Sanjay Manjrekar: ఇటీవలి కాలంలో టీమిండియా విదేశాల్లో అద్భుతంగా రాణించడానికి బుమ్రా, షమీ, సిరాజ్లే ప్రధాన కారణమని మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గత రెండు, మూడేళ్లలో ఓవర్సీస్లో టీమిండియా ప్రదర్శన చూస్తే అది ఇట్టే స్పష్టమవుతుందన్న ఆయన.. గతేడాది ఆసీస్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించడాన్ని, ఇటీవల ఇంగ్లండ్కు వారి అడ్డాలోనే షాకివ్వడాన్ని ఉదహరించాడు. అలాగే, దక్షిణాఫ్రికాను ఇటీవల జరిగిన టెస్ట్లో రఫ్ఫాడించడంలో కూడా ఆ ముగ్గురు సీమర్లదే కీలకపాత్ర అని మంజ్రేకర్ కొనియాడాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా మాధ్యమంతో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్ త్రయాన్ని పాక్ దిగ్గజ బౌలర్లతో పోల్చాడు. బుమ్రా, షమీ, సిరాజ్లను చూస్తే 90లలో ప్రపంచ క్రికెట్ను శాసించిన పాక్ దిగ్గజ బౌలర్లు గుర్తుకొస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో విదేశీ పిచ్లపై పాక్ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ అరివీర భయంకరంగా చెలరేగేవారని, ప్రస్తుతం టీమిండియా పేస్ త్రయం కూడా వారిలాగే విజృంభిస్తుందని వ్యాఖ్యానించాడు. కాగా, సఫారీలతో ముగిసిన తొలి టెస్ట్లో ఈ టీమిండియా బౌలింగ్ త్రయం ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: నా వల్ల కాదు బాబోయ్..! పాక్ హెడ్ కోచ్ పదవికి సక్లయిన్ గుడ్బై -
కెప్టెన్గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్గా రాహుల్, పంత్ల కంటే అతనైతేనే బెటర్..!
Virender Sehwag Picks Jasprit Bumrah As Team India Vice Captain: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో వైస్ కెప్టెన్గా ఎవరుంటారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు, విశ్లేషకులేమో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ల పేర్లు ప్రతిపాధిస్తుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరును తెరపైకి తెస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పరిమిత ఓవర్ల జట్టు ఉప సారధిగా రాహుల్, పంత్ల కంటే బుమ్రానే బెటర్ ఛాయిస్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు బుమ్రా ఏ టీ20 జట్టుకు నాయకత్వం వహించకపోయినా బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో నిలకగా ఆడే వారినే కెప్టెన్, వైస్ కెప్టెన్గా నియమిస్తారు కాబట్టి బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా ఇప్పటివరకూ ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని టీమిండియా వైస్ కెప్టెన్గా బుమ్రాను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం ఇంచుమించు ఇలాంటి ప్రతిపాదననే చేయగా, సెహ్వాగ్.. నెహ్రా ఛాయిస్ను సమర్ధిస్తూ బుమ్రాకు మద్దతు పలికాడు. టీమిండియా కెప్టెన్గా బౌలర్ ఉండకూడదని ఏ రూల్ బుక్లోనైనా రాసుందా అంటూ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లి స్థానాన్ని ఫాస్ట్ బౌలర్తో భర్తీ చేయాలని నెహ్రా డిమాండ్ చేశాడు. చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలిచాడు. బుధవారం సన్రైజర్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన హర్షల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కనీసం మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు -
స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఫొటోలు
-
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..
ఓవల్: ఇంగ్లండ్తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ను సాధించాడు. టెస్ట్ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ కేవలం 18 టెస్ట్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్ మార్క్ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్కు చెందిన జార్జ్ లోమాన్(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్(17), ఇంగ్లండ్ సిడ్నీ బార్న్స్(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్(17), పాక్ యాసిర్ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్(18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్(1) ఇంగ్లండ్ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్లో రూట్(32), వోక్స్(12) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా -
ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఓ ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ పోస్ట్లో ఉన్న భారత ఆటగాళ్ల ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఇన్స్టా పోస్ట్పై ఓ లుక్కేయండి. టీమిండియా క్రికెటర్లు ఫిట్నెస్ కోల్పోయి ఫ్యాట్గా మారితే ఎలా ఉంటారో ఊహించుకుని ఓ అభిమాని సరదాగా ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవళికలను మార్చాడు. View this post on Instagram A post shared by OFFICIAL BCCI 🔵 (@_official_bcci_) దీంతో ఫిట్గా ఉండే మన క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్టలేసుకుని, ఎలా అన్ఫిట్గా ఉంటారో అలా కనిపించారు. ముఖాలు వాచి పోయి అంకుల్స్ను తలపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎప్పుడూ ఫిట్గా కనిపించే మన క్రికెటర్లకు ఏంటీ దుస్థితి అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏదో ఒక రోజు మనోళ్లు ఇలానే తయారవుతారని గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే టీమిండియా రెండో టెస్ట్లో చిరస్మరణీయవిజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు సమాయత్తం అవుతున్నాయి. హెడింగ్లే స్టేడియంలో మనోళ్లు ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్లో చమటోడ్చారు. చదవండి: మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement