-
టీడీపీ తొండాట.. బాబు అండ్ కోకు మామూలే!
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు ఎంపైర్ అంటే రిఫరీ ఉన్నారులే అని పాక్ క్రికెటర్లు అన్నారని జోక్గా చెప్పుకునేవారు. సరిగ్గా ఏపీలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే, ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు కట్టి తిరిగి అధికారంలోకి రావాలని సంకల్పించారు. కానీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీ లతో పాటు ఎల్లో మీడియాతో నేరుగాను, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలతో పరోక్ష కూటమి కడుతున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డారా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.నిష్పక్షపాతంగా ఉంటోన్న ఈసీపై కూటమి నేతలు బీజేపీ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తత్ఫలితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి టీడీపీ కూటమి నేతలకు అవకాశం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థులు అనుసరిస్తున్న ఇలాంటి అనైతిక వ్యూహాలను ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కొత్తకాదని చెప్పాలి.వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం.. పొలిటికల్ కెరియర్ చెప్పాలంటే.. మరీ పెద్దదేం కాదు. ఆయన 2009 నుంచే రాజకీయాలలో ఉన్నట్లు లెక్క. అంటే 15 ఏళ్ల రాజకీయ జీవితం అన్న మాట. కానీ ఆయన ఎదుర్కున్నన్ని సమస్యలు, సవాళ్లు దేశంలోనే మరే నేతకు ఎదురు అయి ఉండకపోవచ్చు. ప్రత్యేకించి ఆయా వ్యవస్థలు పగబట్టినట్లుగా ఆయనపై పడ్డ తీరు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక పెద్ద టీవీ సిరియల్ అవుతుంది. సినిమా తీస్తే ఒక సంచలన కథ అవుతుంది.తాజాగా 2024 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అదే తరహా దాడి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఒంటరిగా ఎదుర్కోలేమన్న భయంతో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే పనిలో పడ్డట్టు అనిపిస్తుంది. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఉద్దేశం కానప్పటికీ, జరిగిన పరిణామాలు విశ్లేషించినప్పుడు అలాంటి భావన కలుగుతోంది. లేకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి, హత్యాయత్నం జరిగితే ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని ఎన్నికల సంఘం సహేతుక కారణం లేకుండా బదిలీ చేయడం, నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఇంటిలెజెన్స్ హెడ్ను మార్చడం తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఇలా వ్యవస్థలనుంచి చికాకులు రావడం కొత్తకాదు. చిన్న వయసులోనే అనేక కష్టాలు పడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం మాత్రం మెచ్చుకోదగింది. అదే సాహస యాత్రను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న ఫలితంగా సోనియాగాంధీ, చంద్రబాబు వంటివారు కుమ్మక్కై అక్రమ కేసులుపెట్టినా చలించలేదు. పదహారు నెలలు జైలులోపెట్టినా బెదరలేదు. ఇన్ని అడ్డంకులు అధిగమించి, 2014లో తనపార్టీకి ఓటమి ఎదురైనా నిబ్బరంగా రాజకీయాలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల ఆదరణ చూరగొని రికార్డు స్థాయిలో 2019లో 151 సీట్లను గెలుచుకున్నారు. అది రాజకీయ ప్రత్యర్దులకు కంటగింపుగా మారింది.ముఖ్యంగా తనకంటే పాతికేళ్ల చిన్నవాడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ స్థాయిలో ప్రజల మన్నన పొందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం నచ్చలేదు. ఆయనకే కాదు. తన మీడియా బలంతో రాజకీయాలను శాసించాలని అనుకునే రామోజీరావు వంటివారికి అసలు గిట్టలేదు. దాంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నమాటే కానీ, మళ్లీ అవే సమస్యలు. మళ్లీ అవే ఆటంకాలు. మళ్లీ ఆయా వ్యవస్థల నుంచి ఇబ్బందులు. పార్టీ పెట్టిన కొత్తలో సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఆయనను వెంటబడి వేధించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికొన్ని వ్యవస్థలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నుంచి పదే, పదే వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడన్న చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొందరితో వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఇబ్బంది పెట్టడానికి ఎన్ని సమస్యలు పెట్టాలో అన్నీ సృష్టించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కీమును ఆరంభించినా, ఏ సంస్కరణను తీసుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో లిటిగేషన్ తీసుకురావడం, వాటిని న్యాయ వ్యవస్థలో కొందరు ఎంటర్ టెయిన్ చేయడం వంటివి ప్రజలలో అనేక డౌట్లకు కారణం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిను ఇబ్బంది పెట్టాలని టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నట్లు కనిపిస్తుంది.తెలుగుదేశం వారు రాసిచ్చిన ఒక ఫిర్యాదుపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంతకం పెట్టి ఎన్నికల సంఘానికి పంపారు. అందులో ఏకంగా 22 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదులు చేయడం ఒక ఎత్తు అయితే, తమకు ఫలానా అధికారులు కావాలని, వారికి తాము కోరిన రీతిలో పోస్టింగ్లు ఇవ్వాలని కోరడం ఒక సంచలనం. అలాంటి ఫిర్యాదు చేసిన పురందేశ్వరిని మందలించవలసిన ఎన్నికల సంఘం, అలా చేయకపోగా, వారు కోరిన రీతిలో స్పందించారు. అంటే బీజేపీతో టిడిపి ఎందుకు పొత్తు పెట్టుకున్నదో అర్థం చేసుకోవచ్చన్నమాట.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అని అనడమే కాకుండా, అనేక రకాలుగా దూషణలు చేసినా, ఓటమి తర్వాత మళ్లీ కాళ్లా, వేళ్లాపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే చంద్రబాబు ఇలా చేశారులే అనుకున్నారు. కానీ అదొక్కటే కాదని, వ్యవస్థను మేనేజ్ చేయడానికి కూడా ఈ పొత్తు అవసరమని ఆయన లెక్కగట్టుకున్నారని అర్దం అయింది. పురందేశ్వరి ఫిర్యాదు తర్వాత కొందరు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినా టీడీపీ కూటమికి సంతృప్తి కలగలేదు. మరికొందరిని కూడా తప్పించాలని తలపెట్టారు. గతంలో ఇంటెలెజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కీలక భూమిక పోషించారని ఆరోపణలు వచ్చాయి.గత ఎన్నికల సమయంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. అప్పట్లో ఏబీపై నిర్దిష్ట అభియోగాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులుపై అలాంటి ఆరోపణలు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు రాసిన కథనాలలో కూడా సీతారామాంజనేయులపై స్పష్లంగా ఫలానా ఆరోపణ అని చెప్పలేకపోయాయి. కాకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారన్నట్లుగా రాశాయి. ఆ ఇబ్బంది ఏమిటో తెలియలేదు. అంటే విపక్ష కూటమికి చెందినవారు డబ్బు రవాణా చేసినా, మద్యం సీసాలు సరఫరా చేసినా, దౌర్జన్యాలు చేసినా ఈ అధికారులు పట్టించుకోరాదన్నది వారి ఉద్దేశంగా ఉంది. పోనీ వీరు అధికార పార్టీ వారికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేసులు పెట్టడం లేదా? అంటే అదేమీ లేదు. తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెట్టిన ఉదంతాలను ఇచ్చింది.ఇక విజయవాడ కమిషనర్ కాంతీలాల్ రాణా బదిలీ అయితే మరీ ఘోరం అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్నప్పుడు ఒక దుండగుడు రాయి విసిరాడు. ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గాయపడ్డారు. ఆ కేసు రాణా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దానిని ఆయన విజయవంతంగా పరిశోధిస్తూ, సాంకేతికతను వాడి నిందితుడిని పట్టుకున్నారు. ఆ నిందితుడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని బయటకు వినవస్తోంది. అంతే! రాణాపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించి ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసి ప్రజలను ఆశ్చర్యపరచింది. ఈయన బదిలీకి ఏ కారణం ఉందో చెప్పరు. వీరంతా వైఎస్సార్సీపీకి అనుకూలమని ఒక ముద్రవేసి వారిపై చర్య తీసుకోవాలని కోరారు.గతంలో ఏబీని పక్కన పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సంఘం తీరును తప్పు పడుతూ ఏకంగా ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ధర్నా చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అలా చేయడం లేదు. ఎవరు బదిలీ అయినా, ఎవరిని కొత్తగా నియమించినా ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతూ ప్రజలలో తిరుగుతున్నారు. ఒక వైపు ప్రధాని మోదీ ముస్లింలపై, కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటిపై పదిహేడువేల మంది ఫిర్యాదు చేసినా, స్పందించని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం చిన్న, చిన్నవాటిపై మాత్రం సీరియస్గా స్పందిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిపై దాడి కేసులో విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో మున్సిపల్, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తఫ్సీ ర్ ఇక్భాల్, జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేంద్ర ప్రసాద్లతో కలిసి ఆయన మాట్లాడారు. కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దీని కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలతో పాటు గ్రామాల్లో కూడా కమిటీలు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్కు సంబంధించి డీసీ, ఏఎస్పీలు ఉంటారన్నారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. మండల స్థాయిలో మోడల్కోడ్ పర్యవేక్షణా అధికారులుగా ఎంపీడీవోలు ఉంటారని, వారితో పాటు వీడియోగ్రాఫర్, ఎస్సైలు పర్యవేక్షిస్తారన్నారు. అలాగే సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గానికి 4 ప్రత్యేక బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్లుగా నియమిస్తామని చెప్పారు. చెక్పోస్టుల ఏర్పాటు జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి మద్యం, నాటుసారా సరఫరా కాకుండా ఉండేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. బొడ్డవర, మక్కువ, పాచిపెంట, చింతపల్లి, కూనేరు, పి.కోనవలసల్లో చెక్ పోస్టులు కొనసాగుతాయన్నారు. జిల్లాలో కోడ్ ఉల్లంఘనను పరిశీలించడానికి 1070 టోల్ ఫ్రీ నంబర్తో పాటు 08922 273255 నంబర్తో కంట్రోల్ రూమ్ కొనసాగుతుందన్నారు. విజయనగరం డివిజన్లో 08922 276888, సబ్ కలెక్టర్ ఆఫీస్లో 08963 221006 కంట్రోల్ రూమ్లు 24 గంటల పాటు పని చేస్తాయన్నారు. ఎక్కడకోడ్ ఉల్లంఘన జరిగినా ప్రజలు ఆ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వా లని కోరారు. పటిష్ట బందోబస్తు : జిల్లాలోని పోలింగ్ స్టేషన్లను పలు రకాలుగా వర్గీకరించినట్లు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు, సమస్యా త్మ క పోలింగ్ కేంద్రం వద్ద నలుగురు, వివాదాలు ఉన్నచోట ముగ్గురు చొప్పున పోలీసులను నియమిస్తామని చెప్పారు. వీరితో పాటు ప్రత్యేక సిబ్బంది నిఘా కొనసాగు తుందన్నారు. బెల్ట్ దుకాణాలు మూసేయాలి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లాలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేంద్రబాబు తెలిపారు. బయటకు మద్యం ఇవ్వకూడదని జిల్లాలో ఉన్న లెసైన్స్ షాపులు, బారుల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇకవేళ ఆ నోటీసులను ఎవరైనా ఉపేక్షిస్తే లెసైన్స్షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిరంతరం కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ టీవీ ఏర్పాటు చేశామని అందులో వార్తలను చూసి సంబంధిత ప్రదేశాల్లో దాడులు చేస్తామన్నారు. జిల్లాస్థాయిలో 08922 255890, ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో 08922 274865, పార్వతీపురంలో 08963 220781 నంబర్లతో ప్రత్యే కంట్రోల్ రూమ్లు కొనసాగుతాయని వివరించారు. సమావేశంలో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్వో బి.హేమసుందర వెంకటరావు, ఆర్డీవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: అంగన్వాడీ కేంద్రాల పని తీరుపై కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్తో పాటూ మిగిలిన సందర్భాల్లోనూ వస్తున్న అంగన్వాడీల పనితీరు సక్రమంగా లేవనే ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని.. అసలు సీడీపీఓలు ఏం చేస్తున్నారని ఐసీడీఎస్ పీడీ శ్రీనివాస్ను ప్రశ్నించారు. క్షేత్ర పర్యటనలు పెంచి సక్రమంగా పని చేయని అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఏజేసీ నాగేశ్వరరావుతో కలిసి ఐసీడీఎస్ అధికారుల తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామా ల్లో కేంద్రాలను సక్రమంగా తెరవడం లేదని, సరుకులు అందించడంలో విఫలమవుతున్నార ని వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిం చాలని ఆదేశించారు. ఇకపై అటువంటి ఫిర్యాదులు వస్తే సీడీపీఓలపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లల హాజరుతో పాటు బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంగన్ వాడీలు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించి న వారిపై వేటు వేయాలన్నారు. నాబార్డు ఆర్ఐడీఎఫ్ కింద మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు 171భవనాలు మంజూ రు కాగా కేవలం 121 భవనాలు మాత్రమే గ్రౌండ్ అవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఈఈ వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ తక్షణమే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాంభం కాని భవనాలను మార్చిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు పూర్తి చేయాలి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కింద మంజూరైన పాఠశాలల అదనపు తరగతుల గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం పలుశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభం కాని నాలుగు భవనాలు పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి సిద్ధం చేయాలని డీఈఓ కృష్ణారావును ఆదేశించారు. 331 వంట గదులు మంజూరు కాగా కేవలం 13 మాత్రమే పూర్తి కావడంపై పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాల విషయమై జనవరి 9లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. 86 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టడానికి రూ1.87కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిధులతో నిర్మిత భవనాల ప్రగతి పర్యవేక్షించాలని సబ్కలెక్టర్ శ్వేతామహంతికి సూచించారు. కాగా, ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల నిర్మాణానికి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఆమోదం తెలిపింది. పాచిపెంట, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి నియోజక వర్గ కేంద్రాల్లో వీటిని నిర్మించనున్నారు. సమావేశంలో సబ్కలెక్టర్ శ్వేతామహంతి, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సోషల్వెల్ఫేర్ డీడీ ఆదిత్యలక్ష్మి పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement