ప్రధాన వార్తలు

అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
తాడేపల్లి: ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు.

AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు.వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గవర్నమెంట్ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తూ ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఎంత వరకూ శ్రద్ధ చూపిస్తుందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం

దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా
సాక్షి, నిజామాబాద్: పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు రైతులది కీలక పాత్ర అన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని పసుపు రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోనే పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందన్న అమిత్ షా.. కొనుగోలు, రవాణా, ఎగుమతి అన్నీ పసుపు బోర్డు చూసుకుంటుందన్నారు. పసుపును ప్రపంచం అద్భుత ఔషధంగా చూస్తుందని అమిత్ షా అన్నారు.‘‘ఒక బిలియన్ డాలర్లు విలువ చేసే పసుపును ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెట్పల్లిలో పసుపును అధికంగా పండిస్తారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ ఇస్తాం. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా బోర్డు ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు’’ అని అమిత్ షా ప్రశంసించారు.

నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ను చదివించాలనుకున్న లారెన్స్తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్, అధిగరం, కాల భైరవ, బుల్లెట్, హంటర్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు.చదవండి: దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని

శివాలెత్తిన షిమ్రోన్ హెట్మైర్.. వరుసగా రెండో మ్యాచ్లో ఊచకోత
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో సియాటిల్ ఓర్కాస్ ఆటగాడు షిమ్రోన్ హెట్మైర్ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి తన జట్టును గెలిపించాడు. నిన్న ఎంఐ న్యూయార్క్పై చివరి బంతికి సిక్సర్ బాది ఓర్కాస్ను గెలిపించిన హెట్మైర్.. ఇవాళ (జూన్ 29) లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్పై కూడా అదే పని (19.5వ ఓవర్) చేశాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్.. రసెల్ (39 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్మన్ పావెల్ (21 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సైఫ్ బదార్ (21 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో రెండో బంతికే వికెట్ (జోష్ బ్రౌన్ 0) కోల్పోయిన ఓర్కాస్.. షయాన్ జహంగీర్ (31 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్ జోన్స్ (38 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (26 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. హెట్మైర్ 19వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును వరుసగా రెండో మ్యాచ్లో గెలిపించాడు.ఈ మ్యాచ్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హెట్మైర్.. మేజర్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ద సెంచరీని నమోదు చేశాడు. ఎంఎల్సీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఎంఐ న్యూయార్క్ ఆటగాడు నికోలస్ పూరన్ పేరట ఉంది. పూరన్ 2023 ఎడిషన్లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఓర్కాస్ లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఈ గెలుపుతో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి.

Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు
పూరీ: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా జరుగుతున్న రథయాత్రలో అపశృతి చోటచేసుకుంది. గుండిచా ఆలయం సమీపంలో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికిపైగా జనం గాయపడ్డారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. 🚨 BREAKING:Tragedy strikes at #JagannathRathYatra in Puri, Odisha — 3 people have died and at least 10 injured in a stampede near Gundicha Temple.What was meant to be a sacred celebration turned into chaos.💔 Heartfelt prayers for the families of the victims. pic.twitter.com/nNC43uSw35— Sarcasm Scoop (@sarcasm_scoop) June 29, 2025ఆలయం వెలుపల జనసమూహం ఒక్కసారిగా పెరగడంతో భయాందోళనలు నెలకొని, ఫలితంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతులను, గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గుండిచా ఆలయం ముందు శారదబాలి సమీపంలో ఈ విషాదరక ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని చూసేందుకు భారీగా జనసమూహం అక్కడికి చేరుకుంది. దీంతో భక్తులను నియంత్రించడం పోలీసులుకు కష్టతరంగా మారింది.Distressing visuals from Jagannath Puri Rathyatra in Odisha where 3 reportedly killed in a stampede, multiple injured. pic.twitter.com/DoEZrXjM3p— Piyush Rai (@Benarasiyaa) June 29, 2025అదే సమయంలో తోపులాట జరగడంతో, కొందరు కింద పడిపోయారు. ఈ గందరగోళంలో ముగ్గురు ఇతరుల కాళ్లకింద నలిగిపోయి మృతిచెందారు. వారు ఖుర్దా జిల్లాకు చెందిన ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. బాధితులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. #WATCH | Odisha: A stampede has been reported during the Rath Yatra in Puri. Further details are awaited. (Visuals from outside the post-mortem centre in Puri) pic.twitter.com/4mOTnE6QTe— ANI (@ANI) June 29, 2025#PuriRathYatraMishap | On Puri Gundicha Temple stampede that led to death & injury of several devotees, Puri Collector Siddharth Shankar Swain says, “As soon as the Pahuda was opened, there was a sudden surge in the crowd. Nine devotees complained of breathlessness and were… pic.twitter.com/Z1TTlE7rPV— OTV (@otvnews) June 29, 2025

Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీనెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు (జూన్ 29) పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశాన్ని ట్రకోమా(కంటి వ్యాధి) నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని, 'జల్ జీవన్' మిషన్ దీనికి దోహదపడిందని ప్రధాని వివరించారు.జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా తెలంగాణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మూడువేల మంది దివ్యాంగులు పాల్గొనడం విశేషమన్నారు. యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారన్నారు. ఢిల్లీ ప్రజలు నది ఒడ్డున యోగా చేశారని, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వద్ద కూడా యోగా కార్యక్రమాలు జరిగాయన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ తదితర ప్రాంతాల్లో యోగా వేడుకలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/N8WrWlWNId— Narendra Modi (@narendramodi) June 29, 2025కైలాశ్-మానసరోవర్ యాత్ర చాలా కాలం తర్వాత తిరిగి ప్రారంభమైందని, జూలై మూడు నుండి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్నదన్నారు. మరోవైపు మన దేశం ఆరోగ్య రంగంలోనూ విజయం సాధించిందని, భారత్ ట్రాకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. భారతదేశంలోని 64 శాతం జనాభాకు సామాజిక భద్రత అందుబాటులో ఉందంటూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దేశంలో దాదాపు 95 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రధాని మోదీ నాటి అత్యవసర పరిస్థితి చీకటి రోజులను కూడా గుర్తుచేసుకున్నారు. ఆనాటి సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను రద్దు చేశారన్నారు. అయితే చివరకు వివిధ పోరాటాలతో ప్రజలు గెలిచారని, ఫలితంగా అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారన్నారు. ఆ సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడిన వారిని మనం గుర్తుంచుకోవాలన్నారు. కాగా మేఘాలయకు చెందిన ఎరి సిల్క్ ఇటీవలే జీఐ ట్యాగ్ను పొందిందని, ఎరి సిల్క్ను ‘అహింసా సిల్క్’ అని కూడా పిలుస్తారన్నారు. చివరిగా ప్రధాని మోదీ భారత అంతరిక్ష మిషన్ గురించి కూడా మాట్లాడారు. వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందించారు.

‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం’.. ఎంపీ రఘనందన్కు మరో బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: రోజుల వ్యవధిలో మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్ బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత వారం బెదిరింపు కాల్గత వారం ఎంపీ రఘునందన్కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మస్క్ ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్ను మస్క్ తప్పుబట్టారు. తాజా సెనేట్ డ్రాఫ్ట్ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్ సైతం మస్క్ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ మస్క్ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
ఏం చేయాలో అర్థం కాలేదు.. నడ్డు రోడ్డుపై ఏడ్చేశాను : ‘దసరా’ విలన్
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే
సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్!
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..
తొలి టెస్ట్లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్కు భారీ షాక్
ఈ కంపెనీ ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక ఉండవ్..
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. ఇంట్లో ఒప్పుకోలేదు: తేజస్విని
అత్తతో కలిసి అల్లుడి పరార్
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
కన్నప్పను కాపాడిన రుద్ర!
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన టీమిండియా
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇరాన్ అణుకేంద్రాలు ద్వంసం కాలేదు-పెంటగాన్ నివేదిక
ఏం చేయాలో అర్థం కాలేదు.. నడ్డు రోడ్డుపై ఏడ్చేశాను : ‘దసరా’ విలన్
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే
సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్!
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..
తొలి టెస్ట్లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్కు భారీ షాక్
ఈ కంపెనీ ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక ఉండవ్..
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. ఇంట్లో ఒప్పుకోలేదు: తేజస్విని
అత్తతో కలిసి అల్లుడి పరార్
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
కన్నప్పను కాపాడిన రుద్ర!
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన టీమిండియా
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇరాన్ అణుకేంద్రాలు ద్వంసం కాలేదు-పెంటగాన్ నివేదిక
సినిమా

నేను చేసిన ఐదు సినిమాలు ముందు నాగచైతన్యకే చెప్పా: వెంకీ అట్లూరి
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri). ప్రస్తుతం హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా అక్కినేని నాగచైతన్యకు వినిపించాడట! తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పాను.వర్కవుట్ కాలేఈరోజు వరకు నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది చైతన్య (Naga Chaitanya)కే చెప్పాను. కానీ, డేట్స్ కుదరక.. లేదా ఏదో ఒక కారణం వల్ల మా కాంబినేషన్లో సినిమా వర్కవుట్ కావడం లేదు. నెక్స్ట్ టైం అయినా కలిసి మూవీ చేద్దామని జోక్ చేసుకుంటూ ఉంటాం. అఖిల్కు మంచి హిట్టు ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది. తనతో భవిష్యత్తులో కచ్చితంగా ఓ మంచి మూవీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. సినిమావెంకీ అట్లూరి.. అఖిల్తో మిస్టర్ మజ్ను మూవీ చేశాడు. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు.చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం

నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ను చదివించాలనుకున్న లారెన్స్తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్, అధిగరం, కాల భైరవ, బుల్లెట్, హంటర్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు.చదవండి: దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని

షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు.

'21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ
ఒక్క పాటతో పడిపోయింది బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్తో కలిసి మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్ జరిగింది.మోడల్గా..తాజాగా ఈ ట్రోలింగ్పై శుభశ్రీ రాయగురు (SubhaShree Rayaguru) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాగా టైటిల్ గెలిచాను. ఐఏఎస్ కోచింగ్కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్బాస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్ వచ్చింది.సాంగ్ షూటింగ్లో పరిచయంఈ మధ్యే మేజస్టీ సాంగ్ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్ షూటింగ్లో అజయ్ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్ జరిగింది. చివరి రోజు షూటింగ్లో తను నాకు ప్రపోజ్ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు. డబ్బు కోసమే పెళ్లి?మా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్నర్ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను. ట్రోలింగ్ దెబ్బకు జ్వరంఈ ట్రోల్స్ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్ కన్ను మూత
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ప్లేయర్, నార్తాంప్టన్షైర్ లెజెండ్ వేన్ లార్కిన్స్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన.. శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. యూకేలోని బెడ్ఫోర్డ్షైర్కు చెందిన లార్కిన్స్.. 1979 మరియు 1991 మధ్య 13 టెస్టులు, 25 వన్డేలు ఇంగ్లండ్ తరపున ఆడాడు.1979 ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో లార్కిన్స్ భాగంగా ఉన్నారు. అదేవిధంగా 1989-90 వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్కు అద్బుతమైన విజయాలను అందించాడు. 1989లో హైదరాబాద్లో ఆస్ట్రేలియాపై లార్కిన్స్(124) సంచలన సెంచరీతో మెరిశాడు.ఓవరాల్గా ఇంగ్లండ్ తరపున ఆయన 1084 పరుగులు చేశాడు. అయితే 1982లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన జట్టులో లార్కిన్స్ సభ్యునిగా ఉన్నాడు. దీంతో ఆయనపై మూడు సంవత్సరాలు నిషేధం విధించారు. లేదంటే లార్కిన్స్ మరిన్ని మ్యాచ్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించేవాడు.కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం ఆయనకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. డిమాస్టిక్ క్రికెట్లో లార్కిన్స్ పేరిట 85 సెంచరీలు, 182 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లు కలిపి 40,736 పరుగులు సాధించారు. అటు బౌలింగ్లోనూ 119 పడగొట్టారు. ఆయన మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు

5 వికెట్లతో చెలరేగిన ఆసీస్ యువ సంచలనం.. ప్లే ఆఫ్స్కు మాక్స్వెల్ టీమ్
మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket) 2025 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ప్లేఆఫ్స్కు ఆర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన వాషింగ్టన్.. తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (58), జాక్ ఎడ్వార్డ్స్ (42), పియెనార్(30) రాణించారు. శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో జేవియర్ బెర్ట్లెట్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. హారీస్ రవూఫ్, షెఫర్డ్ తలా వికెట్ సాధించారు.ఐదేసిన ఓవెన్..ఇక బ్యాటింగ్లో విఫలమైన వాషింగ్టన్ స్టార్ ఆల్రౌండర్, ఆసీస్ యువ సంచలనం మిచెల్ ఓవెన్ (Mitchell Owen) బౌలింగ్లో మాత్రం సత్తాచాటాడు. ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి ఓటమిని శాసించాడు. లక్ష్య చేధనలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 157 పరుగులకు పరిమితమైంది.వాషింగ్టన్ బౌలర్లలో ఓవెన్తో పాటు రచిన్ రవీంద్ర, ఎడ్వర్డ్స్,హోలండ్ తలా వికెట్ సాధించారు. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (67; 40 బంతుల్లో) మాత్రమే రాణించాడు. కాగా శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. మరో రెండు స్ధానాల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, సియాటిల్ ఓర్కాస్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య పోటీనెలకొంది.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు

చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు
తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.. ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం(జూన్ 28) నుంచి ప్రారంభమైంది.తొలి రోజు ఆటలో సఫారీ బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాళ్లు లువాన్-డ్రి ప్రిటోరియస్(153), బాష్(100 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగగా.. డెవాల్డ్ బ్రెవిస్( 41 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో మెరిశాడు.అరంగేట్రంలోనే బ్రెవిస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. డెబ్యూ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బేబీ ఏబీడీ కేవలం 38 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు. బ్రెవిస్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ తన డెబ్యూ టెస్టులో 29 బంతులు, ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతల్ 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కానీ ఈ రెండు హాఫ్ సెంచరీలు కూడా రెండో ఇన్నింగ్స్లో వచ్చినవే కావడం గమనార్హం.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్

సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్..! భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?
సెప్టెంబర్లో ఆసియా కప్.. భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.వాస్తవానికి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ తమ మ్యాచ్లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి.దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒకవేళ పాల్గోన్న భారత్ దాయాది జట్టుతో ఆడుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విషయాలపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆరు జట్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ ఉన్నాయి.ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్..కాగా పాకిస్తాన్తో ఉద్రిక్తల కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలగాలని భారత్ నిర్ణయించుకుందని తొలుత వార్తలు వినిపించాయి. ఈ వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఆ వాస్తవమని, తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సైకియా కొట్టిపారేశారు. తాజాగా మరో బీసీసీఐ సీనియర్ ఆధికారి కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు."ఆసియాకప్లో పాల్గోకపోవడం లేదా మ్యాచ్లను బాయ్కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్తో ఆడుతాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.ఒకవేళ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాము. ఈ టోర్నీకి సంబంధించి రాబోయే రోజుల్లో మాకు ఒక క్లారిటీ వస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు.
బిజినెస్

ఇక ఏడాదికి ఇన్నే ఆడిట్లు.. సీఏలకు కొత్త రూల్
వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థలో భాగస్వామిగా గానీ చార్టర్డ్ అకౌంటెంట్లు సంవత్సరానికి ట్యాక్స్ ఆడిట్లు 60 మాత్రమే చేసేలా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇనిస్టిట్యూట్ ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ, పార్ట్నర్స్ కోసం కూడా ఆడిట్ నిర్వహించేందుకు వెసులుబాటు ఉంది.తాజాగా ప్రతిపాదించిన పరిమితిలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా తెలిపారు. అవకతవకలు జరగకుండా చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూడీఐఎన్) సిస్టంను ప్రవేశపెట్టినట్లు వివరించారు.యూడీఐఎన్ అనేది ప్రాక్టీస్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత సర్టిఫై చేసిన లేదా ధృవీకరించిన ప్రతి డాక్యుమెంట్ కోసం జనరేట్ చేసే ఒక ప్రత్యేక సంఖ్య. దేశీయ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు విదేశీ నెట్వర్కింగ్ మార్గదర్శకాల ముసాయిదాపై అభిప్రాయాలను సమర్పించడానికి గడువును జూలై 16 వరకు పొడిగించింది.

బంగారం భారీ రేట్లు.. డిమాండ్లో మార్పులు
బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో వివిధ సెగ్మెంట్లలో డిమాండ్లో మార్పులు కనిపించవచ్చని బ్రాండెడ్ ఆభరణాల తయారీ దిగ్గజం టైటాన్ తమ 2024–25 వార్షిక నివేదికలో పేర్కొంది. భౌగోళిక–రాజకీయ అంశాలు, స్థూల ఆర్థిక అనిశ్చితుల వల్ల పసిడి రేట్లు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని వివరించింది.రిటైల్ విస్తరణ, కొత్త కలెక్షన్లు, మార్కెటింగ్పై మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతనివ్వడాన్ని కొనసాగిస్తామని టైటాన్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి రేట్లు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ జ్యవెలరీ డివిజన్ ఆరోగ్యకరంగా 20 శాతం, సేమ్–స్టోర్ అమ్మకాల వృద్ధి 14 శాతం మేర నమోదైందని వివరించింది. తనిష్క్ సబ్–బ్రాండ్ అయిన మీయా రూ. 1,000 కోట్ల మార్కును దాటగా, క్యారట్లెన్ విభాగం ఆదాయం 30 శాతం పెరిగిందని పేర్కొంది.

రియల్టీలో తగ్గనున్న సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత (ఇనిస్టిట్యూషన్స్) పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) 37 శాతం తక్కువగా 3.06 బిలియన్ డాలర్లు (రూ.26,300 కోట్లు)గా ఉండొచ్చని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఇందులో హౌసింగ్ ప్రాజెక్టుల వాటా 38 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశి్చతులు, ఆర్థిక సవాళ్లు నెలకొనడాన్ని కారణంగా పేర్కొంది. దీంతో పెట్టుబడుల లావాదేవీల గడువు పొడిగింపునకు గురవుతున్నట్టు వివరించింది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్లో ఇనిస్టిట్యూషన్స్ 4.89 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో.. విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68 శాతంగా ఉంటే, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మిగిలిన 32 శాతం వాటాను ఆక్రమించినట్టు పేర్కొంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (రీట్ లు), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ ప్లేస్మెంట్ (క్యూఐపీలు), లిస్టెడ్ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. పెట్టుబడులకు ఆకర్షణీయం.. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం కొనసాగింది’’అని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ లతా పిళ్లై తెలిపారు. గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది దీనికి అనుగుణంగానే ఉండొచ్చన్నారు.

నికర ఇంధన ఎగుమతిదారుగా భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుతం నికర ఇంధన దిగుమతిదారుగా ఉండగా, వచ్చే ఆరేళ్లలో నికర ఎగుమతిదారుగా అవతరిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా పేర్కొన్నారు. ఇధనాల్, బయోడీజిల్ తదితర బయో ఇంధనాలు, హైడ్రోజన్తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ అనుకూల ఇంధనాలకు మారడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, లాజిస్టిక్స్ వ్యయాలు కూడా దిగొస్తాయని మంత్రి చెప్పారు. అదే సమయంలో కొత్త రహదారుల నిర్మాణం వల్ల ఇంధన వ్యయాలు, లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు ఈ ఏడాది చివరికి 9 శాతానికి దిగిరానున్నట్టు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు ఆరు శాతం మేర తగ్గాయన్న ఒక సర్వే ఫలితాలను ప్రస్తావించారు. ‘‘నేడు చైనాలో లాజిస్టిక్స్ వ్యయాలు జీడీపీలో 8 శాతంగా ఉన్నాయి. అమెరికాలో, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉన్నాయి. అదే భారత్లో 16 శాతంగా ఉన్నాయి’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభసాటి అయిన బయో ఇంధనాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ.. ఎగుమతులను పెంచుకోవడం కోసం రవాణా వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఫ్యామిలీ

తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్స్టా యాప్ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్టాక్ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు.

వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి
విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని, ఆయుష్షునూ తగ్గిస్తాయని నివేదికలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్ అట్లాంటిక్లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్ నోలన్ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.జీవనశైలిలో తీవ్ర మార్పులుచిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్ ట్యాక్స్ రికార్డులు, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.వ్యాధుల పాలయ్యే ప్రమాదంకొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్ ప్రోటీన్ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్ వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, టైప్– 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్ ఎక్కువ ఉందని గుర్తించారు.మానసిక అనారోగ్యంపిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది. విపరీతమైన భావోద్వేగాలుతిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.సమాజంలో ప్రవర్తనకొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి. ఇద్దరిదీ సమాన బాధ్యతఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. – డా. సునీత, సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Ramya Joseph ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ
ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే గోల్డ్మాన్ శాక్స్కు వైస్ ప్రెసిడెంట్గా తనదైన ప్రత్యేకతను నిలుపు కుంది రమ్య జోసెఫ్ (Ramya Joseph). ‘పెఫిన్’ (Pefin) పేరుతో ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ స్టార్ట్ చేసి విజయపథంలో దూసుకుపోతుంది.కొలంబియా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ చేసింది రమ్య.చదువు పూర్తయిన తరువాత మల్టీనేషనల్ ఫైనాల్సియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్లో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థ ‘ది బ్రిడ్జ్ ; ప్రాజెక్ట్’ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసింది. ‘ది బ్రిడ్జ్’లో ఆటోమేషన్, ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం పూర్తిస్థాయి టెక్నాలజీ ప్లాట్ఫామ్ ప్రారంభించింది.రిటైర్మెంట్ తరువాత తన తల్లిదండ్రుల ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు రమ్యకు ‘పెఫిన్’ ఆలోచన వచ్చింది. ‘పర్సనల్ ఫెనాన్స్ ఇంటెలిజెన్స్’ను ‘పెఫిన్’గా సంక్షిప్తీకరించింది.‘ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మా ΄్లాట్ఫామ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కస్టమర్లకు ఉపకరించే పర్సనలైజ్డ్, యాక్షనబుల్ ΄్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను అందిస్తాం’ అంటుంది రమ్య.ఏఐ–ఆధారిత పర్సనల్ ఫైనాన్స్ సెగ్మెంట్కు యువతలో మంచి ఆదరణ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం జెన్–జెడ్, మిలీనియల్స్లో 41 శాతం మంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏఐ సలహాలు తీసుకుంటున్నారు.‘ఎంతైనా రోబో సలహాలే కదా!’ అని ఏఐ బేస్డ్ టెక్నాలజీ గురించి తక్కువ చేసి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని...‘మా సర్వీస్ సింపుల్గా, సులభంగా ఉంటుంది. ఎలాంటి గందరగోళమూ ఉండదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది’ అంటుంది రమ్య.వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో రోబో అడ్వైజర్లు మేజర్ ట్రెండ్గా మారారు. అయితే ‘పెఫిన్’ వాటి కంటే భిన్నమైంది అంటుంది రమ్య. ‘కస్టమర్లకు సంబంధించిన మూడు నెలల స్పెండింగ్ డేటా తీసుకుంటుంది పెఫిన్. కస్టమర్ల అభిరుచుల గురించి తెలుసుకొని ఏది సరిౖయెనదో, ఏది కాదో సూచిస్తుంది. మా నెట్వర్క్ కస్టమర్ల సందేహాలను తీర్చి ఎన్నో సలహాలు ఇస్తుంది. సరిౖయెన దారి చూపుతుంది’ అంటుంది రమ్య.ఆర్థిక విషయాల గురించి మరింత అవగాహన కలిగించడానికి కస్టమర్లకు కంటెంట్ కూడా పంపుతుంది పెఫిన్. నా తల్లిదండ్రులు రిటైర్మైంట్కు దగ్గరలో ఉన్నప్పుడు, వారి ఆర్థికభద్రతకు సంబంధించి రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఆలోచన వచ్చింది. నేను రిటైర్ కావాలను కుంటున్నాను... అని ఎవరైనా అన్నప్పుడు వారికి సరిౖయెన దారి కనిపించదు. ఒకవేళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలనుకుంటే అది ఖర్చుతో కూడిన పని. ఈ నేపథ్యంలో పెఫిన్ అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. – రమ్య జోసెఫ్ ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే

Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే
జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది అందరికీ తెలిసిన విషయమే. పోషకాలు మెండుగా ఉండే జామ పండుతో ప్రయోజనాలు పొందవచ్చ. కానీ జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జామ ఆకులు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పట్టినా మంచి ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి.జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాలసేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.జామ ఆకులు ఆరోగ్యానికి ముఖ్యంగా, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి సహాయపడతాయి జామ ఆకు టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువునుంచి బయటపడవచ్చు.(Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు)వీటిల్లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తాయి,జామ ఆకు టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.నోట్ : ఇవి అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. వీటిని వాడేముందు,వాడిన తరువాత ఏదైనా సమస్యలొచ్చినా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జామ ఆకులను ఉపయోగించడం మంచిది.
ఫొటోలు
అంతర్జాతీయం

పాక్లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికుల మృతిచెందారు. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళంలోని సభ్యుడు.. ఆర్మీ వాహనంపైకి దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 19 మంది స్థానికులు, మరో 10 మంది ఆర్మీలోని సైనికులు గాయాలపాలయ్యారు.మిలటరీ కాన్వాయ్ వెళుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ ఒక్కసారిగా ఆ కాన్వాయ్పై దూకాడు. ఆపై వెంటనే తన వెంట తెచ్చుకున్న బాంబును పేల్చేసుకున్నట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో దగ్గర్లో ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే ఇది ఎవరు చేశారు అనే దానిపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రిక్-ఈ-తాలిబన్ గ్రూప్ అనేది తరుచుగా పాక్లోని సైనికులే లక్ష్యంగా దాడులు చేయడంతో ఇది కూడా వారే చేసే ఉంటారని అనుమానిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ ప్రాంతంలో జరగ్గా, ఇటీవల కాలంలో పాకిస్తాన్లోని పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాన్డోలా చెక్పోస్ట్ పరిధిలో సూసైడ్ బాంబింగ్ జరిగింది. ఇక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపే లక్ష్యంగా దాడి జరిగింది. బలోచ్ మిలిటెంట్లు జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ను అటాక్ చేసిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అసువులు బాశారు. ఇక గ్లోబెల్ టెర్రర్ ఇండెక్స్ లో పాకిస్తాన్లోనే అత్యధికంగా ఉంది. పాక్లో ఉగ్రవాదం అనేది 45 శాతంగా నమోదు కాగా, అంతకంతకు పెరుగుతూ ఉంది. మరణాల పరంగా చూస్తే 2023లో ఉగ్రవాద చర్యలతో 748 ప్రాణాలు కోల్పోగా, 2024 నాటికి అది 1, 081గా పెరిగింది.

ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025

కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది!
‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. ఎలాన్ మస్క్ సృష్టించిన అద్భుతం డ్రైవర్లెస్ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. First time that a car has delivered itself to its owner! https://t.co/xgZBRDaMiX— Elon Musk (@elonmusk) June 28, 2025పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్ మస్క్ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్లు నడపాలన్న మస్క్ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. మోడల్ వై గురించి క్లుప్తంగా..2020లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. టెస్లా మోడల్ త్రీ ప్లాట్ఫామ్పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్లోని ఆస్టిన్ ప్రాంతం ఫ్రీమాంట్లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్లలో ఈ మోడల్ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్ను బట్టి 60 - 81 కిలోవాట్ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్ ఫాస్పే్ట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే వేరియంట్ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్స్ట్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వేరియంట్ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్ క్రూయిజ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్ చేసిన లారెన్
ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్ ఫొటోను లారెన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జెఫ్ బెజోస్(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్ అయిన లారెన్(55)తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరగ్గా.. శుక్రవారం(జూన్ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.వివాహం తర్వాత ఈ ఇన్స్టా పేజీకి తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్లను షేర్ చేశారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్లు 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్తో ఎంగేజ్మెంట్ టైంలో 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.వైవాహిత జీవితానికొస్తే.. మెకెంజీ స్కాట్ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్తో డేటింగ్ మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos)
జాతీయం

బంగ్లాదేశ్కు షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జనపనార, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నావ సేవా పోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు వాణిజ్య శాఖ పరిధిలోని ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. బంగ్లాదేశ్తో సంబంధాల్లో అగాధం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం గమనార్హం.దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛా ప్రాంత(సాఫ్టా) నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి పన్నులూ లేవు. ఇది దేశీయ జూట్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే, ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే జనపనార, సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ(ఏడీడీ) విధించింది.ఈ చర్య బంగ్లాదేశ్ దిగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. పైపెచ్చు, బంగ్లాదేశ్ ఎగుమతిదారులు సాంకేతికపరమైన సాకులు చూపుతూ ఏడీడీ నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబదీ్ధకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి.

కోల్కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి
కోల్కతా: కోల్కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై కమిలిపోయిన గుర్తులను మెడికల్ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.26న రాత్రి 10 గంటలకు కోల్కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.ఈ కేసులో కోల్కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం?

బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు?
న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ నియమావళి ప్రకారం, జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్ర శాఖల (స్టేట్ యూనిట్ల) అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వాలి. దేశవ్యాప్తంగా బీజేపీకి 37 రాష్ట్ర శాఖలు ఉన్నాయి. అంటే 19 రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటివరకు పార్టీ 14 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిచేసింది. మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశముంది. జూలై రెండో వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఇలా.. బీజేపీ దశలవారీ ప్రక్రియ ద్వారా అధ్యక్షుడిని ఎంచుకుంటుంది. ముందుగా బూత్ అధ్యక్షులు, ఆ తర్వాత మండల అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారు. సగం జిల్లాల అధ్యక్షులు ఎంపికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారు. అలాగే 19 రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమవుతుంది. చాలా సందర్భాల్లో ఈ ఎన్నికలు ఏకగ్రీవ పద్ధతిలోనే జరుగుతాయి. పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కలిసి బీజేపీ జాతీయ అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేస్తారు. కొత్త అధ్యక్షుడి ముందు సవాళ్లు జేపీ నడ్డా జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం జనవరి 2023లోనే ముగిసింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై దృష్టి పెట్టారు. కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే 2025లో బిహార్, 2026లో పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది. కుల, ప్రాంత సమీకరణపై దృష్టి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో కుల సమీకరణ, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటారు. పలువురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అందువల్ల కేంద్ర కేబినెట్లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి మోదీ జూలై 2 నుంచి 9వ తేదీ వరకు ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విదేశాల నుంచి తిరిగివచి్చన తర్వాత, జూలై రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

డీపీఆర్లో స్పష్టత లేదు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశలోని కొన్ని కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో ప్రాజెక్ట్కు సంబంధించిన చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని, ఇవి లేకుండా ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నాయి.ముఖ్యంగా ఎల్ అండ్ టీ సంస్థ నెట్వర్క్పై ఉమ్మడి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవై) ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఎల్ అండ్ టీ నెట్వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం క్లారిటీ కోరుతు న్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే మెట్రో ఫేజ్–2 డీపీఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఆర్ఎల్) కేంద్రానికి సమర్పించింది. అయితే, పుణే మెట్రోకు అనుమతిచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోపై మాత్రం నోరు మెదపలేదు. డీపీఆర్లో స్పష్టత లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేంద్రం లేవదీసిన కొన్ని ప్రశ్నలు..» మొత్తం 76.4 కి.మీ. నిడివితో 5 కారిడార్లతో రూ.2,269 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2ను నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొత్త లైన్లు, ఇప్పటికే ఉన్న లైన్లపై రైళ్లను సమన్వయంతో నడుపుతామని డీపీఆర్లో ప్రస్తావించారు. అయితే, ఎల్ అండ్ టీ నెట్వర్క్పై ఉమ్మడి ఎస్పీవై ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది స్పష్టంగా పేర్కొనలేదు. » 50:50 ఎస్పీవై ట్రైన్లు ఎల్అండ్టీ నెట్ వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయనేది స్పష్టంగా తెలియాలి. ఇలాంటి సేవల వల్ల ఎల్ అండ్ టీకి పరోక్షంగా లాభం కలుగుతోంది. కానీ, ఎస్పీవై మాత్రం ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. » ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కారిడార్లపై మూడు కార్ ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ట్రైన్లు చాలక కిక్కిరిసిపోతున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ అదనపు బోగీలు, ట్రైన్లను అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ, డీపీఆర్లో దీనిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఎల్ అండ్ టీతో చర్చించిందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.» జూన్ 3వ తేదీ తర్వాత మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ పాల్గొన్నారు. ఖర్చు పంచుకోవడం, ఆపరేషనల్ అంశాలపై ఇంకా అంగీకారం లేదు. ఫేజ్–2 అమలయ్యాక ప్రభుత్వ సంస్థతో లాభాలు పంచుకోలేం అని ఆయన స్పష్టంగా తెలిపారు అని కేంద్రం పేర్కొంది.
ఎన్ఆర్ఐ

NRI: బ్లూమింగ్టన్లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
బ్లూమింగ్టన్: అమెరికాలో తెలుగు వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింత చేరువ అవుతుంది. తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్స్ విభాగాలను ప్రారంభిస్తున్నారు. క్రమంలోనే తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో దాదాపు ఎనభై మంది తెలుగు ప్రజలు నాట్స్ చాప్టర్ ప్రారంభంలో పాల్గొన్నారు. బ్లూమింగ్టన్ చాప్టర్ సలహాదారులకా వేణుకుమార్ మద్దినేని, కృష్ణ వైట్ల వ్యవహరిస్తున్నారు. నాట్స్ బ్లూమింగ్టన్ చాప్టర్ కో ఆర్డినేటర్ బాధ్యతలను విజయ్ కృష్ణ చింటాకు నాట్స్ అప్పగించింది. బ్లూమింగ్టన్ నాట్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్లుగా ప్రేమేష్ గోగినేని, భరత్ అబ్బూరి, మహిపాల్ రెడ్డి గసిరెడ్డి లను నియమించింది. నాట్స్ బ్లూమింగ్టన్ మహిళా సమన్వయకర్తగా సుష్మ గుడ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వివరించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల సహకారంతో నాట్స్ విభాగం కార్యక్రమాలు చేపడుతుందని బ్లూమింగ్టన్ నాట్స్ నాయకులు తెలిపారు. స్థానికంగా ఉండే తెలుగు వారికి సేవలు అందించేందుకు నాట్స్ బ్లూమింగ్టన్ టీంను సిద్ధం చేసేలా ఈ చాప్టర్ ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల తరపున ప్రాతినిధ్యం వహించబోతున్న వారి ఆలోచనలను ఈ కార్యక్రమలో పంచుకున్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలను బ్లూమింగ్టన్ లో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికపై నాట్స్ నాయకులు చర్చించారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు

పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
డల్లాస్: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహదపడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డల్లాస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ నాయకత్వం అభినందించింది. అలాగే స్పాన్సర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులతో పాటు 20 కి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. సమాజంలో సేవా స్ఫూర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్లోని మహాత్మగాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగు వారు వినియోగించుకున్నారు. నాట్స్ బోర్డు సలహా సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ బాపూజీ దర్శిలు ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిష్ట్ల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

కూతురిపై తల్లి అత్యాచార పర్వం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కన్నకూతురిపై తల్లి లైంగిక దాడులు చేస్తున్న దారుణ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఆరేళ్లుగా ఓ తల్లి కుమార్తెపై లైంగికదాడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి దాష్టీకం గురించి ఉపాధ్యాయురాలికి మొరపెట్టుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వివాహం జరిగాక భర్తతో ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లు నిందితురాలు బుకాయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన తల్లి కుమార్తె మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: అత్త, భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి శనివారం మెదక్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలు, అతడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన డాకొల్ల నవీన్ ఐదేళ్ల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య (24)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్లలోపు ఆడపిల్లలు రుచిక, యశ్విక ఉన్నారు. గతేడాది నవీన్ తన అత్తగారిల్లు లక్ష్మాపూర్కు వచ్చి గొడవపడ్డాడు. ఈ క్రమంలో అత్త రాజమణి, భార్య రమ్యను చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో రామాయంపేటలో నవీన్పై హత్యాయత్నం కేసు నమోదుకాగా, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే లోక్అదాలత్లో ఈ కేసుపై వారిద్దరూ రాజీపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అత్త, భార్యపై హత్యాయత్నం కేసు విషయమై శనివారం కోర్టుకు హాజరైన నవీన్.. భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపైనుంచి దూకాడు. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా నవీన్, పిల్లలు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. అదనపు ఎస్పీ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, నవీనే భార్యాపిల్లలను చంపే కుట్రలో భాగంగా భవనంపైనుంచి తోసిఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లడిల్లుతున్న చిన్నారులు.. కాగా, బాలిక రుచికకు ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఛాతీలోనూ తీవ్ర గాయమైంది. ఏడాది న్నర వయసున్న యశ్విక నోట్లోని పళ్లన్నీ రాలిపో యాయి. తీవ్రగాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా చలించిపోతున్నారు.

డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు.

ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే.. ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG— NDTV (@ndtv) June 26, 2025