-
వార్షిక కౌలు జీవో అమలును నిలిపేయండి
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు. వాస్తవానికి సీఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
AP: ఆ పిటిషన్కు అర్హతే లేదన్న ఏజీ
సాక్షి, గుంటూరు: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హతే లేదని.. పైగా పిటిషనర్లు అమరావతిలో భూముల్ని కలిగి ఉన్నారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష కోసం.. కాబోయే పాలనా రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో నెంబర్ 2283 జారీ చేసింది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని కోర్టును పిటిషన్ ద్వారా కోరారు వాళ్లు. అయితే ఇవాళ్టి విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) రూపేనా కోర్టు ముందుకు రావాలే తప్ప రిట్ రూపంలో కాదని ఏజీ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్గా దాఖలు చేశారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదంటే ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ పిటిషనర్లు కావాలనే రిట్ వేశారు. పైగా పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్నారు (ఫోరమ్ షాపింగ్పై పలు తీర్పులను న్యాయస్థానానికి వివరించారాయన.. ). ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు -
ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ
క్రియోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ కంపెనీ స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఐనాక్స్ ఇండియా ఐపీవోకింద 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లు, వాటాదారులకు చేరనున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐనాక్స్ ఇండియా క్రియోజెనిక్ ట్యాంకుల తయారీలో కార్యకలాపాలు కలిగి ఉంది. డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల ఇన్స్టాలేషన్, క్రియోజెనిక్ సిస్టమ్స్ ఏర్పాటు తదితర సర్వీసులు అందిస్తోంది. రూ. 200 కోట్ల ఈక్విటీ లగ్జరీ ఫర్నీచర్ను రూపొందిస్తున్న స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 91.33 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నా రు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మరో రూ. 40 కోట్లు యాంకర్ స్టోర్లను తెరిచేందుకు వినియోగించనుంది. వీటితోపాటు ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరించేందుకు రూ. 10 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో కొత్త మెషీనరీ, పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 8.2 కోట్లు కేటాయించనుంది. -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
బోన్ఫైర్ వేడుకలు: ఒకేసారి దీపావళి, భోగి పండుగలా జరిగే సంబరం!
ఇంగ్లండ్ ససెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్ పట్టణం ‘బోన్ఫైర్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా పేరు పొందింది. ఇక్కడ ఏటా నవంబర్లో జరిగే లెవెస్ బోన్ఫైర్ వేడుకలు చూస్తే, ఒకేసారి దీపావళి, భోగి పండుగ జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ పండుగను సాధారణంగా నవంబర్ 5న జరుపుకొంటారు. నవంబర్ 5 ఆదివారం వచ్చినట్లయితే, ముందురోజే నవంబర్ 4న జరుపుకొంటారు. ఈ వేడుకల్లో వీథి వీథినా భోగిమంటల్లాంటి చలిమంటల నెగళ్లను ఏర్పాటు చేస్తారు. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా రకరకాల బాణసంచా కాల్పులతో హోరెత్తిస్తారు. సంప్రదాయ వేషధారణలతో కాగడాలు ధరించి ఊరేగింపులు జరుపుతారు. ఈ వేడుకల్లో స్థానిక ఇంగ్లండ్ వాసులతో పాటు, ఇక్కడ స్థిరపడిన ఆఫ్రికన్ జులు తెగ ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు జరుపుకోవడం వెనుక ఒక చారిత్రక సంఘటన ఉంది. గన్పౌడర్ కుట్ర భగ్నం ఇంగ్లండ్ రాజు ఒకటో జేమ్స్కు వ్యతిరేకంగా 1605 సంవత్సరంలో కొందరు కుట్ర పన్నారు. రాబర్ట్ కేట్స్బీ నాయకత్వంలో కొందరు కేథలిక్ నాయకులు రాజు ఒకటో జేమ్స్ను హతమార్చాలనుకున్నారు. రాజు ఒకటో జేమ్స్ ఇతర మతాల పట్ల ఉదారంగా ఉండటం వల్లనే కేథలిక్ నాయకులు అతణ్ణి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజైన నవంబర్ 5న సభ కొలువుదీరిన సమయంలో హౌస్ ఆఫ్ లార్డ్స్ను గన్పౌడర్తో పేల్చివేయాలనుకున్నారు. వీరి కుట్ర గురించి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఒకరికి ముందుగానే ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా సమాచారం అందింది. భద్రతాధికారులకు చెప్పడంతో వారు సునాయాసంగా ఈ కుట్రను భగ్నం చేశారు. గన్పౌడర్ కుట్ర భగ్నమైన సందర్భంగా లెవెస్ పట్టణంలో ఏటా ఇలా బోన్ఫైర్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్గ్రౌండ్ ఎయిర్పోర్టు..కానీ ఇప్పుడది..) -
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం? -
విశాఖ రాజధానిపై నేడు సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ, ఆయనకు సమర్పించనుంది. -
ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు తరలివచ్చే ప్రక్రియ వేగవంతమవు తోంది. మునిసిపల్, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో కూడిన అధికారుల బృందం వైజాగ్లో పర్యటిస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు అవ సరమైన భవనాలు, అధికారుల వసతి కోసం అనువైన స్థలాలను ఈ బృందం పరి లించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి.. అనువుగా ఉంటే ఓకే చేసేందుకు అధికా రుల కమిటీ కసరత్తు మొదలెట్టినట్టు సమా చారం. దీనికనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సోమవారం సమావేశమైన కమిటీ.. ఖాళీ గా ఉన్న భవనాల వివరాలు సేకరించింది. -
పరిపాలన రాజధానిగా విశాఖ వర్ధిల్లాలి అంటూ ప్రత్యేక పూజలు
-
రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ?
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు పాల్పడిన ఘోరాలు విస్తుగొల్పుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయట పెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లాడారు. టీడీపీ సర్కారు రాజధానిపై ఏనాడూ ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వినియోగించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తప్పు చేసి దొరికిపోవడంతో మూటాముల్లె సర్దుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చెప్పారు. హైదరాబాద్లో చేసినట్లుగానే అమరావతిలోనూ భూముల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రాజధానిపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. 2013 చట్టంలోనే భూసమీకరణకు అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టారని, ప్రభుత్వాలు ఇంత అధర్మంగా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. మిగతావారిని దారి మళ్లించి తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో భూములు కొన్నారని తెలిపారు. తొలుత అతి చౌకగా జిరాయితీ భూములు కొన్నారని, ఆ తర్వాత జీవో 1 విడుదల చేసి అన్ని కేటగిరీల భూములకు భూ సమీకరణ ప్యాకేజీని పేర్కొంటూ అసైన్డ్ భూముల దగ్గర మాత్రం ఖాళీగా వదిలేశారని తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్ జరగదని తెలిసి కూడా వారిని కార్యాలయాలకు రప్పించి రిజిస్ట్రేషన్లను తిరస్కరించేలా చేశారని చెప్పారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ రాదంటూ మూడు మండలాల్లోని అసైన్డ్ రైతులను భయపెట్టి బాబు బృందం దక్కించుకుందన్నారు. ఆ భూములకు లభించే కౌలు, వన్టైమ్ బెనిఫిట్ను తమకు అందేలా చంద్రబాబు మనుషులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కాలేజీకి సైతం డబ్బులు జమ అయ్యాయని, పేద రైతులను మాయచేసి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు తమ చేతికి వచ్చిన తర్వాత వాటికి జీవో 1 వర్తించదు కాబట్టి ఏడాది తరువాత తాపీగా జీఓ 41 తీసుకువచ్చారని చెప్పారు. అసైన్డ్ రైతులను భయపెట్టేందుకే ఆ జీఓను ఒక సంవత్సరం పాటు ఆపారని తెలిపారు. రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన జీవోను మున్సిపల్ శాఖ ఇచ్చేసింది అసైన్డ్ భూములకు సంబంధించిన జీవోను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్ పరిపాలన శాఖ ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. పేదల భూములను బోగస్ వ్యక్తుల పరం చేయటాన్ని అధికారులంతా వ్యతిరేకించినా గత సర్కారు లెక్కచేయలేదన్నారు. మూడు మండలాల్లో అసైన్డ్ రికార్డులను సైతం మాయం చేశారని తెలిపారు. ప్రస్తుతం భూములు ఎవరి వద్ద ఉన్నాయో వారికే హక్కులు ఇద్దామంటూ తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు తమ మనుషులను ప్రవేశపెట్టారని చెప్పారు. పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా, రెవెన్యూ శాఖకు తెలియకుండా మాజీ మంత్రి నారాయణ ఇవన్నీ చేశారన్నారు. జీవో వచ్చిన 22 రోజుల తర్వాత నాటి సీఎం దీన్ని అంగీకరించారని, చట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో జారీ అయిందన్నారు. ప్రజల క్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున దోపిడీ చేస్తుంటే దాని పట్ల విశ్వాసం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అనుకూలంగా ఇవ్వలేదని ఆయన్ను తీసేశారని, న్యాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ అందరూ వ్యతిరేకించినా దోపిడీని కొనసాగించారని తెలిపారు. ఇంత అడ్డగోలుగా వచ్చిన భూమి ప్లాట్లను కోర్ క్యాపిటల్లోని సచివాలయం, గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ ఉన్నచోట ఇచ్చారని, ఇది ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పొట్టగొట్టి గొడవలా? అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు తెలిశాయని, ఇన్ని ఘోరాలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు తాను అవినీతిపరుడిని కాదని ఎలా చెప్పుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా ఇవన్నీ చేశారన్నారు. పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు ఇప్పుడు సీఎం జగన్ 50 వేల మందికి అక్కడే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. రాజధాని రైతుల పొట్ట గొట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తాము రైతులమంటూ గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ఒక ప్రభుత్వం తప్పు చేసి వ్యవస్థపై విశ్వాసాన్ని పోగొడితే మళ్లీ ఆ విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హెరిటేజ్, నారాయణ కోసం ఇన్నర్ ప్లాన్ మార్చారు: ఎమ్మెల్యే పేర్ని నాని రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో తనకు సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టాలో ఇన్నర్ రింగు రోడ్డు ఒకటి. దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. మొదట ఇది మంత్రివర్గ నిర్ణయమని చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా, హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం అలైన్మెంట్ ప్లాన్ మార్చారు. ఐఆర్ఆర్తో తనకేం సంబంధం అంటున్న ఏ–14 నారా లోకే‹శ్ 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. ఆ తీర్మానంపై లోకేష్ సంతకం చేశారు. దళితులు, పేదల నుంచి చంద్రబాబు, నారాయణ అసైన్డ్ భూములను లాక్కున్నారు. కేసులు ఎక్కువ నమోదైన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారు? యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371 కోట్లు టిప్ అని అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు? ఇన్నర్ రింగ్ రోడ్డును అటూ ఇటూ తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే తన కరకట్ట ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని హైకోర్టులో చెప్పారు. బాబుకు సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేనికి అద్దె కింద రూ.27 లక్షలు ఇచ్చామని భువనేశ్వరి చెబుతున్నారు. నిజంగానే అధికారికంగా ఇచ్చి ఉంటే అద్దె ఎందుకు చెల్లించారు? ఐటీ రిటరŠన్స్లో ఈ వివరాలను వెల్లడించారా? రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు ఎందుకు మాట్లాడడం లేదు? రాజధానిపై నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. భూసమీకరణకు ఒప్పుకోని వారిని ఏ–2 నారాయణ, ఏ–14 లోకేష్ బెదిరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. ఎకరం భూమిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారు. అసైన్డ్ రైతులను దగా చేసిన ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. సమగ్ర విచారణ జరగాలి: వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలి. రాజధానిని ప్రకటించకముందే లింగమనేని రమేష్ 355 ఎకరాలను కొనేశారు. పేదలను మోసం చేసి కంతేరు వద్ద భూముల్ని హెరిటేజ్ కొనడం ఏమిటి? ఢిల్లీ కోటను ఢీకొన్న జగన్ కళ్లల్లో భయం చూపిస్తానని లోకే‹శ్ అంటున్నారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్ ఎక్కడ? ఆయనకు ఉన్న 175 మంది సైనికుల్లో ఒకరి చేతుల్లో ఓడిపోయిన లోకే‹శ్ఎక్కడ? మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు: ఆదిమూలపు సురేష్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు. ఇన్నర్ రింగు రోడ్డు అనకొండలా మలుపులు తిరుగుతూ కొందరు వ్యక్తుల పొలాల దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో చేయని మోసం అంటూ ఏదీ లేదు. టెండర్లు పిలవకుండా నచ్చిన వాళ్లకు నామినేషన్ల విధానంలో పనులు అప్పగించారు. ముగ్గురు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలైన్మెంట్ను మార్చారు. గ్రాఫిక్స్తో అమరావతిని అంతర్జాతీయ నగరం అని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది అంతర్జాతీయ స్కామ్ అయింది. ఈ స్కామ్కి డైరెక్షన్ చంద్రబాబుది అయితే పర్యవేక్షణ లోకేశ్, నాటి మంత్రులు, ఇతరులది. అమరావతిలో దళిత, పేద రైతుల్ని నిలువునా ముంచారు. నవ నగరాలు, ఐకానిక్ బ్రిడ్జి లాంటివన్నీ బూటకం. ఇన్నర్ రింగురోడ్డు గురించి కాగ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ల విధానంలో సుర్బానా, జురాంగ్ కంపెనీలకు ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించి రూ. 28 కోట్లు రూల్స్కి విరుద్ధంగా చెల్లించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇన్నర్ రింగు రోడ్డులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న వారు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాలి. ఎస్టీయూపీ అనే కంపెనీకి మాస్టర్ప్లాన్ తయారీకి రూ.5 కోట్లు ఇచ్చారు. ఇవి డబ్బులు కాదా? రింగురోడ్డు తుది అలైన్మెంట్ను లింగమనేని, హెరిటేజ్ భూముల గుండా మార్చారు. హెరిటేజ్ భూములు కాజ, కంతేరు, చినకాకాని వద్ద ఉండడంతో రింగురోడ్డు అటు వెళ్లింది. అలైన్మెంట్ మార్పు చేసి తనకు సహాయం చేసినందుకే లింగమనేని రమేష్ ప్రతిఫలంగా చంద్రబాబుకి కరకట్ట నివాసాన్ని ఇచ్చారు. క్విడ్ప్రోకు ఇది తిరుగులేని ఉదాహరణ. నారాయణ తన వద్ద పనిచేసిన ఉద్యోగి పేరు మీద భూమిని కొని తర్వాత తన పేరిట మార్చుకున్నారు. అడ్డంగా దొరికిన అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో చట్టం ముందు నిలబెడుతున్నాం. చంద్రబాబు, లోకే‹శ్ను చట్ట ప్రకారం శిక్షించాలి. -
అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం గత సర్కారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉండే ప్రదేశాలను వదిలేసి బయటి వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ భూమిని పూలింగ్తో సేకరించడమేనని స్పష్టం చేసింది. ఈమేరకు కాగ్ సమర్పించిన తనిఖీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో ప్రధానంగా అమరావతి విషయంలో టీడీపీ సర్కారు అనుసరించిన విధానాలను, భూ సమీకరణను కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతా అసమగ్రం రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు సార్లు ఆడిట్ నిర్వహించినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు, రాజధాని నగర అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగర అభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు ప్రణాళిక వివరాల్లో సమగ్రత లేదని పేర్కొంది. అమరావతిలో ఏకరీతిలో భూ కేటాయింపుల విధానాన్ని అమలు చేయలేదని, వివిధ ప్రైవేట్ సంస్థలకు ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని కాగ్ నివేదిక ఎండగట్టింది. చేపట్టిన పనులన్నీ 2017 నవంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ప్రారంభించలేదని, దీంతో ఎల్పీఎస్ (ల్యాండ్ పూలింగ్ స్కీమ్) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదని కాగ్ పేర్కొంది. రహదారి పనులతో కూడిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాలను సరైన అంచనా, ప్రాథమిక సర్వే లేకుండా చేపట్టడంతో పనుల పురోగతి దెబ్బ తిందని కాగ్ తెలిపింది. అమరావతి రాజధాని అభివృద్ధిలో నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తప్పుబట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్లపై తగిన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారని కాగ్ పేర్కొంది. ప్రణాళిక లోపం.. వ్యయంపై ప్రభావం స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్లు రూ.33,476.23 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాగ్ నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు ఫలితంగా 2019 మే నుంచి కాల పరిమితి లేని ఒప్పందాల ప్యాకేజీలు అనిశ్చితిగా ఉన్నాయని తెలిపింది. గత సర్కారు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల పరిధిలో అనధికారికంగా గ్రీవెన్స్ సెల్ భవన నిర్మాణానికి ఏపీ సీఆర్డీఏ అనుమతి ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగరానికి భూమి వాస్తవ అవసరాలను అంచనా వేసేందుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం రికార్డులను సీఆర్డీఏ అందించలేదని కాగ్ పేర్కొంది. పర్యవసానంగా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేనందున ఎల్పీఎస్ ద్వారా సేకరించిన భూమి అవసరం హేతుబద్ధతను నిర్ధారించలేకపోయినట్లు కాగ్ వెల్లడించింది. దశలవారీ ప్రణాళిక లేకపోవడంతో ప్రాజెక్టుల వ్యయంపై ప్రభావం పడిందని, కార్యాచరణ ప్రణాళికను సూచించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ సిఫార్సులను ఆడిట్కు అందుబాటులో ఉంచలేదని కాగ్ తెలిపింది. కేంద్రం వివరణ కోరినా.. టీడీపీ సర్కారు నిర్దిష్ట విధివిధానాలను అనుసరించకుండా కన్సల్టెన్సీ సంస్థలు, కన్సల్టెంట్లను ఎంపిక చేసినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక ప్రక్రియలో ఏపీ సీఆర్డీఏ టెండరింగ్, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధివిధానాలను అనుసరించకుండా మూడు కన్సల్టెన్సీ సంస్ధలకు రూ.28.96 కోట్ల ఒప్పంద విలువతో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. రాజధాని నగరానికి సంబంధించి రూ.1,09,023 కోట్ల అంచనాతో డీపీఆర్లు రూపొందించినప్పటికీ వీటిలో రూ.46,400 కోట్ల మేర డీపీఆర్లను నీతి ఆయోగ్కు సమర్పించలేదని వెలుగులోకి తెచ్చింది. డీపీఆర్లు లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరినా గత సర్కారు సమర్పించలేదని కాగ్ తెలిపింది. -
విశాఖలో సీఎంవోకు దశలవారీగా చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారాయన. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి హాజరయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతాం. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. అలాగే.. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ కీలక వ్యాఖ్యలు అంతకుముందు వీఎంఆర్డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. -
ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అలహాబాద్ చరిత్ర ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క రోజు రాజధాని మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్ కలిగిన లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్కు చేరింది. ఆ సమయంలో ఆయన అలహాబాద్లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు. ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రలో నిలిచింది. పర్యాటక కేంద్రంగా.. ప్రయాగ్రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. చూడవలసిన ప్రదేశాలు మీరు ప్రయాగ్రాజ్కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్రాజ్లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? -
నాలెడ్జ్ క్యాపిటల్గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ కాపిటల్గా ఫిలడెల్ఫియా.. ఫుట్పాత్లపై ‘బానిసల’ వికృత చేష్టలు!
అమెరికాలోని ఫిలడెల్ఫియా డ్రగ్స్ కాపిటల్గా మారిపోయింది. ఇక్కడి జనం ప్రమాదకరమైన డ్రగ్ ‘ట్రాంక్’ బారిన పడి కెన్సింగ్టన్ వీధుల్లో వికృత చేష్టలకు దిగుతున్నారు. మత్తులో మునిగిపోయి, తామేమి చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో రోడ్ల మీద తిరుగాడుతున్నారు. ‘ట్రాంక్’కు బానిసగా మారిన ఒక వ్యక్తి తన వీడియో క్లిప్ను టిక్టాక్లో షేర్ చేశాడు. ఇదిమొదలు ఇటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పలువురు జాంబీ డ్రగ్స్ తీసుకుంటూ వింతగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇంతేకాకుండా మరికొందరు మద్యం తీసుకోవడం, ధూమపానం చేయడం, కాలి వేళ్లకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మత్తులోకి దిగడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి. ‘ట్రాంక్’ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం? మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిలాజైన్ డ్రగ్ లేదా ‘ట్రాంకో’ను విరివిగా వినియోగిస్తున్నవారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పెరిగిపోయింది. ‘ట్రాంక్’ని ‘జాంబీ డ్రగ్స్’ అని కూడా అంటారు. తొలుత దీనిని ఇది జంతువుల చికిత్సకు ఉపయోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదించింది. అయితే క్రమంగా దీనిని మత్తు పదార్థంగా ఉపయోగించడం ప్రారంభించారు. ‘ట్రాంక్’ను మత్తుపదార్థాలైన హెరాయిన్, కొకైన్, ఫెంటానిల్లను మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగిస్తారు. This is what Philadelphia now looks like thanks to the new drug called “Tranq”. This is what the city where our Declaration of Independence was signed now looks like. Can you believe it? pic.twitter.com/oSZ8RJAtOX — Joey Mannarino (@JoeyMannarinoUS) May 28, 2023 ఫిలడెల్ఫియా ఆరోగ్య అధికారులు గత నెలలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. డ్రగ్స్ మహమ్మారి నగరాన్ని సంక్షోభంలో ముంచిందని పేర్కొన్నారు. ‘జిలాజైన్ డ్రగ్ ఫిలడెల్ఫియాను తీవ్రంగా దెబ్బతీసింది. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మరణాల సంఖ్య పెరిగింది. దీనిని తీసుకునే వ్యక్తులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నారు. ఈ డ్రగ్ మనిషి శరీర భాగాలను క్షీణింపజేస్తుంది. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడానికి నగరంలోని స్వచ్ఛంద భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని’ ఫిలడెల్ఫియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ బోర్డ్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఈ విషయమై స్పందించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డ్రగ్స్ కలిగించే చెడు ప్రభావాలను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. సావేజ్ సిస్టర్స్ వ్యవస్థాపకురాలు సారా లారెల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో ఈ డ్రగ్ వినియోగం మరింతగా పెరిగిందన్నారు. దీనిని అరికట్టడంతో అటార్నీ లారీ క్రాస్నర్ విఫలమయ్యారని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో, డ్రగ్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన 2022లో లారీ క్రాస్నర్ సస్పెండ్ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన విచారణ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్? Yet another video of my hometown Philadelphia where the zombies roam the streets high on Fentanyl and Tranq. Leaving that shithole of a city was the best move of my life other than marrying my wife and fathering my 3 awesome kids. pic.twitter.com/WW3etvaDPj — Nikki Davis (@BlondeNAmerican) May 26, 2023 -
జాబిల్లిపై మూడు సింహాల అడుగులు
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. భారత్ తన విజయసూచకంగా అశోక ముద్రలు(మూడు సింహాల గుర్తు) జాబిల్లి నేలపై ముద్రించనుంది. చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ అనే రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేస్తుంది. రోవర్ చక్రాలు జాబిల్లిపై తిరుగుతూ చంద్రునిపై నీటి జాడ, మట్టి, ఖనిజాలు సహా అనేక వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో రోవర్ చక్రాలు అశోక చిహ్నాన్ని చంద్రునిపై ముద్రించనున్నాయి. భారత తన విజయసూచకంగా రోవర్ చక్రాలకు అశోక చిహ్నాలను ముద్రించింది. దీంతో రోవర్ తిరిగిన ప్రతిచోట అశోక ముద్రలతో కూడిన అడుగులు ఏర్పడతాయి. సారనాథ్ స్థూపం నుంచి సేకరించిన అశోక ముద్రలను భారత్ తన వారసత్వ గుర్తుగా చంద్రుని మట్టిపై నిలుపుతోంది. Big Breaking News - After landing, Chandrayaan-3 rover will etch an impression of the national emblem depicting the Lion Capital of Ashoka at Sarnath and ISRO on the lunar terrain. It will signify India's presence and legacy on the Moon♥️🔥. India set to create history today… pic.twitter.com/BnGBHrqxls — Times Algebra (@TimesAlgebraIND) August 23, 2023 చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్పై పీఎం మోదీ.. -
చంద్రబాబు నిర్వాకం ఫలితం.. ముంపు ముంగిట్లో రాజధాని అమరావతి
తాడికొండ : ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పిన గొప్పలు చిన్నపాటి వర్షానికే వెక్కిరిస్తున్నాయి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని, శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు వంటి నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను తొక్కిపెట్టిన చంద్రబాబు నారాయణ కమిటీ వేసి తనకు అనుకూలంగా రాజధాని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా రాజధాని ప్రాంతానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, చీకటి వాగుకు వచ్చే భారీ వరద నీటిని మళ్ళించేందుకు గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సచివాలయం, హైకోర్టును వరద నీరు భారీగా చుట్టుముట్టింది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు వెళ్లే రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొండవీటి వాగుకు భారీగా వచ్చిన వరదతో పెదపరిమి, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు ప్రాంతాల్లో పొలాలు, రోడ్లు ముంపునకు గురయ్యాయి. కోటేళ్ల వాగుకు బు«ధ, గురువారాలు ఉప్పొంగడంతో సచివాలయ, హైకోర్టు ఉద్యోగులు మంగళగిరి మీదుగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేకుండా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అక్కడ పేదలకు ఇళ్లిస్తే..మా భూముల ధరలు పడిపోతాయి
సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే తమ భూముల ధరలు అమాంతం పడిపోతాయని అమరావతి కోసం భూములిచ్చిన వ్యక్తుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూములిస్తూ చట్టం చేసేందుకు తాము గతంలో ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రికి పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతంలో కాకుండా కడపలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి ఆదాయాన్ని సమకూర్చే ఎల్రక్టానిక్ సిటీ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే చుట్టుపక్కల తమ భూముల ధరలు దారుణంగా పడిపోతాయన్నారు. రాజధాని వెలుపల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని పునరుద్ఘాటించారు. రాజధాని భూముల విషయంలో సీఆర్డీఏ, రైతులకు మధ్య ఉన్నది వ్యాపార ఒప్పందమన్నారు. రైతుల అనుమతి లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... పట్టాల మంజూరు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అందువల్ల పట్టాల మంజూరు వ్యవహారం తేలకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోందని, గృహ నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. రాజధాని భూములపై సీఆర్డీఏకు పూర్తిస్థాయి యాజమాన్యపు హక్కులు లేవని, కేవలం షరతులతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములను ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాతే రాజధాని భూములపై సీఆర్డీఏకు హక్కులు వస్తాయని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. మా నినాదమే.. పేదలందరికీ ఇళ్లు ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, కాసా జగన్మోహన్రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ తోసిపుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఇళ్లను నిరి్మంచుకోవడానికేనన్నారు. ఇళ్లు నిర్మాణం లేనప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రయోజనం ఏముంటుందన్నారు. ప్రభుత్వ నినాదమే ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్లు నిర్మించవద్దని చెప్పలేదన్నారు. ఈ విషయంలో స్పష్టత కావాలనుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి మరో చోట భూమి కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం భూమిలో 5 శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం చెబుతోందన్నారు. చట్ట నిబంధనలకు లోబడి చేసే పనిని ఏ కోర్టు కూడా తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 వేల ఎకరాలను ఇచ్చిందని రెవిన్యూ శాఖ తరఫు న్యాయవాది సుభాష్ తెలిపారు. అందులో 1,400 ఎకరాలు పేదలకిస్తే పిటిషనర్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురి చేత టీడీపీ పిటిషన్లను దాఖలు చేయించిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని అయితే స్వాగతిస్తాం
-
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని..!
-
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
రాజధాని ప్రాంతలో శ్రావణ్ కుమార్ హల్చల్
గుంటూరు: రాజధాని ప్రాంతంలో మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ హల్చల్ చేశారు. రాజధానిలో 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి తుళ్లూరు మండలంలో చొరబడి టీడీపీ నాయకుల ఇళ్లలో బస చేశారు. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ 24, 25, 26 తేదీలలో పలు రకాల నిరసనలు తెలియజేస్తామంటూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. బుధవారం తుళ్లూరు దీక్షా శిబిరం వద్దకు వచ్చి హడావుడి చేసేందుకు యత్నించిన శ్రావణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విజయవాడకు తరలించారు. -
సామాజిక న్యాయమే పరమావధి
సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని కంటే కూడా పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. తమది సామాజిక న్యాయమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా, గత ప్రభుత్వం మాత్రం ధనికుల కోసం ని ర్మిస్తున్న రాజధానిలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమలు చేయలేదని తెలిపింది. కేవలం 44 ఎకరాలను మాత్రమే పేదల కోసం కేటాయించిందని, అలాంటి తప్పిదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఆర్డీఏ చట్టాన్ని సవరించి.. మాస్టర్ ప్లాన్లో ఆర్ 5 జోన్ను సృష్టించామని చెప్పింది. ‘ఈ జోన్లో పేదలకు 1,134 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ భూమిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచాలని నిర్ణయించాం. ఇది ఓర్వలేని గత ప్రభుత్వ పెద్దలు హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపమన్నట్లు ప్రభుత్వ తీరును అమరావతి రైతుల పేరుతో తప్పు పడుతున్నారు. సీఆర్డీఏ నుంచి ఈ 1,134 ఎకరాలను రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల సీఆర్డీఏకు రూ.1,100 కోట్లపైగా మొత్తం సమకూరుతుంది. సీఆర్డీఏకు డబ్బు వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలివ్వొద్దు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 45 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు రకరకాల ఎత్తుగడలతో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ అనుబంధ వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పేదలకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమీ లేదు.. పిటిషనర్ల తరఫున తొలుత దేవ్దత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. పేదలకు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మిన్ను విరిగి మీద పడదన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ వద్ద ల్యాండ్ బ్యాంక్ ఉందని, అందులో నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ, మాస్టర్ ప్లాన్లో చాలా మార్పులు చేశారన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉండగా, క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. సీఆర్డీఏ ప్రతిపాదనలను రైతులు గ్రామ సభల్లో తిరస్కరించారని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అనుమోలు జ్యోతిరత్న వివరించారు. అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాండవుల కోసం శ్రీకృష్ణుడు ఉన్నట్లు పేదల కోసం జగన్ ఉన్నారన్నారు. పేదల నివాసానికి కనీసం 5 శాతం భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉండగా, మాస్టర్ ప్లాన్లో మాత్రం దానికి స్థానం కల్పించలేదన్నారు. ఈ తప్పును సరిదిద్ది చట్ట ప్రకారం పేదల నివాసం కోసం 5 శాతం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్ధిష్టంగా ఫలానా చోటే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేక హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు, మళ్లీ హైకోర్టు.. అడ్డుకునేందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకెళ్లగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందంటూ రైతులను నిలదీసిందని, దీంతో వాళ్లు అక్కడ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిందని, అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి చేయకుంటే చేయలేదంటున్నారని, చేస్తుంటే ఎలా చేస్తారంటూ కోర్టులకెక్కుతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. నవ్వుల పువ్వులు హైకోర్టులో న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు లేవని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఓ పెద్ద మనిషి తనపై క్రిమినల్ కేసు నమోదు కాగానే భయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి మార్చారని తెలిపారు. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వదులుకుని అందరూ హడావుడిగా అమరావతికి వచ్చారన్నారు. దాని పర్యవసానమే సౌకర్యాల కొరత అని వివరించారు. ‘ఆ కోట్ల రూపాయల కోసమే అందరూ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళుతున్నారా? అంటూ ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. -
‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నది అంబేద్కర్ కోరిక’
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజ మార్పు కోసం ప్రయత్నించారన్నారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. శుక్రవారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారాయన. అంబేద్కర్ ఆశయాల్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం దళితులకు, ఆదివాసీలకే పరిమితం కాదు. దేశంలో మతమైనారిటీలే కాదు.. కులమైనారిటీలు కూడా ఉన్నారన్నారాయన. అలాగే.. పొట్టీ శ్రీరాములు ఆంధ్రపప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు కూడా రాష్ట్రం ఇవ్వలేదు. చిన్న రాష్ట్రాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అంబేద్కర్ భావించేవారు. మీ అందరి తరపున సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు ఆయన ప్రసంగించారాయన. దేశానికి రెండో రాజధాని అవసరమని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ కోరుకున్నారు. అదీ హైదరాబాదే కావాలని అంబేద్కర్ కోరుకున్నారని ప్రకాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్న విషయాన్ని అంబేద్కర్ లేవనెత్తారని, ఆ అవసరం ఇప్పుడు ఉందని ప్రకాష్ పేర్కొన్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
మెట్ గాలా-2024 ఈవెంట్లో మెరిసిన సెన్సేషనల్ బ్యూటీ మోనా పటేల్.. ఫోటోలు
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement