-
పొలిటికల్ ఎంట్రీపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ..
-
రేవంత్ సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా..
కంటోన్మెంట్: రేవంత్రెడ్డి సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. 2014 సెపె్టంబర్లో మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్ పరిధిలో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్లో రేవంత్రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదా సంభాషణల్లో భాగంగా మల్లారెడ్డి, రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘అన్నా నువ్వు సీఎం అవుతావు అన్నా.. ఆ చాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్ల..’అన్నారు. అప్పట్లో తీన్మార్ వార్తల్లో ప్రసారం అయిన ఈ వీడియా తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనివారం మల్లారెడ్డి బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వీడియోను చూపుతూ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు రేవంత్రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో తామిద్దరం కలిసి ప్రచారం చేసిన ఫొటోలను సైతం చూపించారు. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ను వీడేది లేదంటూ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నానని తెలిపారు. -
కబ్జా భూములను సరెండర్ చెయ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి సహా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. అలాంటి భూకబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. అలాంటి వారు చేరేందుకు వస్తే.. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా ఎదుర్కొంటుంది..’’అని మైనంపల్లి పేర్కొన్నారు. చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఇకమీద తాము దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాలను బయటపెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లకోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొందరు నేతలు, ఎంపీలు.. మరో పార్టీలో చేరి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్లో, నాగర్కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీచేయబోనని సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. తాజాగా మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల బరి నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కూల్చివేతతో.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలను అక్రమ నిర్మాణాలంటూ ప్రభు త్వం గురువారం కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో మల్కాజిగిరిలో రాజకీయాలపై ప్రభావం పడింది. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధి లో భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ గత రెండు రోజుల్లో పరిణామాలు మారి పోయాయి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి తదితరులు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలిసి చర్చించారు. కానీ అధికారులు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో కళాశాల భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని.. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. గురు వారం రేవంత్ సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలవడంపై, పార్టీ మారుతున్నట్టు జరిగిన ప్రచారంపై కేటీఆర్కు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మార డం లేదని తెలిపారు. తన అల్లుడు రాజశేఖర్రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంలో కలిశామని వివరించారు. ఇదే సమయంలో తమ కు టుంబం లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా లేదని కేటీఆర్కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆస్తులపై దాడులకు భయపడేనా? సీఎం రేవంత్రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహి ంచిన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకోసం 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీచేయడం దాదాపు ఖరారైంది. కానీ మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి ఆస్తుల పై దాడుల నేపథ్యంలో ఈ సీటు నుంచి తమ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయబోరని మల్లారెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్నీ కష్టాలే: మల్లారెడ్డి
-
కౌన్సిలర్లతో దుబాయ్ వెళ్లిన మాజీమంత్రి మల్లారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలకమండళ్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలోని పలు నగర/పురపాలికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 28తో పాలక మండళ్లు ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇప్పటికే పలువురు మేయర్లు, చైర్మన్లు, చైర్ పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో కొంతమంది క్యాంపులకు వెళ్లారు. వీరిలో కొంత మంది తిరిగి రాగా, మరికొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇంతకీ వారికి వ్యతిరేకంగా తీర్మానం ఉంటుందా? ఈ నోటీసులపై కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనే కల నెరవేరుతుందా? లేదా అనే ప్రశ్న ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన నోటీసులపై ఒకవైపు తీవ్రమైన సందిగ్ధత కొనసాగుతుండగా, మరోవైపు షాద్నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలు, బడంగ్ పేట్ కార్పొరేషన్లోని ఆశావహులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఆదిబట్ల.. తేలేదెట్లా..! ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సర్ ఆర్తిక(కాంగెస్)పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు జనవరి 9న అదనపు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీలో 15 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 13 మంది నోటీసులపై సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 12 మంది క్యాంపు (రాజమండ్రి, వైజాగ్, బీమవరం)నకు వెళ్లారు. తాజాగా బుధవారం ఉదయం క్యాంపు నుంచి తిరిగి వచ్చారు. చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న ఓ కౌన్సిలర్ తనతో పాటు క్యాంపునకు వచ్చిన వారికి భారీగా ప్యాకేజీ ముట్టజెప్పినట్లు తెలిసింది. బండ్లగూడ .. ఒత్తిడి తెచ్చినా.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అభ్యర్థి లతా ప్రేమ్గౌడ్పై 16 మంది (బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి 13 మంది) తిరుగుబావుటా ఎగురవేశారు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా, వీరిలో ఒకరు మృతి చెందారు. వీరంతా ఇటీవల కలెక్టర్ శశాంకను కలిసి నోటీసులు అందజేశారు. అదే రోజు క్యాంపునకు వెళ్లారు. నిన్నటి వరకు ఏపీలో ఉన్న నేతలు తాజాగా బుధవారం బెంగళూరుకు చేరుకున్నారు. కేవలం ఆరు నెలల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం సరైన నిర్ణయం కాదని, క్యాంపు నుంచి తిరిగి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చేదిలేదంటూ హెచ్చరించినా వారు ససేమిరా అనడం గమనార్హం. పెద్ద అంబర్పేట .. వీడేనా ఉత్కంఠ? పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, వీటిలో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి చొప్పున గెలుపొందారు. ఎక్స్ అఫీషియో సభ్యులు, కాంగ్రెస్లోని మరికొంత మంది కౌన్సిలర్ల సహకారంతో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి చవుల స్వప్న చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు బీఆర్ఎస్లో కొనసాగిన చైర్ పర్సన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. గత జనవరి 28న 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ అప్పటి కలెక్టర్కు నోటీసులు ఇచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఒక గ్రూపు, పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు మరో గ్రూపు ఇలా రెండు గ్రూపులు 25 రోజుల పాటు క్యాంపునకు వెళ్లారు. హైకోర్టు స్టే విధించడంతో పాటు ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత నోటీసులనే పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దుబాయ్ వెళ్లిన మేడ్చల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీకి రెండు, కాంగ్రెస్కు ఆరు, బీఆర్ఎస్కు 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కప్పరి స్రవంతిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం 17 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు జనవరి 8న అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్కు నోటీసులు ఇచ్చి, ఆ వెంటనే 11 మంది క్యాంపు(గోవా)నకు వెళ్లిపోయారు. నోటీసులు అందజేసి పది రోజులైనా ఇప్పటి వరకు బలప్రదర్శనకు ఏర్పాట్లు చేయకపోవడంతో క్యాంపుల్లో ఉన్న వారిలో ఆందోళన మొదలైంది. మేడ్చల్: అసమ్మతితో రగులుతున్న మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కొంతమంది నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం దుబాయ్ వెళ్లగా.. మరికొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైటెక్కారు. ఏడాది నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య అసమ్మతి చెలరేగుతోంది. చైర్మన్ను గద్దె దించాలని అవిశ్వాస నోటీసు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటీసు ఇవ్వడంతో అవిశ్వాస తేదీ ఖరారు కాలేదు. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు మారి కాంగ్రెస్ రూలింగ్ రావడంతో తమ పార్టీ కౌన్సిలర్లు అసమ్మతితో ఎక్కడా దూరం అవుతారోనని ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను విదేశీ టూర్కు తీసుకెళ్లారు. -
BRS: మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీఎన్నికల హడావుడి ముగిసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల్లోనూ మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా విపక్షాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, గెలిచిన పలువురు నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ మాజీ మంత్రి ఎంపీగా పోటీ చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరో చూద్దాం. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంపై అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతల కన్ను పడింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అయిన మల్కాజ్గిరిలో 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు గుర్తు మీద పోటీచేసి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మేడ్చల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఎంపీ సీటుపై ఆయన కన్ను పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు పోటీ చేసి గెలిచారు. గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్రెడ్డి ఓటమి చెందారు. అందుకే ఈసారి తానే పోటీ చేసి గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ మల్లారెడ్డి ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే.. ఆ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతి రెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలకు, ఆ తర్వత జరిగే అసెంబ్లీ ఉపఎన్నికకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..మల్లారెడ్డికి ఎంపీ సీటు ఇస్తే.. మేడ్చల్కు ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇతర నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని స్థానిక నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు రెండూ కీలకమే కావడంతో.. ఈ సారి కచ్చితంగా మల్కాజ్గిరి పై గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మల్లారెడ్డికి పట్టున్న స్థానం కావడంతో ఈ విషయంలో సీరియస్గానే ఆలోచన చేస్తోంది. ఏదేమైనా మల్కాజ్ గిరి విషయంలో మాజీ మంత్రి మల్లన్న కూడా గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇక్కడ ఎలాగూ ప్రతిపక్షమే గనుక మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టి... ఇక్కడున్న వివాదాల నుంచి బయట పడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది..? -
సీఎం రేవంత్కు మల్లారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..ఏంటంటే..?
సాక్షి,హైదరాబాద్:మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సోమవారం మల్లారెడ్డి పరామర్శించారు. కేటీఆర్ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కేసీఆర్ తెలంగాణను ఒక మోడల్గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు’ అని మల్లారెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయి.లోకల్గా ఎమ్మెల్యే కి ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారు కానీ సీఎంగా కేసీఆర్ ఉండరని వారు అనుకోలేదు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా’ అని మల్లారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..సీఎం రేవంత్తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు -
పదేళ్లలో మేడ్చల్పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
మంత్రి మల్లారెడ్డి కోసం ఎదురు చూస్తున్న మహేశ్ బాబు ఫ్యాన్స్..!
తెలుగు రాష్ట్రాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన స్పీచ్లో కొంతమేరకు కళాత్మకమైన హిడెన్ టాలెంట్ కనిపిస్తుంది. తన రాజకీయ విమర్శల్లో కూడా సినిమా డైలాగ్స్ కనిపిస్తుంటాయి. అలా తెలంగాణ రాజకీయాల్లో ఆయన చాలా ఫేమస్. 'పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్వెల్ నడిపినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా..' అంటూ ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెడింగ్లోనే ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మల్లారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కల్యాణ్ కన్నా తానే ఫేమస్ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా మాట్లాడే ఆయనలో ఒక నటుడు కూడా కనిపిస్తాడు. పలు సినిమాల్లో నటించాలనే కోరక తనకు ఉందని కూడా మల్లారెడ్డి గతంలో చెప్పేవారు. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఇష్టమైన హీరో ప్రిన్స్ మహేశ్ బాబు అని చాలా ఇంటర్వ్యూలలో ఓపెన్గానే మల్లారెడ్డి చెప్పారు. శ్రీమంతుడు సినిమా ఆడియో వేడుకలో మహేశ్ గురించి ఆయన ఇలా చెప్పారు. 'మీకో ముఖ్యమైన విషయం చెబుతున్నా.. నేను మహేశ్ బాబు అభిమానిని. నేను ఈరోజు ఎంపీ అయినాను అంటే కూడా మహేశ్ సినిమా చూసే' అని తెలిపారు. సినిమాల్లో మాదిరి వాటిని ప్లాన్ చేసి.. దాని మాదిరిగానే సక్సెస్ అయ్యానన్నారు. మహేశ్ బాబును కలవాలనే పట్టుదలతోనే ఈ ఫంక్షన్కు వచ్చానని అప్పట్లో మల్లారెడ్డి తెలిపారు. శ్రీమంతుడు సినిమా సమయంలో ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. నేడు (నవంబర్ 27) యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్- రష్మిక జోడీగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈమేరకు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్శిటీలో జరగనుంది. ఆ ఈవెంట్కు సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తన అభిమాన హీరో అయన మహేశ్ను మంత్రి మల్లారెడ్డి కలుస్తారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో ఎక్కడో ఫంక్షన్ జరుగుతుంటే... అదే పనిగా వెళ్లి మహేశ్ను కలిశాడు మల్లారెడ్డి.. ఇప్పుడు యానిమల్ వేడుక తన సొంత కాలేజీలోనే జరుగుతుంది. అక్కడికి ప్రిన్స్ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఛాన్స్ను ఆయన ఎట్టిపరిస్థితిల్లో పోగొట్లుకోరని సమాచారం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందులో ఆయన స్పీచ్ ఎలా ఉంటుందోనని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్పై గంతంలో మల్లారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను వారు షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_) View this post on Instagram A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_) -
Malkajgiri: అల్లుడి గెలుపు మల్లారెడ్డికి సవాల్
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం తాము నిలిపిన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉండటం. వారు గెలవకపోతే తమ పరపతికి భంగం వాటిల్లుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. ఓవైపు పార్టీల పరంగా బాధ్యతలు, మరోవైపు తమ వారి గెలుపు వారికి సవాల్గా మారింది. ఇది కొందరి పరిస్థితి. ఇంకొందరు తాము పోటీ చేస్తున్న చోట గెలవడంతోపాటు మరోచోట తమ వారినీ గెలిపించాలి. ఇటు కృష్ణ యాదవ్.. అటు పూస రాజు.. ► బీజేపీలో జాతీయస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నగరానికి చెందిన ఇద్దరు నేతలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. నగరంలోని అంబర్పేట, ముషీరాబాద్ నియోజవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్థానిక సెగ్మెంట్ అయిన అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో తన నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్గా మారింది. ► ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డా.కె. లక్ష్మణ్దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పూస రాజుకు టికెట్ దక్కింది. పార్టీ ఓబీసీ మోర్చా చైర్మన్గా ఉన్న లక్ష్మణ్.. అదే విభాగంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రాజుకు టిక్కెట్ ఇప్పించుకున్నారని పార్టీవర్గాల ప్రచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత లక్ష్మణ్ మీద పడింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగానూ, రాజ్యసభ సభ్యుడుగానూ, ఇతరత్రానూ ఎన్నో కీలక స్థానాల్లో ఉన్న లక్ష్మణ్ తన నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన తప్పనిసరి స్థితి. ఇలా కిషన్రెడ్డి, లక్ష్మణ్లు తమ జాతీయస్థాయి బాధ్యతల నిర్వహణతోపాటు తమ నియోజకవర్గాల్లో బరిలోని వారు గెలిచేందుకు కృషి చేయాల్సి ఉంది. ఆయనకు అదనపు బాధ్యతలు.. ఈయనకు అల్లుడి గెలుపు ► పోటీ చేస్తున్న తాము గెలవడంతో పాటు తమవారిని గెలిపించాల్సిన బాధ్యతలు బీఆర్ఎస్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డిలపై అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్ నియోజవర్గంలోనే తన ఓటు ఉన్న మంత్రి తలసాని ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. కంటోన్మెంట్లో పోటీ చేస్తున్న లాస్య నందిత ఎమ్మెల్యేగా బరిలో దిగడం కొత్త. అధిష్ఠానం ఆమె గెలుపు బాధ్యతలు కూడా తలసానికి అప్పగించింది. ఇటు సనత్నగర్లో తాను గెలవాలి. అటు కంటోన్మెంట్లో ఆమెను గెలిపించాలి. ► అలాగే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డిపై పడింది. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలుపు పార్టీ అధిష్థానానికే సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మేడ్చల్లో అల్లుడి గెలుపు మల్లారెడ్డికి అనివార్యంగా మారింది. మేడ్చల్లో తాను గెలవడంతోపాటు అల్లుణ్ని గెలిపించడం మల్లారెడ్డికి పెను సవాల్గా మారింది. కాంగ్రెస్లో ఇలా.. ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ఖేరా భార్య కోటా నీలిమ సనత్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కీలకస్థానంలో ఉన్న ఆయనకు తన భార్యను గెలిపించుకోవడం సవాల్గా మారింది. -
మంత్రి మల్లారెడ్డి స్థిర ఆస్తులు రూ.90.24 కోట్లు
హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదు. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇలా.. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్విట్లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు. -
‘జయలలిత డబ్బులు కాజేసి పైకొచ్చాడు’
మేడ్చల్ రూరల్: పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి పై కొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్రెడ్డి మాట్లాడుతూ గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేసుకుందన్నారు. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు. ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం అందడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఓ చోట దాచిపెట్టగా మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు. తన ఇంటి పక్కన ఉండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలిని మోసం చేసి కుటుంబీకులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మైసమ్మగూడలో చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టడం వల్లే మొన్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు చివరకు తమ మేనిఫెస్టోను కాఫీ కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడి గతంలో గెలిచారని కానీ ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉండి చేసిందేమీ లేదన్నారు. తమ వ్యాపారాల కోసమే మేడ్చల్లో ప్రభుత్వ డిగ్రీ కళాళాల, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వెలుగులోకి తెస్తామని తనకు మేడ్చల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్, నాయకులు రమణారెడ్డి, మహేశ్గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్గౌడ్, నడికొప్పు నాగరాజు, రంజిత్, రాహుల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నా.. మజాకా!
మేడ్చల్: మామూలు రోజుల్లోనే మల్లారెడ్డి అంటే ఒక వైరెటీ. ఇక ఎన్నికల ప్రచారం వేళ ఆయన ఇంకెంత వైరెటీగా దూసుకుపోతారో ఈ చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. శుక్రవారం మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా ఆయన హాజరయ్యారు. ఓ నాయకుడి ఇంటి వద్ద కూర్చున్న మహిళలు, వృద్ధుల వద్దకు మంత్రి మల్లారెడ్డి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. గౌరమ్మ అనే వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెకు పూల బొకే ఇచ్చి సరదాగా ముచ్చటించారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే క్రమంలో ఎన్టీఆర్ గ్రౌండ్లో మల్లారెడ్డికి సంబంధించిన ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి. -
గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు?
హైదరాబాద్: కారు స్పీడ్ను అందుకునేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చ సాగుతోంది. అధికార బీఆర్ఎస్ అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అభివృద్ధి మంత్రంతో ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగింది. కాగా.. కాంగ్రెస్, బీజేపీ పారీ్టల్లో ఇప్పటి వరకు టికెట్లు ఖరారు కాకపోవటంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. మరోపక్క మల్కాజిగిరిలోబీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పారీ్టపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పారీ్టలో చేరటంతో మారిన సమీకరణల నేపథ్యంలో జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. జిల్లాలో ప్రధాన పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో రేపో మాపో టికెట్ తమకే లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయిదు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల పరిస్థితి ఇలా.. మేడ్చల్ ఠిసిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ టికెట్ మళ్లీ దక్కడంతో హంగూ ఆర్భాటం.. అభివృద్ధి జపంతో ప్రచార రంగంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి సహా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కాంగ్రెస్లో చేరిన నక్క ప్రభాకర్గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అధిష్ఠానం తోటకూర జంగయ్య యాదవ్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతున్నా.. హరివర్ధన్రెడ్డి, నక్క ప్రభాకర్గౌడ్ తమ రాజకీయ పలుకుబడితో టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఠిభారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డి సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి మేడ్చల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ దీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించటంతో పాటు అవసరమైతే.. కొత్త నేతను కూడా రంగంలోకి దింపవచ్చనే చర్చ కేడర్లో సాగుతోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యరి్థగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖరారు కాగా.. వీరు అనుచరగణంతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. మర్రి రాజశేఖర్రెడ్డి మామ, మంత్రి మల్లారెడ్డి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై ప్రచారం చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్కు ఎంబీసీ చైర్మన్ పదవి రావడంతో ఆయన అనుచరులు కూడా మర్రికి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరిలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మైనంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో అన్ని డివిజన్లలో అభిమానులు, మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన సేవలు ప్రచారంలో ఉపయోగపడుతున్నాయి. ఇద్దరు కార్పొరేటర్లు వెంట ఉండగా, రాజకీయ పార్టీ నాయకులతో కూడా మైనంపల్లికి మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం జాతీయ కోశాధికారి టి.సాయి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధాన పారీ్టలు బలమైన సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపుతుండగా.. బీజేపీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యరి్థని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆకుల రాజేందర్ ఎమ్మెల్యేగా పని చేయడం, స్థానికుడు కావడంతో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ, పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, సంప్రదాయ ఓటు బ్యాంకు ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం. ఉప్పల్ ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డిని కాదని బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించటంతో కార్యకర్తల సమావేశాలతో పాటు సామాజిక వర్గాల వారీగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ భర్త మందుముల పరమేశ్వర్రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రేపో మాపో అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారంతో తమకు పలుకుబడి ఉన్న నేతలో లాబీంగ్ నిర్వహిస్తున్నారు. బీజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టికెట్ కోసం ప్రయతి్నస్తుండగా, స్థానిక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అధిష్టానాలతో రాయబారాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఎవరు ఇస్తానంటే ఆ పారీ్టలో సుభా‹Ùరెడ్డి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గులాబీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరో? ∙సిట్టింగ్ ఎమ్మెల్యే కేవీ వివేకాందగౌడ్కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. తాను చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాల పేరుతో ఆయన ప్రజల వద్దకు వెళ్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ శంభీరాజు మాత్రం చివరి క్షణం వరకైనా బీ– ఫారం తనకే దక్కుతుందన్న ఆశతో అనుచరులతో కలిసి ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థితో శంభీపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో కలిసి తిరగకపోవటంపై బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి కొలను హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి పోటీలో ఉన్నారు. ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న వీరు టికెట్ తనకేనని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్కు టికెట్ ఖరారైనట్లు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా.. ఆ పారీ్టకి చెందిన మరో నాయకుడు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు ఏ పదవి రాకపోవడంతో ఈసారి బీఆర్ఎస్కు ప్రచారం చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు, బొమ్మరెడ్డి ప్రేమ్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో ఎవరికి వారే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గొట్టుముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం టికెట్ ఆశిస్తుండగా, మరో నాయకుడు మన్నే సతీష్ తనకే టికెట్ రానుందని ప్రచారం చేసుకుంటున్నారు. -
హైలెస్సో హైలెస్సా...
‘‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. సామ్ .జి, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ సాగే పాటని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విడుదల చేశారు. డి. ప్రసన్న కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, ఎ. ప్రవస్తి పాడారు. ‘‘అందమైన ప్రేమకథని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు అనూప్’’ అన్నారు మేకర్స్. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లో మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లో చోటు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్గా అవార్డు సాధించిన ఆయన.. 77వ స్వాత్రంత్య దినోత్సవం రోజున ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడితేనే ఎవరైనా విజయం సాధించగలరనడానికి ఈ అవార్డులే నిదర్శనమన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక మిగిలిన జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానని చెప్పారు. చదవండి: స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్లు.. -
కేంద్రం నిధులపై లెక్కలు రాయాలి
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలందరూ లెక్కలు రాసి వాటిని అవసరమైనప్పుడు చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేజ్–2 కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆమె మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. జయశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసిన నిధులపై లెక్కలు రాసి రాష్ట్ర సాధన ఉద్యమాల సమయంలో ప్రజలకు నాయకుల ద్వారా వివరించారన్నారు. ఆయన రాసిన లెక్కల ద్వారానే తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది ప్రజలకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మోసం చేస్తున్న వారిని పక్కాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్కు వచ్చిన ఇబ్బంది ఏమిటో తమకు అర్థంకావడం లేదని అన్నారు. అలుపెరగని యోధుడు జయశంకర్.. అలుపెరగని యోధుడు జయశంకర్ అని ఆమె పేర్కొన్నారు. జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశాడన్నారు. ఆంధ్రలో తెలంగాణ వీలీనాన్ని ఆయన ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్కు అండగా నిలిచారు.. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొర అని ఆయన వెనుక బీసీ అయిన జయశంకర్ ఉండవద్దని ఎంతో మంది జయశంకర్కు చెప్పారని అందుకు ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆయన తెలంగాణ నినాదం వదిలితే తాను కేసీఆర్ను వదులుతానని అనేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని వదలేదని జయశంకర్ కేసీఆర్ను వదలేదన్నారు. ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవీ వరప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రవీణ్కుమార్ ,సత్యపాల్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, భాస్కర్ యాద వ్, శంకర్ముదిరాజ్, జగన్రెడ్డి, దయానంద్యాదవ్, రమేష్ , దేవ, శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి మల్లారెడ్డి అనౌన్స్ చేసిన ‘అన్ స్టాపబుల్’ రిలీజ్ డేట్ (ఫొటోలు)
-
మేడ్చల్ టికెట్ నాదేనంటున్న సుధీర్ రెడ్డి.. మంత్రి మల్లారెడ్డి పరిస్థితేంటి?
మేడ్చల్: రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యే కావాలని కొంతమంది నాయకులు, స్థానాన్ని తిరిగి నెలబెట్టుకోవాలని మరి కొంతమంది నాయకులు రాజకీయాలు మొదలు పెట్టారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలతో కలిసి ఉన్న మేడ్చల్ ప్రజలు ప్రతీ ఎన్నికలో విలక్షణ తీర్పు ఇస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న మేడ్చల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అభ్యర్థులకు అంగబలం, అర్థబలం ఉండి తీరాల్సిందే.. అన్ని పార్టీల్లో అంతర్గత పోరే.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో టికెట్లు ఆశించే నాయకులు ఒకరి కంటే ఎక్కువగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మేడ్చల్కు మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడు పార్టీల నుంచి ఎనిమిది మంది బలమైన నాయకులు ఈ ఎన్నికల్లో ప్రధాన మూడు పార్టీల్లో టికెట్ కోసం పోటీపడుతున్నారు. మూడు టికెట్ల కోసం 8మంది పోటీలో ఉన్నారు. సీజన్ ప్రారంభం నాటికి మరి కొంతమంది వలస నాయకులు, జంప్ జలానీలు జాబితాలో చేరతారు. బీఆర్ఎస్లో ముగ్గురు.. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ఎమ్మెల్యేగా సుదీర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మల్లారెడ్డి తన టికెట్ బలవంతంగా చివరి నిమిషంలో లాక్కున్నారని, ఈసారి టికెట్ తనదేనని ఆయన పలు సమావేశాల్లో చెబుతున్నారు. టికెట్ ఈసారి తనదేనని సీఎం కేసీఆర్ తనకు ఇప్పటికే ఖరారు చేశారని మంత్రి మల్లారెడ్డి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య టికెట్ పోరు జోరుగా సాగుతోంది. సుదీర్రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆయన కుమారుడు శరత్చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్గా ఉండి తమ గ్రూపు రాజకీయం జోరుగా సాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి పార్టీలో 80శాతం నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని తన స్టైల్ రాజకీయం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉండి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసి ఓటమి పాలైన నక్క ప్రభాకర్గౌడ్ బీఆర్ఎస్ మేడ్చల్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి శిష్యుడిగా పేరుపొందిన ఆయన ఈసారి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో జోరుగా.. కాంగ్రెస్ పారీ్టలో ప్రతి ఎన్నికల్లో గ్రూపు రాజకీయం కనబడటం సాధారణం. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయాక నియోజకవర్గ రాజకీయానికి కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అయ్యా క ధిక్కార స్వరం వినిపించి కాంగ్రెస్లో కనుమరుగయ్యారు. ఎన్నికల సీజన్ కావడంతో తిరిగి రేస్లోకి వచ్చాడు. నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు హరివర్ధన్రెడ్డి, వజ్రేయాదవ్లు ఈ సారి ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు ఇద్దరు నేతలు ఎంపీ రేవంత్రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఇద్దరు నేతలు నియోజకర్గంలో ఎవరికి వారుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరివర్ధన్రెడ్డి జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉండి జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. బీజేపీలో ఎవరో..? బీజేపీలో మేడ్చల్ అభ్యరి్థగా నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కొంపల్లి మోహన్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డిలు ఈ సారి పార్టీ బీఫారం ఆశిస్తున్నారు. ఆ పార్టీ అధినాయకత్వం వలస నాయకులను నమ్ముకోవడంతో ఎన్నికల సమయానికి ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చి చేరుతాడో.. టికెట్ ఎవరికి వస్తుందో ఎన్నికల వరకు సస్పెన్స్గానే ఉంటుంది. మిగతా పారీ్టలైన బీఎస్పీ, వామపక్షాలు పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి. -
కబళించిన మంటలు.. ఐదేళ్ల కుమారుడుసహా దంపతుల సజీవ దహనం
కుషాయిగూడ (హైదరాబాద్): ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం. కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉన్న ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రమైన మంటలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి అంటుకుని వ్యాపించాయి. అందులో ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, అందరూ ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినా ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కుషాయిగూడ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా.. సాయినగర్ కాలనీ ప్రధానరోడ్డు మార్గంలో ఉదయ్శంకర్, శివసాయి అనే అన్నదమ్ములు శ్రీ ఆదిత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో గత 25 సంవత్సరాలుగా టింబర్ డిపో నడుపుతున్నారు. ఏ జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అందులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనానికి అంటుకున్నాయి. అదే సమయంలో బాత్రూంకు వెళ్లేందుకు నిద్రలేచిన వాచ్మెన్ కుమార్తె ఉమ మంటలను గమనించి కేకలు పెడుతూ తల్లిదండ్రులను లేపింది. వారు వెంటనే మూడో అంతస్తులో ఉండే యజమాని రాంచందర్షాకు సమాచారం ఇవ్వడంతో పాటు భవనంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే భవనమంతా దట్టమైన పొగలతో నిండిపోయి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కింద దుకాణాలు, పైన పోర్షన్లు మూడంతస్తుల భవనంలో కింద వాణిజ్య దుకాణాలు ఉండగా, పైన యజమాని నివాసంతో పాటు ఆరు పోర్షన్లు ఉన్నాయి. వాచ్మెన్ అరుపులతో నిద్రలోంచి మేల్కొన్న వారు దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ భవనం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. కొంతమంది భవనంపైకి వెళ్లి పక్క భవనంపై నుంచి సురక్షితంగా బయట పడగా, మరికొందరు మంటల్లోంచే బయటకు వచ్చి గాయాలపాలయ్యారు. అయితే రెండో అంతస్తులోని సింగిల్ గదిలో ఉంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన రెపినేని నరేష్ (37), అతని భార్య సుమ (28) కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. అప్పటికే బయటంతా మంటలు, పొగ తీవ్రరూపం దాల్చాయి. సింగిల్ రూం కావడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుమారుడు జశ్వంత్ (5)ను తీసుకుని మంటల్లోంచే గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచి..మొదటి అంతస్తు మెట్ల వద్ద పడిపోయి సజీవ దహనమయ్యారు. నరేష్ దంపతుల పెద్ద కుమారుడు అది్వక్ శనివారం రాత్రి అక్కడికి సమీపంలోనే ఉన్న సుభాష్ చంద్రనగర్లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక రెండో అంతస్తులో ఉన్న నారాయణ, ఉమ దంపతులు బయటకు వచ్చే క్రమంలో మంటల సెగ తాకి గాయపడ్డారు. పద్మావతి అనే మహిళ రెండో అంతస్తు నుంచి చీర సాయంతో దిగుతుండగా మంటల వేడికి చీర తెగడంతో కింద పడిపోయి గాయపడింది. ఆమె భర్త పూర్ణచందర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా వాచ్మెన్ వీరమల్లేష్ ఇంట్లో ఉన్న సిలిండర్ పేలుతుందోమోనన్న భయంతో లోపలికి వెళ్లి దాన్ని తీసుకువచ్చే క్రమంలో స్వల్పంగా గాయపడ్డాడు. మంటలు క్షణాల్లోనే మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని వాచ్మెన్ కూతురు ఉమ చెప్పింది. ఆరు గంటలు శ్రమించాం: ఫైర్ ఆఫీసర్ శేఖర్రెడ్డి ‘అగ్ని ప్రమాదం గురించి 4 గంటలకు మాకు సమాచారం అందింది. పది నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే మంటలు, దట్టమైన పొగ కారణంగా బిల్డింగ్లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి లోనికి ప్రవేశించాం. ఓ కుటుంబం మిస్ అయ్యిందని చెప్పడంతో గాలించగా మొదటి అంతస్తు కారిడార్పై ఓ శవం, మెట్లపై రెండు శవాలను గుర్తించాం..’అని చర్లపల్లి అగ్ని మాపక అధికారి శేఖర్రెడ్డి తెలిపారు. కాగా సాయినగర్ కాలనీలో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనుల కోసం రోడ్డును తవ్వేయడంతో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి దగ్గరగా చేరుకోలేక పోయాయని స్థానికులు చెప్పారు. ఇలావుండగా అగిప్రమాదాలకు సంబంధించిన ఎలాంటి భద్రతా వ్యవస్థ లేకుండా టింబర్ డిపో నిర్వహిస్తున్న శ్రీ ఆదిత్య సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని నూతలపాటి శివసాయిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. నరేష్, సుమ, జశ్వంత్ల మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పేలిన రెండు సిలిండర్లు.. మంటలు భారీఎత్తున ఎగసి పడటానికి భవనం కింద ఉన్న ఆటోమొబైల్ షాప్ గోదామే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గోదాంలోని టైర్లు, ఆయిల్ డబ్బాలతో పాటుగా ఇతర సామగ్రికి నిప్పు అంటుకోవడం వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన టింబర్ డిపోలో 8 గ్యాస్ సిలిండర్లు ఉండగా వీటిల్లో రెండు పేలిపోయాయి. టింబర్ డిపోలో అన్ని గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయో తెలియరాలేదు. అలాగే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది కూడా తెలియరాలేదు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మి క శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంపై హోం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని ఆదుకుంటామన్నారు. గాంధీ మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తానిక్కడికి వచ్చానని, తల్లిదండ్రుల మృతితో అనాథగా మిగిలిన అద్విక్ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే చూస్తుందని మల్లారెడ్డి చెప్పారు. కాగా బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షల ఎక్స్గ్రేషియాను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. -
యాభై ఏళ్లలో చేయనోళ్లు.. ఇప్పుడు అభివృద్ధి చేస్తారట!
సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు. దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది.. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. 3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్పాత్ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్రెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు రైతులా! దున్నపోతులా!
ఘట్కేసర్: రైతుల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అన్నదాతలపై విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎక్కడ చేశారని నిలదీసిన రైతుల్ని పట్టుకుని ‘మీరు రైతులా దున్నపోతులా’అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడికక్కడే సభలోనుంచి లేచి నిరసనకు దిగారు. మంగళవారం పట్టణంలోని నారాయణగార్డెన్లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన 2022–23 అర్థ వార్షిక నివేదిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనేవారని, నేడు పండుగ వాతావరణంలో సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో హరినాథ్రెడ్డి అనే రైతు రుణమాఫీ అవుతుందని తీసుకున్న రూ.80 వేలకు మరో 80 వేలు వడ్డీ అయిందని రుణమాఫీ ఎక్కడ చేశారని అడగగా మరో రైతు మహిపాల్రెడ్డి వడ్డీ రేటు తగ్గించాలని కోరారు. దీంతో దున్నపోతుల్లా ఉన్నారు, మీరు రైతులా, బయటకు గుంజుకుపోండని మల్లారెడ్డి ఆదేశించడంతో రైతులు నిరసనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రైతుల్ని పోలీస్స్టేషన్కు తరలించారు. -
మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా 'సీఐ భారతి' లాంచ్
నరేంద్ర, గరిమా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సీఐ భారతి. రమణారెడ్డి గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో విశాల పసునూరి నిర్మిస్తున్నారు. సోమవారం నాడు హైదరాబాద్లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ... 'రొటీన్కు భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టాం. మా సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీదట కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయనున్నాం' అన్నారు. హీరో నరేంద్ర మాట్లాడుతూ... 'రమణా రెడ్డి గారు అద్భుతమైన కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా నటించడం చాలా సంతోషం. నా పాత్ర చాలా బాగా డిజైన్ చేశారు. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం' అన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement