-
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం.. సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
Delhi liquor scam: మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీíÙయల్ కస్టడీకి పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులు ఆయన్ను శనివారం ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీíÙయల్ కస్ట డినీ పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మనీశ్ సిసోడియా జైలులోనే ఉన్నారు. -
Delhi Liquor Scam: ప్రకంపనలు రేపుతున్న అరెస్టుల పర్వం (ఫొటోలు)
-
ED: కవిత అరెస్ట్పై ఈడీ కీలక ప్రెస్నోట్ విడుదల
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఈడీ సోమవారం కవిత అరెస్ట్పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ‘ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేశాం. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించింది. మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్,మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారు. ఈ వ్యవహారంలో ఆప్ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు. ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారు. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు. ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం. కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు. నిలకడగా కవిత ఆరోగ్యం: వైద్యులు ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కవిత బీపీ సాధారణంగా ఉందన్న పేర్కొన్నారు. 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయంది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరీంగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్ చేసింది. చదవండి: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఊరట -
Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా మనీష్ సిసోడియా వరానికి ఒకసారి ఆనారోగ్యంతో ఉన్న తన భార్యను, వైద్యులను కలవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. మనీష్ తన భార్యను వారానికోసారి కలిసేందుకు కస్టడీ పెరోల్కు అనుమతించాలని ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఫిబ్రవరి 2న మనీష్ దరఖాస్తుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)కి నోటీసు జారీ చేశారు. అయితే మొదటి దరఖాస్తును సాధారణ బెయిల్గా.. రెండో దరఖాస్తును కస్టడీ పెరోల్పై మనీష్ వారానికి రెండు రోజులు తన భార్యను కలవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు ఈడీకీ నోటీసు ఇచ్చింది. ఇక.. గత నవంబర్లో దీపావళీ సందర్భంగా తన భార్యను కలవటానికి మనీష్కు కోర్టు కస్టడీ పెరోల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో మనీష్కు సంబంధాలు ఉన్న అభియోగాలపై ఈడీ, సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల కేసు విచారణ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'బీజేపీ ఎలాంటి కుట్ర పనైనా చేయగలదు. నేను కూడా గట్టిగానే ఉన్నా. ఎప్పటికీ లొంగిపోను. నన్ను బీజేపీలో చేరమని అడుగుతున్నారు. నన్ను ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో ఎప్పటికీ చేరబోనని చెప్పాను. అది ఎప్పటికీ జరగదు.' అని ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆప్ అధినేత మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆసుపత్రుల కోసం ఖర్చు చేయగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ బడ్జెట్లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ గురించి కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. "ఈరోజు అన్ని కేంద్ర ఏజెన్సీలు మన వెంటే పడుతున్నాయి. మంచి పాఠశాలలను నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పు. మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్లు నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోతే మనీష్ సిసోడియా జైలుకు వెళ్లేవారు కాదు. బీజేపీ అన్ని రకాల కుట్రలు చేస్తోంది. కానీ మమ్మల్ని అడ్డుకోలేకపోయారు" అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల కేసులో మంత్రి అతిశీకి నోటీసులు అందించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి చాలా సేపు అక్కడే వేచి ఉన్నారు. కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించాలని అతిశీ కోరినప్పటికీ వారు నిరాకరించారు. ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్కు శనివారం నోటీసులు అందించారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు -
Delhi liquor scam: జైలు నుంచి ఇంటికెళ్లిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కొద్దిసేపు ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓదార్చేందుకు ఆరు గంటలపాటు ఇంటికి వెళ్లేందుకు సిసోడియాకు ఢిల్లీ సిటీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని మధుర రోడ్డులో గల నివాసానికి శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగింటివరకు ఆయనకు అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా సిసోడియా భార్య సీమా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ సిసోడియా గతంలో కోర్టును కోరిన విషయం విదితమే. దీంతో ఆయనకు కోర్టు ఇలా కొద్దిగంటలపాటు ఉపశమనం కలి్పంచింది. అయితే బయట ఉన్న సమయంలో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. గతంలోనూ భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచి్చనా ఇంటికొచ్చే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కలవలేకపోయారు. -
లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. మనీష్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు. రూ. 338 కోట్ల బదిలీకి సంబంధించి సందేహాస్పదమైన కొన్ని అంశాలున్నందవల్లే బెయిల్ను తిరస్కరించామని జస్టిస్ ఖన్నా అన్నారు. విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తాజా తీర్పుతో సిసోడియాకు మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు. అయితే, ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో విచారణకు ఎంత సమయం పడుతుందని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్యం కుంభకోణంలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. అరెస్టయిన సమయంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఫిబ్రవరి 28న క్యాబినెట్కు రాజీనామా చేశారు. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా ♦ ఈ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారులుబదులుగా కొంతమంది వ్యాపారులకు మద్యం లైసెన్స్లు మంజూరు చేసేందుకు సహకరించారనే ఆరోపణలు ♦ కొందరు మద్యం విక్రయదారులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఎక్సైజ్ పాలసీని మార్చారని అభియోగాలు ♦ ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ ♦ ఎక్సైజ్ శాఖతో సహా 18 పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తున్న సిసోడియా ఫిబ్రవరి 28న క్యాబినెట్కు రాజీనామా ♦ మనీలాండరింగ్ కేసులో మార్చి 9న తీహార్ జైలులో విచారించిన తర్వాత ఈడీ అరెస్టు చేసింది. ♦ "హై ప్రొఫైల్" వ్యక్తి అంటూ మే 30న సీబీఐ కేసులోబెయిల్ నిరాకరించిన హైకోర్టు ♦ జూలై 3న మనీలాండరింగ్ కేసులో కూడా బెయిల్ను తిరస్కరణ ♦ సిసోడియాను సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు, ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి- సుప్రీం ♦ విశ్లేషణలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ తిరస్కరించినట్టు తాజాగాపేర్కొన్న సుప్రీంకోర్టు Supreme Court dismisses the bail plea of former Delhi Deputy CM Manish Sisodia in connection with cases related to alleged irregularities in the Delhi Excise Policy case. pic.twitter.com/3gAYUMGW9I— ANI (@ANI) October 30, 2023 -
Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్పై 30న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీష్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..సిసోడియాపై మోపిన అభియోగాలపై దిగువ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. ‘సిసోడియాను ఈ విధంగా మీరు సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. ఇప్పటిదాకా మీరు వాదనలను ఎందుకు ప్రారంభించలేదు? ఎప్పుడు మొదలవుతాయి? మాకు ఈ విషయం రేపటి(మంగళవారం) కల్లా చెప్పండి’అని ధర్మాసనం ఎస్వీ రాజును ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, రాజు అవునని బదులిచ్చారు. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. మార్చి 9వ తేదీన సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి, తీహార్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. -
ఆప్కు కాంగ్రెస్ చురకలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్దతునిస్తూనే ఆప్కు కాంగ్రెస్ చురకలంటించింది. ఇండియా కూటమి భాగస్వామైన ఆప్ను కాపాడుకుంటూనే పంజాబ్లో తమ నేతలను అరెస్టు చేయడంపై విరుచుకుపడింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. బీజేపీ ప్రతికార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాయని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ ప్రతికార రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని అన్నారు. అదే క్రమంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై ఆప్ను నిందించారు. AAP MP Sh. @SanjayAzadSln ji's arrest by the ED takes the BJP's vendetta politics to another level. We stand in complete solidarity with him and reject the use of law enforcement agencies to settle political scores. For this reason, we also oppose the arrests of All India… — K C Venugopal (@kcvenugopalmp) October 5, 2023 పంజాబ్లో 2015నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరాను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మఖ్యమంత్రి ఓపీ సోనీని కూడా అరెస్టు చేశారు. పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ నేతలను అరెస్టు చేయడం పట్ల కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతల అరెస్టులు న్యాయబద్ధంగా జరలేదని ఆరోపించారు. కూటమిలో పోరు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్కు మద్యం కుంభకోణం కేసులో మద్దతుగా నిలుస్తోంది. అటు.. పంజాబ్లో సొంత అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లో ఆప్, కాంగ్రెస్కు మధ్య సీట్ల షేరింగ్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. అవినీతి మయమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆప్ నేతలు అంటున్నారు. కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉంటుందని పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం: మద్యం కుంభకోణంలో అక్రమాలకు పాల్పడి ఆ డబ్బును పార్టీ ప్రచారాల కోసం వినియోగించారని ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైలు పాలయ్యారు. తాజాగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? -
వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు సీబీఐను ప్రశ్నించింది. ఇదే కేసులో నిందితుడైన దినేశ్ అరోరా వాంగ్మూలం మినహా ఇంకా ఏం ఆధారాలున్నాయని అడిగింది. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ పేర్కొంది. కొన్ని వాట్సాప్ సందేశాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యం ఆమోదయోగ్యమేనా? అప్రూవర్గా మారిన వ్యక్తి ఇచి్చన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా ఎలా భావించగలం? అని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని అభిప్రాయపడింది. సిసోడియా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, మరి ఆ డబ్బులు ఆయనకు ఎవరిచ్చారు? డబ్బులిచి్చనట్లు ఆధారాలున్నాయా? ఈ కేసులో అరోరా వాంగ్మూలం కాకుండా సాక్ష్యాలున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంజయ్ సింగ్కు ఐదు రోజుల కస్టడీ బుధవారం అదుపులోకి తీసుకున్న ఆప్ నేత ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు గురువారం ప్రత్యేక కోర్టు జడ్జి నాగ్పాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి ఆయన్ను విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. దీంతో జడ్జి నాగ్పాల్ ఆయన్ను విచారణ నిమిత్తం అయిదు రోజుల ఈడీ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జడ్జి అనుమతి మేరకు సంజయ్ సింగ్ కోర్టులో మాట్లాడారు. -
సిసోడియా అరెస్ట్పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. సాక్ష్యం ఎక్కడ?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ను దర్యాపు చేస్తున్న కేంద్రం ఏజెన్సీలకు పలు ప్రశ్నలు సంధించింది. దీంతో, ఈ కేసు మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర ఏజెన్సీలకు సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయని ప్రశ్నించింది. కొందరు వ్యక్తులకు లబ్ధిచేకూరే విధంగా ఈ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు సంబంధించి కొన్ని వాట్సాప్ మెసేజ్లను సీబీఐ కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. ఈ క్రమంలో సదరు మెసేజ్ల ఆమోదయోగ్యతపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు దినేష్ అరోరా స్టేట్మెంట్ మినహా సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. నగదు ఎవరి నుండి ఎవరికి ఎలా చేరిందనే అంశంపై పూర్తి సాక్ష్యాధారాల లింకులను సమర్పించలేదని పేర్కొంది. వారు దాని గురించి మాట్లాడుకోవడం మీరు చూశారా? ఈ సాక్ష్యాలు ఆమోదయోగ్యంగా ఉంటాయా? ఇది అప్రూవర్గా మారిన ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం కాదా? మరి దీన్నెలా సాక్ష్యంగా భావించగలం అని ఎదురు ప్రశ్నలు సంధించింది.ఈ కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైనా ఆధారాలను చూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. Take out time from your schedule and read all arguments in Manish Sisodia Case. Today's Argument in SC shows that how anyone can be framed in PMLA case by ED without any establishment of any money Trail. 9 months have been passed since his arrest still no evidence found — 🇮🇳Delightful🇮🇳 (@sdhruv86) October 5, 2023 మీరు రూ.100 కోట్లు, రూ.30 కోట్లు అని రెండు అంకెలు చెప్పారు. వారికి ఇది ఎవరు చెల్లించారు. నగదు చాలా మంది చెల్లించవచ్చు. మద్యానికి సంబంధించినదే కానవసరంలేదు. సాక్ష్యం ఎక్కడ ఉంది. దినేష్ అరోరా కూడా నగదు తీసుకున్న వ్యక్తే, గ్రహీత. ఆయన కూడా నిందితుడే. ఒక్క దినేష్ అరోరా ప్రకటన తప్ప.. ఈ కేసులో సరైన రుజువులు ఎక్కడున్నాయి. ఈ కేసులో విజయ్ నాయర్ మాత్రమే ఉన్నారని, మమనీష్ సిసోడియా పాత్ర లేదని ధర్మాసనం ప్రశ్నించింది. మనీలాండరింగ్ చట్టం కింద సిసోడియాను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: త్వరలో ‘కింగ్ పిన్’ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు: అనురాగ్ ఠాకూర్ -
త్వరలో ‘కింగ్ పిన్’ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు: అనురాగ్ ఠాకూర్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ ఎంపీ సంజయ్సింగ్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ సర్కార్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన విమర్శలు చేశారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్ను టార్గెట్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ కేసులో ‘కింగ్ పిన్’(కేజ్రీవాల్) కూడా జైలులో ఉంటారని అన్నారు. అయితే, మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలుకు వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు, ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు. केजरीवाल पर जमकर भड़के अनुराग ठाकुर बोलें, इनके मंत्री से लेकर सांसद तक सब जेल में हैं।#anuragthakur #BJP #newliquorpolicy #SanjaySinghArrested #ManishSisodia pic.twitter.com/LAhuFaQTm3 — Chaupal Khabar (@ChaupalKhabar) October 5, 2023 లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు బయట ఉన్న కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు. ఆయన నెంబర్ కూడా వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కానీ రెండు నెలల్లోనే అవినీతి కారణంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని ఠాకూర్ విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్ సింగ్ అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది మోదీ భయాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల వరకు ఇంకా చాలా మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్! -
వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. "Nothing will be found at his residence," Arvind Kejriwal reacts to ED's raid on Sanjay Singh Read @ANI Story | https://t.co/oTADiHIxnP#ArvindKejriwal #EDRaid #SanjaySingh pic.twitter.com/txzXtqdGgQ — ANI Digital (@ani_digital) October 4, 2023 'ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోనూ ఏమీ లభించలేదు. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. అయినా.. లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం' అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. బీజేపీ ఫైర్ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా మండిపడింది. దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇదీ చదవండి: Delhi Liquor Policy Case: ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బులు.. అందుకే సంజయ్ సింగ్ ఇంట సోదాలు? -
మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్యం క్షీణిస్తోందని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సిసోడియా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. తన తరుపున వాదనలకు రెండు గంటల సమయం ఇవ్వాలని బెంచ్ను కోరారు. తమ క్లయింట్ అభ్యర్ధనపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఢిల్లీ ఎక్సైజ్ పోర్టుఫోలియోను నిర్వహించే క్రమంలో మధ్యం కుంభకోణం జరిగిందని సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వర్తించారు. అయితే.. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచీ కస్టడీలోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ప్రభుత్వంలో తన పదవులకు సిసోడియా రాజీనామా చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
సీఎం కేజ్రీవాల్కు బర్త్డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు నేడు(ఆగస్టు16). ఈ ఏడాది ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేజ్రీవాల్కు పలువురు రాజకీయ నేతలు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. Thank you for your wishes Sir. https://t.co/pa74MlU12I — Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023 అయితే మోదీ ట్వీట్కు కేజ్రీవాల్ బదులిచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సెనా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, రాజీవ్ శుక్లాతో తదితరులు కేజ్రీవాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్ మనీష్ను మిస్ అవుతున్నా: కేజ్రీవాల్ కేజ్రీవాల్ తన పుట్టిన రోజున సీఎం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ ఈరోజు నా పుట్టినరోజు. చాలా మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. కానీ నేను మనీష్ను చాలా మిస్ అవుతున్నాను. ప్రస్తుతం అతను తప్పుడు కేసులో జైలులో ఉన్నారు. Today is my birthday. Many people are sending their wishes. Thank you so much! But I miss Manish. He is in jail in a false case. Lets all take a pledge today - that we will do everything within our means to provide best quality education to every child born in India. That will… — Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023 ఈ రోజు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. భారత్లో పుట్టిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన, నాణ్యమైన విద్యను అందించడానికి మా శక్తిమేర ప్రయత్నిస్తాం. అది పటిష్ట భారత్కు పునాది వేస్తుది. అది భారత్ను నంబర్ వన్గా తీర్చిదిద్దాలనే మన కలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది. అది మనీష్ను కూడా సంతోషపరుస్తుంది.’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని ప్రభుత్వం అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నియంత్రణ కోసం తీసుకొచ్చిన చట్టం కారణంగా కేజ్రీవాల్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. చదవండి:మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు -
ఢిల్లీ మద్యం కుంభకోణం: మనీష్ సిసోడియా రూ.52 కోట్ల ఆస్తుల అటాచ్..
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన భార్య, ఇతరులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్డడీలో ఉన్నారు. అన్దీప్ సింగ్ ధాల్, రాజేశ్ జోషీ, గౌతమ్ మల్హోత్రాతో పాటు మరికొందరి ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు అకౌంట్లలో రూ.11 లక్షలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సిసోడియాకు సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన మరుసటి రోజే ఈడీ ఆస్తుల అటాచ్ చర్యలకు పూనుకుంది. దేశ రాజధానిలోని నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాదే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియా ఇమేజ్ను దెబ్బతీయడానికే కేంద్రం కట్టుకథలు అల్లుతోందని అన్నారు. ఈడీ సీజ్ చేసిన రెండు ఫ్లాట్లలో ఒకటి 2005లోనే కొనుగోలు చేయగా.. మరొకటి 2018లో కొన్నట్లు చెప్పారు. మద్యం పాలసీ కంటే ముందే ఆ ఆస్తులను కొన్నట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్, తన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మనీశ్ సిసోడియా గారు ఇది మొదలుపెట్టారు. ఇవాళ ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నా. విద్యా శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ప్రతీ చిన్నారికి మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. అందు కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలు మెరుగైన వసతులతో నిర్మించడం లాంటి ప్రయత్నాలు చేశారు. బహుశా అందుకేనేమో ఆయన్ని ఇవాళ జైలులో పెట్టారు అని మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అంతం చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. కానీ, అలా జరగనివ్వము అంటూ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. వాళ్లు తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు బనాయించి ఓ మంచి మనిషిని(మనీశ్ సిసోడియాను ఉద్దేశించి..) జైలుకు పంపించారు. ఆయన్ని ఎందుకు జైల్లో పెట్టాలి. ఎంతో మంది నేరస్తులు, దోపిడీ దారులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ దేశంలో. ఒకవేళ ఆయన గనుక మంచి చేసి ఉండకపోతే.. జైలుకు వెళ్లి ఉండేవారు కాదేమో. ఆయన చేసిన మంచి.. వాళ్లకు కంటగింపుగా మారింది అంటూ మండిపడ్డారు కేజ్రీవాల్. VIDEO | Delhi CM Arvind Kejriwal breaks into tears as he talks about former Deputy CM Manish Sisodia during the inauguration of an educational institute in the national capital. pic.twitter.com/fNLoQMYGN4 — Press Trust of India (@PTI_News) June 7, 2023 ఆయన ఈ సమాజానికి మంచి జరగాలని అనుకున్నాడు. ఆ ఆశయాలు మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఆయన బయటకు వస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. సత్యం ఏనాడూ ఓడిపోదు. సత్య మార్గంలో నడిచే వాళ్లకు దేవుడు కూడా తోడు ఉంటాడు. ఆయన బయటకు వచ్చేదాకా.. ఆ మంచిని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది అంటూ పేర్కొన్నారాయన. లిక్కర్ స్కాం కేసు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. మధ్యలో మనీలాండరింగ్ ఆరోపణలపైనా ఈడీ సెపరేటుగా ఛార్జిషీట్ దాఖలు చేసింది కూడా. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన బెయిల్ దక్కకపోగా.. సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన. ఇదీ చదవండి: అమిత్ షా నివాసం వద్ద నిరసనలు -
లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. తన భార్య అనారోగ్యం కారణంగా ఆరు వారాలు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ సిసోడియాకు చుక్కెదురైంది. తన భార్యను చూసుకునేందుకు తానొక్కడినే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి నిరాశే మిగిలింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సిసోడియా.. మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, భార్యను చూసేందుకు సిసోడియాకు అనుమతించింది. ఏదైనా ఒకరోజు తన నివాసం వద్ద కానీ, ఆసుపత్రిలోనైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో భార్యను కలిసేందుకు ఆమోదం తెలిపింది. భార్యను కలిసేందుకు సిసోడియాకు కోర్టు శనివారం అనుమతిచ్చినప్పటికీ, సిసోడియా నివాసానికి వెళ్లేసరికి అప్పటికే ఆయన భార్య ఆసుపత్రిలో చేరారు. దాంతో సిసోడియా తన భార్యను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో, భార్య కలిసేందుకు సిసోడియాకు కోర్టు మరో అవకాశం ఇచ్చింది. మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఇటీవల సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్యను చూడడానికి గత శుక్రవారం జైలు నుంచి బయటకు రావడానికి హైకోర్టు అనుమతించింది. అయితే.. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా మార్చి 9న అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి:బ్రిజ్భూషణ్ అరెస్ట్కు రెజ్లర్ల డిమాండ్.. లభించని అమిత్ షా హామీ -
ఆయన ఇంటికి.. ఆమె ఆసుపత్రికి..
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, తాజాగా సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. దీంతో, శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ను న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, అనూహ్యంగా సిసోడియా ఇంటికి చేరుకోవడానికన్నా ముందే ఆయన భార్య అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక, ఆమె ఆసుపత్రిలో ఉండటంతో జైలు అధికారులు.. సిసోడియాను ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తన భార్య, కుటుంబ సభ్యులను ఆసుపత్రిలోనే కలుసుకున్నారు. అక్కడే వారితో మాట్లాడారు. కాగా, సాయంత్రం 5 గంటలకు సిసోడియా మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ఒడిషా రైలు ప్రమాదంపై రిటైర్డ్ ఉద్యోగి, యూనియన్ నేత సంచలన కామెంట్స్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
ఏపీ పోలింగ్పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement