టీ20 ప్రపంచకప్-2024
T20 World Cup 2024
-
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.ఇక హిట్మ్యాన్తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్డౌన్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.ఇక మిడిలార్డర్లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ రిటైర్మెంట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్కప్-2024 చాంపియన్గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.నో కోహ్లిఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్లు ఆడి 573 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యాది కీలక పాత్రటీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్గా గతేడాది అతడు 17 మ్యాచ్లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్దీప్ సింగ్ 18 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్వికెట్ టేకర్గానిలిచాడు.ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్దీప్ సింగ్(ఇండియా). -
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్వాష్కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రత్యర్థి చేతిలో క్లీన్స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్లో ఓ మ్యాచ్ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
Rewind 2024: విండీస్లో ‘విన్’.. మనూ సూపర్... చెస్లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్కు, టైటిల్కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్లో అయితే పతకాల తోరణం!చెస్లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్లో ‘విన్ ఇండియా’ కపిల్దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్ను అందించింది.ప్రతీ మ్యాచ్లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్తో దంచికొట్టిన ఫామ్లో ఉండటంతో మ్యాచ్ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో బుమ్రా, యువ పేసర్ అర్ష్దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్దేవ్లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్బై చెప్పిన డివైన్ క్రికెట్పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్లో ఆడే కివీస్ టీమ్లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్తో..పేస్ బౌలింగ్తో పాటు బ్యాటర్గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్లో భారత్తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
T20 WC: మనసులోనే శపిస్తున్నావని తెలుసు: సంజూతో రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపికైనా.. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్. రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చిన కారణంగా ఈ వికెట్ కీపర్ను ఈవెంట్ ఆసాంతం బెంచ్కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్లో రోహిత్ సేన చాంపియన్గా నిలవడంతో వరల్డ్కప్ గెలిచిన సభ్యుల జాబితాలో మాత్రం సంజూ తన పేరును లిఖించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో తాజాగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సంజూ శాంసన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. సౌతాఫ్రికాతో ఫైనల్కు ముందు తనకు మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందని.. మెగా మ్యాచ్కు సిద్ధంగా ఉండాలని యాజమాన్యం చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆఖరి నిమిషంలో తన అదృష్టం తారుమారైందని.. పాత జట్టుతోనే టైటిల్ మ్యాచ్ ఆడాలనే నిర్ణయం తీసుకున్నారని సంజూ పేర్కొన్నాడు.ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జర్నలిస్టు విమల్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఫైనల్కు ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్నపుడు రోహిత్ నన్ను పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాడు.జట్టు నుంచి నన్ను తప్పిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు. ‘నేను ఇలా ఎందుకు చేశానో నీకు అర్థమైంది కదా!.. ఆఖరి నిమిషంలో ఇలా కూడా జరుగుతుందని నీకు తెలుసు కదా! ఇది సహజమైన ప్రక్రియే!’ అని నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ.. ‘ముందుగా మ్యాచ్ గెలవాలి.ఇప్పుడు మీ దృష్టి మొత్తం మ్యాచ్ మీదే పెట్టండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని చెప్పాను. అయితే, నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘మనసులో నాకు శాపనార్థాలు పెడుతున్నావని నాకు తెలుసు. నాకు తెలిసి నువ్వు సంతోషంగా లేవు. మీ మైండ్లో ఇంకేదో విషయం ఉందనిపిస్తోంది’ అన్నాడు.అప్పుడు నేను.. ‘ఓ ఆటగాడిగా మ్యాచ్ ఆడాలని నేను ఆశపడటం సహజం. మీ నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాను. మ్యాచ్ ఆడలేకపోయాననే పశ్చాత్తాపం నాకు ఉంటుంది. మీ లాంటి గొప్ప లీడర్తో వరల్డ్కప్ ఫైనల్ ఆడలేకపోతున్నాననే బాధ ఉంటుంది. అదొక్కటే నా మెదడును తొలిచివేస్తుంది’ అని అన్నాను’’ అంటూ సంజూ శాంసన్ నాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.‘‘ఏదేమైనా ఫైనల్కు సిద్ధంగా ఉండాలని ముందుగానే చెప్పడంతో నేను మానసికంగా రెడీ అయిపోయా. అయితే, టాస్కు ముందు పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించారు. కాస్తత నిరాశకు గురైనా.. పర్లేదు. ఇలాంటివి సహజమే అని సరిపెట్టుకున్నా. అయితే, టాస్ పడటానికి ముందు కూడా రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి.. నాకోసం పది నిమిషాలు కేటాయించడం మామూలు విషయం కాదు. అతడి స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఇలా చేసే వారు కాదేమో’’ అని సంజూ శాంసన్ రోహిత్పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్కు ఊహించని షాక్? -
మహిళల టి20 ప్రపంచకప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ (ఫొటోలు)
-
T20 WC: పాక్పై గెలిచి సెమీస్కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్ప్రీత్ కౌర్ టీమ్కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్లో ఆడిన నాలుగు మ్యాచ్లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
W T20 WC: కథ మళ్లీ మొదటికి...
‘నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్ కప్ ట్రోఫీ లేకుండానే హర్మన్ ముగించింది. వరుసగా గత మూడు టి20 వరల్డ్ కప్లలో సెమీస్, ఫైనల్, సెమీస్... ఇదీ మన ప్రదర్శన. టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్లో కచ్చితంగా టాప్–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్ మ్యాచ్ల సంగతేమో కానీ... సెమీస్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదుగత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్లు భారత్కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్ బృందం ఫేవరెట్గా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్ కప్పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. ఆసీస్ ముందు తలవంచిసెమీస్లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్ ముందు తలవంచాల్సి వచ్చింది. నాలుగో వికెట్కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో ఓవరాల్గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.హర్మన్ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్తో పోలిస్తే మన బౌలింగ్ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్తో మ్యాచ్లలో దెబ్బ తీసింది. సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్నెస్ క్యాంప్, స్కిల్ క్యాంప్లు చాలా బాగా జరిగాయని కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం. –సాక్షి క్రీడా విభాగం -
వరుసగా విఫలమవుతున్నా ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్న హర్మన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.హర్మన్ తాజాగా పాక్తో జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్లో హర్మన్ కెప్టెన్గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్లో ఓటమిపాలైంది. మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.ఓవరాల్గా చూస్తే.. బ్యాటింగ్లో బెత్ మూనీ, తహిళ మెక్గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్లో గెలిచినా టీమిండియా సెమీస్కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్పై గెలిచినా నెట్ రన్రేట్ ఇంకా మైనస్లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్లన్నీ గెలవాల్సి ఉంటుంది. చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్గా సచిన్ -
వరల్డ్కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!
మహిళల టీ20 వరల్డ్కప్-2024 తొలి మ్యాచ్లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. ఈ గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు ప్రస్తుత వరల్డ్కప్లో బోణీ కొట్టడంతో పాటు 3836 రోజుల సుదీర్ఘ విరామానంతరం ఓ టీ20 వరల్డ్కప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్ల అనంతరం వరల్డ్కప్లో లభించిన విజయం కావడంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్ చివరి సారి 2014 టీ20 వరల్డ్కప్లో విజయం సాధించింది. నాడు బంగ్లాదేశ్ ఐర్లాండ్పై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వరుసగా 16 టీ20 వరల్డ్కప్ మ్యాచ్ల్లో ఓడింది. నాలుగు ఎడిషన్లలో (2016, 2018, 2020, 2023) ఆ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు.An emotional win 💯Bangladeshi skipper Nigar Sultana reacts after a streak breaking victory 🙌 👇https://t.co/aarEGSWApL— Cricket.com (@weRcricket) October 3, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టీ20 వరల్డ్కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చదవండి: బోణీ బాగుండాలి -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
బాబర్కు ఇప్పుడైనా సిగ్గు వచ్చింది: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైనపుడే ఈ పని చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా వన్డే వరల్డ్కప్-2023లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్ చేతిలో తొలిసారి వన్డే పరాజయం చవిచూసిన బాబర్ బృందం.. సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా బాబర్ ఆజం టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా ఈ క్రమంలో టెస్టు జట్టుకు షాన్ మసూద్ను నాయకుడిగా ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. టీ20 పగ్గాలను ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే, వీరిద్దరు ఆరంభం నుంచే కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు షాహిన్పై వేటు వేసిన పీసీబీ.. బాబర్ ఆజంను తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది.తాజాగా మరోసారి రాజీనామాఅయితే, అమెరికా- వెస్టిండీస్లో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓడటమే గాక.. కనీసం సూపర్-8 దశకు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టింది. జూన్లో ఈ టోర్నీ ముగిసిన నాటి నుంచి బాబర్ ఆజం.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చిందిబ్యాటింగ్పై దృష్టి పెట్టే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు బాబర్ ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సికందర్ బఖ్త్.. ‘‘ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది. నిజానికి వరల్డ్కప్లో మా జట్టు ఓడిన నాడు.. అంటే జూన్ 16నే అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పిందిఅప్పుడే కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. దేశం మొత్తం ఇదే కోరుకుంది. కానీ అతడు మొండిగా ప్రవర్తించాడు. తను తాను ఓ కింగ్లా ఊహించుకోవడం బాబర్కు అలవాటు. తన ఆట తీరు బాగా లేకున్నా.. బాగుందనే ఫీలవుతాడు. అయితే, బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది. అందుకే ఇప్పటికైనా కెప్టెన్సీని వదులుకున్నట్లు ప్రకటించాడు’’ అని పేర్కొన్నాడు.ఇంటా, బయటా వరుస ఓటములు.. అయినాకాగా టెస్టులకు షాన్ మసూద్నే సారథిగా కొనసాగించడంపై కూడా సికందర్ బఖ్త్ విమర్శలు చేశాడు. ఇంటా, బయటా వరుస టెస్టు సిరీస్లలో ఓటములనే బహుమతిగా ఇస్తున్న ఆటగాడు కెప్టెన్గా ఉండటం దురదృష్టకరమంటూ పెదవి విరిచాడు. కాగా పాకిస్తాన్ తరఫున 1976- 1989 వరకు సికందర్ బఖ్త్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 26 టెస్టుల్లో 67, వన్డేల్లో 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.చదవండి: ఇంగ్లండ్ బజ్బాల్ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
టీ20 వరల్డ్కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్వైట్లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
టీ20 వరల్డ్కప్ మ్యాచ్ అఫీషియల్స్ పేర్ల ప్రకటన
మహిళల టీ20 వరల్డ్కప్ 2024 మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో పది మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు.మ్యాచ్ రిఫరీలు: షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరాఅంపైర్లు: లారెన్ అజెన్బాగ్, కిమ్ కాటన్, సారా దంబనేవానా, అన్నా హారిస్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, వృందా రతి, స్యూ రెడ్ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్కాగా, మహిళల టీ20 వరల్డ్కప్ అక్టోబర్ 3 నుంచి షార్జా, దుబాయ్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ మొత్తం 18 రోజుల పాటు సాగనుంది. ఇందులో 23 మ్యాచ్లు జరుగనున్నాయి. అక్టోబర్ 20న దుబాయ్లో జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీ పడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడనుండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో (అక్టోబర్ 3) టోర్నీ మొదలు కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా జరుగనుంది.చదవండి: డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..! -
టీ20 వరల్డ్కప్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక క్రికెట్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు చమారీ ఆటపట్టును కెప్టెన్గా ఎంపిక చేశారు. 38 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ ఇనోకా రణవీర వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ఓపెనర్ విష్మి గుణరత్నే, మిడిలార్డర్ బ్యాటర్లు కవిషా దిల్హరి, హర్షిత సమరవిక్రమ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.కాగా, టీ20 వరల్డ్కప్-2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక) తమతమ జట్లను ప్రకటించాయి. స్కాట్లాండ్ ఒక్కటి జట్టును ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. గ్రూప్-బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. వరల్డ్కప్ మ్యాచ్లు అక్టోబర్ 3 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్తో) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరునుంది. షార్జా, దుబాయ్ వేదికలుగా టీ20 వరల్డ్కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్తో ముగుస్తుంది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టు: చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచినీ నిసంసాలా, ఉదేశిక ప్రబోధనీ, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఇనోకా రణవీర, శశిని గింహని, అమా కాంచన, సుగందిక కుమారి [ట్రావెలింగ్ రిజర్వ్: కౌశిని నుత్యాంగన]చదవండి: భారత బౌలర్ల విజృంభణ.. 149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
టీ20 వరల్డ్కప్.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్కప్ 2024 టికెట్ల రేట్ల వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్లు (సుమారు రూ. 100)గా నిర్ణయించింది. యువతలో క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఏళ్లలోపు వారికి టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్కప్ యొక్క లేజర్ షోను ప్రదర్శించబడింది.కాగా, మహిళల టీ20 వరల్డ్కప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్టు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి గ్రూప్లో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్ మ్యాచ్లు దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ షార్జాలో జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్లో జరుగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్లో జరుగనుంది.చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. -
కౌన్ బనేగా కరోడ్పతిలో టీ20 వరల్డ్కప్నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్లో ఎవరూ టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
మెంటలోడు అనుకుంటారని భయపడ్డా: ద్రవిడ్
ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్కప్-2024 చాంపియన్గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..ఫలితంగా కెప్టెన్గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నాఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్గా ఉండాలని చెబుతాను.గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను. అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ -
టీ20 వరల్డ్కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా లారా వోల్వార్డ్ట్ ఎంపికైంది. వోల్వార్డ్ట్ కెప్టెన్గా ఇది తొలి వరల్డ్కప్. గత టీ20 ప్రపంచకప్లో సూన్ లస్ సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది. ఆ టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్ వరకు చేరింది. అనంతరం సూన్ లస్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వోల్వార్డ్ట్ సౌతాఫ్రికా టీ20 జట్టు పగ్గాలు చేపట్టింది. రానున్న వరల్డ్కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూన్ లస్, అయాబొంగా ఖాకా, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ వంటి సీనియర్లతో పాటు అయాండా హ్లూబి, అన్నరీ డెర్క్సెన్ వంటి యువ ప్లేయర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వరల్డ్కప్ బృందంలో 18 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ శేషనీ నాయుడు కూడా చోటు దక్కించుకుంది. అండర్-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనల కారణంగా శేషనీ నాయుడు వరల్డ్కప్ జట్టులోకి వచ్చింది. ఇదే జట్టు వరల్డ్కప్కు ముందు పాకిస్తాన్తో జరిగే మూడో మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొంటుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16-20 వరకు జరుగనుంది.వరల్డ్కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్లో జరుగనుంది. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్సెన్, మైకే డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సూన్ లస్, నాన్కులుకెకు మ్లాబా, శేషనీ నాయుడు, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్ట్రావెలింగ్ రిజర్వ్: మియాన్ స్మిట్స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల స్కాట్లాండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్ బ్రైస్ ఎంపికైంది. వరల్డ్కప్లో స్కాట్లాండ్ గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్లో జరుగనుంది. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.కారణం అతడేటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అందుకే విభేదాలు?ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్పై మండిపడ్డారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.కలిసిపోయారుఈ నేపథ్యంలో తాజా సీజన్లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్గా.. హార్దిక్ వైస్ కెప్టెన్గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్తో పాటు ఆల్రౌండర్గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. -
Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!
సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్లు ఆడిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్లు ఆడింది. ఇక అండర్-19 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్తో హర్మన్ బృందం తొలి మ్యాచ్లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు. ----హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్)మ్యాచ్లు 173పరుగులు 3426అత్యధిక స్కోరు 103సగటు 28.08సెంచరీలు 1అర్ధ సెంచరీలు 12వికెట్లు 32---స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)మ్యాచ్లు 141పరుగులు 3493అత్యధిక స్కోరు 87సగటు 28.86అర్ధ సెంచరీలు 26---షఫాలీ వర్మమ్యాచ్లు 81పరుగులు 1948అత్యధిక స్కోరు 81సగటు 25.63అర్ధ సెంచరీలు 10---యస్తికా భాటియామ్యాచ్లు 19పరుగులు 214అత్యధిక స్కోరు 36సగటు 16.46---దీప్తి శర్మమ్యాచ్లు 117పరుగులు 1020అత్యధిక స్కోరు 64సగటు 23.72అర్ధ సెంచరీలు 2వికెట్లు 131---జెమీమా రోడ్రిగ్స్మ్యాచ్లు 100పరుగులు 2074అత్యధిక స్కోరు 76సగటు 30.50అర్ధ సెంచరీలు 11---రిచా ఘోష్మ్యాచ్లు 55పరుగులు 860అత్యధిక స్కోరు 64*సగటు 28.66అర్ధ సెంచరీలు 1---పూజ వస్త్రకర్మ్యాచ్లు 70వికెట్లు 57అత్యుత్తమ ప్రదర్శన 4/13సగటు 21.24ఎకానమీ 6.36---అరుంధతి రెడ్డిమ్యాచ్లు 29వికెట్లు 21అత్యుత్తమ ప్రదర్శన 2/19సగటు 34.66ఎకానమీ 7.92---రేణుక సింగ్మ్యాచ్లు 47వికెట్లు 50అత్యుత్తమ ప్రదర్శన 5/15సగటు 22.02ఎకానమీ 6.40---హేమలతమ్యాచ్లు 23పరుగులు 276అత్యధిక స్కోరు 47సగటు 16.23వికెట్లు 9---ఆశా శోభనమ్యాచ్లు 3వికెట్లు 4ఉత్తమ ప్రదర్శన 2/18సగటు 20.50ఎకానమీ 7.45---రాధ యాదవ్మ్యాచ్లు 80వికెట్లు 90ఉత్తమ ప్రదర్శన 4/23సగటు 19.62ఎకానమీ 6.55---శ్రేయాంక పాటిల్మ్యాచ్లు 12వికెట్లు 16ఉత్తమ ప్రదర్శన 3/19సగటు 18.75ఎకానమీ 7.14---సజన సజీవన్మ్యాచ్లు 9పరుగులు 30అత్యధిక స్కోరు 11సగటు 10.00 -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్కప్లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్తో రెండు, ఇండియా, పాకిస్తాన్తో ఒక్కో మ్యాచ్లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్కప్ 2024 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్గా స్మృతి మంధన వ్యవహరించనుంది. వికెట్కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ప్రామాణికంగా వారి ఎంపిక జరుగనుంది. ఈ జట్టుతో పాటు భారత సెలెక్టర్లు ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్లు, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లను కూడా ఎంపిక చేశారు. ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఉమా ఛెత్రి (వికెట్కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్.. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లుగా రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా ఎంపికయ్యారు.టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్కీపర్), యాస్తికా భాటియా (వికెట్కీపర్)*, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సంజన సజీవన్ట్రావెలింగ్ రిజర్వ్లు: ఉమా ఛెత్రీ (వికెట్కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రాకాగా, మహిళల టీ20 వరల్డ్కప్ అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్తో తలపడుతుంది. అనంతరం దుబాయ్ వేదికగానే అక్టోబర్ 6న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. -
ఆ రెండు పిచ్లు అసంతృప్తికరం..!
దుబాయ్: టి20 ప్రపంచకప్లో అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య వెస్టిండీస్లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన టరోబా పిచ్ సంతృప్తికరంగా లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. మెగా టోర్నీ ముగిసిన రెండు నెలల తర్వాత పిచ్లపై ఐసీసీ మంగళవారం నివేదిక విడుదల చేసింది. టరోబా పిచ్తో పాటు.. అమెరికాలో నిర్వహించిన ప్రపంచకప్ తొలి రెండు మ్యాచ్లకు వేదికగా ఉన్న న్యూయార్క్ పిచ్లు కూడా బాగాలేవని ఐసీసీ వెల్లడించింది. తాత్కాలికంగా నిర్మించిన స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్తో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 96 పరుగులకు పరిమితమైంది. అస్థిర బౌన్స్తో ఆ పిచ్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయని అప్పుడే వ్యాఖ్యతలు పేర్కొనగా... తాజాగా ఆ రెండింటిని ఐసీసీ ‘అసంతృప్తికరం’ జాబితాలో చేర్చింది.ఐర్లాండ్, భారత్ మ్యాచ్లో అయితే అనూహ్య బౌన్స్ కారణంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాల బారిన పడ్డారు. అనంతరం బుమ్రా బౌలింగ్లో ఐర్లాండ్ బ్యాటర్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో టి20 ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డ్రాప్–ఇన్ పిచ్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్కు ఐసీసీ మంచి రేటింగ్ ఇచ్చింది. సాధారణంగా పిచ్ల ప్రమాణాలను బట్టి ఐసీసీ ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘సంతృప్తికరం’, ‘అసంతృప్తికరం’, ‘అన్ఫిట్’ రేటింగ్స్ ఇస్తుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్నకు ఆతిథ్యమివ్వగా.. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గి భారత్ చాంపియన్గా నిలిచింది. -
జట్టులో చోటు ఎందుకు లేదు?.. సంజూ రిప్లై అదుర్స్
స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.సానుకూల దృక్పథంతో ఉంటాఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్కు ఎంపికైన సంజూ శాంసన్ను.. వన్డే సిరీస్కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.రెండుసార్లూ డకౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు. రెండుసార్లూ డకౌట్గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్లో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: నా కోచింగ్ కెరీర్లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్ The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP— Deepu (@deepu_drops) August 10, 2024 -
నా కోచింగ్ కెరీర్లో చేదు అనుభవం అదే: ద్రవిడ్
టీమిండియా విజయవంతమైన కోచ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్ మార్గదర్శనంలో.. టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్గా ఎదిగింది. ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఘనంగా వీడ్కోలుఅయితే, టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్- 2021-23, వన్డే వరల్డ్కప్-2023(ఫైనల్) టోర్నీలో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో ద్రవిడ్ను వెంటనే కోచ్గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీకాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు కోచ్గా కొనసాగాలని కోరింది.ఇందుకు అంగీకరించిన ద్రవిడ్కు ఘనమైన వీడ్కోలు లభించింది. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు చాంపియన్గా అవతరించింది. తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి భారత్కు ఐసీసీ టైటిల్ దక్కింది. అయితే, సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఓడిపోవడం మాత్రం ద్రవిడ్ కెరీర్లోని చేదు అనుభవం అని చెప్పవచ్చు.ఆ ఓటమే బాధించిందిఅయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం అన్నింటికంటే సౌతాఫ్రికా గడ్డ మీద ఓటమే.. తన కోచింగ్ కెరీర్లో ఎదురైన ఘోర పరాభవం అంటున్నాడు. ప్రొటిస్ జట్టును తమ సొంతదేశంలో ఓడించే అవకాశం చేజారడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించామని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘నా క్రికెట్ కోచింగ్ కోరీర్లో అన్నింటికంటే ఘోర పరాభవం.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడం. సెంచూరియన్లో జరిగిన తొలి మ్యాచ్లో మేము విజయం సాధించాం. అదే జోరులో రెండో టెస్టును ఘనంగా ఆరంభించాం. కానీ సౌతాఫ్రికా అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుని గెలుపును లాగేసుకుంది.మూడో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. మా జట్టులోని కొందరు సీనియర్లు అప్పుడు అందుబాటులో లేరు. రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. అయినా.. రెండు, మూడో టెస్టుల్లో విజయానికి చేరువగా వచ్చాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ సిరీస్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కోచ్గా ఎలా నన్ను నేను సంభాళించుకోవాలో తెలుసుకున్నా.ఓటమీ మంచికేఅన్ని మ్యాచ్లు మనమే గెలవలేం. ఒక్కోసారి ఓటమే మనకు ఎంతో నేర్పిస్తుంది’’ అని రాహుల్ ద్రవిడ్ 2021-22 సిరీస్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక గౌతీ హయాంలో తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం 0-2తో ఆతిథ్య లంక జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంకకు వన్డే సిరీస్ను సమర్పించుకుంది.చదవండి: IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు! -
క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయింపు
టీ20 వరల్డ్కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. సిరాజ్కు జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిరాజ్తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. సిరాజ్, నిఖత్ జరీన్, ఈషా సింగ్ వేర్వేరు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారు. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా? భారత్ తరఫున మళ్లీ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతాడా? టీ20 సిక్సర్ల కింగ్గా తన పేరును పదిలం చేసుకుంటూ మరిన్ని భారీ షాట్లు బాదుతాడా? అంటూ హిట్మ్యాన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇందుకు కారణం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలే!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్. ద్వైపాక్షిక సిరీస్లో అనూహ్య విజయాలతో మూడు ఫార్మాట్లలోనూ భారత్ను వరల్డ్ నంబర్ వన్గా నిలిపాడు. అయితే, ప్రపంచకప్ గెలవాలన్న కల మాత్రం టీ20 ప్రపంచకప్-2024తో తీరింది. అంతకు ముందు.. రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే టీమిండియా నిష్క్రమించగా.. వన్డే వరల్డ్కప్-2023లోనూ రన్నరప్తోనే సరిపెట్టుకుంది.లంకతో వన్డే సిరీస్తో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఐసీసీ టైటిల్ గెలిచి విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చాడు. వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడగానే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న హిట్మ్యాన్.. మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు అని విలేకరులు అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా నేను టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నట్లే అనిపిస్తోంది. ఇక ఏదైనా కీలక టోర్నీ వస్తోందంటే మళ్లీ టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలేమోనన్న ఫీలింగ్ వస్తోంది.పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు రాలేదుఇప్పటికీ నేను పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదు. ఏదో కొన్నాళ్లు సెలవు తీసుకుని మళ్లీ ఆడాలి కదా అన్న ఫీలింగ్లోనే ఉన్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగినట్లయింది. కాగా గతంలో చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల.. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్బై చెప్పినా.. వన్డే వరల్డ్కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చాలాసార్లు రిటైర్మెంట్ ఇచ్చి మళ్లీ బరిలోకి దిగాడు.ఆ అవకాశం లేదు.. కానీకాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాట్ కోహ్లితో పాటు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్.. వరల్డ్కప్-2024కు ముందే రీఎంట్రీ ఇచ్చాడు. కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసిన హిట్మ్యాన్.. భారత్ తరఫున మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండో టీ20 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్గా నిలిచాడు. ఇక 2026లో మరోసారి టీ20 వరల్డ్కప్నకు రంగం సిద్దం కాగా.. రోహిత్ శర్మ వయసు అప్పటికి 39 ఏళ్లు అవుతుంది. కాబట్టి అతడు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం దాదాపుగా ఉండదు. ఇక రోహిత్ స్థానంలో టీమిండియా టీ20 నూతన కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్ శ్రీలంక తాజా పర్యటనలో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది.చదవండి: లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్పైనే..!Even we are not over your T20I retirement, @ImRo45 🥹What's your take? 💬#SonySportsNetwork #SLvIND #RohitSharma pic.twitter.com/AMt7HXLR6U— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2024 -
‘రోహిత్ ఎవరినో తిడుతున్నాడు.. ఆరోజు ద్రవిడ్కు నిద్ర పట్టలేదు’
2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో భారత్కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ టైటిల్ సాధించిన తర్వాత హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. విండీస్లోని బార్బడోస్లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, యావత్ భారతావని మాత్రం వరల్డ్కప్ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్లో హారికేన్ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది. వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్ ఫ్లైట్ను బార్బడోస్కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్కు తీసుకువచ్చారు.ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్ క్లాస్ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్కు వచ్చేశాడు. బిజినెస్ క్లాస్లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్లో నిద్రపోయాడు.నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు. -
'అతడెప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు'.. ద్రవిడ్పై ప్రశంసల వర్షం
టీ20 వరల్డ్కప్-2024 కప్ విజయనంతరం టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ను భారత్కు అందించి హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ద్రవిడ్ ముగించాడు.ద్రవిడ్ కెప్టెన్గా ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే కరేబియన్ దీవుల్లో కోచ్గా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీకాలం కూడా టీ20 వరల్డ్కప్తో ముగిసింది. అయితే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి అని మాంబ్రే కొనియాడాడు. కాగా ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు."రాహుల్ ద్రవిడ్తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇండియా-ఏ, అండర్-19 జట్లు, ఎన్సీఎ, ఆపై భారత సీనియర్ జట్లకు అతడితో కలిసి పనిచేశాను. దాదాపు 8-9 నుంచి ద్రవిడ్తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. కోచ్గా ద్రవిడ్ ఎప్పుడూ ఆధికారం చెలాయించలేదు.ఆటగాళ్ల వెనకే ఉండి ప్రోత్సహించేవాడు. ఇదొక్కటి చాలు రాహుల్ అంటే ఏంటో తెలియడానికి. అతడు ఆటగాళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. ఎప్పుడూ ప్లేయర్లు కోసమే ఆలోచించేవాడు. ద్రవిడ్ ఎప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు.ఏ క్రెడటైనా జట్టుకు, కెప్టెన్కే దక్కాలని ద్రవిడ్ ఆశించేవాడు. ద్రవిడ్, రోహిత్ ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి భారత్కు వరల్డ్కప్ను అందించారు" అని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాస్ పేర్కొన్నాడు. -
‘పాకిస్తాన్లో అలా ఉండదు.. సూపర్ హిట్ గ్యారెంటీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సూపర్ హిట్ అవుతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలా కాకుండా ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ దేశాల్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ దృష్ట్యానే తాను ఈ మాట చెప్తున్నట్లు సల్మాన్ బట్ పేర్కొన్నాడు.రూ. 167 కోట్ల మేర నష్టంగతేడాది నుంచి ఐసీసీ టోర్నీల జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 నిర్వహించగా.. అమెరికా- వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2024కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అయితే, క్రికెట్కు అంతగా క్రేజ్లేని అమెరికాలో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం వల్ల ఐసీసీ భారీగా నష్టపోయిందనే వార్తలు వచ్చాయి.సుమారు రూ. 167 కోట్ల మేర ఐసీసీ అపెక్స్ కౌన్సిల్కు నష్టం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికాలో జరిగిన టీ20 టోర్నీకి.. మా దేశంలో జరిగే ఈవెంట్కు అసలు పోలికే ఉండదు.టీ20 వరల్డ్కప్ కంటే చాంపియన్స్ ట్రోఫీ పెద్ద హిట్ అవుతుంది. నిజానికి అక్కడ(అమెరికా) పిచ్లు సరిగా లేవు. జనావాసాలకు స్టేడియాలు చాలా దూరం. అంతేకాదు హోటల్స్ కూడా ఎక్కడో దూరంగా ఉంటాయి. అసలు అక్కడి స్థానికులకు కూడా తమ సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.భద్రత విషయంలోనూ విదేశీయులు మాత్రమే అక్కడికి వెళ్లి మ్యాచ్లు వీక్షించారు. అయితే, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడి ప్రజలు ఆటగాళ్లను ఆదరించడంతో పాటు ప్రేమిస్తారు, గౌరవిస్తారు కూడా! క్రికెట్ అంటే ఇక్కడి వాళ్లకు చాలా ఇష్టం.అలాగే జట్లు గంటల పాటు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే.. ఆరు నిమిషాల్లో టీమ్ హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోవచ్చు. భద్రత విషయంలోనూ ఎలాంటి సందేహాలు ఉండవు. ఉపఖండ దేశాల్లో ఉన్నట్లు అమెరికాలో క్రికెటర్లకు క్రేజ్ ఉండదు’’ అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వెళ్లే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు కోసం ఐసీసీ.. బీసీసీఐ కోరినట్లుగానే పాక్ వెలుపల వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
‘రోహిత్, కోహ్లి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటన తమను ఆశ్చర్యపరిచిందని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. వాళ్లు తమ నిర్ణయం గురించి ఒక్కసారి కూడా డ్రెసింగ్రూంలో చర్చించనేలేదని తెలిపాడు.ఏదేమైనా దశాబ్దకాలం పాటు జట్టుతో ఉన్న ఈ స్టార్ ప్లేయర్లు సరైన సమయంలో సరైన ప్రకటన చేశారని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్ సేన అద్భుత ఆట తీరుతో టైటిల్ సాధించింది. పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ చిరస్మరణీయ విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి పారస్ మాంబ్రే తాజాగా గుర్తుచేసుకున్నాడు. హిందుస్తాన్ టైమ్స్తో ముచ్చటిస్తూ..‘‘అభిమానులే కాదు మేము కూడా వాళ్లు ఇలాంటి ప్రకటన చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇలాంటి విషయాల గురించి జట్టులో ముందుగానే చర్చ రావడం సహజం. కానీ వీళ్లు మాత్రం ఎక్కడా విషయం బయటకు రానివ్వలేదు.బహుశా రాహుల్ ద్రవిడ్తో మాట్లాడి ఉంటారేమో గానీ.. మాకు మాత్రం తెలియదు. అందుకే ఫ్యాన్స్తో పాటు మేము కూడా ఆశ్చర్యపోయాం. అయితే, వాళ్ల కోణం నుంచి చూస్తే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని అనిపించింది.పదేళ్లకు పైగా జట్టుతో ఉన్నారు. 2011లో విరాట్ వరల్డ్కప్ గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ ప్రపంచకప్ టైటిల్ సాధించలేదు. ఇందుకోసం కోహ్లి ఎంతగానో తపించిపోయాడు.ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు నెరవేరింది. అతడి సుదీర్ఘ ప్రయాణం ఒకరకంగా పరిపూర్ణమైంది. ఇక ఈ ముగ్గురి ఆటగాళ్ల వయసు పరంగా చూసినా ఇది సరైన నిర్ణయమే. వారికి అపార అనుభవం, నైపుణ్యాలు ఉన్నాయి. కానీ.. హై నోట్లో కెరీర్ ముగించే అవకాశం మళ్లీ మళ్లీ రాకపోవచ్చు కదా!’’ అని పారస్ మాంబ్రే పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉండగా.. అతడి జట్టులో బ్యాటింగ్ కోచ్గా విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్గా పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా టి.దిలీప్ సేవలు అందించారు. ఈ టోర్నీ తర్వాత వీరందరి పదవీ కాలం ముగియగా.. కొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో దిలీప్ రీఎంట్రీ(తాత్కాలికం) ఇచ్చాడు. -
'T20 వరల్డ్కప్లో అదే నా ఫేవరేట్ మూమెంట్.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'
టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్కోచ్గా తన ప్రస్ధానాన్ని ముగించాడు. గతేడాది వన్డే వరల్డ్కప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్లో తన ఫేవరేట్ మూమెంట్ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్తో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్కప్ రన్నరప్గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్కప్ ఫైనల్కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్ను అద్భుతంగా అందుకుని భారత్ను ఛాంపియన్స్గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
ICC: ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?
టీ20 ప్రపంచకప్-2024 పొట్టి క్రికెట్ ప్రేమికులకు భిన్నమైన అనుభవాన్ని అందించింది. ఈ ఐసీసీ టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలోని న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది.ఫలితంగా పరుగుల ప్రవాహానికి బదులు వికెట్ల జాతర జరిగింది. న్యూయార్క్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నసావూ కౌంటీ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్ వల్ల మ్యాచ్లన్నీ.. టీ20 ఫార్మాట్కు పూర్తి భిన్నంగా జరిగాయనే చెప్పవచ్చు.ముఖ్యంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కు కూడా ఇదే వేదిక కావడం గమనార్హం. అయితే, మరో వేదిక వెస్టిండీస్లో మాత్రం మెరుగైన స్కోర్లు నమోదయ్యాయి.ఇక ఐసీసీ ఈవెంట్లో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ కి సంబంధించిన సంచలన వార్త తెరమీదకు వచ్చింది.ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?ఈ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి నష్టాన్ని మిగిల్చిందని దాని సారాంశం. క్రికెట్కు పెద్దగా ఆదరణ లేని అమెరికాలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించడం వల్ల దాదాపు రూ. 167 కోట్ల(భారత కరెన్సీలో) నష్టం వచ్చిందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.ఈ విషయం గురించి ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చకు రానుందని తెలిపింది. కొలంబో వేదికగా శుక్రవారం ఈ మీటింగ్ జరుగనుంది.అయితే, వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చింననున్న తొమ్మిది పాయింట్ల ఎజెండాలో ఈ పాయింట్ లేకపోయినా.. పోస్ట్ ఈవెంట్ రిపోర్టుకు సంబంధించిన నివేదిక మాత్రం తయారు చేసినట్లు పీటీఐ పేర్కొంది.కొత్త చైర్మన్ ఎవరు?ఇక ఈ ఈవెంట్లో ప్రధానంగా ఐసీసీ కొత్త చైర్మన్ నియామకం గురించి కూడా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని పీటీఐ వెల్లడించింది. గ్రెగ్ బార్క్లే స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా నియామకం, దాని పర్యావసనాల గురించి చర్చ జరుగనున్నట్లు పేర్కొంది.అదే విధంగా.. ఐసీసీ చైర్మన్ పదవీకాలానికి సంబంధించి మార్పులు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి అత్యధికంగా మూడు దఫాలు రెండేళ్ల చొప్పున కొనసాగవచ్చు. అయితే, తాజాగా దీనిని రెండు దఫాలు.. మూడేళ్ల చొప్పున కొనసాగేట్లు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.చదవండి: అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే జట్టుకు దూరం! -
హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్
టీ20 వరల్డ్కప్ విజయానంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వడోదరకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. హార్దిక్ను ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంలో వడోదర వీధుల గుండా తన స్వగృహానికి చేరకున్నాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. A HERO'S WELCOME FOR HARDIK PANDYA IN VADODARA. 😍🏆 pic.twitter.com/LFY0g1ZgOX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024హార్దిక్ నామస్మరణతో వడోదర వీధులు మార్మోగిపోయాయి. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హార్దిక్తో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో "చక్దే ఇండియా" పాట ప్లే చేయగా జనాలు ఉర్రూతలూగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది.Hardik Pandya and Krunal Pandya dancing on Chak De India. 🇮🇳 pic.twitter.com/Q2S8OMuCSv— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024కాగా, హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్కప్ విజయానంతరం ముంబైలో జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అక్కడే ఉండిపోయాడు. అనంతరం హార్దిక్ అనంత అంబానీ వివాహా వేడుకలో సందడి చేసి ఇవాళ (జులై 15) వడోదరకు చేరుకున్నాడు.ఇదిలా ఉంటే.. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. -
పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని తగ్గించింది. ఈ విషయాన్ని పీసీబీ అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్ల ప్రవర్తనపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్పై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ జట్టుకు నష్టం చేకూరుస్తున్నారని పీసీబీ భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం, పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విషయంలో ఆటగాళ్ల మధ్య ఐక్యత లేదన్నది వాటి ప్రధాన సారాంశం. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.సంస్కరణలకు శ్రీకారంఅదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాక్ టెస్టు హెడ్కోచ్ జేసన్ గిల్లెస్పి, వన్డే- టీ20ల ప్రధాన కోచ్ గ్యారీ కిర్స్టెన్తో లాహోర్లో సోమవారం చర్చించినట్లు తెలుస్తోంది.పాక్ బోర్డు అధికారులు ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు గల కారణాలు వెల్లడిస్తూ.. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్, ఆటగాళ్ల పారితోషికం విషయంలో చర్చ జరిగింది.ఆ రెండిటి ఆధారంగాక్రికెటర్ల ఫిట్నెస్, ప్రవర్తన ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ను రివైజ్ చేయాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదు’’ అని పేర్కొన్నారు.అంతేకాదు.. ‘‘పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇక నుంచి నిరంభ్యంతర పత్రాలు(NOCs- నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.కోచ్తో అతడి గొడవకాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం, టీ20ల మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్తో షాహిన్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది.అయితే, వెంటనే అతడు కోచ్కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఆటగాళ్లను సరైన దారిలో పెట్టేందుకు పీసీబీ కాస్త కఠినంగానే వ్యవహరించనుందని బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్పై ఇప్పటికే పీసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కెప్టెన్గా బాబర్ భవితవ్యం కూడా తేలనుంది.చదవండి: ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీ, రైనాపై విమర్శలు -
టీమిండియా టీ20 కెప్టెన్గా వాళ్లిద్దరి మధ్యే పోటీ
అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా శకం టీ20 ప్రపంచకప్-2024తో ముగిసింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఈ ముగ్గురూ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు.ఈ నేపథ్యంలో టీ20లలో భారత జట్టు కొత్త కెప్టెన్ ఎవరా అన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తన దృష్టిలో టీమిండియాకు ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరు స్టార్లకు ఉందన్న ఈ మాజీ వికెట్ కీపర్.. కొత్త కోచ్ గౌతం గంభీర్, సెలక్టర్ల నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట ఆడడు.కాబట్టి అతడి వారసుడి ఎంపికపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. నా దృష్టిలో ఇద్దరికి ఆ అవకాశం ఉంది. లాజికల్గా చూస్తే హార్దిక్ పాండ్యానే కెప్టెన్ను చేయాలి.ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2024లో అతడిని వైస్ కెప్టెన్గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్ గైర్హాజరీలో అతడు సారథిగా వ్యవహరించాడు.రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా పొట్టి వరల్డ్కప్ ఆడనుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్లో అతడు కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు.కచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్గా సరైన ఆప్షనే అనిపిస్తాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిని చేయాలన్న అంశంపై సెలక్టర్లు, కొత్త కోచ్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. తానైతే ఇద్దరికీ కెప్టెన్ అయ్యే అర్హత ఉందని చెబుతానంటూ సబా కరీం సోనీ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
కెప్టెన్గా ప్రపంచకప్ గెలవాలన్న టీమిండియా సారథి రోహిత్ శర్మ కల టీ20 వరల్డ్కప్-2024తో నెరవేరింది. ఈ మెగా టోర్నీకి ముందు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న హిట్మ్యాన్.. ట్రోఫీని ముద్దాడగానే రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంటర్నేషనల్ టీ20లకు వీడ్కోలు పలికాడు. అయితే, వన్డే, టెస్టుల్లో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి చర్చ మొదలైంది. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సీనియర్ల పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించనున్నాడన్న సంకేతాల నేపథ్యంలో రోహిత్తో పాటు విరాట్ కోహ్లి వంటి వాళ్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇటీవల డల్లాస్లో ఓ ఈవెంట్కు హాజరైన రోహిత్ శర్మకు లాంగర్ ఫార్మాట్ల రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఈ విషయం గురించి చెప్పాను. మరికొంత కాలం నేను క్రికెట్ ఆడుతాను’’ అని రోహిత్ పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20లలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా రోహిత్ శర్మ పేరుగాంచాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో 159 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్.. 4231 పరుగులు సాధించాడు.అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించాడు. అదే విధంగా అత్యధిక సిక్సర్లు (205) కొట్టిన బ్యాటర్గానూ రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక రోహిత్ శర్మ ఖాతాలో రెండు టీ20 ప్రపంచకప్లు ఉండటం విశేషం.ధోని సారథ్యంలో 2007 నాటి మొట్టమొదటి పొట్టి క్రికెట్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ.. ఈ ఏడాది కెప్టెన్ హోదాలో టైటిల్ సాధించాడు. ఇక వన్డేల్లోనూ రోహిత్ శర్మకు ఘనమైన రికార్డే ఉంది.భారత్ తరఫున 262 వన్డే మ్యాచ్లలో 10709 రన్స్ చేసిన హిట్మ్యాన్ ఖాతాలో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్గా రోహిత్ కొనసాగుతున్నాడు.మరోవైపు టెస్టుల్లో మాత్రం కేవలం 59 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 4138 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి.ఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ వరకు కెప్టెన్గా కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే స్పష్టం చేశాడు.ఈ ఐసీసీ టోర్నమెంట్ల తర్వాత రోహిత్ ఆటగాడిగా కొనసాగుతాడా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్తో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. -
రోహిత్ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు: గంగూలీ
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 17 ఏళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ 11 ఏళ్ల సుదీర్ఘణ అనంతరం ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. భారత జట్టు చివరిగా 2013లో ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా రోహిత్ నేతృత్వంలో ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది.టీ20 వరల్డ్కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. భారత్ ట్రోఫీ గెలిచి రెండు వారాలు గడిచినా విజయోత్సవ సంబురాలు ఇంకా జరుగతూనే ఉన్నాయి. తాజాగా భారత విజయానికి సంబంధించి కోల్కతాలో వేడుక జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజయర్యాడు.ఈ సందర్భంగా గంగూలీ.. టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. దాదా రోహిత్ గురించి మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ను కెప్టెన్ చేసింది నేనే. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో టీమిండియా వరల్డ్కప్ గెలవడంతో నన్నెవరూ నిందించడం లేదు. అయితే రోహిత్ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని మాత్రం అందరూ మరిచిపోయారని సరదాగా అన్నాడు. -
కోచ్తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్కు షాహిన్ దూరం
పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టెస్టు జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పి ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందే పాక్ క్రికెట్ బోర్డు ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో బాబర్ ఆజం తిరిగి సారథిగా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ సమయంలో బాబర్తో పాటు కోచ్లతోనూ షాహిన్ ఆఫ్రిదికి గొడవలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి.దీంతో పీసీబీ ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించింది. బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్తో షాహిన్కు వాదన జరగడం నిజమేనని.. అయితే, ఆటలో ఇవన్నీ సహజమేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.తనకు కొత్త పాఠాలు నేర్పవద్దని షాహిన్ యూసఫ్తో దురుసుగా ప్రవర్తించాడని.. అయితే, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని పేర్కొంది.అయితే, బంగ్లాదేశ్తో సిరీస్కు షాహిన్ ఆఫ్రిది దూరం కానున్నాడన్న నేపథ్యంలో పీసీబీ చర్యలు తీసుకుంటోందని అంతా భావించారు. అయితే, కోచ్ గిల్లెస్పి ఈ వార్తలను కొట్టిపారేశాడు.షాహిన్ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడని, అందుకే ఆ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని అతడు కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే అతడు బంగ్లాతో సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.కాగా పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్ ఆఫ్రిది గతేడాది పెళ్లాడాడు. ఈ జంట త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్కు వెళ్లనుంది. ఆగష్టు 21 నుంచి సెప్టెంబరు 3 వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. -
‘మిస్టరీ గర్ల్’తో హార్దిక్ పాండ్యా.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
టీ20 వరల్డ్కప్లో వైఫల్యం.. కెప్టెన్సీకి రాజీనామా
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో శ్రీలంక గ్రూప్ దశలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ స్పష్టం చేశాడు. హసరంగ రాజీనామా విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది.హసరంగ గతేడాదే శ్రీలంక టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. అతను లంక జట్టు సారథిగా కేవలం పది మ్యాచ్ల్లో మాత్రమే వ్యవహరించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో హసరంగ సారథ్యంలో శ్రీలంక నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. శ్రీలంక టీ20 జట్టు కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్లకు ఇంకా వేదికలు ఖరారు కాలేదు. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు.. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం భారత్.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుండగా.. శ్రీలంక ఆటగాళ్లు లంక ప్రీమియర్ లీగ్తో బిజీగా ఉన్నారు. -
హెడ్ కోచ్గా గంభీర్ జీతం అన్ని కోట్లా?.. ద్రవిడ్ కంటే రెట్టింపు?!
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.రెండు పడవల మీద ప్రయాణం చేయలేననిబీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్.. కామెంటేటర్గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్.. పూర్తి స్థాయిలో క్రికెట్కే అంకితమయ్యాడు.ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ చాంపియన్గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరువలేనివి.ఈ క్రమంలోనే గౌతం గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.టీ20 ప్రపంచకప్-2024 అందించికాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్కు టీ20 ప్రపంచకప్-2024 అందించిన కోచ్గా ద్రవిడ్ పేరు సంపాదించాడు.ఇక హెడ్ కోచ్గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ మెంటార్గా గంభీర్కు రూ. 25 కోట్లు?కాగా కేకేఆర్ మెంటార్గా గంభీర్కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. హెడ్ కోచ్గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.జీతంతో పాటు అన్ని సదుపాయాలువార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్ క్లాస్లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.అయితే, హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.ఎట్టకేలకు గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.అదే నా లక్ష్యం: గంభీర్‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా గంభీర్ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
వాళ్లిద్దరిపై వేటు వేసిన పీసీబీ.. అబ్దుల్ రజాక్కు డబుల్ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో జట్టు వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ రజాక్ను కూడా తప్పించినట్లు సమాచారం.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కనీసం సూపర్-8 కూడా చేరకుండానేపసికూన అమెరికా, పటిష్ట భారత్ చేతిలో ఓడి కనీసం సూపర్-8 కూడా చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్లో ఫైనల్కు చేరిన పాకిస్తాన్ ఈసారి ఘోరంగా ఇలా వెనుదిరగడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ నిర్ణయానికే పీసీబీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.అయితే, సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఈ మేరకు తామే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్లను తప్పించాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.వీరిద్దరిని మినహాయిస్తే సెలక్షన్ కమిటీలో ఇంకో ఐదుగురు మిగులుతారు. హెడ్ కోచ్, కెప్టెన్(సంబంధిత ఫార్మాట్), మహ్మద్ యూసఫ్, అసద్ షఫీక్, బిలాల్ అఫ్జల్, డేటా అనలిస్టు ఉంటారు. ఇక రియాజ్, రజాక్ స్థానాలను ఇప్పట్లో భర్తీ చేసేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రజాక్కు డబుల్ షాక్అంతేకాదు రజాక్కు డబుల్ షాకిచ్చిన్నట్లు సమాచారం. మహిళా సెలక్షన్ కమిటీ విధుల నుంచి కూడా అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా అనాలోచిత నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ఆజం ఖాన్(మాజీ కెప్టెన్ మొయిన్ కుమారుడు) వంటి ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో వహాబ్ రియాజ్పై విమర్శలు వచ్చాయి.అతడి విషయంలో మాజీ క్రికెటర్లు పీసీబీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు జట్టు వెళ్లిన సమయంలో రియాజ్ కేవలం సీనియర్ టీమ్ మేనేజర్గా మాత్రమే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అతడిని సెలక్షన్ కమిటీ నుంచి పూర్తిగా తప్పించినట్లు సమాచారం.ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది. కాగా పాక్ బోర్డులో గత కొన్నేళ్లుగా నిలకడ లేకుండా పోయింది. గడిచిన నాలుగేళ్లలో ఆరుగురు చీఫ్ సెలక్టర్లు మారారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ హోదాలో పనిచేశారు. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లూ, నేనూ సమానమే!
ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ‘జెంటిల్మేన్’నే అని మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన క్యాష్ రివార్డులో తనకు దక్కాల్సిన మొత్తాన్ని సగానికి తగ్గించుకుని గొప్పతనాన్ని చాటుకున్నాడు.సహాయక సిబ్బందితో పాటే తానూ అంటూ హుందాగా వ్యవహరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ‘వాల్’ మార్గదర్శనంలో టీమిండియా టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ చేరింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.అయితే, తాజా పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ ద్వారా ద్రవిడ్ కల నెరవేరింది. అతడి గైడెన్స్లో రోహిత్ సేన వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఇలా మేజర్ టోర్నీలో చాంపియన్గా నిలవడంతో బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో.. కప్ గెలిచిన ప్రధాన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్కు రూ. 5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది.అదే విధంగా... బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్ల మేర ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ మాత్రం తనకు దక్కిన మొత్తాన్ని సగానికి తగ్గించమని బోర్డును కోరినట్లు తెలుస్తోంది.సహాయక కోచ్ల మాదిరే తనకు కూడా రెండున్నర కోట్ల రూపాయలు చాలంటూ.. మిగిలిన సగాన్ని తిరిగి తీసుకోమని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.‘‘మిగతా సహాయక సిబ్బంది మాదిరే రాహుల్ కూడా తనకు బోనస్గా కేవలం రెండున్నర కోట్లు చాలని చెప్పాడు. మేము అతడి సెంటిమెంట్ను గౌరవిస్తాం’’ అని పేర్కొన్నాయి.దటీజ్ ద్రవిడ్.. అప్పుడు కూడా ఇలాగే..రాహుల్ ద్రవిడ్ గతంలో అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. 2018లో అతడి మార్గదర్శనంలో యువ భారత్ ప్రపంచకప్ గెలిచింది.ఈ నేపథ్యంలో నాడు బీసీసీఐ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 30 లక్షలు ఇచ్చింది.ఈ క్రమంలో ద్రవిడ్ తనకు ఎక్కువ మొత్తం వద్దని.. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరాడు. ఫలితంగా బోర్డు ద్రవిడ్తో పాటు మిగతా సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేశారు.చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
నా వర్క్ వైఫ్: ద్రవిడ్ను ఉద్దేశించి రోహిత్ భావోద్వేగ పోస్ట్.. వైరల్
‘‘ప్రియమైన రాహుల్ భాయ్.. నా మనసులోని భావాలను వెల్లడించేందుకు సరైన పదాల కోసం వెతుక్కొంటున్నాను. అయితే, ఈ నా ప్రయత్నం వృథా అవుతుందేమో!ఏదేమైనా చెప్పాలనుకున్నది చెప్పి తీరుతా..! కోట్లాది మంది అభిమానుల్లాగే నేను కూడా చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా.అయితే, వారెవరికీ రాని అవకాశం నాకు వచ్చింది. నిన్న దగ్గరగా చూడటమే కాదు.. నీతో కలిసి పనిచేసే భాగ్యం దక్కింది.క్రికెట్లో నువ్వొక శిఖరానివి. కఠిన శ్రమకు ఓర్చే ఆటగాడివి. అందుకు ప్రతిఫలంగా ఎన్నెన్నో ఘనతలు సాధించావు.అయితే, మా దగ్గరికి వచ్చే సమయంలో ఆటగాడిగా నీ ఘనతలన్నీ పక్కన పెట్టి.. కేవలం కోచ్గా మాత్రమే వ్యవహరిస్తావు.నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు, సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తావు.ఆటకు, మాకు నువ్విచ్చిన గొప్ప బహుమతి అది. ఆట పట్ల నీకున్న ప్రేమ నీ హుందాతనానికి కారణం. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను. పనిలో ఉన్నపుడు తనను కూడా పట్టించుకోకుండా నేను నీతోనే ఉంటానని నా భార్య ఎల్లప్పుడూ అంటూ ఉంటుంది.రాహుల్ భాయ్ ‘నీ వర్క్ వైఫ్’(పనిలో సహచరులు, పరస్పర గౌరవం, మద్దతు, విశ్వసనీయత కలిగి ఉండేవారు) అంటూ నన్ను ఆటపట్టిస్తుంది. ఇలా అనిపించుకోవడం కూడా నా అదృష్టమే అని భావిస్తా. నిన్ను చాలా మిస్సవుతాను. అయితే, కలిసి కట్టుగా మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాను.రాహుల్ భాయ్ నా నమ్మకం, నా కోచ్, నా స్నేహితుడు అని అనుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా?! సెల్యూట్’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకొంటున్న రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. రాహుల్ భాయ్తో తన అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ కోచ్ పట్ల ప్రేమను చాటుకున్నాడు.ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీతో ద్రవిడ్, తాను, తన కుటుంబం దిగిన ఫొటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత భారత జట్టు సారథిగా రోహిత్ పగ్గాలు చేపట్టగా.. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు.కల నెరవేరిందివీరిద్దరి హయాంలో టీమిండియా ఆసియా వన్డే కప్ గెలవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరింది. అయితే, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్తో ఈ దిగ్గజాల కల నెరవేరింది.అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ మెగా టోర్నీలో ద్రవిడ్ మార్గదర్శనంలోని రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. సౌతాఫ్రికాను ఓడించి ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది.ఇక ఈవెంట్ తర్వాత తాను బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఇప్పటికే ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యాడు.మీరిద్దరూ అరుదైన వజ్రాలుఇందుకు స్పందిస్తూ.. ‘‘మీరిద్దరూ అరుదైన వజ్రాలు’’ అంటూ టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. కాగా వరల్డ్కప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ ముగిసే వరకూ కెప్టెన్గా తనే కొనసాగనున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఇంటర్నేషనల్ టీ20 కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
BCCI: గంభీర్ మనసులో ఏముంది?.. ఆలస్యానికి కారణం ఇదే
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ ప్రకటనపై సస్పెన్స్ వీడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు అతడినే కొనసాగించింది బీసీసీఐ. ఈ క్రమంలో టైటిల్ గెలిచి సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు ద్రవిడ్.ఇక ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోచ్గా వస్తాడనే ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.అయితే, శ్రీలంకతో సిరీస్ నాటికి మాత్రం పూర్తిస్థాయి కోచ్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ హెడ్కోచ్ ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది.బ్యాటింగ్ కోచ్గానూ గంభీర్?అయితే, జీతం విషయంలో గంభీర్- బోర్డు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. హెడ్ కోచ్గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్గానూ గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయమై చర్చలు కొలిక్కి రాలేదని తెలిపింది.కాగా రాహుల్ ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐకి షరతు విధించినట్లు సమాచారం.అదే విధంగా వరల్డ్క్లాస్ బ్యాటర్ అయిన తాను ఉండగా.. ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదనే యోచనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న అంశంలో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే క్లారిటీ రానుంది.చదవండి: BCCI: రోహిత్కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం! -
మిల్లర్ క్యాచ్ కాదు.. నా లైఫ్లో ఇంపార్టెంట్ క్యాచ్ అదే: సూర్యకుమార్
టీ20 వరల్డ్కప్-2024లో విజేతగా భారత్ నిలవడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ది కీలక పాత్ర. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా అందుకున్న సూర్యకుమార్.. 13 ఏళ్ల టీమిండియా వరల్డ్కప్ నిరీక్షణకు తెరదించాడు. సూర్య తన సంచలన క్యాచ్తో విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. భారత క్రికెట్ చరిత్రలో సూర్య పట్టిన క్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు 10 రోజులు పైగా అవుతున్నప్పటికి సూర్యపై ఇంకా ప్రశంసల వర్షం కురిస్తోంది. అయితే సూర్య తన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన క్యాచ్ ఎప్పుడో అందుకున్నాడంట. తన భార్య దేవిశా శెట్టిని వివాహం చేసుకోవడమే ముఖ్యమైన క్యాచ్ అంటూ సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టిలు ఇటీవల తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్ద కేక్ను తీసుకువచ్చి కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సూర్యకుమార్ ఇనాస్టాగ్రామ్లో షేర్ చేశాడు. "వరల్డ్కప్లో క్యాచ్ అందుకుని నిన్నటకి 8 రోజులైంది. కానీ నిజానికి నా జీవితంలో అంత్యంత ముఖ్యమైన 8 ఏళ్ల క్రితమే అందుకున్నానంటూ" ఆ ఫోటోకు సూర్య క్యాప్షన్గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు మీరిద్దరూ కలకలం ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.ఇక వరల్డ్కప్లో 8 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. 135.37 స్ట్రైక్రేట్తో 199 పరుగులు చేశాడు. వరల్డ్కప్ విజయనంతరం సూర్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి శ్రీలంక పర్యటకు సూర్యకుమార్ అందుబాటులోకి రానున్నాడు. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
T20 WC: ‘క్రికెటర్లకు క్యాష్ రివార్డు.. మరి నాకేం దక్కింది?’
మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్లకు పెద్ద పీట వేసే షిండే సర్కారు.. తనలాంటి క్రీడాకారులను మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించాడు.క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష తగదని.. అందరినీ సమానంగా చూడాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు చిరాగ్ శెట్టి విజ్ఞప్తి చేశాడు. కాగా భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో జయభేరి మోగించి ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి రాగానే ఘన స్వాగతం లభించింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే మైదానంలో విజయోత్సవాలు నిర్వహించిన బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానాను అందించింది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో నలుగురు ముంబై ఆటగాళ్లు ఉండటం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీ20 స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివం దూబేలు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యులు.వరల్డ్కప్ విజేతలకు రూ. 11 కోట్ల నజరానాఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే ఈ నలుగురిని తన నివాసంలో ప్రత్యేకంగా సన్మానించారు. శాలువాలు కప్పి.. వినాయకుడి ప్రతిమలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.అదే విధంగా.. వరల్డ్కప్ విజేతలకు రూ. 11 కోట్ల నజరానా కూడా ప్రకటించారు మహా సీఎం. ఈ నేపథ్యంలో చిరాగ్ శెట్టి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్లకు క్యాష్ రివార్డు.. మరి నాకేం దక్కింది?‘‘బ్యాడ్మింటన్లో థామస్ కప్.. క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన దానికంటే తక్కువేం కాదు. థామస్ కప్ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి టైటిల్ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిని.అంతేకాదు కప్ గెలిచిన జట్టులో ఉన్న ఏకైక మహారాష్ట్ర క్రీడాకారుడిని. వరల్డ్కప్ గెలిచిన క్రికెట్ స్టార్లను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సంతోషం.కానీ నాలాంటి ఆటగాళ్ల శ్రమను కూడా గుర్తిస్తే బాగుంటుంది. క్రీడలన్నింటికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెటర్లను సత్కరించడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు.అంతెందుకు బ్యాడ్మింటన్ ప్లేయర్లందరం కూడా టీవీలో వరల్డ్కప్ ఫైనల్ చూశాం. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవడం పట్ల గర్వపడుతున్నాం.అయితే, గత రెండేళ్ల కాలంలో నేను కూడా గుర్తుంచుకోదగ్గ.. చిరస్మరణీయ విజయాలు సాధించాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను కనీసం అభినందించలేదు.ఎలాంటి క్యాష్ రివార్డు కూడా ప్రకటించలేదు. 2022 కంటే ముందు భారత బ్యాడ్మింటన్ జట్టు కనీసం సెమీస్ చేరిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మేము ఏకంగా టైటిల్ గెలిచాం. అయినా తగిన గుర్తింపు కరువైంది’’ అని చిరాగ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు.ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ బ్యాడ్మింటన్ స్టార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా చిరాగ్ శెట్టి- సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డితో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.అంతేకాదు ప్రఖ్యాత థామస్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. సాత్విక్సాయిరాజ్తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్, థాయ్లాండ్ ఓపెన్ గెలిచాడు. అదే విధంగా.. మలేషియన్ సూపర్ 750, ఇండియా సూపర్ 750 ఫైనల్స్ చేరాడు. తదుపరి ఈ జోడీ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించనుంది.చదవండి: ‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’# Live📡| 05-07-2024 📍वर्षा निवासस्थान, मुंबई 📹 जगज्जेत्या भारतीय क्रिकेट संघाचे वर्षा निवासस्थानी स्वागत https://t.co/TSiJXnHFzw— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 5, 2024 -
IND vs ZIM: సంజూ వచ్చేశాడు.. అతడిపై వేటు! భారత తుది జట్టు ఇదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్దమవుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే మూడో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు భారత తుది జట్టు ఎంపిక చేయడం శుభ్మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వరల్డ్కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కారణంగా యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే దూరమైన సంగతి తెలిసిందే. వారి స్ధానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది. అయితే ఇప్పుడు జైశ్వాల్, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్ల కోసం జట్టుతో చేరారు. వీరి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు.ఈ క్రమంలో జట్టు కూర్పు కొంచెం కష్టంగా మారింది. అభిషేక్ శర్మ ఓపెనర్గా దుమ్ములేపుతుండడంతో జైశ్వాల్ మూడో మ్యాచ్కు బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో జురెల్కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక రెండో టీ20కు జట్టులోకి వచ్చిన సాయిసుదర్శన్ స్ధానంలో ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా) శుభ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లిలకు ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసలతో పాటు కనక వర్షం కూడా కురిసింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ మొత్తం పంచుకునే క్రమంలో ఎవరెవరికి ఎంత దక్కనుందనే విషయం గురించి ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు!ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరల్డ్కప్ ప్రధాన జట్టులో భాగమైన ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్లకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల మేర ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్లకు కూడా ఈ మేర భారీ మొత్తం దక్కనుంది.వారికి 2.5 కోట్లు? అదే విధంగా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. ఇక కోచింగ్ సిబ్బందిలో ప్రధానమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్లకు రూ. 2.5 కోట్ల మేర రివార్డు దక్కనుంది.మిగిలిన వాళ్లలో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు కమలేశ్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్.. ఇద్దరు మసాజర్లు రాజీవ్ కుమార్, అరుణ్ కనాడే.. అదే విధంగా కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయిలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల మేర బీసీసీఐ నజరానా ఇవ్వనుంది.చీఫ్ సెలక్టర్కు ఎంతంటే?వీరి సంగతి ఇలా ఉంటే.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యులకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వీడియో అనలిస్టులు, మీడియా ఆఫీసర్లు, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ సహా ఈ మెగా టోర్నీలో భాగమైన 42 మంది సభ్యులకు వారి బాధ్యతలకు అనుగుణంగా రివార్డులోని కొంత మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం.సౌతాఫ్రికాను ఓడించికాగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.ఈ ఐసీసీ ఈవెంట్లో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలవగా.. ఫైనల్లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.ట్రావెలింగ్ రిజర్వ్స్: రింకూ సింగ్, శుబ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.చదవండి: IND vs SL: భారత్తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా సనత్ జయసూర్య -
ఏడ్చేసిన నీతా అంబానీ.. రోహిత్ ముంబైని వీడటం పక్కా! వీడియో
ఐపీఎల్-2024కు ముందే రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన హిట్మ్యాన్ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి తగిన మూల్యం చెల్లించింది.పాండ్యా సారథ్యంలో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. రోహిత్- పాండ్యా సైతం ఎడమొహం- పెడమొహంగానే మెదిలారు. ఫలితంగా ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, టీ20 ప్రపంచకప్-2024తో సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరూ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నారు. కెప్టెన్గా రోహిత్, ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతను చక్కగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యులైన తమ ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ల ముందస్తు పెళ్లి వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత్ నిర్వహించిన సమయంలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు.వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ అద్భుతం చేశాడంటూ అతడిని హగ్ చేసుకున్న నీతా.. ఆ తర్వాత సూర్య, హార్దిక్లను కూడా ఆత్మీయంగా హత్తుకున్నారు.ఈ సందర్భంగా హార్దిక్ను ఉద్దేశించి.. ‘‘కష్ట సమయం ఎప్పుడూ ఉండదు.. అయితే, పట్టుదల కలిగిన మనుషులు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు’’ అని ప్రశంసించారు. ముఖ్యంగా వరల్డ్కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసి జట్టును గెలిపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు.మరోవైపు.. 2011 నాటి సంబరాన్ని మళ్లీ తీసుకువచ్చారంటూ ముఖేశ్ అంబానీ ఆటగాళ్లను కితాబులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇందులో రోహిత్ శర్మ మాత్రం పైకి నవ్వుతూ కనిపించినా కాస్త మనస్ఫూర్తిగా ఆ వేడుకలో భాగం కాలేకపోయాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే తన మనసు విరిగిపోయిందని.. వచ్చే సీజన్లో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడటం పక్కా అని ఫిక్సయిపోయారు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో వరల్డ్కప్ టైటిల్ చేరింది.AMBANI FAMILY celebrating the World Cup heroes - Captain Rohit, Hardik & Surya. 🇮🇳- VIDEO OF THE DAY...!!!! ❤️ pic.twitter.com/8XbPo9kkLE— Johns. (@CricCrazyJohns) July 6, 2024 -
ఎందుకలా నెట్టేస్తున్నావు?.. రోహిత్పై విమర్శలు
ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన క్షణాలను తలచుకుంటూ హిట్మ్యాన్ కుటుంబం సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.ఇలాంటి సంతోషకర సమయంలో కొద్ది మంది నెటిజన్లు మాత్రం రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రులంటే అతడికి ఏమాత్రం గౌరవం లేదంటూ ఇష్టారీతిన ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మందేమో ఈ విషయంలో విరాట్ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ అతడినీ విమర్శిస్తున్నారు.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది.తద్వారా భారత్ ఖాతాలో పదమూడేళ్ల తర్వాత మరో వరల్డ్కప్ ట్రోఫీ చేరింది. టైటిళ్ల సంఖ్య నాలుగైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైకి పయనమైన రోహిత్ సేన బస్ పెరేడ్లో పాల్గొంది.అదే విధంగా.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ చిరస్మణీయ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సైతం ఈ ఆనందోత్సవంలో భాగమయ్యారు.ఈ క్రమంలో కుమారుడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె.. ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. అయితే, అందుకు ప్రతిగా రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రోలింగ్కు కారణమయ్యాయి.‘‘ఇక చాల్లే.. అందరూ చూస్తున్నారమ్మా’’ అన్నట్లుగా బిడియం ప్రదర్శించిన రోహిత్.. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఈ క్రమంలో కొంతమంది రోహిత్ను టార్గెట్ చేశారు. ‘‘భార్య, కూతురితో ఉన్నంత అనుబంధం తల్లితో లేదా? ఆమె అంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇలా చేయడం అస్సలు బాలేదు’’ అని విమర్శిస్తున్నారు.ఇక మరికొంత మందేమో.. ‘‘రోహిత్ కనీసం తన తల్లిదండ్రులనైనా ఇక్కడిదాకా తీసుకువచ్చాడు. కోహ్లి అయితే భార్యను తప్ప తల్లిని ఏనాడూ ఎక్కడికీ తీసుకురాడు’’ అని ట్రోల్ చేస్తున్నారు.అప్పుడే తన నిర్ణయం చెప్పాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సాధించిన విజయం పట్ల అతడి తల్లి పూర్ణిమ శర్మ స్పందించారు. ‘‘ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.వరల్డ్కప్ ఆడేందుకు వెళ్లే కంటే ముందు రోహిత్ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించాడు.గెలిచినా.. ఓడినా తన ఆలోచనలో మార్పు ఉండదని చెప్పాడు. అప్పుడు నేను గెలవడానికి ప్రయత్నించు అని మాత్రమే చెప్పగలిగాను. నిజానికి ఇప్పుడు కూడా నా ఆరోగ్యం అంతగా బాలేదు. అయితే, డాక్టర్ అప్పాయింట్మెంట్ మిస్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చాను’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారు.Such a sweet moment between Rohit Sharma and his mom 🥹❤️ pic.twitter.com/u8hXhr3LVL— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024 -
న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్ రిప్లై ఇదే..
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. లీగ్ దశలో పూర్తిగా విఫలమైన ఈ ‘రన్మెషీన్’.. సెమీస్ వరకు అదే పేలవ ప్రదర్శన కనబరిచాడు.అయితే, అసలైన మ్యాచ్లో మాత్రం దుమ్ములేపాడీ కుడిచేతి వాటం బ్యాటర్. సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత అర్ధ శతకంతో రాణించి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ మాత్రమే శాశ్వతం’ అని నిరూపించి.. తన విలువ చాటుకున్నాడు. అయితే, ఫైనల్ మ్యాచ్కు ముందు తనను ఆత్మవిశ్వాసంతో లేనని.. డీలా పడిపోయానని కోహ్లి పేర్కొన్నాడు.భారంగా తయారయ్యానని కుమిలిపోయాజట్టుకు ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా తయారయ్యానని కుమిలిపోయానని తెలిపాడు. అలాంటి సమయంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచి.. తాను కోలుకునేలా ఉత్సాహాన్ని నింపారని కోహ్లి వెల్లడించాడు.వెస్టిండీస్ నుంచి ట్రోఫీతో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సమయంలో కోహ్లి సంభాషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నేను, నా జట్టుకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నానని రాహుల్ భాయ్కు చెప్పాను.అందుకు బదులుగా.. ‘కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్లోకి వస్తావు’ అని భాయ్ చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆడే సమయంలో రోహిత్తో కూడా ఇదే మాట చెప్పాను. నేను కాన్ఫిడెంట్గా లేనని చెప్పాను.పట్టుదలగా నిలబడ్డానుఒక్క పరుగు కూడా చేయకపోతే పరిస్థితి ఏమిటని సతమతమయ్యాను. అయితే, ఫైనల్లో మేము వికెట్లు కోల్పోతున్న క్రమంలో పరిస్థితి తగ్గట్లుగా నన్ను నేను మలచుకోవాలని నిర్ణయించుకున్నాను.జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేయాలని పట్టుదలగా నిలబడ్డాను. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చింది’’ అని విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వరల్డ్కప్-2024లో ఫైనల్కు ముందు కోహ్లి చేసిన పరుగులు 75 మాత్రమే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో 59 బంతుల్లోనే 76 రన్స్ సాధించాడు. కాగా సమష్టిగా రాణించి టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs Zim: వికెట్ కీపర్గా అతడే.. భారత తుది జట్టు ఇదే! -
హైదరాబాద్లో అడుగుపెట్టిన సిరాజ్.. అభిమానుల ఘన స్వాగతం
టీ20 వరల్డ్కప్ ఛాంపియన్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సొంత గడ్డపై అడుగు పెట్టాడు. ఢిల్లీలో టీమిండియా విక్టరీ బస్ పరేడ్ ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్కు అభిమానలు ఘనస్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ అతడికి జేజేలు పలికారు. సిరాజ్ మియాతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అనంతరం మహ్మద్ సిరాజ్ రోడ్ షోలో పాల్గొన్నాడు. మెహిదీపట్నం నుంచి ఈద్గహ్ గ్రౌండ్లోని సిరాజ్ ఇంటి వరకు భారీగా ర్యాలీగా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా సిరాజ్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా ఆపూర్వ స్వాగతం పలికింది. హైదరాబాద్.. వరల్డ్కప్ హీరో మహమ్మద్ సిరాజ్ స్వాగతం పలకుతుందని ఎస్ఆర్హెచ్ ఎక్స్లో రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్కప్ విజేతగా భారత్ నిలవడంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు. అమెరికా వేదికగా జరిగిన లీగ్ స్టేజి మ్యాచ్ల్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రాకతో మిగిలిన మ్యాచ్లకు సిరాజ్ బెంచ్కే పరిమితమయ్యాడు. #WATCH | Cricket fans welcome Mohammed Siraj on his return to Hyderabad after winning the T20I Cricket World Cup pic.twitter.com/aEzskY51vG— ANI (@ANI) July 5, 2024 -
జగజ్జేతలకు జాక్ పాట్.. రూ.11 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించిన మహారాష్ట్ర సీఎం
టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచి 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత జట్టుకు మరో జాక్ పాట్ తగిలింది. విశ్వవిజేత టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రూ.11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.భారత విన్నింగ్ టీమ్లో సభ్యులైన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు ముంబై చెందిన క్రికెటర్లన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ నలుగురిని శుక్రవారం విధాన్ భవన్ (స్టేట్ లెజిస్లేచర్ కాంప్లెక్స్) సెంట్రల్ హాల్లో సీఎం ఏక్నాథ్ షిండే సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా పాల్గోనున్నారు. ఈ సందర్భంగానే నగదు బహుమతిని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్లో అద్బుత క్యాచ్ను అందుకున్న సూర్యకుమార్ యాదవ్ను షిండే ప్రత్యేకంగా అభినందించారు. కాగా జగజ్జేత నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ సైతం రూ. 120 కోట్ల భారీ ప్రైజ్మనీ అందించింది. -
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి.. సచిన్, ధోని లానే: రైనా
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ20 కెరీర్కు ఘనంగా విడ్కోలు పలికారు. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ను భారత్కు అందించి వారు తమ టీ20 ప్రయణాన్ని ముగించారు. టీ20 వరల్డ్కప్-2024 విజయం తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెజెండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేసాడు. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు. కాగా విరాట్ కోహ్లి జెర్సీ నెం. 18 కాగా.. రోహిత్ జెర్సీ నంబర్ 45."బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాలనకుంటున్నాను. వరల్డ్కప్ను అందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి. కాబట్టి జెర్సీ నెం.18 నెం. 45ని రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను. ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి. ఇప్పటికే జెర్సీ నెం 10(సచిన్), నెం 7(ధోని)లకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆవిధంగానే ఇప్పుడు విరాట్, రోహిత్ జెర్సీ నెంలను ఎవరికీ కేటాయించకూడదు. ఆ జెర్సీ నంబర్లను చూస్తే ప్రతీ ఒక్కరికి స్పూర్తి కలగాలి. నెం.18, నెం. 45ల జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్కు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించారు. ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
2007 కంటే ఈ వరల్డ్కప్ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్ టీమిండియాకు తమ సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. ముంబైలో వేలాది మంది అభిమానుల నీరాజనాల మధ్య భారత ఆటగాళ్ల బస్ విక్టరీ పరేడ్ అంగరంగవైభంగా జరిగింది. ఆ తర్వాత వాఖండే స్టేడియంలో విశ్వవిజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది.ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకు తరలిచ్చారు. టీమిండియా స్టేడియంలో అడుగుపెట్టగానే జయహో భారత్ అంటూ జేజేలు కొట్టారు. భారత ఆటగాళ్లు సైతం వారి అభిమానానికి పిధా అయిపోయారు.దీంతో భారత ప్లేయర్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 2007 వరల్డ్కప్ విజయం కంటే ప్రస్తుత ప్రపంచకప్ గెలుపు తనకెంతో ప్రత్యేకమైనదని రోహిత్ తెలిపాడు."2007 వరల్డ్కప్ విజయాన్ని నేను ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే అది నా ఫస్ట్ వరల్డ్కప్ విజయం. అప్పుడు కూడా ఇదే ముంబైలో విక్టరీ పరేడ్ జరిగింది. అయితే అది మధ్యాహ్నం.. ఇప్పుడు ఇది సాయంత్రం. అయితే ఈసారి వరల్డ్కప్ విజయం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే విజేతగా నిలిచిన జట్టుకు నేను సారథిగా ఉన్నాను. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. ఈ విజయం నా ఒక్కడికే కాదు ఎవత్ దేశానికి గర్వకారణం. ఈ ట్రోఫీ కోసమే గత 13 ఏళ్లగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 140 కోట్ల భారతీయుల కలనెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని" బీసీసీఐతో రోహిత్ పేర్కొన్నాడు. -
రిటైర్మెంట్పై స్పందించిన జస్ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే?
టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి వరల్డ్కప్లో 17 ఏళ్ల తర్వాత భారత్ విశ్వవిజేతగా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రా.. టీమిండియాకు పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. అయితే టీ20 వరల్డ్కప్ విజయం తర్వాత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్కు విడ్కోలు పలికేశారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20 క్రికెట్కు గుడ్బై చెబుతాడా ఏమో అని అభిమానులు తెగ టెన్ష పడుతున్నారు. తాజాగా బుమ్రా వాంఖడే వేదికగా జరిగిన కార్యక్రమంలోతన రిటైర్మెంట్ ప్లాన్పై స్పందించాడు. ఇప్పటిల్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని బుమ్రా తెలిపాడు. "నా రిటైర్మెంట్కు ఇంకా చాలా సమయం ఉంది. నేను ఇప్పుడే నా కెరీర్ను ప్రారంభించాను. ఈ మెగా టోర్నీ విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20 వరల్డ్కప్ విజేతగా నిలవడం చాలా గర్వంగా ఉంది. నా ఫీలింగ్స్ను మాటల్లో చేప్పలేకపోతున్నాను. ఈ వాంఖడే మైదానం నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అండర్-19 కుర్రాడిగా ఇక్కడికి వచ్చా. ముంబై వీధులన్నీ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయాయి. ఇటువంటి ఘన స్వాగతం నేను ఎప్పుడూ చూడలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. ఇప్పటికి నేను ఓ యువ క్రికెటర్గానే భావిస్తున్నాను. మేము ఈ వరల్డ్కప్లో సీనియర్ ఆటగాళ్లు, కుర్రాళ్లతో కలిసి భారత జట్టు బరిలోకి దిగింది. ప్రతీ మ్యాచ్లోనూ 100 శాతం ఎఫెక్ట్ పెట్టి విజయం సాధించాము. రోహిత్, విరాట్ మన లక్ష్యం ఏంటనే దానిపై స్పష్టతతో ఉన్నారు. దేశానికి కీర్తి తీసుకొచ్చేందుకు అన్ని విధాల మేము ప్రయత్నిస్తాం. నా కెరీర్లో వరల్డ్ కప్ను ఎప్పుడూ గెలవలేదు. ఈ విజమం మాకు మరింత స్పూర్తినిచ్చిందని" బీసీసీఐతో బుమ్రా పేర్కొన్నాడు. -
నేడు (జులై 5) హైదరాబాద్కు మొహమ్మద్ సిరాజ్.. భారీ రోడ్ షోతో ఘన స్వాగతం
టీ20 వరల్డ్కప్లో విజయానంతరం ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనున్న లోకల్ బాయ్ మొహ్మమద్ సిరాజ్కు ఘన స్వాగతం లభించనుంది. సిరాజ్ను భారీ ఊరేగింపుతో ఇంటివరకు తీసుకెళ్లాలని అభిమానులు ప్రణాళిక వేశారు. ముంబైలో జరిగిన టీమిండియా విన్నింగ్ పెరేడ్ తరహాలో ఈ ఊరేగింపు కూడా జరగాలని సిరాజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ విజయోత్సవ ర్యాలీలో భాగ్యనగర వాసులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విక్టరీ ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని సిరాజ్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. సిరాజ్ విక్టరీ ర్యాలీ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మెహిదిపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగనుంది.కాగా, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.17 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్కప్తో తిరిగి రావడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్కప్ను చూసేందుకు స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
లండన్కు వెళ్లిపోయిన విరాట్ కోహ్లి
ముంబైలో జరిగిన వరల్డ్కప్ విజయోత్సవాల అనంతరం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లండన్ వెళ్లిపోయాడు. విరాట్ భార్య అనుష్క శర్మ.. పిల్లలు విరుష్క, అకాయ్లతో కలిసి లండన్లో ఉంటుంది. వీరిని కలిసేందుకు విరాట్ లండన్కు పయనమయ్యాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమం అనంతరం విరాట్ నేరుగా ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. విరాట్ విమానాశ్రమంలోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.విరాట్ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి, ఇప్పట్లో అతను టీమిండియాకు ఆడే అవకాశం లేదు. ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఉన్నప్పటికీ విరాట్ అందుబాటులో ఉండకపోవచ్చు. అక్టోబర్లో న్యూజిలాండ్తో జరిగే సిరీస్ సమయానికి విరాట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదీ లేదంటే విరాట్ అందుబాటులోకి వచ్చేది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయానికే. ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న (జులై 4) ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది.11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి.విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్కప్ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్ బంప్స్ రావాల్సిందే..!
టీమిండియా టీ20 వరల్డ్కప్ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. GOOSEBUMPS GUARANTEED...!!!! 😍- Team India singing 'Vande Maataram' with Wankhede crowd. 🇮🇳pic.twitter.com/SfrFgWr4x9— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024నిన్న (జులై 4) జరిగిన వరల్డ్కప్ విన్నింగ్ పెరేడ్లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.THE DANCE OF ROHIT SHARMA, VIRAT KOHLI & PLAYERS AT WANKHEDE.🥹🏆- One of the Most beautiful Moments in Indian cricket history. ❤️ pic.twitter.com/IjBujoejgb— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్కప్ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు. -
చెట్టెక్కిన అభిమానం.. జడుసుకున్న టీమిండియా క్రికెటర్లు
టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. THE DROW SHOWING INDIAN TEAM VICTORY PARADE AT MARINE DRIVE. 🇮🇳🤯- The Craze and Love for Team India..!!! ❤️pic.twitter.com/krkHJHW0ST— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధుల టీమిండియా క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. అయితే ఈ విన్నింగ్ పరేడ్లో ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. ఓ అభిమాని భారత క్రికెటర్లను దగ్గరి నుండి చూసేందుకు చెట్టెక్కాడు. సదరు అభిమాని ఎంచక్కా చెట్టు కొమ్మపై పడుకుని సెల్ఫోన్తో భారత క్రికెటర్ల ఫోటోలు తీసుకున్నాడు. అభిమానిని సడెన్గా చూసిన భారత క్రికెటర్లు ఒక్కసారిగా జడుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమాని చేసిన రిస్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్కీ ఫెల్లో.. టీ20 ప్రపంచకప్ను, వరల్డ్కప్ విన్నింగ్ హీరోలను దగ్గరి నుండి చూశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.टीम इंडिया को करीब से देखने के लिए पेड़ पर चढ़ गया शख़्स, देखिए वीडियो#Shankhnaad #T20WorldCup #IndianCricketTeam #VictoryParade | @chitraaum pic.twitter.com/9zENHdKjV9— AajTak (@aajtak) July 4, 2024కాగా, భారత క్రికెటర్ల వరల్డ్కప్ విన్నింగ్ పరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే స్టేడియం వరకు సాగింది. అనంతరం వాంఖడేలో బీసీసీఐ భారత క్రికెటర్లను సన్మానించింది. ఇదిలా ఉంటే, జూన్ 29 జరిగిన టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది.Captain Rohit Sharma talking about on support to Team India in Mumbai.❤️- THE PROUD CAPTAIN, ROHIT. 🐐🏆pic.twitter.com/b8m6D4RJoi— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024 -
జగజ్జేతలకు జేజేలు.. వాంఖడేలో టీమిండియా జట్టుకు సన్మానం (ఫొటోలు)
-
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
దటీజ్ హార్దిక్ పాండ్యా.. అవమానపడ్డ చోటే జేజేలు! వీడియో వైరల్
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బార్బోడస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న టీమిండియాకు అభిమానులు, బీసీసీఐ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్కు వెళ్లే అంతవరకు జేజేలు కొడుతూ అభినందించారు. ఇప్పుడు ముంబై వంతు. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ ప్రారంభమైంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్ విక్టరీ పరేడ్ జరగనుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వరల్డ్ ఛాంపియన్స్కు సన్మానం జరగనుంది.హార్దిక్కు సారీ చెప్పిన అభిమానిఇక టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో సమయంలో ఏ వాంఖడే స్టేడియంలో అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. ఇప్పుడు అదే మైదానంలో నీరాజనాలు అందుకుంటున్నాడు. భారత ఆటగాళ్ల సన్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వాంఖడే స్టేడియంకు తరలివచ్చారు. హార్దిక్ హార్దిక్ అంటూ జేజేలు కొడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని లైవ్లో హార్దిక్ క్షమాపణలు చెప్పింది."మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐపీఎల్లో నేను కూడా అతడిని ట్రోల్ చేశాను. అలా ఎందుకు ట్రోల్ చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. అతడు టీ20 వరల్డ్కప్లో హీరోగా మారాడు. అతడు వేసిన చివరి ఒక అద్భుతం. అతడికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని" సదరు అభిమాని ఇండియా టూడేతో పేర్కొంది. Hardik Pandya is Zlatan Ibrahimovic of Indian Cricket 🏏 who has turned his "haters into fans" 👏🏻The Best All Rounder of ICC T20 World Cup 2024 - @hardikpandya7 💥#IndianCricketTeampic.twitter.com/cNcK2zPiwq— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024 -
విశ్వవిజేతలకు ఘన సత్కారం.. 125 కోట్ల ప్రైజ్ మనీ అందజేత
Team India Victory Parade Live Updates: విశ్వవిజేతలకు ఘన సత్కారం.. 125 కోట్ల ప్రైజ్ మనీవాంఖడేలో టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. వేలాది మంది అభిమానుల మధ్య భారత ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించింది. భారత జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా అందజేశారు. ఇక భారత ఆటగాళ్లు ట్రోఫీని పట్టుకుని మైదానం మొత్తం తిరిగారు. అభిమానులకు అభివాదం చేస్తూ టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా టీ20లకు విడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు."2011 వరల్డ్కప్ విజయం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న నా సీనియర్ల భావోద్వేగాలతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తోంది. ఈ 15 ఏళ్లలో రోహిత్ ఇంతలా ఎమోషన్ అవ్వడం ఇదే తొలిసారి. ఇక బుమ్రా ఒక అద్బుతం. టోర్నీలో విజయం సాధించడంలో అతడిదే కీలక పాత్ర. అటువంటి ఆటగాడు భారత తరపున ఆడటం మనందరి అదృష్టం"- భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి"మమ్మల్ని స్వాగతించడానికి అభిమానులు భారీగా తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మా లాగే టైటిల్ కోసం ఎన్నో ఏళ్ల ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అన్పించింది. భారత్లో క్రికెట్ను ఒక మతంగా భావిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు"- భారత కెప్టెన్ రోహిత్ శర్మసందడి చేస్తున్న భారత ప్లేయర్లు..వాంఖడేలో భారత ఆటగాళ్లు డ్యాన్స్లు ఇరగదీస్తున్నారు. మరి కాసేపట్లో విశ్వవిజేలతకు సన్మానం జరగనుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Virat, Rohit, Hardik and others are dancing their hearts out 🔥🔥🔥🔥#T20WorldCup pic.twitter.com/UAWjL89Wxa— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024 ముగిసిన విక్టరీ పరేడ్.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ ఘనంగా ముగిసింది. భారత జట్టు వాంఖడే స్టేడియంకు చేరుకుంది. భారత ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. జేజేలు కొడుతున్న ఫ్యాన్స్..జనసముద్రం మధ్య టీమిండియా విక్టరీ పరేడ్ కొనసాగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కలిసి వరల్డ్కప్ను పట్టుకుని ఫ్యాన్స్కు చూపించారు. దీంతో అభిమానులు రోహిత్ , విరాట్ అంటూ జేజేలు కొడుతున్నారు.కొనసాగుతున్న టీమిండియా విజయోత్సవ యాత్రటీమిండియా విజయోత్సవ యాత్ర కొనసాగుతోంది. అభిమానుల నీరాజనాల మధ్య బస్ ముందుకు కొనసాగుతోంది. ఈ పరేడ్ వాంఖడే స్టేడియం వరకు జరగనుంది.ప్రారంభమైన టీమిండియా విక్టరీ పరేడ్ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్ ప్రారంభమైంది. నారిమన్ పాయింట్ నుంచి భారత జట్టు విజయోత్సవ యాత్ర ప్రారంభమైంది. ఓపెన్ టాప్ బస్లో భారత ఆటగాళ్లు ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేస్తున్నారు.విజయోత్సవ యాత్ర కాస్త ఆలస్యంటీమిండియా విజయోత్సవ యాత్ర కాస్త ఆలస్యం కానుంది. ముంబైలో భారీ వర్షం కురుస్తుండండతో ఆటగాళ్లు ఇంకా హోటల్ గదులకే పరిమితమయ్యారు. అదేవిధంగా భారత ఆటగాళ్ల ఎక్కాల్సిన పరేడ్ బాస్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుంది. పోలీస్లు తీవ్రంగా శ్రమించి నారిమన్ పాయింట్ వద్దకు బస్స్ను తీసుకువచ్చారు.టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్ భారత జట్టుకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ముంబైలో అడుగుపెట్టిన భారత జట్టు హోటల్కు చేరుకుంది. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్ పాండ్యా సతీమణి పోస్టు వైరల్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొన్ని నెలలగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు పాండ్యా గానీ, నటాషా గానీ ఈ విషయంపై స్పందించలేదు. అయితే తాజాగా నటాషా పెట్టిన ఓ పోస్టు ఈ విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఉంది."జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండి నిరుత్సాహానికి లోనవుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మీరు భయపడవద్దు. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా ఉంటాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు" అని నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. కాగా టీ20 వరల్డ్కప్-2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ను సొంతం చేసుకున్న భారత జట్టు.. సగర్వంగా భారత గడ్డపై అడుగు పెట్టింది. అయితే భారత్ ఛాంపియన్స్గా నిలవడంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ సత్తాచాటిన హార్దిక్ భారత్కు రెండో సారి పొట్టి ప్రపంచకప్ను అందించాడు. విజయనంతరం పాండ్యా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గత కొన్ని కొన్ని నెలల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాని పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. భారత విజయం తర్వాత కోహ్లి, రోహిత్ సతీమణిలు తమ భర్తలపై ప్రశంసల వర్షం కురిపించగా.. పాండ్య ప్రదర్శనపై మాత్రం నటాషా ఇప్పటివరకు కనీసం ఒక్క పోస్టు కూడా చేయలేదు. -
థాంక్యూ పీఎం సార్.. చాలా సంతోషంగా ఉంది: విరాట్ కోహ్లి
టీ20 వరల్డ్కప్ను సాధించి 11 ఏళ్ల నిరీక్షణకు తెరిదించిన భారత జట్టు ఎట్టకేలకు సొంత గడ్డపై అడుగుపెట్టింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రోహిత్ సేనకు ఆపూర్వ స్వాగతం లభించింది.ఎయిర్ పోర్ట్కు భారీగా చేరుకున్న అభిమానులు టీమిండియాకు జేజేలు పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని భారత జట్టు తన నివాసంలో కలిసింది. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి అప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో భారత జట్టు ఢిల్లీ నుంచి ముంబైకు పయనమైంది.ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. విరాట్ సోషల్ మీడియా వేదికగా ప్రధానికి కృతజ్జతలు తెలిపాడు."ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మమ్మల్ని మీ నివాసానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ అంటూ" కోహ్లి ఎక్స్లో రాసుకొచ్చాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం సోషల్ మీడియా మోదీకి ధన్యవాదాలు తెలిపాడు.చదవండి: T20 WC 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్బై Humbled to meet honorable PM Shri Narendra Modi Sir along with the entire team. Thank you Sir for your encouraging words, means a lot to all of us. 🇮🇳 pic.twitter.com/I6lq3E1nS1— Yuzvendra Chahal (@yuzi_chahal) July 4, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్బై
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ మహ్మదుల్లా రియాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్కప్-2024 ముగిసిన అనంతరం రియాద్ తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్కు తన సేవలను అందించాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు. మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గతంలో బంగ్లా దేశ్ టీ20 జట్టు కెప్టెన్గా కూడా మహ్మదుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతడి సారథ్యంలోని బంగ్లా జట్టు ఫైనల్కు చేరింది. ఇక టీ20 వరల్డ్కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8 రౌండ్లో నిష్కమ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ బంగ్లా జట్టు ఓటమి పాలైంది. -
వాంఖడేలో భారత జట్టుకు సన్మానం.. ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ
టీ20 వరల్డ్కప్-4 విజేతగా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత తమ సొంత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రాయంకు భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ..ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సన్మాన వేడుకను చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంసీఎ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.వర్షం అంతరాయం..ఇక ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు అక్కడ వాతవారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
రోహిత్ సేనకు మోదీ విందు
-
T20 ఛాంపియన్స్ ను అభినందించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
T20 World Cup 2024: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు
విశ్వ విజేత టీమిండియా ఇవాళ (జులై 4) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా మోదీ భారత బృందాన్ని అభినందించారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు ఆల్పాహార విందు ఏర్పాటు చేశారు. మోదీ అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది ముచ్చటించారు. TEAM INDIA MEETS PM NARENDRA MODI. 🇮🇳pic.twitter.com/tCotFhi4QP— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024అనంతరం భారత బృందం ప్రధాని నివాసం నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.కాగా, ఇవాళ ఉదయమే భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. హరికేన్ (గాలివాన) కారణంగా భారత బృందం మూడు రోజుల పాటు బార్బడోస్లోనే ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్కప్ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది. -
రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్
టీ20 వరల్డ్కప్ విజయానంతరం ఇవాళ (జులై 3) ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు కేరింతలు, హర్షద్వానాలతో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. జయహో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్ వరల్డ్కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.The Happiness and dance of Captain Rohit Sharma is absolute priceless. 😄❤️pic.twitter.com/G5XQPjH5Qj— Tanuj Singh (@ImTanujSingh) July 4, 2024హోటల్ ఎంట్రెన్స్లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్ వాయింపుకు రోహిత్ శర్మ, సూర్యకుమార్, రిషబ్ పంత్ మాస్ డ్యాన్స్ చేశారు. రోహిత్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. హోటల్ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేక్ను ఏర్పాటు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేక్ను కట్ చేశాడు. ఇదిలా ఉంటే, భారత క్రికెటర్లు ఐటీసీ మౌర్యలో కాసేపు సేదతీరి ప్రధాని మోదీని కలిసేందుకు వెళతారు. మోదీతో భేటి అనంతరం టీమిండియా ముంబైకు బయల్దేరుతుంది. అక్కడ భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్లో ర్యాలీగా వెళ్తారు. చివరిగా టీమిండియా వాంఖడే స్టేడియంకు చేరుకుంటుంది. అక్కడ బీసీసీఐ ఆథ్వర్యంలో భారత క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్కప్ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.