-
Kanguva: దీపావళికి కంగువ?
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ దర్శకత్వం వహించగా, దిశా పటానీ హీరోయిన్గా, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రధారులుగా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. (చదవండి: కంగువా మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా పదివేల మందితో వార్ సీన్..!)కాగా ‘కంగువ’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. డిఫరెంట్ టైమ్స్ లైన్స్లో సాగే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని, తొలి భాగం ఈ ఏడాదిలో, మలి భాగం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుందని టాక్. -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
ఆగిపోయిన సూర్య & సుధా కొంగర కొత్త సినిమా
-
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ‘కంగువా’.. అన్ని కోట్లా?
కంగువా చిత్రం సౌండ్ సినీ వర్గాల్లో బాగా పెరిగిపో తోంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీక్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ చిత్రం కంగువా. చారిత్రిక, సాంఘిక కథాంశాల ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మెట్లో తమిళం, తెలుగు, మలమాళం, కన్నడం, హిందీ తదితర 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రంలో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.కాగా ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న కంగువ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మాండమైన గ్రాఫిక్స్, సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే కంగువ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తాజా సమాచారం. నటుడు సూర్య కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. -
'కంగువ' స్పెషల్ పోస్టర్.. ఆ సినిమా గుర్తొచ్చిందిగా!
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్కు పరిచయమవుతోంది. శివ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. పీరియాడికల్, ప్రస్తుత అంశాలతో కూడిన ఈ చిత్రంలో సూర్య గెటప్, టీజర్ ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మాట్లో, 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్ను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) అందులో పీరియడ్ కాలానికి చెందిన సూర్య ఫొటోను, మరో పక్క ప్రస్తుత ఫొటోను పొందుపరచారు. మధ్యలో 2024లో విడుదల అని పేర్కొన్నారు. దీంతో కంగువా చిత్రంలో సూర్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియడ్ పాత్రధారి చేతిలో కత్తి పట్టుకోగా, ప్రస్తుతం పాత్రధారి చేతిలో తుపాకీ పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్కు ఎట్రాక్షన్గా మారింది. అదేవిధంగా ఇది గత జన్మకు, పునర్జన్మకు సంబంధించిన కథా చిత్రం అని కూడా అనిపిస్తోంది. దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే ఈ మధ్య 'బింబిసార' అనే మూవీతో తెలుగులో వచ్చింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు అదే చిత్రం గుర్తొస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்! ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ! ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! & Happy Ambedkar Jayanthi! #Kanguva pic.twitter.com/MtTGPnzxw3 — Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024 -
సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్
సౌత్ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్ కపుల్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సూర్య పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తుంది. తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్ చేసింది. జిమ్లో ప్రతి వర్కౌట్ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్ కపుల్స్ అని చెప్పుకొస్తున్నారు. జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్నెస్గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ అంట. నిత్యం జిమ్కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
వెండితెరపై కాలచక్రం.. సమయంతో ప్రయాణం చేస్తున్న టాప్ హీరోలు
వెండితెరపై కాలచక్రం తిరుగుతోంది. ప్రేక్షకలను విభిన్న కాలాలకు తీసుకుని వెళ్లేందుకు కొందరు హీరోలు సిద్ధం అవుతున్నారు... కాలాన్ని కదిలిస్తున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇలా వెండితెరపై సమయంతో ప్రయాణం చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం. ఆరువేల సంవత్సరాలు... ఆరువేల సంవత్సరాల టైమ్ లైన్ తో సోషియో ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898ఏడీ’ కథనం సాగుతుందని తెలుస్తోంది. ‘‘ఈ సినిమా కథ మహాభారతం కాలంలో మొదలై, 2898తో పూర్తవుతుంది. అందుకే ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్ను ఖరారు చేశాం’’ అని ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్హాసన్ ఇతర లీడ్ రోల్స్లో కనిపిస్తారు. రాజమౌళి, మలయాళ నటి అన్నా బెన్ , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారని తెలిసింది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898ఏడీ’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఐదువందల సంవత్సరాలు... టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో సూర్య కెరీర్లో రూపొందిన చిత్రం ‘24’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2016లో విడుదలై హిట్ సాధించింది. ఈ జానర్లోనే తాజాగా సూర్య నటించిన చిత్రంగా ‘కంగువ’ను చెప్పుకోవచ్చు. ఐదువందల (1700 – 2023) సంవత్సరాల టైమ్ పీరియడ్లో ఈ చిత్ర కథనం సాగుతుంది. పద్దెనిమిదో శతాబ్దంలో తాను మొదలుపెట్టిన ఓ పనిని పూర్తి చేయలేక మరణించిన ఓ వీరుడు... పునర్జన్మలో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తాడు? అన్నదే ‘కంగువ’ సినిమా కథనం అని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించగా, హీరోయిన్ గా దిశా పటానీ, ఓ కీలక పాత్రలో యోగిబాబు, విలన్ గా బాబీ డియోల్ కనిపిస్తారు. స్టూడియోగ్రీన్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందని తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో... మలయాళ నటుడు టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. ఈ సినిమాలో మణియన్ , అజయన్ , కుంజికేలు.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తున్నారు టొవినో థామస్. పాత్రలకు తగ్గట్లే కథ కూడా మూడు తరాల హీరోల నేపథ్యంలో సాగుతుంది. కథ రీత్యా మూడు తరాల్లోనూ హీరోగా టొవినో థామస్నే కనిపిస్తారని తెలుస్తోంది. ఇలా మూడు డిఫరెంట్ టైమ్ లైన్స్లో టైమ్ ట్రావెల్గా ఈ సినిమా కథనం సాగుతుంది. కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభిలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కృతీ శెట్టికి ఇది తొలి మలయాళ చిత్రం. మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎమ్ ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. త్రీడీలోనూ రిలీజ్ చేయాలని ఈ చిత్రం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్ సమాచారం. ఆధునిక అశ్వత్థామ మహాభారతంలో అమరవీరుడిగా చెప్పుకునే అశ్వత్థామ ఇప్పటి ఆధునిక యుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సినిమా‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాకు దర్శకుడు. కాగా ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్తోనే ఉంటుందని బాలీవుడ్ సమాచారం. జాకీ భగ్నానీ, వసుభగ్నాని, దీప్షికా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇలా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
‘కంగువ’ నాకెంతో స్పెషల్ : హీరో సూర్య
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు . ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. -
అసలు సూర్యకు ఏమైంది ? షాక్ లో ఫ్యాన్స్..!
-
సూర్య 'కంగువ' టీజర్.. కళ్లు చెదిరిపోయేలా విజువల్స్!
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ తాజాగా విడుదల అయింది. పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘కంగువ’ టీజర్.. పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులందరినీ మెప్పించింది. అందులో సరికొత్త అవతారంలో ప్రేక్షకుల్ని సూర్య మెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్ను చూస్తుంటే సూర్య నట విశ్వరూపం ఏంటో ఇండియన్ బాక్సాఫీస్కు చూపెట్టనున్నారని తెలుస్తోంది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న కంగువ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగనుంది. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని నిర్మాత ధనంజయన్ గతంలో చెప్పారు. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించే ప్లాన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కంగువా టీజర్ చూస్తే విజువల్ వండర్గా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్ను ఈ టీజర్ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్తో కంగువ చేసిన రూత్లెస్.. ఫెరోషియస్ ఫైట్ టీజర్లో హైలైట్గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్లో కనిపించింది. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
సూర్య 'కంగువ' టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ విడుదలకు రెడీ అవుతుంది . పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. భారీ అంచనాలతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం కంగువ.. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోస్ గ్రీన్ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సూర్య నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్గా ఉంది. త్రీడీ ఫార్మాట్లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో సూర్య కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న‘కంగువా’ పార్ట్-1 ఇదే 2024లోనే విడుదల కానుంది. -
కంగువా కోసం చెన్నైకి యానిమల్ విలన్..
ఇంతకుముందు హిందీ చిత్రాలలో కథానాయకుడిగా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బాబీ డియోల్ ఇప్పుడు ప్రతి నాయకుడిగా విజృంభిస్తున్నారు. ఇటీవల యానిమల్ చిత్రంలో విలన్గా ఇరగదీశారు. తాజాగా దక్షిణాదిలోనూ సత్తా చూపేందుకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా కోలీవుడ్కు కంగువ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, కోవై సరళ, రెడిన్ కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సూర్య ఇటీవలే డబ్బింగ్ను పూర్తి చేశారు. కంగువ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తిలకించడానికి బాబీడియోల్ గురువారం చైన్నెకి చేరుకున్నారు. దీంతో ఆయనకు కంగువ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఘనస్వాగతం పలికారు. కంగువ చిత్రాన్ని 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన 'వ్యూహం' సినిమా -
పాన్ ఇండియా సినిమాలు.. 'కంగువా, తంగలాన్' విడుదలకు ఇబ్బందులు
తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడెక్షన్పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు. కంగువా చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'తంగలాన్' చిత్రాన్ని ఆస్కార్కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్లకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
కంగువా.. ఫుల్ యాక్షన్ మోడ్లో గ్లామర్ బ్యూటీ!
సూర్య కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కంగువా. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ అధినేత కేఈ. జ్ఞానవేల్ యూవీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటించగా హిందీ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ పీరియాడికల్, సోషల్ కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కంగువ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య ఆరు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రంలో విలన్గా నటించిన బాబీ డియోల్కు ఇంట్రో సాంగ్ ఉంటుందట. గ్లామర్ డాల్గా పాపులర్ అయిన దిశా పటాని ఇందులో పూర్తిగా వైవిద్య భరిత కథా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో ఆమె ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించనుందట! చిత్రంలో ఆమెకు ఏకంగా ఆరు ఫైట్స్ ఉంటాయని సమాచారం. దిశా పటాని తమిళంలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. మరోవైపు ప్రభాస్తో కలిసి కల్కి 2898 AD అనే సినిమా చేస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో ఈ అమ్మడు నటిస్తున్న రెండు చిత్రాలు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందడం విశేషం. చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు! -
రూత్లెస్...పవర్ఫుల్
రూత్లెస్..పవర్ఫుల్..అన్ఫర్గెటబుల్... ఇవన్నీ ఒకరి గురించే. అతనే ఉధిరన్. ‘కంగువ’ సినిమాలో బాబీ డియోల్ పాత్ర పేరు ‘ఉధిరన్’. జనవరి 27 బాబీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కంగువ’ సినిమాలో ఆయన పోషిస్తున్న ఉధిరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా, ఓ కీలక పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పదికి పైగా భాషల్లో, త్రీడీలోనూ విడుదల కానుంది. ‘‘ఉధిరన్గా యునిక్ మేకోవర్లో కనిపిస్తారు బాబీ డియోల్. యుద్ధానికి సిద్ధం అవుతున్న ఉధిరన్కు ఆయన ప్రజలు మద్దుతు తెలుపుతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
గుర్తుపట్టలేనట్లుగా 'యానిమల్' విలన్.. ఆ సినిమా కోసమే ఇలా!
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్య కథతో డైరెక్టర్ శివ తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో 'కంగువ' చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఇకపోతే ఈ సినిమాలో ఉధిరన్ అనే శక్తివంతమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. శనివారం ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' నుంచి ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్' అనే క్యాప్షన్తో ఉధిరన్ పాత్రని పరిచయం చేశారు. ఈ పోస్టర్లో బాబీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్కు ఆయన వర్గమంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు. విజువల్ వండర్గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపీరియెన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్లోకి రాబోతోంది. రీసెంట్గా 'యానిమల్' మూవీలో క్లైమాక్స్లో కనిపించే విలన్గా చేసిన బాబీ.. ఇప్పుడు 'కంగువ'లో ఉధిరన్గా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) Happy birthday #BobbyDeol brother.. Thank you for the warm friendship. It was awesome to see you transform in full glory as the mighty #Udhiran in our #Kanguva Guys watch out for him! @directorsiva @ThisIsDSP @vetrivisuals @StudioGreen2 pic.twitter.com/e3cPBkdMcS — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2024 -
సూర్య 'కంగువ' రెండో లుక్.. ఆ హిట్ సినిమా గుర్తొచ్చిందిగా!
నేషనల్ అవార్డ్ విన్నర్, తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంతో డైరెక్టర్ శివ దీన్ని తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. త్రీడీలోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో 'కంగువ' సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) ఈ సెకండ్ లుక్ పోస్టర్లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్తోనూ సర్ప్రైజ్ చేశాడు. 'విధి.. కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్.. కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే కంగువ ' అనే క్యాప్షన్తో సెకండ్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ దెబ్బకు 'కంగువ'పై అంచనాలు పెరుగుతున్నాయి. అదే టైంలో సూర్య '24' సినిమాలో ఆత్రేయ పాత్ర గుర్తొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) அனைவருக்கும் இனிய பொங்கல் மற்றும் தமிழர் திருநாள் வாழ்த்துகள்! Happy Pongal! मकर संक्रांति शुभकामनाएँ! ಎಲ್ಲರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ!ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು! అందరికి సంక్రాంతి!శుభాకాంక్షలు! #Kanguva #Kanguva2ndLook pic.twitter.com/Xe1yQ89nf4 — Suriya Sivakumar (@Suriya_offl) January 16, 2024 -
కడపకు కంగువా
కడపకు పయనమవ్వనున్నారట కంగువా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువా’. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను కడపలో ప్లాన్ చేశారని, ఈ నెల రెండో వారంలో ఈ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కడపలో జరగనుందట. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్లో విడుదల కానుంది. -
దిశా పటానిలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటీస్లో దిశా పటానికి చోటు కచ్చితంగా ఉంటుంది. మూడు పదుల పరువాల భామ 8 ఏళ్ల నట జీవితంలో చాలా పేరే సంపాదించింది. మోడలింగ్ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఉత్తరాది బ్యూటీ కథానాయకిగా పరిచయం అయ్యింది మాత్రం తెలుగు చిత్రం కావడం విశేషం. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దిశా పటాని ని లోఫర్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం చేశారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. 2015లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి దశ తిరిగింది మాత్రం ఎంఎస్ ధోనీ. ది అన్ టోల్డ్ స్టోరీనే. ఆ తరువాత ఆమె జోరు తగ్గలేదు. బాలీవుడ్లో ప్రముఖ స్టార్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కట్టాయి. ఇక గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతుంది. డాన్స్లోనూ దిట్టే. ఇక ప్రతిభ అంటారా? అంతకు మించే. అందుకే తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ, చైనీస్, తమిళంలో నటిగా చుట్టేసింది. చైనీస్ భాషలో వరల్డ్ సూపర్స్టార్ జాకీచాన్కు జంటగా కుంగ్ ఫూ. యోగా చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దిశా పటాని తాజాగా తన రూట్ మార్చి కోలీవుడ్లోనూ పాగా వేసింది. సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల కానుంది. ఇక దిశా పటానిలోని మరో ప్రతిభ ఏమిటంటే ఇటీవల ఈమె క్యూన్ కరు ఫికర్ పేరుతో ఓ మ్యూజికల్ ఆల్భమ్కు దర్శకత్వం వహించడం, కాగా ఈ బ్యూటీ భవిష్యత్తులో ప్యూచర్ ఫిలింకు దర్శకత్వం వహిస్తుందేమో చూడాలి. కాగా ఈమె తరచూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారట. ఈ విషయంలో ఫటా ఫట్ అంటూ దూసుకెళ్తోంది దిశ పటాని. -
కంగువ షూటింగ్లో హీరో సూర్యకు ప్రమాదం..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. కంగువ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్య 42 వ ప్రాజెక్ట్గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే థాయ్లాండ్లో షూటింగ్ ముగించుకుని వచ్చిన కంగువ టీమ్.. తాజాగా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణనను చెన్నైలో ప్లాన్ చేశారు. కంగువ చిత్రం కోసం భారీ యాక్షన్ సీన్స్లో పాల్గొన్న సూర్యపై రోప్ కెమెరా వచ్చి పడంది. దీంతో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే షూటింగ్ ఆపేసిన యూనిట్ సభ్యులు.. సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఆ కెమెరా సూర్య భుజానికి తగలడంతో భారీ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారని తెలుస్తోంది. లేదంటే ఆ కెమెరా భుజానికి బదులుగా సూర్య తలపై పడింటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని అక్కడి వారు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్య ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. కనీసం కంగువ చిత్ర యూనిట్ కూడా ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు. A minor injury happened to #Suriya on his shoulders, yesterday at #Kanguva shooting spot due to the rope camera has been slipped off !! So the shooting has been cancelled today 🎬 Get well soon #Suriya❤️ pic.twitter.com/Br2VT0ryww — AmuthaBharathi (@CinemaWithAB) November 23, 2023 -
సూర్య 'కంగువా' చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా నిర్మాత వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తోంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో సూర్య అత్యంత పరాక్రమవంతుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ‘కంగువా’ను ఉద్దేశించి చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. 'కంగువా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ముందుగా కేవలం 10 భాషల్లో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కంగువా చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ ఇది అందుబాటులోకి తెస్తున్నాం. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతుంది.' అని జ్ఞానవేల్ రాజా అన్నారు. కంగువ కలెక్షన్స్ విషయంలో సినిమా లక్ష్యం రూ.1000 కోట్లని చిత్ర నిర్మాతల్లో మరోకరు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దిశా పఠానీతో పాటు బాబీ దేవోల్, జగపతి బాబు, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. 2024 వేసవి సమయంలో ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్-1 హిట్ అయితే పార్ట్-2 కూడా ఉన్నట్లు సమాచారం. Exclv: Producer KEG. @StudioGreen2 🤫😱#KANGUVA - 38 Languages | 3D | IMAX A Huge Sambavam loading it seems..🔥 Next Level of @Suriya_offl ..⭐pic.twitter.com/GvwBIU7GQZ — Suriya Yash Fan page ™ (@Suriya_Yash_Fc) November 20, 2023 -
ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్న కంగువ
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా యువీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న భారీ పిరియాడికల్ కథా చిత్రం ఇది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు గ్లింమ్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సూర్య గెటప్, ఆయన లుక్స్, హావభావాలు చిత్ర ప్రముఖులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మెట్లో ఏకంగా 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కొంగువ చిత్రం 2024 సమ్మర్ స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. దీంతో ఈ చిత్రం పైనే ఇప్పుడు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల దృష్టి ఉంది. కాగా దీపావళి సందర్భంగా కంగువ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. అందులో సూర్య రగులుతున్న కట్టెను చేతిలో పట్టుకుని రౌద్రం ప్రదర్శిస్తుండగా.. ఆయన వెనుక అనుసరగణం పోరుకు సిద్ధంగా ఉన్న దృశ్యం కంగువ చిత్రంపై మరింత ఆసక్తిని రేకేతిస్తోంది. యాక్షన్తో కూడిన భారీ పీరియాడిక్ డ్రామా చిత్రమిది. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఒక గెటప్ను తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. -
మరో సాహసం చేస్తున్న హీరో సూర్య
నటుడు సూర్య ఇటీవల వైవిద్య భరిత పాత్రలకు కేరాఫ్గా మారారనే చెప్పాలి. ఆయన సమీపకాలంలో నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలలో సరికొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కంగువ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. చారిత్రక కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక యోధుడుగా సూర్య పాత్ర గానీ గెటప్ గానీ ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి కేఈ. జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తోంది. ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. కాగా విచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ విడుదలై కంగువపై ఆసక్తిని పెంచేశాయి. కాగా ఈ చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి నిర్మాతలు చేస్తున్నారు. కాగా నటుడు సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆకాశం నీ హద్దురా వంటి సూపర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి హిట్ కొట్టడానికి ఈ కాంబో సిద్ధమవుతోంది. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో సూర్య మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అందులో కొడుకు కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా ఆయన తనను మలుచుకోవడానికి వర్కౌట్ చేస్తున్నట్లు తెలిసింది. అందుకు గాను ఆయన 20 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడట. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం సూర్యకు మాత్రమే సాధ్యం అని ఆయన ఫాన్స్ చెప్తున్నారు. కాగా మరో ముఖ్య పాత్రలో మలయాళ యువస్టార్ దుల్కర్సల్మాన్ను నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా నవంబర్ రెండో వారంలో ఈ చిత్రం సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జీవి ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్న 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తాజా సమాచారం. -
కొత్త సినిమా కోసం థాయ్ల్యాండ్కి సూర్య
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్గా ఉంది. త్రీడీ ఫార్మాట్లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్యే థాయ్ల్యాండ్ వెళ్లారు. అక్కడ దట్టమైన అడవుల్లో 20 నుంచి 25 రోజులు పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నారు. 'కంగువ' చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా తమిళ ఉగాదికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత సూర్య, సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నాడు. అలానే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' పూర్తి చేస్తాడు. (ఇదీ చదవండి: 'మామ మశ్చీంద్ర' సినిమా రివ్యూ)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
Advertisement