తిరుపతి అర్బన్ : ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికీ కౌంటింగ్పై అవగాహన తప్పనిసరని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ పూర్తిచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా సిబ్బంది ర్యాండమైజేషన్ సజావుగా చేపట్టామన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు 310 మందికి గాను 311 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 383 గాను 395 మంది, మైక్రో అబ్జర్వర్లు 346 గాను 347 మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 1,039 మంది 208 కౌంటింగ్ టేబుళ్లకు అవసరమైన నేపథ్యంలో రిజర్వ్తో కలిపి 120 శాతంతో 1,053 మందిని కేటాయించామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్ఓ పెంచలకిషోర్, నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, ఎన్ఐసీ డీఐఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
Published Sat, May 25 2024 1:30 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
Advertisement