Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Takes On Education System In AP1
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఏపీ ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025

conspiracy theory against kethireddy pedda reddy,High Tension In Tadipatri2
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌

సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్‌ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్‌లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్‌ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు.

వెలగలవారిపాలెం(ఆర్‌) పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని3
AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!

పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్‌) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్‌ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్‌ టీచర్‌ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు.వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గవర్నమెంట్‌ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తూ ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఎంత వరకూ శ్రద్ధ చూపిస్తుందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం

Amit Shah Inaugurates Turmeric Board Office In Nizamabad4
దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్‌ షా

సాక్షి, నిజామాబాద్‌: పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ధనపాల్‌ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.కిసాన్‌ సమ్మేళన్‌(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు రైతులది కీలక పాత్ర అన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని పసుపు రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోనే పలు దేశాలకు నిజామాబాద్‌ పసుపు వెళ్తుందన్న అమిత్‌ షా.. కొనుగోలు, రవాణా, ఎగుమతి అ‍న్నీ పసుపు బోర్డు చూసుకుంటుందన్నారు. పసుపును ప్రపంచం అద్భుత ఔషధంగా చూస్తుందని అమిత్‌ షా అన్నారు.‘‘ఒక బిలియన్‌ డాలర్లు విలువ చేసే పసుపును ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, మెట్‌పల్లిలో పసుపును అధికంగా పండిస్తారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ ఇస్తాం. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా బోర్డు ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు’’ అని అమిత్‌ షా ప్రశంసించారు.

Raghava Lawrence Emotional Post on Child Artist Ravi Raj Rathod5
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్‌ భావోద్వేగం

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్‌ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన రవిరాజ్‌ రాథోడ్‌ను కొన్నేళ్ల కిందట లారెన్స్‌ దత్తత తీసుకున్నాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ను చదివించాలనుకున్న లారెన్స్‌తన ట్రస్ట్‌ ద్వారా మంచి హాస్టల్‌ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్‌ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్‌ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్‌ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్‌ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్‌ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్‌ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్‌లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో చెన్నైలోని లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అడ్రస్‌ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్‌.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్‌, అధిగరం, కాల భైరవ, బుల్లెట్‌, హంటర్‌ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్‌ చేస్తున్నాడు.చదవండి: దిల్‌రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని

Shimron Hetmyer Unleashes Havoc To Score Second Fastest Fifty In MLC History6
శివాలెత్తిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఊచకోత

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో సియాటిల్‌ ఓర్కాస్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించాడు. నిన్న ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్సర్‌ బాది ఓర్కాస్‌ను గెలిపించిన హెట్‌మైర్‌.. ఇవాళ (జూన్‌ 29) లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌పై కూడా అదే పని (19.5వ ఓవర్‌) చేశాడు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. రసెల్‌ (39 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (21 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సైఫ్‌ బదార్‌ (21 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో రెండో బంతికే వికెట్‌ (జోష్‌ బ్రౌన్‌ 0) కోల్పోయిన ఓర్కాస్‌.. షయాన్‌ జహంగీర్‌ (31 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్‌ జోన్స్‌ (38 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్‌ (26 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. హెట్‌మైర్‌ 19వ ఓవర్‌ ఐదో బంతికి సిక్సర్‌ బాది తన జట్టును వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన హెట్‌మైర్‌.. మేజర్‌ లీగ్‌ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ద సెంచరీని నమోదు చేశాడు. ఎంఎల్‌సీలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు ఎంఐ న్యూయార్క్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ పేరట ఉంది. పూరన్‌ 2023 ఎడిషన్‌లో కేవలం​ 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఓర్కాస్‌ లీగ్‌ చరిత్రలో ఐదో అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఈ గెలుపుతో ఓర్కాస్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, వాషింగ్టన్‌ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.

Jagannath Rath Yatra Three Dead Several Injured7
Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు

పూరీ: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా జరుగుతున్న రథయాత్రలో అపశృతి చోటచేసుకుంది. గుండిచా ఆలయం సమీపంలో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికిపైగా జనం గాయపడ్డారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. 🚨 BREAKING:Tragedy strikes at #JagannathRathYatra in Puri, Odisha — 3 people have died and at least 10 injured in a stampede near Gundicha Temple.What was meant to be a sacred celebration turned into chaos.💔 Heartfelt prayers for the families of the victims. pic.twitter.com/nNC43uSw35— Sarcasm Scoop (@sarcasm_scoop) June 29, 2025ఆలయం వెలుపల జనసమూహం ఒక్కసారిగా పెరగడంతో భయాందోళనలు నెలకొని, ఫలితంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతులను, గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గుండిచా ఆలయం ముందు శారదబాలి సమీపంలో ఈ విషాదరక ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని చూసేందుకు భారీగా జనసమూహం అక్కడికి చేరుకుంది. దీంతో భక్తులను నియంత్రించడం పోలీసులుకు కష్టతరంగా మారింది.Distressing visuals from Jagannath Puri Rathyatra in Odisha where 3 reportedly killed in a stampede, multiple injured. pic.twitter.com/DoEZrXjM3p— Piyush Rai (@Benarasiyaa) June 29, 2025అదే సమయంలో తోపులాట జరగడంతో, కొందరు కింద పడిపోయారు. ఈ గందరగోళంలో ముగ్గురు ఇతరుల కాళ్లకింద నలిగిపోయి మృతిచెందారు. వారు ఖుర్దా జిల్లాకు చెందిన ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. బాధితులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. #WATCH | Odisha: A stampede has been reported during the Rath Yatra in Puri. Further details are awaited. (Visuals from outside the post-mortem centre in Puri) pic.twitter.com/4mOTnE6QTe— ANI (@ANI) June 29, 2025#PuriRathYatraMishap | On Puri Gundicha Temple stampede that led to death & injury of several devotees, Puri Collector Siddharth Shankar Swain says, “As soon as the Pahuda was opened, there was a sudden surge in the crowd. Nine devotees complained of breathlessness and were… pic.twitter.com/Z1TTlE7rPV— OTV (@otvnews) June 29, 2025

Mann Ki Baat Prime Minister Modi praised Telangana8
Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే..

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీనెలా నిర్వహించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఈరోజు (జూన్ 29) పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశాన్ని ట్రకోమా(కంటి వ్యాధి) నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని, 'జల్ జీవన్' మిషన్ దీనికి దోహదపడిందని ప్రధాని వివరించారు.జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా తెలంగాణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మూడువేల మంది దివ్యాంగులు పాల్గొనడం విశేషమన్నారు. యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారన్నారు. ఢిల్లీ ప్రజలు నది ఒడ్డున యోగా చేశారని, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వద్ద కూడా యోగా కార్యక్రమాలు జరిగాయన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ తదితర ప్రాంతాల్లో యోగా వేడుకలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/N8WrWlWNId— Narendra Modi (@narendramodi) June 29, 2025కైలాశ్‌-మానసరోవర్ యాత్ర చాలా కాలం తర్వాత తిరిగి ప్రారంభమైందని, జూలై మూడు నుండి అమర్‌నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్నదన్నారు. మరోవైపు మన దేశం ఆరోగ్య రంగంలోనూ విజయం సాధించిందని, భారత్‌ ట్రాకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. భారతదేశంలోని 64 శాతం జనాభాకు సామాజిక భద్రత అందుబాటులో ఉందంటూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దేశంలో దాదాపు 95 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రధాని మోదీ నాటి అత్యవసర పరిస్థితి చీకటి రోజులను కూడా గుర్తుచేసుకున్నారు. ఆనాటి సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను రద్దు చేశారన్నారు. అయితే చివరకు వివిధ పోరాటాలతో ప్రజలు గెలిచారని, ఫలితంగా అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారన్నారు. ఆ సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడిన వారిని మనం గుర్తుంచుకోవాలన్నారు. కాగా మేఘాలయకు చెందిన ఎరి సిల్క్ ఇటీవలే జీఐ ట్యాగ్‌ను పొందిందని, ఎరి సిల్క్‌ను ‘అహింసా సిల్క్’ అని కూడా పిలుస్తారన్నారు. చివరిగా ప్రధాని మోదీ భారత అంతరిక్ష మిషన్ గురించి కూడా మాట్లాడారు. వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందించారు.

BJP MP Raghunandan Rao get Threatening Call To Him9
‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం’.. ఎంపీ రఘనందన్‌కు మరో బెదిరింపు కాల్‌

సాక్షి,హైదరాబాద్‌: రోజుల వ్యవధిలో మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్‌ బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత వారం బెదిరింపు కాల్‌గత వారం ఎంపీ రఘునందన్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్‌ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్‌లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్‌ కాల్‌ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ కాల్‌ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్‌ పాల్గొన్నారు.బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్‌ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్‌ ఫిర్యాదుతో పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Elon Musk Criticises Donald Trump Big, Beautiful Bill Again10
కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై మస్క్‌ విమర్శలు

వాషింగ్టన్‌: అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్‌ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్‌ ద్వారా మస్క్‌ ట్వీట్‌ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్‌’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్‌ను మస్క్‌ తప్పుబట్టారు. తాజా సెనేట్‌ డ్రాఫ్ట్‌ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్‌ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్‌లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,ఎలాన్‌ మస్క్‌ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్‌ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్‌ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్‌ సైతం మస్క్‌ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్‌ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్‌ మస్క్‌ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement