-
PM Narendra Modi: కాంగ్రెస్ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ, ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను ఇరుకున పెడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న సొమ్మును దోచేయడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను దొడ్డిదారిన కాజేసి, ఓటు బ్యాంక్కు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో, బరేలీ, షాజహాన్పూర్, మధ్యప్రదేశ్లోని మొరేనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... అడ్డుగోడను నేను.. ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మల సొత్తుపై కాంగ్రెస్ నాయకులు గురిపెట్టారు. అధికారంలోకి రాగానే తస్కరించాలని కుట్ర పన్నారు. మన ఆడపడుచుల సొమ్మును ఎవరూ దోచుకెళ్లకుండా నేను కాపలాదారుడిగా పనిచేస్తున్నా. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ప్రజలకు, కాంగ్రెస్కు మధ్య ఒక అడ్డుగోడగా నేను నిల్చున్నా. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకోకుండా కాపాడుతున్నా. జనం ఆస్తులను, సంపదను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ రాజకుమారుడు అంటున్నారు. ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో 55 శాతం ఆస్తిని స్వా«దీనం చేసుకొని, మిగతా 45 శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట! ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు. మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదు. అయినా కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను కోర్టులు తిరస్కరించాయి. అందుకే ఆ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుంది. మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోంది. కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పదేపదే ఈ విషయం చెబుతోంది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఆంధ్రప్రదేశ్లోనే ముస్లిం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్ను దేశమంతటా అమలు చేయాల న్నదే కాంగ్రెస్ కుయుక్తి. నేను కూడా ఒక ఓబీసీనే. కర్ణాటక మోడల్ నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుంటారు. ముస్లింలకు కట్టబెడతారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలి. సంతుïÙ్టకరణ(ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపర్చడం) ద్వారా తుషీ్టకరణ(బుజ్జగింపు)ను అంతం చేయాలన్నదే మా ప్రయత్నం. అసలు లోగుట్టు ఇదే..ఎస్టేట్ డ్యూటీ(పన్ను)ని అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్ డ్యూటీని కుమారుడు రాజీవ్ గాంధీ రద్దు చేశారు. అసలు లోగుట్టు ఇదే. ఇందిరా గాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయి. ఇందిరా గాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. జనం ఆస్తులను కాజేసే ప్రయత్నాలను కచి్చతంగా తిప్పికొడతాం. -
Rahul Gandhi: కులగణనను ఏ శక్తీ ఆపలేదు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనను ఏ శక్తీ ఆపలేదని ప్రకటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ‘‘ నాకు కులం పట్టింపు లేదు. కానీ న్యాయం విషయానికొచ్చేసరికి దేశంలో అన్యాయమైపోయిన 90 శాతం జనాభాకు న్యాయం దక్కేలా చూడటమే నా జీవిత లక్ష్యం. మా ప్రభుత్వం ఏర్పడగానే మేం చేసే మొట్టమొదటి పని కులగణన జరిపించడమే.మోదీ అస్తవ్యస్తపాలనలో దాపురించిన ఆదాయ అసమానతల గురించే కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. మోదీ అత్యంత మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు బదిలీచేసిన రూ.16 లక్షల కోట్ల మొత్తంలో కాంగ్రెస్ కొంతైనా ఈ 90 శాతం పేదలకు అందేలా చేస్తుంది. లెక్కలు కట్టాం. ఇదే న్యాయం అని భావించాం. అందుకే ఈ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాం’’ అని రాహుల్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాన్సీరియస్ నేతనా?‘‘పూర్తిగా రాజకీయాలకు అంకితంకాని నేత అని రాహుల్పై బీజేపీ చేసిన విమర్శలకు రాహుల్ ధీటుగా బదులిచ్చారు. ‘‘ గ్రామీణఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, ఉత్తరప్రదేశ్లో భట్టా, పార్సౌల్ గ్రామాల వద్ద భూసేకరణ ఉద్యమం, నియాంగిరీ హిల్స్ వివాదం ఇలా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషిచేశా. ఉద్యమాలను ముందుండి నడిపించా. ఇవన్నీ మీడియాకు నాన్సీరియస్ అంశాలేకదా. సీరియస్ అంశాలుగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విరాట్ కోహ్లీల గురించి మీడియా చూపిస్తుంది. 90 శాతం జనాభా గురించి పట్టించుకునే వ్యక్తిని నాన్సీరియస్ నేత అని అంటారా?’’ఓబీసీ, దళితులు, గిరిజనుల ప్రాతినిధ్యమెక్కడ?‘‘ మీడియారంగంలో ఓబీసీ, దళితులు, గిరిజనుల చేతుల్లో ఉన్న ఒక్క మీడియా సంస్థనైనా చూపించండి. ఒక్కరు కూడా లేరు. మీ ప్రాతినిధ్యం మీడియాలో లేదు. న్యాయవ్యవస్థలోనూ దాదాపు అంతే. 650 మంది హైకోర్టు జడ్జీల్లో 90 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించేది కేవలం 100 మందే. దేశంలోని 200 అగ్రశ్రేణి సంస్థల్లోనూ దళితులు, గిరిజనులు, ఓబీసీలు లేరు’’ దేశాన్ని విడగొడుతున్నానట!‘‘అన్యాయం జరిగితే ఏ మేరకు అన్యాయం జరిగిందో తెల్సుకుంటాం. ఒక వ్యక్తికి అంతర్గత గాయమైతే ఎక్స్–రే తీయడంలో తప్పులేదుగా. అలాగే కులగణన ఎక్స్–రే అవసరమని నేను అనగానే జాతీయ మీడియా, నరేంద్ర మోదీ ఏకమైపోయి నేనేదో దేశప్రజలను విభజిస్తున్నట్లు విష ప్రచారం మొదలెట్టారు. అన్ని కులాల ప్రాతినిధ్యం ఎలా ఉందో తెలియాలంటే ఎక్స్–రే అవసరమని దేశభక్తులంతా భావిస్తారు. దేశాన్ని సూపర్పవర్గా మార్చాలనే ఈ దేశభక్తుడు(మోదీ) మాత్రం ఈ ఎక్స్–రే పేరు వింటేనే భయపడుతున్నారు’’ కులాలే లేనప్పుడే మీరెలా ఓబీసీ అయ్యారు?‘‘ గత పదేళ్లు తాను ఓబీసీ వ్యక్తినని మోదీ ఘంటాపథంగా చెప్పారు. తీరా నేను కులగణన ప్రస్తావన తీసుకురాగానే దేశంలో కులాలే లేవని మాట మార్చారు. మరి అలాంటపుడు మీరు ఓబీసీ ఎలా అయ్యారు? మళ్లీ ఆయనే దేశంలో రెండే కులాలున్నాయని సెలవిచ్చారు. పేద, ధనిక కులాలు అని. పేదల జాబితాను పరికిస్తే దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలే కనిపిస్తాయి. ఈ 90 శాతం జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం’’రామమందిరం, పార్లమెంట్లో మా వ్యక్తులెక్కడ? ‘‘ సమస్య నుంచి కొంతకాలమే దృష్టి మరల్చగలరు. ఓబీసీలు మిమ్మల్ని నిలదీసే సమయం వచి్చంది. రామమందిరం పూర్తయింది అక్కడ మా(దళితులు, గిరిజనులు) వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించారు. మా వాళ్లు ఒక్కరైనా ఉన్నారా?. ఒక్కరినైనా ఆహా్వనించారా? గిరిజన మహిళా రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్లను ఎందుకు రానివ్వలేదు?’’ఆర్థిక, వ్యవస్థాగత సర్వేలూ కలిపే..‘‘ మేం అధికారంలోకి వస్తే కులగణనతోపాటే ఆర్థిక సర్వే చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్రంగాలుసహా అన్ని రంగాల్లో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఎంత ఉందనేది తెలిపే ఇన్స్టిట్యూషనల్ సర్వేనూ చేస్తాం. కులగణనను ఏ శక్తీ ఆపలేదు. ఎంత గట్టిగా నిలువరిస్తే అంతే బలంగా ప్రతిఘటిస్తాం’’ -
పరివార్.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ
న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ నేత లాలూప్రసాద్ విమర్శలు పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా మంటలు రాజేశా యి. మోదీకి కుటుంబమూ లేదు, సంతానమూ లేరంటూ ఆదివారం పట్నా జన్సందేశ్ ర్యాలీలో లాలూ ఎద్దేవా చేశారు. ఆయనసలు హిందువే కాదంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతల సమక్షంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలకు మోదీ సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. భారతదేశం, 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా వెంటనే అందిపుచ్చుకున్నారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మొదలుకుని రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జి.కిషన్రెడ్డి, అర్జున్రామ్ మేఘ్వాల్ తదితర కేంద్ర మంత్రులు, నేతలంతా ఈ మేరకు ప్రకటనలు చేశారు. మోదీపై లాలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. విపక్షాలపై పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేగాక సోషల్ మీడియా అకౌంట్లలో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అంటూ జోడించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా ఇదే బాటపట్టి ‘మోదీ కా పరివార్’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చివరికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తన ఎక్స్ ప్రొఫైల్కు ‘మోదీ కా పరివార్’ అని చేర్చుకున్నట్టు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి! విపక్షాలు మరోసారి లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి చేజేతులా పదునైన నినాదమే అందించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిల్లర వ్యాఖ్యలు: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు విపక్షాలకు కొత్తేమీ కాదంటూ బీజేపీ ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘17 ఏళ్లుగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా బాధాకరం’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. విపక్షాల రాజకీయ దురహంకారానికి దేశ ప్రజలు తగిన విధంగా బదులు చెబుతారన్నారు. ‘‘మొత్తం దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు మోదీ. అందుకే ఎంత పని చేసినా ఆయనకు అలుపే రాదు. గత పదేళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు’’ అని చెప్పారు. మోదీకి సంతానం లేదన్న లాలు వ్యాఖ్యలను కూడా సుధాన్షు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ మతం గురించి లాలుకేం తెలుసు? అసలు విపక్ష ఇండియా కూటమిలో ఒక్కరు కూడా హిందువు లేదు! సనాతన ధర్మంలో భక్తికే పెద్దపీట తప్ప కుమారునికి కాదు. భారత్లో గురుశిష్య సంప్రదాయముంది తప్ప తండ్రీ కొడుకుల సంప్రదాయం లేదు. రామ భక్తుడైన హనుమంతునికే ఊరూరా గుళ్లున్నాయి. రాముని కుమారులు లవకుశులకు ఎక్కడైనా ఆలయముందా?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మోదీ లక్ష్యమైతే ఎలాగైనా అధికారం సాధించి 2047 దాకా కూడా దాన్ని తమ కుటుంబాల గుప్పెట్లోనే ఉంచుకోవడం విపక్షాల లక్ష్యం’’ అంటూ దుయ్యబట్టారు. వీలైనంత భారీగా అవినీతికి పాల్పడి, తద్వారా తాము, తమ కుటుంబాలు మాత్రమే తరతరాలకు సరిపడా సంపద పోగేసుకోవాలన్నది విపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నేరగాళ్లే మోదీ పరివారం: కాంగ్రెస్ ఇండియా కూటమి నానాటికీ బలోపేతమవుతుండటం చూసి అధికార బీజేపీలో అక్కసు పెరిగిపోతోందని కాంగ్రెస్ ఆరోపించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘మోదీ కా పరివార్’ పేరిట కొత్త డ్రామాకు తెర తీసిందని మండిపడింది. ‘‘రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్భూషణ్సింగ్ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం. అదే ‘మోదీ కా అస్లీ పరివార్’’ అంటూ ఎద్దేవా చేసింది. ‘‘మణిపూర్ హింసాకాండకు బలైన మహిళలకు మోదీ కుటుంబంలో చోటేది? ఢిల్లీ శివార్లలో నిరసన గళమెత్తుతున్న రైతులను తన కుటుంబంగా చెప్పుకోగలరా? ఉపాధి లేక నిత్యం ఆత్మహత్యల బాట పడుతున్న నిరుద్యోగ యువతను తన కుటుంబమని చెప్పుకోరేం? బీజేపీ సర్కారు కేవలం క్రూరమైన నేరగాళ్లు, మోదీ సన్నిహిత పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తోంది’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ‘‘రైతుల హత్య, మహిళలపై అత్యాచారాలు... ఇదే నిజమైన మోదీ కుటుంబం’’ అంటూ కాంగ్రెస్ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిజ్భూషణ్, అజయ్ మిశ్రా తదితరులు తమ సోషల్ హ్యాండిల్స్కు ‘మోదీ కా పరివార్’ అని జోడించుకోవడాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సంఘ్ పరివార్ కాస్తా చివరికి మోదీ పరివార్గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2019లో ‘మై భీ చౌకీదార్’ సాక్షి, న్యూఢిల్లీ: మోదీపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీపై ‘మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి)’ అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మత అల్లర్లకు కారకుడనే అర్థంలో ఆమె చేసిన విమర్శలు వివాదానికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు బాగా నష్టం చేశాయి. అనంతరం 2018లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. తాను దేశానికి చౌకీదార్లా ఉంటానన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఎక్కుపెట్టిన ఆ విమర్శలూ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నింటికీ తీవ్రంగా చేటు చేశాయి. ఆ వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఘనవిజయం సాధించింది. మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్లో ‘నరేంద్ర మోదీ చౌకీదార్’ అని చేర్చుకున్నారు. బీజేపీ నేతలు కూడా ‘మై భీ చౌకీదార్’ అని ప్రొఫైల్స్లో చేర్చుకున్నారు. ‘‘నువ్వేమీ మరీ అంత పెద్దవాడివి కాదు. మాట్లాడితే కుటుంబ రాజకీయాలంటూ మాపై పదేపదే దాడికి దిగుతున్నావ్! కుటుంబాల గురించి నీకెందుకు? నీకు సంతానం ఎందుకు లేదో చెప్పు. కుటుంబమే లేదు నీకు. అయోధ్యలో రామాలయం కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటావు. కానీ నువ్వసలు హిందువువే కాదు. అమ్మ మరణిస్తే ప్రతి హిందువూ శిరోముండనం చేయించుకుంటాడు. నువ్వు మాత్రం చేయించుకోలేదు. కారణమేంటో చెప్పు! దేశమంతటా విద్వేష వ్యాప్తి చేస్తున్నావ్!’’ – పట్నా ర్యాలీలో మోదీపై లాలూ విమర్శలు ‘‘ఇండియా కూటమిలోని విపక్ష నేతలంతా అవినీతి, వారసత్వ, సంతుస్టీకరణ రాజకీయాల్లో పీకల్లోతున కూరుకుపోయారు. పార్టీ ఏదైనా ఝూట్–లూట్ (అబద్ధాలు, దోపిడీ) అన్నదే వాళ్లందరి నైజం. దీనిపై ప్రశి్నస్తే నాకు కుటుంబమే లేదంటూ ఆక్షేపిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఒక సేవకునిలా ప్రజా క్షేమానికే నా జీవితాన్ని అంకితం చేశా. దేశసేవ చేయాలనే కలను నిజం చేసుకోవడానికి చిన్న వయసులోనే ఇల్లు వీడా. నా జీవితమంతా తెరిచిన పుస్తకం. ప్రతి భారతీయునికీ ఆ విషయం తెలుసు’’ – ఆదిలాబాద్ సభలో మోదీ -
మోదీ కలలు కంటున్నారు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు పెంచాయి. ‘‘ మోదీ కలలు కంటున్నారు. ఏకంగా 400కుపైగా సీట్లు గెల్చుకుంటామని మోదీ చెప్పడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఆయనకు లేదని అర్థమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశ లౌకిక భావనను గాయపరిచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ద్రోహం చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చేసింది? రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు?. గత మే నుంచి రావణకాష్టంగా రగిలిపోతున్న మణిపూర్లో మోదీ ఎందుకు ఇంతవరకు ఒక్కసారైనా పర్యటించలేదు?’’ అని సీపీఐ నేత బినోయ్ విశ్వం నిలదీశారు. ‘‘ 400 లేదా 500 సీట్లు గెలుస్తామని కల కనే హక్కు మోదీకి ఉంది. కానీ వాస్తవం వేరు. వేరే వాళ్ల కలలకు తగ్గట్లు నడుచుకోవాలో, సొంత నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు’ అని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటస్ చెప్పారు. ‘ ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని ప్రసంగం అస్సలు ముగియదు. ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు స్మరించుకుంటేగానీ మోదీకి ఎన్నికల్లో గిట్టుబాటు అవుతుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ‘‘ బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో కూర్చున్నందుకైనా కాస్తంత గౌరవప్రదంగా మాట్లాడాలి. 400కుపైగా గెలుస్తామనడం చూస్తుంటే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలొస్తున్నాయి’’ అని మరో కాంగ్రెస్ ఎంపీ డ్యానిష్ అలీ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ నెహ్రూ గతించి దాదాపు 60 ఏళ్లు గడుస్తున్నా మోదీ ఇంకా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మోదీ ఇంతగా పట్టించుకుంటుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోదీ ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్కే అంకితమిచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరల గురించి మోదీ ఇంకా నెహ్రూ, ఇందిర గాంధీలనే తిడుతున్నారు. ధరలు పెరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెస్ గెలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి!’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్ను లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
కులమతాల చిచ్చు పెడుతున్నారు
ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్ముఖ్లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది. జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్లో అడుగుపెట్టింది. అరుణాచల్ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది -
అస్సాం ప్రభుత్వం, సీఎం..
శివసాగర్/జోర్హాట్(అస్సాం): భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాంలో మొదలుపెడుతూనే ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నాగాలాండ్ బుధవారం ముగిసిన యాత్ర అస్సాంలో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలోని హాలోటింగ్ పట్టణంలో వందలాది మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం ఉందంటే అది ఈ రాష్ట్ర సర్కారే. అతిపెద్ద అవినీతి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు’’ అని ఆరోపించారు. జొర్హాట్ జిల్లాలోని దేబెరాపూర్లోని వీధి సమావేశంలోనూ రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ అస్సాంలోని బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇక్కడి గిరిజనులు, తేయాకు కారి్మకులు, స్థానిక తెగలకు అన్యాయం చేస్తోంది. సంపదను కొల్లగొడుతూ విద్వేషాన్ని చిమ్ముతోంది. యాత్ర మొదలైన మణిపూర్లో జాతుల మధ్య వైరం కార్చిచ్చులా విస్తరించి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానిని చల్లార్చేందుకు కనీసం ఒక్కసారైనా మోదీ మణిపూర్కు రాలేదు. ఇక నాగాలాండ్లో నాగాల సమస్యను పరిష్కరిస్తామని మోదీ సర్కార్ తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ అది ఎంత వరకు సఫలమైందనేది మోదీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’’ అని రాహుల్ ఆరోపించారు. -
USA presidential election 2024: రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు. వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
ప్రధానిలో నిర్దయ చూస్తే బాధేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా నిరసనగా ఖేల్ రత్న, అర్జున అవార్డులను రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో రోడ్డుపై వదిలేయడం తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ ఆదివాంర ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రధానిని వైఖరిని ఎండగట్టారు. ‘‘భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఆత్మాభిమానానికి అత్యంత విలువ ఇస్తుంది. అవార్డులు, పురస్కారాలన్నీ ఆ తర్వాతే. ఇలాంటి ధైర్యశాలుల కంటే ‘బాహుబలి’ వంటి పరపతి గల వ్యక్తుల నుంచి పొందే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?’’ అని మోదీని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అంటే దేశ రక్షకుడు. ఇంతటి తీవ్రమైన అంశంలో ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా బాధేస్తోంది’’ అన్నారు. -
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు. భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు. అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్ నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్లో చూసే తెలుసుకున్నా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సిల్గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్సర్లోని ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు. -
G20 Summit: నేతలకు పేదరికం కనిపించకుండా దాస్తోంది
న్యూఢిల్లీ: జీ20 భేటీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన చర్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మురికి వాడలను కనిపించకుండా చేయడం, ధ్వంసం చేయడం వంటి వాటితోపాటు వీధుల్లో తిరిగే కుక్కలు తదితర జంతువులను క్రూరంగా బంధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. అతిథుల ఎదుట మన దేశ వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మురికివాడల చుట్టూ పచ్చని పాలిథిన్ షీట్లను కప్పి ఉంచినట్లుగా ఉన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘ప్రభుత్వం మమ్మల్ని పురుగులుగా భావిస్తోంది. మేం మనుషులం కామా?’ అని స్లమ్ నివాసి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. మోదీ చర్యలను విమర్శించారు. ‘మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జీ20 శిఖరాగ్రం వేళ మురికివాడలను కనిపించనీయడం లేదు. ఎందుకంటే రాజు పేదలను ద్వేషిస్తాడు’అని కాంగ్రెస్ ప్రధాని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది. -
‘రెడ్ డైరీ’ కాంగ్రెస్ను ముంచేస్తుంది
సికార్(రాజస్తాన్): రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అక్రమ, ఆర్థిక లావాదేవీల చిట్టా ఈ ‘రెడ్ డైరీ’లో ఉందంటూ బహిష్కృత మంత్రి రాజేంద్ర గుఢా చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ వంతపాడారు. ఈ ఆరోపణలకు దేశవ్యాప్తంగా 1.25 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితంచేసే కార్యక్రమం వేదికగా నిలిచింది. సికార్లో జరిగిన ఈ వేడుకలో ఇంకొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లిపోవాలని గాం«దీజీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సిన నినాదం ‘అవినీతి క్విట్ ఇండియా, వారసత్వం క్విట్ ఇండియా, బుజ్జగింపు క్విట్ ఇండియా’. కాంగ్రెస్ వారి కొల్లగొట్టే దుకాణంలో కొత్త సరుకే ఈ ‘రెడ్ డైరీ’. గెహ్లాట్ సర్కార్ పేపర్ లీక్ పరిశ్రమను నడుపుతోంది. కాంగ్రెస్ వారి అవినీతి రహస్యాలు అందులో దాగిఉన్నాయి. ఆ అవినీతి ఈసారి ఎన్నికల్లో వారిని ఓటమిపాలుచేయనుంది’ అని మోదీ అన్నారు. ‘ రెడ్డైరీ పేజీలు తెరిస్తే చాలా మంది పెద్ద తలకాయల బండారాలు బయటపడతాయని ప్రజలే చెబుతున్నారు’ అని ఆరోపించారు. పేరు మార్చి ఏమార్చి.. ‘ఇందిరాగాంధీ హయాంలో ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిర’ అని ప్రజల్ని ఏమార్చారు. తర్వాత యూపీయేనే ఇండియా, ఇండియానే యూపీయే’ అని మభ్యపెట్టారు. బ్రిటిష్ సంస్థకు ఇండియా పదాన్ని జోడించి దేశంలో అడుగుపెట్టి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ సంగతి తెల్సిందే. ఇండియా పేరున్న సిమీపై నిషేధం విధించాక ఎఫ్పీఐ పేరిట మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఇప్పుడు కాంగ్రెస్, దాని జట్టు పారీ్టలు ఇదే ఎత్తుగడతో తమ కూటమికి ఇండియా అని పేరుపెట్టుకున్నాయి’ అని మోదీ ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్లో మోదీ పర్యటించడం గత ఆరునెలల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ‘ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో విపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి’ అని గుజరాత్లోని తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయిన రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారం¿ోత్సవంలో మోదీ విమర్శించారు. గెహ్లాట్ ‘ఎరుపు’ దాడి మోదీ విమర్శలపై సీఎం గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. ‘ఎరుపు(రెడ్) డైరీ ఊహాత్మకం. వాస్తవానికి అలాంటిది లేదు. మాజీ మంత్రిని పావుగా వాడి రాజకీయం చేస్తున్నారు. నిజానికి అదొకటి ఉంటే మీ చేతిలో కీలుబొమ్మలైన ఈడీ, ఐటీ, సీబీఐలు ఎందుకు ఇంతవరకు దాని వివరాలు తెల్సుకోలేకపోయారు? ఎర్ర సిలిండర్(ఎలీ్పజీ సిలిండర్) ఏకంగా రూ.1,150కి విక్రయిస్తూ అసలైన దోపిడీకి పాల్పడింది మోదీనే. ఎర్ర టమాటాలు రూ.150 పైగా ఎగబాకడానికి మీరే కారణం. ఇంత ధరకు సిలిండర్, టమాటాలు కొనాల్సిరావడంతో ఆగ్రహంతో ప్రజల ముఖాలు ఎర్రబడిపోయాయి. రాజస్తాన్ ప్రజలు ఈసారీ బీజేపీకి ఎర్రజెండానే చూపిస్తారు’ అని అన్నారు.‘ రాష్ట్రానికి విచ్చేసిన మీకు మూడునిమిషాల ప్రసంగం ద్వారా ఆహా్వనం పలికే అవకాశాన్ని పీఎంఓ కార్యాలయం తొలగించింది. అందుకే ఇలా ట్వీట్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా’ అని గెహ్లాట్ ట్వీట్చేశారు. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘కాళ్లకు గాయాల కారణంగా మీరు హాజరుకావట్లేరని మీ కార్యాలయం నుంచి సమాచారం వచి్చనందుకే షెడ్యూల్ మార్చాం. అయినా రావాలనుకుంటే ఇదే మా ఆహా్వనం. వచ్చేయండి’ అని పీఎంఓ తేలి్చచెప్పింది. -
అలవాటు మార్చుకుని.. ఇక నుంచి ఇక్కడే విమర్శిస్తారట!
అలవాటు మార్చుకుని.. ఇక నుంచి ఇక్కడే విమర్శిస్తారట! -
ఓర్వలేకే దేశంపై నిందలు
న్యూఢిల్లీ: భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బ్రిటన్లో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తూర్పారబట్టారు. ఇండియాటుడే సదస్సులో మాట్లాడిన ఆయన రాహుల్ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. ‘‘భారత ప్రజాస్వామ్యం సాధిస్తునప్రగతిని, ఘన విజయాలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే దేశంపై నిందలేస్తున్నారు. మాటల దాడులు చేస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ భారత్పై ఎంతో విశ్వాసం కనబరుస్తున్నారు. ఇలాంటి వేళ ప్రతికూల వ్యాఖ్యలతో దేశాన్ని తక్కువ చేసే, ప్రజల స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుభ సందర్భాల్లో దిష్టిచుక్క పెట్టడం మన సంప్రదాయం. ఇలాంటి వ్యక్తులు తమ చేష్టల ద్వారా బహుశా అలా దిష్టిచుక్క పెట్టే బాధ్యత తీసుకున్నట్టున్నారు’’ అంటూ చురకలంటించారు. ఇలాంటి కురచ ప్రయత్నాలను పట్టించుకోకుండా దేశం ప్రగతి పథంలో దూసుకుపోతూనే ఉంటుందన్నారు. ‘‘గత పాలకుల హయాంలో అవినీతి, కుంభకోణాలే నిత్యం పతాక శీర్షికల్లో ఉండేవి. ఇప్పుడేమో అలాంటి అవినీతిపరులంతా వారిపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న వార్తలు హెడ్లైన్స్గా మారుతున్న విచిత్ర పరిస్థితిని మనమంతా చూస్తున్నాం’’ అంటూ ఎద్దేవా చేశారు. -
Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!
అంబాలా/చండీగఢ్: ఆరెస్సెస్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది. కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు. రాహుల్ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్రాజ్ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
బిహార్ కులకలం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ను రూపొందించారు. దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్ కుమార్ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వార్డ్ కేస్ట్స్ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్ సూపర్ పవర్గా భారత్ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకీ కులగణన? స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం! పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన నితీశ్ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే.. భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి. పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు. 2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు. లోక్సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ? బిహార్లో కులగణన పూర్తయి లోక్సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. ఇప్పుడు బిహార్లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్గా మండల్ కమిషన్ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్డెస్క్ -
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
కశ్మీర్ ఫైల్స్పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
Gujarat Assembly Election 2022: తల్లీబిడ్డలను వేరుచేస్తున్నారు
మహువా: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. రాష్ట్ర అధికార బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం ఆయన సూరత్ జిల్లాలోని మహువాలో జరిగిన భారీ బహిరంగ సభలో గిరిజనులద్దేశిస్తూ ప్రసంగించారు. ‘బీజేపీ మిమ్మల్ని తాత్కాలిక వనవాసులు అంటోంది. కానీ, గిరిపుత్రులే అడవికి అసలైన యజమానులు. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అటవీభూములను ధారాదత్తంచేస్తూ గిరిజనులను తమ అడవి తల్లికి దూరంచేస్తోంది. ఇక్కడ మీ బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో ఆధునిక విద్య, వైద్యానికి మీ పిల్లలు దూరమవుతున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడుతూ వైద్యులు, ఇంజనీర్లు, పైలట్లు కావడం బీజేపీ సర్కార్కు ఇష్టంలేదు’ అని రాహుల్ దుయ్యబట్టారు. రాజ్కోట్లో జరిగిన మరో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీతోనే రైతులకు కష్టాలు మహారాష్ట్రలో కర్షకులు, యువత, గిరిజనులను పట్టిపీడిస్తున్న కష్టాలకు అసలు కారణం బీజేపీయేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో 380 కిలోమీటర్ల పొడవునా కొనసాగిన భారత్ జోడో యాత్రనుద్దేశిస్తూ రాహుల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పంటల బీమా పథకాల వైఫల్యం కారణంగా రైతులు కష్టాలు పడుతున్నారని వాపోయారు. -
రాహుల్ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్ అగాడీకి బీటలు?
ముంబై: వీర సావర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గురువారం సావర్కర్పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత అరవింద్ సావంత్ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్ వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా శనివారం అభిప్రాయపడ్డారు. అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్ వారి నుంచి సావర్కర్ రూ.60 పెన్షన్ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్కు సావర్కర్పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్కు తక్షణం గుడ్బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్సాహెబ్ దన్వే శనివారం డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు. -
నచ్చనంత మాత్రాన విమర్శిస్తారా?
‘‘నటిగా నేను ఎంచు కున్న జీవితం ప్రత్యేకమైనది. ఇక్కడ (ఇండస్ట్రీ) ఉన్న ప్రతి ఒక్కర్నీ అందరూ ఇష్టపడతారని కచ్చితంగా అనుకోను. నేను మీకు (విమర్శిస్తున్నవారిని ఉద్దేశించి) నచ్చనంత మాత్రాన మీరు నాపై విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రతిరోజూ కష్టపడి పని (సినిమాలు) చేయడం మాత్రమే నాకు తెలుసు. నా పని వల్ల మీరు ఆనందపడితే నాకు అదే చాలు’’ అని రష్మికా మందన్నా అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి ఇన్స్టాగ్రామ్లో రష్మిక ఈ విధంగా షేర్ చేశారు. ‘‘కొన్నేళ్లుగా రెండు విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సింది. నటిగా నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు. విమర్శలు, నెగటివిటీ ఈ రెండు విషయాలతో ఇబ్బందిపెడుతున్నారు. ప్రతికూలత, ద్వేషం వల్ల ఉపయోగం ఏంటి? నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది. అవి చదివినప్పుడు నా హృదయం పగిలిపోతోంది. కొన్ని ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని విషయాలు తప్పుగా రీచ్ అయ్యి.. నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించాను. ఇంటర్నెట్లో వస్తోన్న తప్పుడు కథనాలు ఇటు పరిశ్రమలో అటు బయట నాకున్న మంచి రిలేషన్స్పై ప్రభావం చూపుతున్నాయి. నాతో పాటు నా సహచరులు కూడా ఇబ్బందిపడుతున్నారు. నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఉపయోగపడే సద్విమర్శలను స్వాగతిస్తాను. నాపై వస్తున్న విమర్శలను ఎత్తి చూపడం ద్వారా నేను ఎవరిపైనో గెలవడానికి ప్రయత్నించడం లేదు. అలాగే నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నేను మారాలనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్నవారిపై నాకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్ నన్ను ముందుకు నడుపుతున్నాయి. ఇదిగో ఇలా అందరికీ నా మనసులోని మాటలను చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చింది అవే. అందరం అందరికీ మంచి చేసేలా కృషి చేద్దాం’’ అని పోస్ట్ చేశారు రష్మిక. -
అవినీతిమయ పార్టీలు: ఆప్, కాంగ్రెస్లపై మోదీ విసుర్లు
సోలన్ (హిమాచల్ప్రదేశ్): ‘‘కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెసైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు, ఆశ్రిత పక్షపాతానికి తిరుగులేని గ్యారెంటీ’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కపెట్టారు. శనివారం హిమాచల్ప్రదేశ్లోని సుందర్ నగర్లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్థిరత్వానికి, అభివృద్ధికే ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ హిమాలయ రాష్ట్రంతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. అధికార బీజేపీకి వేసే ప్రతి ఓటూ తనకు ఆశీర్వాదమని భావిస్తానన్నారు. ‘‘మీరు వేసే ప్రతి ఓటూ వచ్చే పాతికేళ్ల కాలానికి రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. నేను కమలం పువ్వు గుర్తు చేపట్టి మీ ముందుకొచ్చాను. మా అభ్యర్థులను చూడకండి. కమలం గుర్తును చూసి ఓటేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్ హయాంలో స్థిరత్వం లేని పాలన వల్ల చిన్న రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. చిన్న రాష్ట్రమని హిమాచల్ను కాంగ్రెస్ ఏళ్ల తరబడి చిన్నచూపు చూసింది. అందుకే 21వ శతాబ్దంలో మనకు కావాల్సింది స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం’’ అన్నారు. ‘‘మందులను మాటిమాటికీ మారిస్తే రోగం తగ్గదు. ఎవరికీ మేలు జరగదు. అందుకే అధికార బీజేపీని మళ్లీ గెలిపించండి’’ అని కోరారు. హిమాచల్లో ప్రతిసారీ అధికార పార్టీ ఓడటం ఆనవాయితీగా వస్తోంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు గుజరాత్తో పాటుగా డిసెంబర్ 8న జరుగుతుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
- Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
Advertisement