కౌంటింగ్‌పై అవగాహన తప్పనిసరి | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌పై అవగాహన తప్పనిసరి

Published Sat, May 25 2024 1:30 AM

కౌంటింగ్‌పై  అవగాహన తప్పనిసరి

తిరుపతి అర్బన్‌ : ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికీ కౌంటింగ్‌పై అవగాహన తప్పనిసరని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తిచేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ సందర్భంగా సిబ్బంది ర్యాండమైజేషన్‌ సజావుగా చేపట్టామన్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 310 మందికి గాను 311 మంది, కౌంటింగ్‌ అసిస్టెంట్లు 383 గాను 395 మంది, మైక్రో అబ్జర్వర్లు 346 గాను 347 మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 1,039 మంది 208 కౌంటింగ్‌ టేబుళ్లకు అవసరమైన నేపథ్యంలో రిజర్వ్‌తో కలిపి 120 శాతంతో 1,053 మందిని కేటాయించామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పెంచలకిషోర్‌, నోడల్‌ అధికారి చంద్రశేఖర్‌ నాయుడు, ఎన్‌ఐసీ డీఐఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement