-
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'సలార్'తో హిట్ కొట్టాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. దీని తర్వాత 'రాజా సాబ్', 'సలార్ 2'కి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. ఏంటి సంగతి? ఆ సినిమా ఏది?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)పైన చెప్పిన సినిమాలతో పాటే ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. ఇందులో నటిస్తున్నందుకు గానూ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట.ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'కన్నప్ప' టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిబట్టి సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?) -
కాన్స్లో కన్నప్ప
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 20వ తేదీన ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్ చేశారు విష్ణు మంచు. -
కన్నప్ప: మంచు విష్ణు చెప్పింది కాకుండా ప్రభాస్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వరుస అప్డేట్లు వదులుతున్నారు. ఈ మధ్యే కన్నప్ప సెట్స్లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే! ప్రభాస్ తన పాత్ర తానే సెలక్ట్ చేసుకున్నాడంటున్నాడు విష్ణు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘కన్నప్ప నుంచి ఏ న్యూస్ వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. గత ఐదారు అప్డేట్లు టాప్లో ట్రెండ్ అయ్యాయి. నా మిత్రుడు ప్రభాస్ షూట్లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. ప్రభాస్ను కలిసినప్పుడు..కన్నప్ప కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్కు, డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికర విషయం చెప్పాలి. ప్రభాస్ను కలిసినప్పుడు.. నేను కన్నప్ప సినిమా చేస్తున్నా.. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పాను. అందుకాయన ‘కథ బాగా నచ్చింది నాకు ఫలానా పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఆ క్యారెక్టర్ నేను చేయొచ్చా?’ అని అడిగారు. ఏ కారెక్టర్ అయితే ప్రభాస్కు బాగా నచ్చిందో అదే పాత్రను పోషించారు. అద్భుతమైన అప్డేట్త్వరలోనే ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రల గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము’ అన్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ పని చేస్తున్నారు.చదవండి: నా కన్నా మా అక్కే అందంగా ఉండేది.. టార్చర్ పెట్టా: నటి -
కన్నప్ప సెట్స్లో...
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్స్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. -
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. -
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
'కన్నప్ప' కోసం స్టార్ హీరోను దింపిన మంచు విష్ణు.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' కోసం భారత దిగ్గజ నటలను దింపుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీల స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశాడు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో ఆయన పంచుకున్నాడు. మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం రూపొందుతోంది. 'కన్నప్ప' పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. ఈ బిగ్ ప్రాజెక్ట్లో ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీ మంచి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లయింది. కన్నప్ప సినిమాతో అక్షయ్ కుమార్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. 1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించిన అక్షయ్ ఆ తర్వాత 2018లో రజినీకాంత్ రోబో2.0 సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్ని లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఓ మై గాడ్ 2లో ఇలాంటి పాత్రలో కనిపించిన అక్షయ్ భేష్ అనిపించుకున్నాడు. దీంతో కన్నప్పకు బాలీవుడ్లో మంచి మార్కెట్ వస్తుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కల్కి సినిమాలో శ్రీవిష్ణువు అంశతో కూడిన భైరవగా ప్రభాస్ కనిపించనున్నాడు.. ఇలాంటి సమయంలో కన్నప్పలో మహాశివుడిగా కనిపిస్తే ఇబ్బందవుతుందని భావించిన ప్రభాస్.. మంచు విష్ణును రిక్వెస్ట్ చేసి మార్పులు చేయాలని కోరాడట. దీంతో శివుడి పాత్ర కోసం వేట కొనసాగించిన మంచు విష్ణుకు అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని ప్లాన్ చేశాడట. అలా టాలీవుడ్లోకి తాజాగా అక్షయ్ ఎంట్రీ ఇచ్చేశాడు. త్వరలో షూటింగ్ జరుగుతుందని విష్ణు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్ స్టార్స్
భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. డివోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్ అయిన కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. కన్నప్ప విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్ చల్ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు విష్ణు మంచు. ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్గా నటించిన ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి, నెట్టింట షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది. కుబేర ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ లుక్ మాత్రం టైటిల్కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది. కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్ లుక్లో ధనుష్ సరైన కాస్ట్యూమ్ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు. హరోం హర ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్ ఫిక్స్ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల 2 తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి హిట్ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్బాబు పుట్టినరోజు, మోహన్బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
కన్నప్ప గురి
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప‘ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు మంచు లుక్ విడుదలైంది. ‘‘ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు విష్ణు మంచు. ఫస్ట్ లుక్ పోస్టర్ కన్నప్ప క్యారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతుండగా అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్ను న్యూజిలాండ్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మళ్లీ షురూ అయింది. తాజాగా న్యూజిలాండ్లో రెండో షెడ్యూల్ను ప్రారంభించారు. ఇప్పటికే 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్తా గ్యాప్ తర్వాత కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు తాజాగా షూటింగ్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన తండ్రి మోహన్ బాబు, విష్ణు మంచు వీడియోలో కనిపించారు. ఈ షెడ్యూల్లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కన్నప్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. న్యూజిలాండ్, థాయ్లాండ్, ఇండియాకు చెందిన ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. The second schedule of #Kannappa in #NewZealand is in full swing !!@iVishnuManchu #Prabhas #Vishnu pic.twitter.com/UQ67xfJVCS — Aryan (@chinchat09) February 28, 2024 -
రాజకీయాలపై 'మంచు మోహన్బాబు' సంచలన లేఖ
కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ విలక్షణ నటులు, నిర్మాత మంచు మోహన్బాబు ఒక లేఖ విడుదల చేశారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆయన ఇలా విజ్ఞప్తి చేశారు. 'ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నాను.శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.' అని మంచు మోహన్ బాబు ఒక లేఖను తన ఎక్స్పేజీలో విడుదల చేశారు. విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5 — Mohan Babu M (@themohanbabu) February 26, 2024 -
ఎన్టీఆర్, రామ్ చరణ్ కి పోటీగా రంగంలోకి మంచి విష్ణు..!
-
'కన్నప్ప' విడుదల ఫిక్స్.. ఆ తేదీలో బిగ్ఫైట్
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్లో కీలకమైన ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ భారత్కు తిరిగొచ్చేసింది. దీంతో సినిమా విడుదల తేదీని టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప టీమ్ భావిస్తోందట. ఇందులో కీ రోల్లో నటిస్తున్న ప్రభాస్ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. కన్నప్ప చిత్రం షూటింగ్ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దసరా సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం అన్నీ భాషల్లోని స్టార్స్తో ప్రమోషన్స్ కార్యక్రామాలను కూడా సెట్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్. ఒకేరోజులో రామ్ చరణ్, తారక్ సినిమాలు ఈ దసరాకు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాలు కూడా విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో 'కన్నప్ప' కూడా వస్తే సంక్రాంతి మాదిరి మళ్లీ థియేటర్స్ సమస్య రావచ్చనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ 5న 'దేవర' ప్రకటన ఉన్నప్పటికీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో దసరాకు తారక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. కన్నప్పలో మోహన్లాల్, కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, నయనతార పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు. -
Avram Manchu: ఐదేళ్లకే సినిమాలో ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు తనయుడు (ఫోటోలు)
-
మంచు వారసుడొస్తున్నాడు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో ఎంట్రీ!
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం ద్వారా మంచు వారసుడు సినీ అరంగేట్రం చేయనున్నారు. విష్ణు మంచు వారసుడిగా అవ్రామ్ కన్నప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మోహన్ బాబు మూడో తరం కూడా సినిమాల్లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో అవ్రామ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. విష్ణు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. అవ్రామ్తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు.కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు థాంక్స్ చెప్పారు. -
90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, బ్రహ్మానందం, మోహన్లాల్, శివరాజ్కుమార్, శరత్కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 3 నెలల క్రితం న్యూజిల్యాండ్లో మొదలైంది. ‘‘న్యూజిల్యాండ్లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో 90 రోజుల మొదటి షెడ్యూల్ చేశాం. అక్కడి అద్భుతమైన లొకేషన్స్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వస్తున్నాం. ఈ సినిమాకు థాయ్ల్యాండ్, న్యూజిల్యాండ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోహన్బాబు. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
కన్నప్పలో కథానాయికగా..
కన్నప్పలో భాగమయ్యారు ప్రీతీ ముకుందన్. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రభాస్, మోహన్బాబు, బ్రహ్మానందం, మోహన్లాల్, శివరాజ్ కుమార్, శరత్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిల్యాండ్లో జరుగుతోందని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రీతీ ముకుందన్ను ఎంపిక చేసినట్లు గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ప్రీతికి ఇది తొలి సినిమా. ‘కన్నప్ప’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది. నాట్య కళలో ప్రీతికిప్రావీణ్యం ఉంది. ‘కన్నప్ప’లో ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
మంచు విష్ణు మూవీ షూటింగ్.. గాయపడ్డ స్టార్ కొరియోగ్రాఫర్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతోంది. చిత్రీకరణ సంగతలా పక్కనబెడితే వరస అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న హీరో గాయపడగా.. ఇప్పుడు సాంగ్ తీస్తున్న సమయంలో టైంలో స్టార్ కొరియోగ్రాఫర్ గాయపడింది. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారు. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) గతంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో 'కన్నప్ప' మూవీ వచ్చింది. ఇప్పటి జనరేషన్కి తగ్గట్లు కన్నప్ప మూవీ తీస్తామని మంచు విష్ణు చాలారోజుల నుంచి చెబుతూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం న్యూజిలాండ్లో సీన్స్ తీస్తున్నారు. అయితే నవంబరు మొదట్లో హీరో విష్ణు గాయపడ్డాడు. డ్రోన్ తగలడంతో విష్ణు మోచేతికి గాయమైంది. ఇది అయిపోయిందనుకునేలోపు ఇప్పుడు సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ కాలికి ఫ్రాక్టర్ అయింది. ఓ పాట కోసం స్టెప్స్ కంపోజ్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ మధ్యలో నిలిపేశారు. అలానే ఆమెని కూడా కొన్నిరోజులు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ సూచించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
ఆలయాన వెలసిన కథలతో పూనకాలు తెప్పిస్తున్న స్టార్స్
పూనకాలు తెప్పించే, భక్తి పారవశ్యంలో ముంచే భక్తి రసాత్మక చిత్రాల నిర్మాణం తగ్గింది. పూర్తి స్థాయి భక్తి చిత్రాలంటే కమర్షియల్గా వర్కవుట్ అవుతాయా? అనే సందేహం ఉన్న నేపథ్యంలో ఆ తరహా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు దాదాపు ముందుకు రావడంలేదు. అయితే కమర్షియల్ కథల్లో భక్తి జోడించి, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇలా ఆలయాన వెలసిన కథలతో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నారు. మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, శరత్కుమార్, శివ రాజ్కుమార్, బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాస్తికుడైన ఓ యోధుడు శివ భక్తునిగా ఎలా పరివర్తన చెందాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలు శివాలయం నేపథ్యంలో ఉంటాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా తెరకెక్కుతోంది. సుమంత్, మీనాక్షీ గోసామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జాగర్లపూడి సంతోష్ దర్శకుడు. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. ఈ సంగతి ఇలా ఉంచితే... హీరో సుమంత్, దర్శకుడు జాగర్లపూడి సంతోష్ కాంబినేషన్లో 2018లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్యపురం’లో లైట్గా భక్తి టచ్ ఉంది. తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’లో కాస్త ఎక్కువ ఉంటుంది. హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఇందులో కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ హీరోయిన్లు. భైరవకోన అనే ఊరిలో ఉండే ఓ దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందువల్ల పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్కి ఎక్కువ సమయం పడుతోందట. త్వరలో రిలీజ్ గురించిన అప్డేట్ రానుందని సమాచారం. ఇటీవల విడుదలై, హిట్గా నిలిచిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. ‘మా ఊరి పోలిమేర’ (2021)కు ఈ చిత్రం సీక్వెల్. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శీను, రాకేందు మౌళి ప్రధాన పాత్రలు పోషించారు. గౌరీ శ్రీను నిర్మించారు. ఈ సినిమాలో బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని దర్శకుడు అనిల్ విశ్వనాథన్ ప్రస్తావించినప్పటికీ ప్రధానాంశం ఓ ఊరి పోలిమేరలో ఉన్న దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఆ దేవాలయంలో ఏదో నిధి ఉందని ఆ నిధిని సాధించే ప్రయత్నాలు చేస్తుంటారు ప్రధాన తారలు. కాగా ‘మా ఊరి పోలిమేర 3’ కూడా ఉంటుంది. సో.. మూడో భాగం కూడా నిధి నిక్షిప్తం చేయబడి ఉందని భావిస్తున్న ఆ ఊరి పోలిమేరలోని గుడి చుట్టూ తిరుగుతుందని ఊహించవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నటి పవిత్రా లోకేశ్ డైరెక్టర్. నటుడు వీకే నరేశ్ సమర్పణలో విజయకృష్ణ స్టూడియోస్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి గత ఏడాది మేలో వివరాలు వెల్లడించారు మేకర్స్. మరో అప్డేట్ రావాల్సి ఉంది. మాస్ జాతర హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్బస్టర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ సినిమాలో గంగమ్మ జాతర నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇంట్రవెల్ టైమ్లో వచ్చే ఈ జాతర ఓ పెద్ద హైలైట్గా ఉంటుందట. ఈ చిత్రంలో పుష్పరాజ్గా అల్లు అర్జున్, శ్రీ వల్లిగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా అంజలి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రదర్శకుడు కృష్ణ చైతన్య గంగానమ్మ జాతర నేపథ్యంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట . సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న రిలీజ్ కానుంది. -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్బాబు,శరత్కుమార్లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్లో 'మహాభారతం' సిరీస్ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
కన్నప్పలో ఎంట్రీ
సీనియర్ నటులు మంచు మోహన్బాబు, శరత్కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. హీరో ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
టీడీపీ జనసేన మధ్య డబ్బు గొడవ
ఇస్మార్ట్ రాహుల్ గాంధీ
ఎల్లో టెర్రరిజం..బాబు, పురందేశ్వరి కుట్ర దీనికోసమేనా ?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నీ శకం ముగిసింది బాబు..
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
తప్పక చదవండి
- Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
Advertisement