-
అమ్మమ్మను తలుచుకుని ఎమోషనలైన పూజా హెగ్డే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తను మరోసారి అమ్మమ్మను గుర్తు చేసుకుని ఎమోషనలైంది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. 'విల్ మిస్ యూ అజ్జి' అంటూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా.. ఇటీవలే బుట్టబొమ్మ తన చెల్లెలు భూమి పెళ్లిలో సందడి చేస్తూ కనిపించింది. గతంలో కూడా పూజా తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కాగా.. గతేడాది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కిసీ కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. టాలీవుడ్లో గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో చిత్రాలేవీ లేవు. ప్రస్తుతం ముంబై భామకు అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. -
ఈ స్టూడెంట్ వయసు జస్ట్... 92
‘చదువుకు వయసుతో పనేమిటి’ అనేది పాత డైలాగే కావచ్చు గానీ 92 సంవత్సరాల సలీమాఖాన్కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే బామ్మను 92 ఏళ్ల వయసులోనూ బడి బాట పట్టించింది. ఉత్తర్ప్రదేశ్లోని బులందర్షహర్కు చెందిన సలీమాకు బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం దొరకలేదు. ఆరు నెలల క్రితం బడిలో చేరిన సలీమా పిల్లలతో పాటు క్లాస్రూమ్లో కూర్చునేది. చదవడం, రాయడం నేర్చుకుంది. ‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను అనే సంతోషాన్ని చెప్పడానికి మాటలు లేవు’ అంటుంది సలీమాఖాన్. ‘మొదట్లో ఆమెకు చదువు చెప్పడానికి టీచర్లు తటపటాయించారు. అయితే ఆమెను వద్దనడానికి మా దగ్గర ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు ఉత్సాహం వచ్చింది. అక్షరాస్యురాలిని కావాలి అనే ఆమె పట్టుదల టీచర్లకు నచ్చింది’ అంటుంది స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ శర్మ. -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో అత్యధికులు తమకు తామే సెలెబ్రిటీలమన్న భావన ఉంటున్నారు. కొంతవరకు మంచిదే కానీ కేవలం లైకులు కామెంట్ల కోసం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాగే ఒకామె తొందరపడి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాసుపాలైంది. అమ్రిత్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న ఒక యువతి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని చాలా క్రియేటివ్ గా పోస్ట్ చేసింది. ఆమె అమ్మమ్మ బ్రతికుండగా సోఫాలో కూర్చుని తింటున్న ఫోటోను ఒకపక్కన మరొపక్కన ఆమె లేకుండా ఖాళీగా ఉన్న సోఫా ఫోటోను పోస్ట్ చేసి.. ఫోటోలతో పాటు "నేను దీని నుండి ఎప్పటికీ కోలుకోలేను.." అని రాసింది. పెద్దావిడ మరణవార్తను తన ఫాలోవర్లకు చెప్పాలన్న కుతూహలం కన్నా వారి సానుభూతి రూపంలో లైకులు కామెంట్లు పొందాలన్న ఆమె ఆత్రుతే ఎక్కువగా కనిపించింది నెటిజన్లకు. దీంతో వారు కూడా సున్నిత శైలిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన కామెంట్లతో ఆ యువతిని చెడామడా వాయించేస్తున్నారు. "మీ అమ్మమ్మ మరణం తీరని లోటు. అలాగని ప్రతిదీ ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలా?" అని కొందరు రాస్తే.. ఆమె చావు నీకు ఇలా ఉపయోగపడిందన్న మాట, మీకు రిప్లై ఇస్తే నాకు మెసేజులు మీద మెసేజులు వస్తున్నాయని మరొకరు.. కామెంట్లు చేశారు. ఎవరేమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. సదరు వ్యక్తి చేసిన పోస్టుకు మాత్రం 40 లక్షల పైచిలుకు వీక్షణలు దక్కాయి. అదీ సోషల్ మీడియా పవర్ అంటే.. I’m never going to recover from this pic.twitter.com/yRhfdApZap — A (@ammmmmmrit) July 10, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
సైకో వీరంగం.. గుమ్మం నుంచి బామ్మను లాగి..
ఫ్రాన్స్లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి గుమ్మం ముందు నిలబడిన బామ్మ, చిన్నారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు కూడా గాయపడింది. బోర్డియక్స్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే.. నిందితుడు ఓ ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ కాలనీలో బామ్మ తన మనవరాలితో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా కాస్త బోరింగ్గా ఫీల్ అయిన బామ్మ గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆఫ్రికన్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని గమనించిన బామ్మ తన మనవరాలితో వెంటనే ఇంట్లోకి వెళ్లి డోర్ మూసేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నిందితుడు వారిని అడ్డగించాడు. డోర్ వేయకుండా ఆపేసి వారిని బయటకు లాగాడు. విచక్షణా రహితంగా చిన్నారిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. అనంతరం బామ్మపై దాడి చేసి.. విలువైన వస్తువులను లాక్కెళ్లాడు. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. Shocking video of violent attack on a grandmother and granddaughter by a migrant in Bordeaux, France goes viral; Netizen demand strict anti-immigration laws. pic.twitter.com/kqjeE2tFW9 — Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అకారణంగా దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. ఇదీ చదవండి: గొంతును ఏమార్చారు, ఒరిజినల్గా నమ్మించారు -
భళా బామ్మ! సాఫ్ట్వేర్ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. యుక్త వయస్కురాలు చేసినట్లు అన్ని పనులు చేస్తోంది. అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో అనే వివరాలను తెలుసుకుందాం. ఆ ఆలోచనే.. లక్షల సంపాదనగా మారింది గుజరాత్లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది. అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
‘మనవరాలి’కి జన్మనిచ్చిన 56 ఏళ్ల మహిళ
వాషింగ్టన్: మనవరాలికి నానమ్మ జన్మనివ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, సరోగసి పున్యమా అని ఇలాంటి వింత సంఘటనలు ఇటీవల సాధ్యమవుతున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని ద పీపుల్స్ మీడియా పేర్కొంది. ఉతాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు గర్భాశయం తొలగించారు. ఈ క్రమంలో సరోగసి ద్వారా వారి బిడ్డను కనివ్వడనికి అతడి 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట వాదించాడు జెఫ్ హాక్. అయితే, వైద్యులు చేసి చూపించారు. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ పేర్కొంది. నానమ్మ గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారు జెఫ్ హాక్, కాండ్రియా. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ హాక్. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని చేప్పారు నాన్సీ. ఒక మహిళ తన మనవరాలిని మోయడం అనేది అసాధారణమైన విషయమని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Cambria Hauck (@cambriairene) ఇదీ చదవండి: విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్! -
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్లాండ్కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్లాండ్లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్గా ఉందే! -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
ప్రాణాలు తీసిన డిప్రెషన్
నిజాంపేట్ (హైదరాబాద్): గోరు ముద్దలు తినిపించాల్సిన అమ్మమ్మే గొంతు నులిమి ఊపిరి తీసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లి పేగుబంధాన్ని తెంపేసుకుంది. 12 ఏళ్ల క్రితం దూరమైన కుటుంబ పెద్దను కుమారుడు దగ్గర చేసే యత్నంలో.. ఇది నచ్చని తల్లీకూతుళ్లు తీవ్ర మానసిక క్షోభకు గురై చనిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో 18 నెలల బాలుడి ఊపిరి తీసి ఉరి వేసుకున్నారు. వీరిలో తల్లి చనిపోగా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన లలిత (56), కృష్ణమూర్తి దంపతులు హైదరాబాద్లోని నిజాంపేట్ వినాయకనగర్లో ఉంటున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్. ఇద్దరు కూతుళ్లు అర్చన, దివ్య ఉన్నారు. లలిత భర్త కృష్ణమూర్తి 12 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వేరుగా ఉంటున్నాడు. లలిత ఇద్దరు కూతుళ్ల వివాహాలు చేసి అత్తారిళ్లకు పంపించింది. శ్రీకర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా కుటుంబంలో మనస్పర్థలు.. నాలుగేళ్ల క్రితం దివ్య వివాహం సమయంలో శ్రీకర్ తన తండ్రి కృష్ణమూర్తిచే కన్యాదానం చేయించాలని కుటుంబంలో ప్రతిపాదన తెచ్చాడు. దీనికి తల్లి లలిత, చెల్లెలు దివ్య ఒప్పుకోలేదు. ఆయన వస్తే తను పెళ్లి చేసుకోనని దివ్య కరాఖండీగా చెప్పింది. దీంతో శ్రీకర్ తన ప్రతిపాదన విరమించుకున్నాడు. అప్పటి నుంచి శ్రీకర్ తన తండ్రి కృష్ణమూర్తితో టచ్లో ఉన్నట్లు మిగతా కుటుంబ సభ్యులు భావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లిలో కూతురు దివ్య వద్ద లలిత కొద్ది రోజులు.. కుమారుడి వద్ద కొద్ది రోజులు ఉంటూ వస్తోంది. కుమారుడి వయసు 35 ఏళ్లు దాటుతున్నా వివాహం కాకపోవడం, సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదని లలిత ఆందోళనకు గురయ్యేది. దీనికి తోడు ఎప్పుడో దూరమైన భర్తకు కుమారుడు దగ్గరవుతున్నాడనే అనుమానం పెరిగిపోసాగింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన లలిత.. 15 రోజుల క్రితం దివ్యతో లలిత తనకు బతకాలని లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తల్లితో ఎక్కువ అనుబంధం ఉన్న దివ్య ఆమె లేని జీవితం తనకూ వద్దనుకుంది. తాము చనిపోతే శివ కార్తికేయ అనాథ అవుతాడని, దీంతో బాలుడినీ చంపాలని తల్లీకూతుళ్లు నిర్ణయించుకున్నారు. మొదట చిన్నారి గొంతునులిమి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తల్లీకూతుళ్లు.. మొదట శివ కార్తికేయను గొంతు నులిమి అమ్మమ్మ లలిత ఊపిరితీసింది. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో గదిలో దివ్య చున్నీతో మెడకు వేసుకుని చనిపోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన శక్తి చాలకపోవడంతో తెల్లవారుజామున పక్కగదిలో ఉన్న శ్రీకర్ను నిద్ర లేపింది. ఆందోళనకు గురైన అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని దివ్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో తమ మృతికి ఎవరూ కారణం కాదనే సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. -
KTR Hometown: అవ్వా.. నేను వెంకటమ్మ మనవడిని
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని తన నానమ్మ ఊరు కోనాపూర్లో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. ‘అవ్వా.. నేను వెంకటమ్మ మనవన్ని’అంటూ పలకరించారు. ఊరంతా కలియదిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు. తర్వాత ఊర్లో తన సొంత డబ్బు రూ.2.5 కోట్లతో నానమ్మ పేరుతో కట్టిస్తున్న బడికి శంకుస్థాపన చేశారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగుపై రూ.2.40 కోట్లతో కట్టిస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి, రూ.75 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.24 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. మాది మొదటి నుంచీ ఉన్నత కుటుంబమే తమది మొదటి నుంచి ఉన్నత కుటుంబమేనని కేటీఆర్ చెప్పారు. ‘మా తాత రాఘవరావుది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. ఆయన వందల ఎకరాల ఆసామి. నానమ్మ వెంకటమ్మది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ (పోసానిపల్లె). నానమ్మ వాళ్లింట్లో మగ పిల్లలు లేకపోవడంతో తాతను 1930ల్లో ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నరు. కోనాపూర్లో చెరువు కింద ఆయకట్టులో సగం భూమి మా తాతదే. ఊరి కింది భాగాన 500 ఎకరాలకు పైగా భూమి ఉండేది. నిజాం సర్కారు ఎగువ మానేరుకు ప్లానింగ్ చేస్తే తాత, నానమ్మల భూమి అంతా అందులో మునిగింది. అప్పుడు నిజాం సర్కారు రూ.2.5 లక్షల ముంపు పరిహారం ఇచ్చింది. ఆ డబ్బులతో తాత, నానమ్మ సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు. అక్కడ ఆ డబ్బుతో వందల ఎకరాల భూమి కొన్నారు. మా నానమ్మ, తాతలు వదిలి వెళ్లిన కోనాపూర్లో సొంత డబ్బుతో కార్పొరేట్ను మించిన సర్కారు బడి కట్టించాలనుకున్న. ఈ రోజు ముహూర్తం కుదిరింది. ఏడాదిలోపు భవనం నిర్మాణం పూర్తి చేస్త. రెండంతస్తుల్లో 14 గదులతో బడి నిర్మితమవుతుంది. విద్యా మంత్రిని తీసుకువచ్చి ప్రారంభించుకుందాం’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో మానేరు పొంగిందా! సీఎం కేసీఆర్ది వ్యవసాయ కుటుంబమని, పొలం కొనుక్కుని ఇళ్లు కట్టుకుంటే ఫాంహౌస్ సీఎం అని విమర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నోరుందని కొందరు ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. సీఎం వయసు, స్థాయికి విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని దుయ్యబట్టారు. ‘మాకు కూడా మస్తు మాట్లాడొచ్చు. కానీ బాధ్యతలున్నాయి’అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం అంటే ఏంటో తెలిసినవాడు కాబట్టే రైతులకు సీఎం మేలు చేస్తున్నారని చెప్పారు. దుర్భిక్ష ప్రాంతాలైన సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఎగువ మానేరు ఎప్పుడన్నా ఏప్రిల్, మే నెలల్లో పొంగి పొర్లిందా అని ప్రశ్నించారు. మానేరు నది మొత్తం జీవనదిలా మారిందన్నారు. మానేరుతో అనుబంధం ‘ఎగువ మానేరు నిర్మాణంతో నానమ్మ వాళ్ల భూములు ముంపునకు గురైతే మిడ్ మానేరు నిర్మాణంతో అమ్మమ్మ ఊరు కొదురుపాక మునిగింది. అమ్మమ్మ వాళ్ల భూముల మునిగాయి. మా చిన్న అమ్మమ్మ వాళ్లది వచ్చునూరు. దిగువ మానేరులో వాళ్ల ఊరు మునిగింది. మానేరు నదితో మా కుటుంబానికి ఏదో తెలియని అనుబంధం ఉంది’అని కేటీఆర్ వివరించారు. అమ్మమ్మ ఊరిలోనూ బడి కట్టిస్తా పేదలకు మంచి విద్య అందించాలన్న లక్ష్యంతో ‘మన ఊరు–మన బడి’కి సీఎం శ్రీకారం చుట్టారని, కార్యక్రమం కింద 26 వేల పాఠశాలల అభివృద్ధికి రూ.7,300 కోట్లు ఖర్చు చేయనున్నామని కేటీఆర్ వివరించారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ వస్తోందని, బీబీపేటలో జూనియర్ కాలేజీ త్వరలోనే ఏర్పాటవుతుందని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలోనూ అమ్మమ్మ పేరుతో పాఠశాల కట్టిస్తానని కేటీఆర్ ప్రకటించారు. అర్హులకు ఆసరా పెన్షన్లిస్తాం సిరిసిల్ల: రాష్ట్రంలోని అర్హులైన వారికి కొత్తగా ఆసరా పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రైతుల రూ.50 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ. 20 వేల కోట్లతో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను 560 చదరపు అడు గులతో నిర్మించామని.. పైసా లంచం లేకుండా లబ్ధిదారులకు అందించామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా తలసరి ఆదాయం 60 వేల డాలర్లని (సుమారు రూ. 60 లక్షలు), మన దేశ తలసరి ఆదాయం రూ.1,800 ఉందని చెప్పారు. అచ్చే దిన్ అంటూ సిలిండర్, పెట్రోల్ ధరలను కేం ద్రం పెంచుతోందని.. మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఎల్ఐసీ వంటి సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ రోడ్డులో మినీ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా జనం తోపులాట గా కేటీఆర్ను నెట్టడంతో ఆయన అసహనానికి గురయ్యారు. మున్సిపల్, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం లోకి రాకుండానే వెనుదిరిగారు. కేటీఆర్కు కేసీఆర్ ఫోన్ కోనాపూర్లో తిరుగుతూ నానమ్మ వాళ్ల పాత ఇంటి వద్దకు చేరుకున్నప్పుడు సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావని సీఎం అడిగారని, నానమ్మ ఇంటి ముందు నిలబడ్డానని చెబితే మురిసిపోయారని కేటీఆర్ చెప్పారు. గ్రామస్తులు అడిగినవాటికి భరోసా ఇవ్వాలని కూడా చెప్పారని, వినతిపత్రంలో పేర్కొన్న వాటిని కలెక్టర్ పరిశీలించి నివేదికను తనకు ఇస్తే సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ శోభ, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటి తదితరులు పాల్గొన్నారు. -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ
చెన్నై: కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ మహిళ తన మనవడిని కిరాతకంగా హత్య చేసింది. పసివాడు అనే కనికరం కూడా లేకుండా ఆ బామ్మ ఈ ఘోరానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల ప్రకారం, కోయంబత్తూరులోని అన్బాగం వీధిలో నాగలక్షి అద్దె ఇంట్లో నివసిస్తూ ఓ హోటల్లో హౌస్ కీపర్గా పనిచేస్తోంది. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, ఆమె కుమార్తె నందినికి (24) వృత్తిరీత్యా కాల్ టాక్సీ యజమాని కమ్ డ్రైవర్ నిత్యానందంతో వివాహం జరిగింది. అయితే ఆమె కోరికకు విరుద్ధంగా తన కుమార్తె వివాహం చేసుకున్నందుకు నాగలక్షి నిత్యానందంపై పగ పెంచుకుంది. ఎనిమిది నెలల క్రితం, నందిని తన భర్తతో అభిప్రాయభేదాల కారణంగా ఆమె తన చిన్న కుమారుడిని తీసుకుని నాగలక్ష్మి ఇంటికి వెళ్లింది. గత కొన్ని రోజులుగా, నాగలక్షికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నందిని హోటల్లో పనిచేయడం ప్రారంభించింది. మంగళవారం రాత్రి పని నుంచి తిరిగి వచ్చిన నందిని తన బిడ్డ శ్వాస తీసుకోకపోవడం గమనించి, అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణంపై అనుమానంతో నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా అందులో పిల్లాడి పుర్రె పగిలిపోయిందని, అతని గొంతులో బిస్కెట్ రేపర్ దొరికిందని నివేదిక పేర్కొంది. పోలీసుల విచారణలో, నాగలక్షి చిన్నారిని చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. చదవండి: SR Nagar: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్ -
అమ్మమ్మే కడతేర్చింది..!
సంగారెడ్డి అర్బన్: కూతురుకు రెండో వివాహం చేయడం కోసం ఏడాదిన్నర వయసున్న మనవడిని చెరువులోకి తోసి హత్య చేసింది ఓ అమ్మమ్మ. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగారెడ్డిలోని రాజంపేటకాలనీకి చెందిన నాగమణి తన కూతురు సుజాత మనవళ్లు మహేష్, జశ్వంత్లతో నివాసముంటోంది. సుజాత భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో పుల్కల్ మండలం బద్రిగూడెంకు చెందిన జనార్దన్తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చెరువులో తోసి ఏమీ తెలియనట్లు.. తనను పెళ్లి చేసుకోవాలని సుజాత.. జనార్దన్పై ఒత్తిడి తెచ్చింది. అయితే పెద్ద కుమారుడిని ఎవరైనా దత్తత తీసుకుంటారని, ఏడాదిన్నర ఉన్న చిన్న కుమారుడిని ఎలాగైనా వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కూతురు పెళ్లికి చిన్నారిని అడ్డు తొలగించాలని నాగమణి నిర్ణయించుకుంది. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లి బొబ్బలికుంట చెరువులో తోసేసింది. బాలుడు ఊపిరి ఆడక మృతిచెందాడు. బాలుడు అదృశ్యమయ్యాడని ఈ నెల 29న పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అమ్మమ్మే నింది తురాలని తేలింది. నాగమణితోపాటు సుజాతను, జనార్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్
బెంగళూరు: నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. మూడ నమ్మకాలకు పల్లెలని, పట్టణాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. దేన్నైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా కర్ణాటకలోని నెలమంగళ సమీపంలో ఉన్న గాంధీ అనే గ్రామంలో దుష్టశక్తులకు బలివ్వడానికి ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పదేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా.. సావిత్రమ్మ, సౌమ్య అనే వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. అయితే పాప కనిపించకపోవడంతో ఆ బాలిక బామ్మ చుట్టు పక్కల వెతికింది. కాగా, సమీపంలో దుష్టశక్తుల నుంచి రక్షణకు పూజలు చేస్తున్న చోటు నుంచి కేకలు వినిపించడంతో.. బామ్మ సమీపంలోని పొలంలో వెళ్లింది. అక్కడ బాలిక మెడలో దండలు వేసి పూజలు చేస్తున్నట్లు గ్రహించి తమ వారితో వెళ్లి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పూజారితో సహా ఓ నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నట్లు శనివారం బాధితుడి కుటుంబం మరో మారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు -
విషాదం: అమ్మమ్మా.. ఎంతపని చేశావ్!
అమలాపురం టౌన్: రెండేళ్ల వయస్సులో తండ్రి మరణం.. మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లితో దూరం..అమ్మమ్మ పెంపకంతో జీవనం... ఇప్పుడు ఆ ఒక్క ఆసరాగా ఉన్న అమ్మమ్మ కరోనాతో మరణం... అయినవాళ్లు ఉన్నా ఎవరూ తనను సాకేందుకు ముందుకు రాకపోవడం...నేను ఇక అనాథగా మిగిలిపోతానా... నన్నెవరూ చేరదీయరా...అంటూ ఆ పదేళ్ల బాలుడు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అమలాపురం మైపాలవీధికి చెందిన సంకు సాయిచరణ్ రెండో ఏటే అతని తండ్రి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లి, అన్న, అతను దిక్కులేని వారయ్యారు. ఆ కుటుంబం అమలాపురంలోని అమ్మమ్మ సూర్యవతి ఇంటికి చేరుకుంది. అన్నయ్యను బంధువులు దత్తత తీసుకున్నారు. అమ్మమ్మ పెద్ద మనసుతో ఆలోచించి తన కూతురికి వేరే పెళ్లి చేసి పంపించేసి, సాయిచరణ్ను తనే పెంచుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే ఏడేళ్ల కిందట అమ్మమ్మ.. సాయిచరణ్ అమ్మకు ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన అప్పటికే భార్య చనిపోయిన వ్యక్తికి రెండో పెళ్లి చేసి సాగనంపింది. అప్పటి నుంచి మనవడు సాయిచరణ్ను చదివిస్తూ అల్లా రు ముద్దుగా చూస్తోంది. గత నెలలో అమ్మమ్మ సూర్యావతికి కరోనా సోకి మృత్యువాత పడింది. వేరే పెళ్లితో అప్పడు వెళ్లిన అమ్మ, సూర్యావతి కుమారులు కలిసి ఆమె అంత్యక్రియలు ముగించారు. కొద్దిరోజులకు సాయిచరణ్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సాయిచరణ్ను ఎవరు పెంచాలన్నదే ప్రశ్నార్థకం? అమ్మమ్మ దిన కార్యక్రమం ఆమె రక్త సంబంధీకులంతా ఏ లోటూ లేకుండా పూర్తి చేశారు. అయితే సాయి చరణ్ను ఇక నుంచి ఎవరు పెంచాలనే ప్రశ్న తలెత్తింది. సాయిచరణ్కు తల్లిగా ఆమె తీసుకుని వెళితే బాగుంటుందని అమలాపురంలోని వారి బంధువులు ఒకే మాటగా చెప్పారు. అయి తే సాయిచరణ్ తల్లి, ఆమె భర్త మాత్రం అతని బాగోగులు బయట నుంచి మేమూ చూస్తూ ఉంటాం. అతడిని అమలాపురంలోని బంధువులే చేరదీసి పెంచాలని కోరుతున్నారు. బుధ, గురువారాల్లో అమలాపురంలోని ఆ కుటుంబాల పెద్దలు ఇరు పక్షాలతో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నేనెవరికీ వద్దా... నన్నెవరూ తీసుకు వెళ్లరా..అంటూ సాయిచరణ్ మౌనంగా రోదిస్తున్నాడు. చదవండి: ఆధార్ లేకున్నా టీకా మరణించి.. నలుగురిలో జీవించి.. -
దారుణం: మనవరాలిని చంపి.. ఆపై బామ్మ నాటకం
జైపూర్: రాజస్థాన్లోని కనకాబాయి (50) అనే ఓ మహిళ ఓ గొడవ విషయంలో మరో వ్యక్తికి గుణపాఠం నేర్పడానికి తన మూడేళ్ల మనరాలిని చంపేసింది. పైగా ఆ బాలికను రామేశ్వర్ మొగ్యా అనే వ్యక్తి చంపినట్లు ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మే 30 న, బోరినా గ్రామంలోని రెండు గ్రూపులు నీళ్ల కోసం వెళ్లి మార్గం మధ్యలో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడగా.. అమర్లాల్ మొగ్యా అనే వ్యక్తి మూడేళ్ల కుమార్తె మృతి చెందింది. దాంతో రామేశ్వర్ మొగ్యాపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రామేశ్వర్ మొగ్యా కుమార్తె కూడా గొడవలో గాయపడినట్లు గుర్తించారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కనకబాయి.. రామేశ్వర్ మొగ్యాను బెదిరించింది. దాంతో రామేశ్వర్ మొగ్యా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కనకబాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. (చదవండి: 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు!) -
అమ్మమ్మ ఇంట్లో మనవరాలి చోరీ
నేరేడ్మెట్ : సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీ చేసిన మనవరాలితోపాటు ఆమె స్నేహితుడిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపిన మేరకు.. కేశవనగర్కు చెందిన డీజే ఆపరేటర్ పర్షా అజయ్(21), దమ్మాయిగూడలోని వీఆర్ఆర్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ పట్రిసియా(21)లు రెండేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. పట్రిసియా తన బంగారు గొలుసు ఇవ్వగా అమ్మేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అజయ్ డబ్బుల కోసం స్నేహితురాలి సొంత అమ్మమ్మ అమిలియా ఇంట్లో చోరీకి పధకం వేశారు. ఇందులో భాగంగా గత నెల 31వ తేదీన డిఫెన్స్ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి మనవరాలు పట్రిసియా వెళ్లి అక్కడే ఉంది. అదే రోజు అర్థరాత్రి అమ్మమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. తన స్నేహితుడు అజయ్కు ఫోన్ చేసి డిఫెన్స్ కాలనీకి పిలిపించి చోరీ చేసిన అభరణాలను అప్పగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్రిసియా, అజయ్లు నిందితులుగా తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి, చోరీ సోత్తును పోలీసులు రికవరీ చేశారని డీసీపీ చెప్పారు. బాలికపై లైంగిక దాడి.. యువకుడి అరెస్టు చైతన్యపురి: మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. న్యూమారుతీనగర్లో నివసించే తంగళ్లపల్లి మణికంఠ (20)ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సెల్ఫోన్ ద్వారా పద్నాలుగు సంవత్సరాల ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడే వాడు. గత శుక్రవారం మాయమాటలు చెప్పి బాలికను మన్సూరాబాద్లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుడు మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వైరల్: మందు కోసం పిల్లోడిని పడేసింది
ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులెలాగో పిల్లలను సరిగా పట్టించుకోవడమే మానేస్తున్నారు. నానమ్మ, అమ్మమ్మ తాతయ్యల దగ్గర వదిలేసి వారి పనులను చూసుకుంటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండే వీరికి మనవళ్లతోనే బోలెడంత కాలక్షేపం. కానీ పైన ఫొటోలో కనిపిస్తున్న నానమ్మ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతలా తప్పు పట్టేందుకు ఆమె ఏం చేసిందనుకుంటున్నారా.. అసలు సంగతి తెలిస్తే మీరే అవాక్కవుతారు. సోఫాలో కూర్చున్న బామ్మ పక్కన బుడ్డోడు నిలబడ్డాడు. ఆమె ఎదుట మందు గ్లాసు ఉంది. అది కంటపడటంతో పిల్లవాడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించి పడేయబోయాడు. అంతే.. ఆమె చటుక్కున చంటోడిని వదిలేసి గ్లాసు కిందపడి పగిలిపోకుండా కాపాడింది.(చదవండి: ‘ముంబై పవర్ కట్’ టాప్లో ట్రెండింగ్) కానీ చంటోడు మాత్రం నానమ్మ తనను వదిలేయడంతో ఢమాలున కిందపడ్డాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఎనిమిది మిలియన్ల మందికి పైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడిందని కొనియాడుతున్నారు. గ్లాసు కింద పడుంటే పిల్లవాడికి గాయాలయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో పిల్లవాడి కన్నా మందుకే అంత ప్రాధాన్యతనివ్వడమేంటని విమర్శిస్తున్నారు. ఆల్కహాల్ కోసం బుడ్డోడిని కింద పడేసిందంటున్నారు. (చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..) When you've finally become an adult and have your priorities straight. pic.twitter.com/fSSIX2I6XT — The Cultured Ruffian (@CulturedRuffian) October 12, 2020 -
వీళ్లు మనుషులు కాదు.. రాక్షసులు
సాక్షి, చెన్నై : వారు మనుషులమనే విషయాన్ని మరిచిపోయారు. రాక్షసంగా ప్రవర్తించారు. అక్రమ సంతానమని వద్దని అమ్మ, అమ్మమ్మ కలిసి పుట్టిన నాలుగు రోజుల బిడ్డను సజీవ దహనం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఇడ్లీ తినలేదన్న ఆగ్రహంతో ఆడ బిడ్డను పెద్దమ్మ కర్రతో కొట్టి చంపేసింది. పోలీసుల కథనం మేరకు.. తెన్కాశి జిల్లా శంకరన్ కోయిల్ రైల్వే కాలనీ సమీపంలో వేకువ జామున మృతదేహం కాలుతున్న వాసన రావడాన్ని వాకింగ్ వెళ్లిన వారు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఓ పసికందు అగ్నికి ఆహుతి అవుతుండడంతో మంటల్ని ఆర్పే యత్నం చేశారు. అప్పటికే ఆ శిశువు మరణించింది. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ మంగై కరసి బృందం అక్కడికి చేరుకుని విచారించగా మగబిడ్డగా తేలింది. పసికందును సజీవ దహనం చేసిన వారి కోసం వేట మొదలెట్టారు. ఎస్పీ సుగుణాసింగ్ సైతం రంగంలోకి దిగారు. విచారణలో రైల్వే కాలనీ ఆరో వీధికి చెందిన శంకర గోమతి, ఆమె తల్లి ఇంద్రాణి ఈ కిరాతకానికి పాల్పడినట్టు తేలింది. వివాహం కాకుండానే ఓ వ్యక్తి ద్వారా శంకర గోమతి గర్భవతి అయింది. ఆబార్షన్కు యత్నించినా, సమయం మించడంతో గత్యంతరం లేక బిడ్డను కనాల్సి వచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా తల్లి, కుమార్తె జాగ్రత్త పడ్డారు. బిడ్డ పుట్టిన నాలుగో రోజున ఈ అక్రమ సంతానం తమకు వద్దు అని ఈ కిరాతకానికి ఒడిగినట్టు విచారణలో తేలింది. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య) ఇడ్లీ తినలేదని.. కళ్లకురిచ్చి జిల్లా త్యాగుదుర్గానికి చెందిన రోశి భార్య జయరాణి ఇటీవల మరణించింది. దీంతో రోశి రెండో వివాహం చేసుకున్నాడు. తన కుమార్తె ప్రిన్సీమేరి(5)ని జయరాణి తల్లి పచ్చయమ్మాల్ ఇంట్లో వదలి పెట్టాడు. పచ్చయమ్మాల్తో పాటు పెద్ద కుమార్తె ఆరోగ్య మేరీ ఆ ఇంట్లో ఉంది. బుధవారం పచ్చయమ్మాల్ పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఇంట్లో ఆరోగ్య మేరి, ప్రిన్సీ ఉన్నారు. ఇడ్లీ తినేందుకు ప్రిన్సీ మారాం చేయడంతో పెద్దమ్మ ఆరోగ్య మేరీ ఆగ్రహానికి లోనైంది. ఆ బిడ్డను ఇంట్లో ఉన్న దుడ్డుకర్రతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరోగ్యమేరీని అరెస్టు చేశారు. బిడ్డ విక్రయం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి అరగల కురిచ్చికి చెందిన మురుగవేల్, హేమలత దంపతులకు ముగ్గురు పిల్లలు. గత నెలాఖరులో మరో బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కరోనాతో పనులు లేక పోషణ కష్టంగా మారింది. దీంతో పుట్టిన బిడ్డను తమ బంధువు పులియంకండ్రిగకు చెందిన ఫలినో ద్వారా కోయంబత్తూరుకు చెందిన రాజశేఖర్, కోకిల దంపతులకు రూ.80 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శిశుసంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ బిడ్డను విక్రయించిన తల్లిదండ్రుల్ని, కొనుగోలు చేసిన వారిని, మధ్యవర్తిని బుధవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, చెన్నై తిరువొత్తియూరులో పైఅంతస్తులో ఆడుకుంటున్న లారీ డ్రైవర్ సుకుమార్ కుమారుడు సురేష్ కింద పడ్డాడు. చాలాసేపు ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
అమ్మమ్మా.. ఇదేందమ్మా!
వీణవంక (హుజూరాబాద్): నెల రోజుల శిశువును అమ్మమ్మ అమ్మేసింది. మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన ఆమె అప్పులు తీర్చుకోవడం కోసం రూ లక్షకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ప్రేమ వివాహం నచ్చనందుకే..! పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది. శిశు విహార్కు తరలింపు శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్లోని శిశువిహార్కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. -
94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’
లండన్ : పండు ముదుసలి. 94 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకునే వయస్సు. అత్యంత సాహసానికి ఒడిగట్టింది. తన కుటుంబ సభ్యులను కలసుకోవాలనే ఆరాటమే అందుకు కారణం. ఇది వర కే లండన్ చేరుకున్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఫ్రాన్స్ నుంచి లండన్లోని డోవర్ రేవుకు అతి చిన్న పడవలో ఇద్దరు, ముగ్గురితో కలసి బయల్దేరింది. అత్యంత ప్రమాదకరమైన ఇంగ్లీషు ఛానల్లో అతి చిన్న పడవలో డోవర్ రేవు చేరుకునేందుకు బయల్దేరడం అంటే దుస్సాహసమే. ఇలాంటి దుస్సాహసాలకు ఎంతో ఇప్పటి వరకు ఎంతో మంది బలైపోయారు. అయినప్పటికీ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్కు అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 94 ఏళ్ల పండు ముసలవ్వ చిన్న పడవలో ఇంగ్లీష్ ఛానల్లో 21 మైళ్లు ప్రయాణించగానే బ్రిటన్ గస్తీ నౌకా దళం గమనించింది. వెంటనే ఆమెను, ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరుముగ్గురిని అదుపులోకి తీసుకొని ఒడ్డుకు చేర్చింది. 94 ఏళ్లు కలిగిన వారు ఇంత వరకు వలస వచ్చేందుకు ప్రయత్నించలేదని, బహూశ వలసకు వచ్చిన వారిలో అతి పెద్ద వయస్కురాలు ఆమెనే కావొచ్చని ఇంగ్లండ్ నౌకాధికారులు తెలిపారు. ఆమె పేరు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్!) ఇతరులతోపాటు తనకు పౌరసత్వం ఇవ్వాలని డోవర్ ఒడ్డుకు చేరుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్యరీత్య ఆమెకు పౌరసత్వం లభించవచ్చని బ్రిటీష్ మీడియా అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఐదువేల మంది ఇంగ్లీష్ ఛానల్ ద్వారా ఫ్రాన్స్ నుంచి లండన్ వలస వచ్చేందుకు ప్రయత్నించారని బ్రిటీష్ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ‘ఇంటి నుంచి పని’లో పదనిసలు -
అమ్మ కన్నా నానమ్మే ఎక్కువైందని..
చండీగఢ్: ప్రేమ ప్రాణం పోస్తుందంటారు. కానీ అదే ప్రేమ ప్రాణం తీస్తుందనడానికి ఓ ఘటన ఉదాహరణగా నిలిచింది. పంజాబ్లోని జలంధర్కు చెందిన కుల్వీందర్ కౌర్ అనే మహిళకు అరష్ ప్రీత్ అనే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె భర్త ఉపాధి నిమిత్తం ఇటలీకి వెళ్లగా.. కొడుకుతో కలిసి అత్తగారింట్లోనే నివసిస్తోంది. అయితే ఆమెకు అత్తకు పొసిగేది కాదు. కానీ ఆమె పంచప్రాణాలైన కొడుకు మాత్రం తన నానమ్మతో బాగా చనువుగా ఉండేవాడు. ఇది కుల్వీందర్కు ఎంతమాత్రమూ నచ్చేది కాదు. (పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) తనకన్నా నానమ్మపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఆమె లోలోపలే రగిలిపోయింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో కుల్వీందర్ తన కొడుకును చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. కన్నకొడుకును కత్తితో పొడిచి అనంతరం భవనంలోని రెండో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లవాడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడి గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో అతడు శవమై కనిపించాడు. సదరు మహిళ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. హత్యానేరం కింద పోలీసులు కుల్వీందర్ కౌర్పై కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియాల్సి ఉంది. (కన్న కూతురిని హతమార్చిన తల్లి.. ఆపై) -
తాప్సీ ఇంట్లో విషాదం..
నటి తాప్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తాప్సీ ఎంతగానో ఇష్టపడే ఆమె బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె శనివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గురుద్వారలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫొటోను షేర్ చేసిన తాప్సీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘కుటుంబంలోని ఆ తరం వాళ్లు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అని పేర్కొన్నారు. దీంతో పలువురు నెటిజన్లు తాప్సీ బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే తన బామ్మ ఏ కారణం చేత మరణించారో మాత్రం తాప్సీ వెల్లడించలేదు. కాగా, తెలుగులో ఝమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ.. పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఆమె.. పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. View this post on Instagram The last of that generation in the family leaves us with a void that will stay forever.... Biji ❤️ A post shared by Taapsee Pannu (@taapsee) on May 30, 2020 at 3:04am PDT -
భాగీరథి అమ్మకు ఆధార్!
తిరువనంతపురం: 105 సంవత్సరాల వయసులో నాల్గవ తరగతి పరీక్ష పూర్తిచేసి ‘మన్కీ బాత్’రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కేరళ బామ్మ, భాగీరథి అమ్మ త్వరలో ఆధార్ కార్డు పొందనున్నారు. కేరళలోని కొల్లామ్లో నివసించే భాగీరథి అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ (కేఎస్ఎల్ఎమ్) నిర్వహించిన నాల్గో తరగతి పరీక్ష పాసైన ‘పెద్దవయసు విద్యార్థి’గా పేరొందారు. తనను మోదీ ప్రస్తావిండంతో సంతోషపడినా, ఆధార్ కార్డు ఇంతవరకు లేదని ఆవేదనచెందారు. కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్దిపొందలేకపోయారు. విషయం తెల్సుకున్న ఓ జాతీయ బ్యాంకు అధికారులు ఇటీవల ఆమె ఇంటికెళ్లి ఆధార్ ప్రక్రియను పూర్తిచేశారు. ‘కార్డు పొందేందుకు గతంలో యత్నించినా.. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు, కంటి రెటీనా స్కాన్ చేయలేకపోయాం’అని ఓ అధికారి వివరించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement