-
భారత్తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా-భారత్ సంబంధాలపై ఆ దేశ ఆర్థిక మంత్రి మేరీ ఎన్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకరించిన తర్వాతే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నిజ్జర్ హత్యకేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి హాజరైన కెనడా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్జీ మీడియాతో మాట్లాడుతూ.. "మా దృష్టంతా నిజ్జర్ కేసు దర్యాప్తుపైనే ఉంది. అందుకు భారత్ సహకరించేలా చేయడంపైనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని పూర్తైన తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తాం. మా దేశానికి చెందిన వ్యక్తి హత్యలో విదేశీ జోక్యం ఉందని ఆరోపణలు రావడాన్ని సీరియస్గా తీసుకున్నాం.' అని అయన చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసాలను కూడా రద్దు చేసుకున్నారు. ఈ కేసులో భారత్ దర్యాప్తుకు సహకరించాలని కెనడా ఒత్తిడి చేస్తోంది. ఇదీ చదవండి: ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి -
సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో
టొరంటో: ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారి, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్తో సన్నిహిత సంబంధాలను మెరు గుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. అదేసమయంలో, ఖలిస్తాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య ఘటనకు సంబంధించిన వాస్తవాల వెల్లడిలో సహకారానికి భారత్ ముందుకురావాలని కోరారు. భారత్పై బలమైన ఆరోపణలున్నప్పటికీ సన్నిహితంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాంట్రియల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ వేదికపై కీలకంగా మారిన భారత్తో కెనడా, మిత్ర దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నా. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్తో సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాం’అని చెప్పారు. అదే సమయంలో చట్టపాలన కలిగిన దేశంగా, నిజ్జర్ హత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు భారత్ తమతో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్తో వాషింగ్టన్లో జరిగే సమావేశంలో ఇదే విషయాన్ని బ్లింకెన్ ప్రస్తావిస్తారని కూడా బైడెన్ ప్రభుత్వం చెప్పిందన్నారు. -
ట్రూడో టార్గెట్గా ఆందోళనలు
టొరెంటో: కరోనా టీకా తప్పనిసరి నిబంధన, కోవిడ్ నిబంధనల పాటింపును వ్యతిరేకిస్తున్నవారి నిరసనలు కెనెడాలో పెరిగిపోయాయి. ఆందోళనకారులు రాజధాని నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్ హిల్ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. కొందరు నిరసనకారులు జాతీయ మృతవీరుల స్మారకాన్ని అవమానించడం, సైనికుల సమాధిపై డ్యాన్సులు చేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఆందోళనకారులు స్వస్తిక్ గుర్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వీరికి దేశీయుల నుంచి పెద్దగా సానుభూతి లభించకున్నా వీరు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు. ఇలాంటివారి సంఖ్య స్వల్పమని, అబద్ధాలను వీళ్లు ప్రచారం చేస్తున్నారని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో దుయ్యబట్టారు. కేవలం టీకా తప్పనిసరి నిబంధనలు ఎత్తివేయడంతో తమ నిరసన ఆగదని, ట్రూడో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్లో చాలా నిబంధనలను ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు విధించినా నిరసనకారులు మాత్రం ట్రూడో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. -
సౌదీ యువతికి కెనడా ఆశ్రయం
టొరంటో/బ్యాంకాక్: థాయిలాండ్లో చిక్కుకుపోయిన సౌదీఅరేబియా యువతి రహాఫ్ ముహమ్మద్ అల్ఖునన్(18) శనివారం ఎట్టకేలకు కెనడాకు చేరుకుంది. ఇంట్లో వేధింపులు తట్టుకోలేక థాయ్లాండ్కు పారిపోయివచ్చిన రహాఫ్కు ఆశ్రయమిస్తామని కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం తెల్సిందే. ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ చొరవతోనే ఇది సాకారమైందని థాయ్లాండ్ ఇమ్మిగ్రేషన్ ముఖ్య అధికారి సురాచత్ హక్పర్న్ తెలిపారు. సౌదీకి చెందిన రహాఫ్ మహ్మద్ అల్ఖునన్ తల్లిదండ్రుల ఆంక్షలను తట్టుకోలేక, తనకు నచ్చినట్టుగా బతికేందుకు కువైట్ నుంచి థాయ్లాండ్ మీదుగా ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు యత్నించారు. అయితే తగిన పత్రాలు లేకపోవడంతో రహాఫ్ను జనవరి 5న థాయ్లాండ్ అధికారులు ఎయిర్పోర్టులోనే ఆపేశారు. దీంతో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ హోటల్ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. రహాఫ్కు ఆశ్రయం కల్పించే విషయమై ఆస్ట్రేలియా, కెనడా సహా పలు దేశాలతో ఐరాస చర్చించింది. అయితే వేగంగా స్పందించిన కెనడా తాము రహాఫ్కు ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించగా, అందుకు ఆమె అంగీకరించారు. కాగా, ఈ విషయంలో తనకు సాయం చేసిన ప్రతీఒక్కరికి రహాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయంతో సౌదీతో ఆ దేశ సంబంధాలు మరింత దిగజారనున్నాయి. ఇంతకుముందు సౌదీలో మహిళా హక్కుల కార్యకర్తలకు మద్దతు పలకడంతో కెనడాపై సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
తాజ్ ముందు ట్రూడో.. ఫొటోలో టవల్తో కేజ్రీవాల్!
సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆదివారం తాజ్మహల్ను సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్మహల్ ఎదుట ట్రూడూ భార్య, పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. అయితే, ఈ ఫొటోలో ఓ పొరపాటు కాంగ్రెస్ నేత శశి థరూర్ కంటబడింది. ఆయన ఆనందభరితలయ్యారు. వెంటనే ట్వీట్ చేశారు. తాజ్మహల్ ముందు ట్రూడో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలో స్విమ్మింగ్ దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి పడగలిగాడు. ఏకంగా ప్రధాని ఫొటోలో ఫొటోబాంబ్ అయ్యాడు’ అని శశి ట్వీట్ చేశారు. నిజానికి శశి ట్వీట్ చేసిన ఆ ఫొటోలో ట్రూడో కుటుంబం వెనుక ఉన్నది ఎవరో కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజ్ ముందు ట్రూడో ఫ్యామిలీ ఫొటోలో ఆయన టవల్లో ఉన్నట్టు ఎవరో ఫొటోషాప్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండా నిజమైన ఫొటోనేమోనని థరూర్ అనుకున్నారు. తర్వాత ఆయన సారీ చెప్పారు. అది ఫొటోషాప్ చేసిన చిత్రమని గుర్తించలేకపోయానని, సోషల్ మీడియాలో నిజంగా అనిపించే చిత్రాలను కూడా నమ్మలేమని ఆయన ట్వీట్ చేశారు. Sir who photoshopped this? And is this man arvind kejriwal? — Wasi Mohammad (@WasiMd110) 18 February 2018 -
దీపావళి ముబారక్
ఒట్టావా : దీపావళి పర్వదినం ససందర్భంగా హిందువులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రడువ్ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపిన.. ఆయన అందులో పేర్కొన్న ఒక పదం వివాదాస్పదంగా మారింది. వేల మంది ఆయనపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఇంతకూ ఆయన తన ట్విటర్లో ఏమన్నారంటే... ’’ హిందువులందరికీ దీపావళి ముబారక్‘‘ అని చెప్పారు. నలుపు రంగు షేర్వానీలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఫొటో పెట్టి.. దీపావళి శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అంతేకాక ఒట్టావాలో రాత్రి దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటాం అని అందులో పేర్కొన్నారు. జస్టిన్ ట్రడువ్ ట్వీట్ను 3 లక్షల మంది లైక్ చేశారు. ఇదాఇలా ఉండగా.. ఈ ట్వీట్పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దీపావళి పండుగకు శుభాకాంక్షలు చెప్పినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.. అందుఏలో ముబారక్ అనే పదాన్ని తొలంగించండి అని కొందరు.. రీ ట్వీట్ చేశారు. మరికొందరైతే ముబారక్ అనేది అరబిక్ పదం.. దానిని హిందువులకు ఎలా ఆపాదిస్తారు? అని ప్రశ్నించారు. Diwali Mubarak! We're celebrating in Ottawa tonight. #HappyDiwali! pic.twitter.com/HBFlQUBhWX — Justin Trudeau (@JustinTrudeau) 17 October 2017 -
మీ ప్రధాని ఇలా చేయగలడా?
పరిపాలనా సంగతులు ఎలాఉన్నా ఇతర వ్యాపకాలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు కొందరు దేశాధినేతలు. గుర్రపుస్వారీ చేయటమో, బైక్ పై దూసుకెళ్లటమో, ప్రోటోకాల్ పక్కన పెట్టి నలుగురితో కలిసి చిందులెయ్యటమో లేక లక్షల రూపాయల సూట్లు ధరించడమో.. లాంటివి చేస్తూ జనం, మీడియా దృష్టిని ఆకర్షిస్తూంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆయా సందర్భాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడీ జాబితాలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడెయు కూడా చేరిపోయారు. 44 ఏళ్లకే ఉత్తరఅమెరికా ఖండంలోని అతిపెద్ద దేశమైన కెనడాకు ప్రధానిగా ఎన్నికయిన జస్టిన్.. రాజకీయాల్లోకి రాకముందు అథ్లెట్. స్నో బోర్డింగ్, యోగాల్లో విశేష ప్రావిణ్యం సాధించారు. ఎన్నికల ప్రచారంలోనూ చంటిపిల్లల్ని ఒంటిచేత్తో పైకెత్తి తన ప్రతిభచాటుకున్నారు. ఉత్సాహవంతుడైన జస్టిన్ తన కార్యాలయంలోని టేబుల్ పై పీకాక్ పోజ్ (మయూరాసనం) వేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ ఫొటో మూడేళ్ల కిందటిది. 2013, ఏప్రిల్ లో జస్టిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఆయన అభిమానులు కొందరు ఆ పాత ఫొటోను మళ్లీ రీట్వీట్ చేయడంతో ఇప్పుడిది వైరల్ అయింది. ఫొటోతోపాటు 'మీ దేశ ప్రధాని ఇలా చెయ్యగలడా?' అంటూ జస్టిన్ అభిమానులైన కెనడియన్లు నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు. మరి మీరేం బదులిస్తారు?
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement