-
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎనీ్టఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
‘అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో.. కానీ ఆడపిల్లకు ఆపద వస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయను’– ఇది వెండితెరపై వీర లెవల్ డైలాగ్ కట్ చేస్తే.. ఆడది కనిపిస్తే ‘ముద్దు’ అయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి – ఇది రియల్ లైఫ్లో ముసుగు తొలగించిన మన నాయకుడి ముతక డైలాగ్ ‘నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది’రాజకీయాల్లో మాత్రం తనదాకా ఎందుకనుకున్నారేమో.. ప్రజలను వణికించడానికి నియోజకవర్గంలో పీఏలకే పెత్తనాన్ని అప్పగించేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: సినిమాల్లో వీర లెవల్ డైలాగులు పలికే ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మాత్రం ఫెయి ల్యూర్ నేతగా మిగిలిపోయారు. అభివృద్ధి, ప్రతిపక్షంపైనా భారీ సంభాషణలు పలికే ఆయన ప్రజల సమస్యలు తీర్చడంలో జీరోగా మారారు. సెల్యూలాయిడ్పై తన నటనతో ఈలలు, చప్పట్లు కొట్టించుకునే ఆయన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి అభినందనలు పొందలేకపోయారు.గడిచిన పదేళ్లలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడం, కనీసం స్థానికంగా ఉండే లోటు పాట్లు, సమస్యలపై పదిశాతం కూడా అవగాహన లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం నెలకోసారి కూడా నియోజకవర్గంలో పర్యటించని నేత తమకెందుకని, తమ సమస్యలు తీర్చి అక్కున చేర్చుకునే స్థానిక నేతలే తమక కావాలని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ పదేళ్లలో చాలా హామీలిచ్చినా వాటిని తీర్చలేకపోయారు.రాష్ట్రంలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వెండి తెరపై మన్ననలు పొందిన మాజీ సీఏంతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అయితే మరీ ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే ఉన్న ఆయన ఆ ప్రాంతాన్ని గాలికొదిలేశారు. సినిమా షూటింగులు, కుటుంబ వ్యవహారాలు, హైదరాబాద్లో స్థిరనివాసం వెరసి ఆయన ఏడాదికి ఒకట్రెండుసార్లు పర్యటనకు మాత్రమే పరిమితమయ్యారు.పీఏలదే పెత్తనం ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలనేది అక్కడి ప్రజల మనోగతం. కానీ అరిచి గీపెట్టినా ఆయన అక్కడికి వెళ్లరు. దీంతో ఆయన నియమించుకున్న ప్రైవేటు పీఏలదే పెత్తనం. అంతేకాదు షాడో ఎమ్మెల్యేగా కూడా వీళ్లే వ్యవహరిస్తుంటారు. ఆయనకు పీఏగా ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పేరు కలిగిన వ్యక్తి గతంలో కర్ణాటకలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అనంతరం రిమాండుకు వెళ్లారు. అయినా సరే మళ్లీ ఆయన్నే పీఏగా కొనసాగిస్తున్నారు.ఆ పీఏతోపాటు మరో ఇద్దరు కూడా పీఏలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏలు అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా పంచాయతీలు తీర్చడం, సెటిల్మెంట్లు చేయడంలో వారు ఆరితేరారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పదేళ్లలో వారు ఎలాంటి సమస్యను తీర్చడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. కేవలం అయ్యగారు చెప్పిందే వేదంగా పనిచేశారు. పచ్చ నేతలకే అందుబాటులో ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము ఎదుర్కొనే సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక అక్కడి ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ప్రచార రంగంలోకి మళ్లీ ఫ్యామిలీ మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ‘పురం’లో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆయన భార్య కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే భార్య అక్కడికి వచ్చి చీరలు పంచినట్టు తెలిసింది. నియోజకవర్గంలో చుట్టిముట్టేలా ప్రచారం ముమ్మరం చేసి కొత్త హామీలు ఇస్తున్నారు. త్వరలోనే కుమారుడు, కూతుళ్లను కూడా ప్రచారానికి దించబోతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు.కానీ అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని పురం ప్రజలు వాపోతున్నారు. భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తానని, రోడ్ల విస్తరణ చేపడతానని ఇచి్చన హామీలు నెరవేర్చలేకపోయారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచి్చన హామీ అలాగే ఉంది. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంలో బావను మించిపోయారనే విమర్శలున్నాయి. వాటిని అమలుపరచకపోగా మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారు. సెంటిమెంటును గౌరవించని తీరు 1985లో నటుడు, మాజీ సీఎం ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఆ కుటుంబమంటే ఇక్కడి ప్రజలకు గౌరవం. ఆ గౌరవంతోనే ఆయన కుమారులను ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ కుటుంబమంటే ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపమైంది. దీన్ని ప్రజల బలహీనతగా భావించిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడకు రావడమే మానేశారు. మేము వచి్చనా రాకపోయినా మాకే ఓటేస్తారన్న ధీమా ఆయనది. 2014లోనూ, 2019లోనూ ఇక్కడి నుంచి ఆయన్ను అసెంబ్లీకి పంపించారు. కానీ ఆయన ఇక్కడి సమస్యలను మాత్రం ‘పురం’ పొలిమేర దాటించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎప్పుడూ అక్కడి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. వేసవి వచి్చందంటే తాగునీటితో అల్లాడే ఇక్కడి ప్రజలు తమ కష్టాలు తామే తీర్చుకోవాలన్నట్టు చెబుతుంటారు. ఇదే విషయమై ఇటీవల ఓ టీడీపీ నేత ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు ఓటు వేయడం వాళ్ల అదృష్టం.ఆ అవకాశం అందరికీ రాదు . మీరు నోరు మూసుకుని చెప్పింది చేయండి’’ అని గర్జించారట. కేంద్రం నిధులిచి్చనా.. నియోజకవర్గ కేంద్రంలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. 1984 నుంచి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధీ లేదు. అమృత్ స్కీం ద్వారా టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.194 కోట్లతో పైప్లైన్ వేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీపై రూ.100 కోట్ల భారం పడింది. ఈ డబ్బుకు వడ్డీ చెల్లించేందుకు మున్సిపాలిటీ ఆదాయం సరిపోవడం లేదు. దీంతో పురం మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. -
బాలకృష్ణను ఓడించి జగనన్నకు గిఫ్ట్ ఇస్తా
-
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
‘సహనం నా బ్లడ్లోనే లేదు..’ అభిమానులపై బాలయ్య పంచుల పర్వం
-
అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
సాక్షి, సత్యసాయి: ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇవాళ్టి నుంచి బాలయ్య బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. బాలయ్య సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపైనా ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు. ఇదీ చదవండి: బాలయ్య కోపం ఎవరి మీద?.. అభిమానులు జర జాగ్రత్త! -
బాలయ్య కోపం ఎవరి మీద?
ఇప్పటిదాకా ఒక లెక్క. ఈసారి మాత్రం ఓ లెక్క. హిందూపురం కంచుకోటను బద్ధలు కొట్టి టీడీపీని ఓడించేందుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు సీటు కేటాయించింది. తద్వారా గత ఐదేళ్లలో మొక్కుబడిగా నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే నామినేషన్ల పర్వం దగ్గర పడింది కదా!. బహుశా అందుకేనేమో షూటింగ్కు బాలయ్య పేకప్ చెప్పినట్లున్నారు. ప్చ్.. హిందూపురంలో ఈసారి బాలయ్య గెలుపు కష్టమే. టీడీపీ తమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.. అదీ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న బలంగా వినిపిస్తున్న టాక్ ఇదే. ఈ నేపథ్యంలో.. శనివారం నుంచి కదిరి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి బాలయ్య సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా.. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారట. విశేషం ఏంటంటే.. ‘బాలయ్య అన్స్టాపబుల్’ పేరుతో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు. ఆ బస్సు గురించి చివర్లో ఓ ముచ్చట చెప్పుకుందాం. అది ఎన్టీఆర్ క్రేజ్ వల్లే.. హిందూపురం.. ఈ సీటు నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే.. పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణించాక జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలో హిందూపురం నుంచి పోటీ చేసి బాలయ్య ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అయితే..ఆ సమయంలో బాలయ్య 16 వేల ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లోనూ 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు ఎన్నికల్లోనూ పది శాతం ఓట్ల తేడాతో బాలయ్య నెగ్గారు. ఈ రెండుసార్లూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల కారణంగా ఓట్లు చీల్చాయి. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా బాలయ్య ‘అఖండ’ మెజారిటీ ఏం గెలవలేదు. పైగా ఈసారి బాలయ్యపై వ్యతిరేకతకు అదనంగా.. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ, రాయలసీమ ఎన్నికల బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడంతో.. బాలయ్యకు హిందూపురంలో ఈసారి టీడీపీకి గడ్డు పరిస్థితే ఎదురుకావొచ్చనే చర్చా బాగా నడుస్తోంది. దూరం దూరం.. పీఏల యవ్వారం! అభివృద్ధి పనులా?.. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ సందర్శించింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. షూటింగ్ల బిజీలతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి ధర్నాలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. మొదటి దఫాగా గెలిచిన సమయంలోనే కాదు.. ప్రతిపక్ష హోదాలో రెండోసారి కూడా అదే తీరును బాలయ్య కనబరుస్తూ వచ్చారు. అందుకే అక్కడి ప్రజల్లో ఆయన తీరుపై వ్యతిరేకత బలంగా ఉంది. అంతెందుకు.. ఇప్పుడు ఆయన చేపడుతున్న బస్సు యాత్ర హడావిడి కూడా.. ఎన్నికల నేపథ్యంలోనే అదీ సుదీర్ఘకాలం పది నెలల తర్వాత ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు అడుగులేయిస్తోన్నదే. వీటన్నింటికి తోడు ఆయన పీఏలపై వచ్చిన ఆరోపణలు ఆయన ఇమేజ్ను మరింత పల్చన చేశాయి. గతంలో హిందూపురంలో బాలయ్య తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు అభిమానులు జర జాగ్రత్త! నెలల తరబడి నియోజకవర్గంలో బాలకృష్ణ కానరాక టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి జరుగుతున్న చమక్కులు చూస్తున్నదే. అభిమానులు, కార్యకర్తలతో బాలయ్య వ్యవహరించే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల్ని నెట్టేయడం, కుదిరితే కొట్టడం.. దానిని ‘ప్రేమ’ అంటూ ప్రచారం చేసే ఎల్లో సోషల్ మీడియా పేజీలు, అభిమాన సంఘాలు అబ్బో.. ఈసారి కూడా సోషల్ మీడియా ఆ స్టఫ్ను బాగానే పంచే అవకాశమూ లేకపోలేదు. బస్సుపై బాలయ్య గుస్సా అన్స్టాపబుల్ పేరుతో ఆయన ఓ ఓటీటీలో హోస్ట్ షో నిర్వహించుకున్నారు. ఫస్ట్ సిరీస్ ఏదో బాగానే ఆడింది. కానీ, రెండోది పాపం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రచార యాత్ర బస్సుకు కూడా అన్స్టాపబుల్ అని పేరు పెట్టారు. దాని మీద ఓ మూలకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రాన్ని ఉంచారు. ఇంకోపక్కన కూటమి నేతల ఫొటోలతో పాటు బాలయ్య ఫొటోను ఉంచారు. ఇంతకీ బస్సు మీద(పోస్టర్లో) బాలయ్య గుర్రుగా చూస్తుంది ‘అలగ జాతి, సంకర జాతి’ అని అవమానించిన బ్రదర్నా?.. లేదంటే ‘మక్కీ చూస్’ అంటూ గతంలో తిట్టిపోసిన మోదీనా? ఈ రెండూ కాకుంటే.. తండ్రి నుంచి సీటు లాక్కుని, పవన్తో పొత్తుల విషయం తనతో మాట వరుసకు కూడా చర్చించకుండా, స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం టీడీపీ మెయిన్ సీట్లో కూర్చోనివ్వకుండా అడ్డుకున్న వియ్యంకుడు చంద్రబాబు నాయుడ్నా?.. -
ఘనంగా బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీ పదేళ్లు వేడుక (ఫొటోలు)
-
Nandamuri Balakrishna: ఎన్నాళ్లీ మేకప్? మీకు ప్యాకపే.!
రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న బాలకృష్ణ.. మూడోసారి రాయలసీమలోని హిందూపూరం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాయలసీమ గొప్పతనాన్ని మరిచి.. అక్కడ అంతా రక్తపాతంతో నిండి ఉంటుందని రెండున్నర దశాబ్ధాల క్రితమే తప్పుడు సంకేతాలు ఇస్తూ 'సమరసింహా రెడ్డి'తో లాభ పడ్డాడు. అప్పటి నుంచి అదే కిక్ను కొనసాగిస్తూ.. తాజాగా 'వీర సింహా రెడ్డి'తో ‘అఖండ’మైన లాభాలను పొందాడు. రాజకీయంగా, సినిమాల పరంగా రాయలసీమతో ఎంతో లబ్ధి పొందిన బాలకృష్ణ ఉండేది మాత్రం హైదరాబాద్లో... సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తూ ఎన్నికల సమయం వచ్చేసరికి హిందూపూరంలో వాలిపోతాడు. చివరకు కరోనా సమయంలో కూడా హిందూపురం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. అలాంటి కష్ట సమయంలో కూడా ఆయన భాగ్యనగరంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు రాగానే హిందూపురం వచ్చి ప్రజలకు మేకప్ వేసే పనిలో ఉన్నాడు. కానీ ఈ సారి మేమే బాలయ్యకు ప్యాకప్ చెప్పేస్తామని అంటున్నారు అక్కడి ప్రజలు. 30 ఏళ్లకు పైగా అక్కడ టీడీపీనే.. ప్రజలకు చేసింది శూన్యం 1983 నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి 16 వేల ఓట్లతో గెలుస్తే.. 2019 ఎన్నికల్లో మాత్రం 17వేల ఓట్లతో నెగ్గారు. మొత్తం 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న హిందూపురం నియోజక వర్గానికి ఇప్పటి వరకు టీడీపీ చేసిన అభివృద్ధి శూన్యం. దీనికి ప్రధాన కారణం బాలయ్య అనే చెప్పవచ్చు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలను ఏడాదికి ఒక్కసారి అయినా పలకరించిన దాఖలాలు లేవు. ఇక ఎమ్మెల్యేగా బాలకృష్ణ పనితీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. ఆయన సమయం అంతా సినిమా షూటింగ్స్కే కేటాయించడానికి సరిపోతుంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే.. ఎప్పుడో తనకు బుద్ది పుడితే అడపాదడపా హిందూపురం వెళ్లి హల్చల్ చేసే వారు. ఆ సమయంలో మందీమార్బలాన్ని పెట్టుకుని బైకు తోలుతూ, ఎద్దులబండి తోలుతూ.. బాలకృష్ణ సర్కస్ ఫీట్లు చేసే వారు. కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో బాలకృష్ణ హిందూపురం వైపు వెళ్లడం అనేది జరిగింది లేదు. బాలయ్యకు వార్నింగ్ బెల్స్ 30 ఎళ్లుగా టీడీపీ వెంట నడిచిన హిందూపురం ప్రజలకు బాలకృష్ణ చేసిన మంచిపని ఒక్కటి కూడా లేదు. అందుకే హిందూపురం పరిధిలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా అక్కడి ప్రజలు ఓడించారు. టీడీపీ గతంలో అధికారంలో లేని సమయంలో కూడా హిందూపురం మున్సిపాలిటీని ఆ పార్టీ నిలుపుకునేది. ఉనికిని గట్టిగా చాటుకునేది. అయితే బాలకృష్ణ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి నెగ్గినా కూడా మున్సిపల్, ఇతర స్థానిక ఎన్నికల్లో దారుణమైన ఓటమిని టీడీపీ చూసింది. దీనంతటికి కారణం బాలకృష్ణ అనే చెప్పవచ్చు. గెలిపించిన ప్రజల కోసం నిలబడకుండా.. నిత్యం సినిమా షూటింగ్స్లతో బాలయ్య బిజీగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గం బాధ్యతలను ఆయన పీఏలు చూసుకుంటూ వచ్చారు. డబ్బులు దోచుకోవడం..దోచుకున్నది పంచుకోవడం తప్ప ఆ పీఏలు చేసిందేమి లేదు. దీంతో అక్కడ ప్రజల్లో బాలయ్యపై తీవ్రమైన వ్యతిరేఖత రావడం మొదలైంది. అందుకే గత మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో హిందూపురం ప్రజలు టీడీపీని చావుదెబ్బ కొట్టారు. ఇదే రేంజ్లో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణకు ఇదేగతి పడుతుందని హిందూపురం ప్రజల నుంచి వార్నింగ్ బెల్ మోగింది. టీడీపీ ఎన్ని ఎత్తులు వేసిన ఈసారి బాలకృష్ణ గెలుపు కష్టమే అని చెప్పవచ్చు. సినిమాలకే బాలయ్య ఓటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య 2014లో ఎంపికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు..? నమ్మి గెలిపించిన ప్రజల కోసం అండగా నిలబడుతారు. కానీ బాలయ్య ఆ పని చేయలేదు. తన పంతాను మార్చుకోకుండా సినిమాలతోనే తన 10 ఏళ్ల ఎమ్మెల్యే కాలాన్ని పూర్తిచేశారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగుతూనే 12 సినిమాలు విడుదల చేసి 13వ చిత్రం కూడా షూటింగ్ పనులు కానిచ్చేశారు. సినిమాలతో పాటు ఓటీటీ షోలతో బాలకృష్ణ చాలా బిజీగా కాలం వెళ్లదీశారు. తను ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మరిచినట్టుగా ఉన్నారు. 2014-2024 వరకు ఎమ్మేల్యేగా పదేళ్ల కాలం పదవిలో ఉంటూనే 13 సినిమాలు తీసిన బాలకృష్ణ.. పదవి లేకుండా అంటే 2004-2014 వరకు 14 సినిమాలు విడుదల చేశారు. ఈ లెక్కలు చాలు హిందూపురం ప్రజలకు బాలకృష్ణ ఏ మాత్రం అందుబాటులో ఉంటున్నాడో చెప్పడానికి అని నెటిజన్లు లెక్కలతో సహా చెబుతున్నారు. అందుకే ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత హిందూపురంలో చాప చుట్టేసి.. అక్కడ ప్రజలను గాలికొదిలేసి సినిమాలకు తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలతో అయినా న్యాయం చేశారా..? బాలకృష్ణకు ప్లాపులు పడితే చాలు రాయలసీమ బ్యాక్డ్రాప్ పేరుతో సినిమా తీస్తాడు. అందులో సీమ గురించి తక్కువ చేస్తూ చూపించడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. రాయలసీమంటే రక్తపాతం.. అక్కడ అందరూ వికృతంగా కనిపిస్తారని తన సినిమాలో చూపించడం. రాక్షసుల్లాంటి వాళ్లందరూ ఆ ప్రాంతంలో ఉంటారని చెప్పడం. అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదని చెప్పడం. వాళ్లందర్నీ నరికినరికి చంపేది బాలకృష్ణ ఒక్కడే అన్నట్లు చూపిస్తాడు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించేది రాయలసీమలోని హిందూపురం. గతంలో తన తండ్రి అదే నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎన్నికైన వ్యక్తి. బాలకృష్ణ వియ్యంకుడు పుట్టి పెరిగింది కూడా రాయలసీమలోనే.. ఇవన్నీ ఆయన కంటికి కనిపించకపోవడం బాధాకరం. తనకు రాయలసీమ సినిమా జీవితాన్ని ఇస్తే.. అదే ప్రాంతానికి చెందిన హిందూపురం రాజకీయ భిక్ష పెట్టింది. అలాంటి ప్రాంత ప్రజలనే చిన్నచూపు చూసే బాలకృష్ణకు ఈసారి ఎన్నికల్లో హిందూపురం ప్రజలు తగిన బుద్ధి చెప్పడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. -
చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలయ్య కలిసి నటించిన ఏకైక మూవీ!
మల్టీస్టారర్ సినిమాలంటే జనాలకు మహా క్రేజు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటివరకు మల్టీస్టారర్ సినిమాలకు ఢోకా లేదు. ఇద్దరు హీరోల కాంబినేషన్ ఎలా ఉందో చూడాలని అభిమానులు తెగ ముచ్చటపడుతుంటారు. అయితే అప్పట్లోనే నలుగురు స్టార్ హీరోలు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ కలిసి నటించారు. వీళ్లంతా కలిసి ఏ సినిమా చేశారా? అని ఆలోచిస్తున్నారా? ఆ మల్టీస్టారర్ మూవీ ఇదే ఒకరు హీరోగా నటిస్తే.. మిగిలిన ముగ్గురు అతిథులుగా మెరిశారు. ఆ సినిమా పేరే త్రిమూర్తులు. ఇందులో వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించారు. ఖుష్బూ, శోభన, అశ్విని హీరోయిన్లుగా నటించారు. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ సినిమాలో మెగాస్టార్, కింగ్ నాగ్, బాలయ్య గెస్టులుగా కనిపించారు. వీరు మాత్రమే కాదు. ఇండస్ట్రీ అంతా దిగింది. అతిరథులంతా ఇందులోనే కృష్ణ, విజయ నిర్మల, కృష్టంరాజు, చంద్రమోహన్, మురళీ మోహన్, విజయశాంతి, పద్మనాభం, రాధ, భానుప్రియ, శారద, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై.విజయ.. ఇలా పలువురు సెలబ్రిటీలు కనిపించారు. ఇంతమంది నటించిన ఏకైక సినిమా త్రిమూర్తులు అనే చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ అవలేదు. భారీ తారాగణం ఉన్నప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేనట్లు అర్థమవుతోంది. టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బప్పి లహరి సంగీతం అందించాడు. ఐదు పాటలకు వేటూరి సుందరరామమూర్తి లిరిక్స్ అందించాడు. ఇది హిందీ మూవీ నసీబ్కు రీమేక్గా తెరకెక్కింది. చదవండి: అక్క భర్తతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను: జయలలిత -
హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్
హీరో బాలకృష్ణ గురించి చెప్పగానే చాలామంది ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన ప్రవర్తన. ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. బయటనే కాదు సెట్లోనూ ఇలా కొట్టడాలు జరుగుతుంటాయని విన్నాం. కానీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ చెప్పడంతో ఇది నిజమని తేలిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్.. పలు సినిమాలు తీశాడు. తెలుగులో బాలయ్యతో కలిసి 'జై సింహా', 'రూలర్' చిత్రాలు చేశాడు. కానీ ఈ రెండూ ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. అయితే షూటింగ్ సందర్భంగా ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడని చెప్పారు. అలానే తన అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడని చెబుతూ అప్పటి విషయాన్ని చెప్పాడు. తాజాగా 'గార్డియన్' అనే తమిళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బాలయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. (ఇదీ చదవండి:పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) 'షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతాడు. అలా ఓ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నా అసిస్టెంట్ శరవణన్ని ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దీంతో శవరణన్ కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు' 'మళ్లీ ఆయన శరవణన్ని ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి.. సర్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా సరే కూల్ కాలేదు. వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్కి అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త స్థిమిత పడ్డాడు' అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం చెబుతున్నంతసేపు స్టేజీపైన ఉన్న హీరోయిన్ హన్సికతో పాటు మిగతా వాళ్లందరూ నవ్వుతూనే ఉన్నారు. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..) -
పచ్చ నేతల ప్రలోభ పర్వం
హిందూపురం అర్బన్/చిలమత్తూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. స్థానిక నేతల ద్వారా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. క్లస్టర్, బూత్ లెవెల్ కన్వీనర్ల కనుసన్నల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే, చాలాచోట్ల ప్రజల నుంచి వారికి చుక్కెదురవుతోంది. చిలమత్తూరు మండలంలోని అప్పనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేస్తుండగా... సుధాకర్ అనే రైతు వారికి చీవాట్లు పెట్టాడు. ‘ఏమి చేశారని మాకు చీరలు ఇచ్చేందుకు వస్తున్నారు? ఏదైనా మంచి చేసి అప్పుడు పంపిణీ చేయండి. ఎన్నికలు వస్తేనే చీరలు పంచుతారా?! ఇదొక్కటి చేస్తే ఓట్లు పడవు. మంచి చేసిన వారికే ప్రజలు ఓట్లు వేస్తారు. మీలాంటి వాళ్లకు కాదు’ అని ఆయన చురకలు అంటించారు. దీంతో వారు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. రాత్రికి రాత్రే పంపిణీ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రాత్రిపూట చీరల పంపిణీ చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే చీరలు పంచేందుకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే మొదలుపెట్టారు. ఈసారి మహిళా ఓట్లు పడవని నిర్ధారణకు వచ్చారో ఏమో తెలియదు కానీ హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో క్లస్టర్, బూత్ కనీ్వనర్ల కనుసన్నల్లో మహిళా ఓటర్లకు చీరల పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 2,46,463 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 1,22,471 మంది ఉన్నారు. ఇందులో లక్ష మందికైనా చీరలు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటోతో ఉన్న బ్యాగులో చీరలు ఉంచి మహిళలకు అందిస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ పంపిణీ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే లేపాక్షి మండలంలోని తిలక్ నగర్, నాయనపల్లి, లేపాక్షి, కంచిసముద్రం, చోళసముద్రం, హిందూపురం రూరల్ మండలంలోని బేవనహళ్లి, చౌళూరు, మనేసముద్రం, చిలమత్తూరు మండలంలో సోమఘట్ట, చాగలేరు, కోడూరు, చిలమత్తూరు, దేమకేతేపల్లిలో పంపిణీ పూర్తి చేశారు. టేకులోడు, తుమ్మలకుంట, వీరాపురంలో రెండు రోజుల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈసారి నందమూరివారి కంచుకోట బద్ధలవ్వడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన బాలకృష్ణ పీఏలు ఈ సమాచారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితులలో చీరలు పంపిణీ చేసి మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాఫలించవని ప్రజలు అంటున్నారు. -
చంద్రబాబు, బాలయ్యకు కొత్త కష్టాలు.. జూనియర్ ఎన్టీఆర్తో ఎఫెక్ట్?
జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించినా.. ఫోటో కనిపించినా నారా, నందమూరి కుటుంబాలు వణికిపోతున్నాయి ఎందుకు? నాయకత్వ లక్షణాలు లేని కొడుకును తలచుకుని చంద్రబాబు, అల్లుడిని గుర్తు చేసుకుకుని బాలయ్య ఆందోళన చెందుతున్నారా? ఎప్పటికైనా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్తోనే ప్రమాదమని భయపడుతున్నారా? హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య ఎందుకు ఆదేశాలు జారీ చేశారు?.. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే చంద్రబాబు బాలకృష్ణ ఉలిక్కిపడుతున్నారు. జూనియర్ ఫ్లెక్సీలు చూసినా, జెండాలను చూసినా వారు వణికిపోతున్నారు. అవి తమ కంటికి కనిపించకుండా తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సభలు, సమావేశాలు అంటూ చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు. చంద్రబాబు సభల్లో జూనియర్ అభిమానులు జెండాలు పట్టుకుని ప్రత్యక్షమవుతున్నారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కుప్పంలో సైతం చంద్రబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. జూనియర్ సీఎం.. సీఎం అంటూ ఆయన అభిమానులు చేస్తున్న నినాదాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. తన కుమారుడు లోకేష్కు భవిష్యత్తులో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్తో పోటీ తప్పదని భావించిన చంద్రబాబు ఎక్కడా జూనియర్ పేరు వినపడకుండా జాగ్రత్త పడుతున్నారు. వ్యూహాత్మకంగానే పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి పాత్ర లేకుండా చేసేశారు చంద్రబాబు. రోజురోజుకు బలహీన పడుతున్న పార్టీలోకి జూనియర్ను తీసుకురావాలనే సూచన చేసిన బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నేతలకు చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. చంద్రబాబే కాదు జూనియర్ని చూసి బాలకృష్ణ కూడా ఆందోళన చెందుతున్నారు. తన అల్లుడు లోకేష్కు జూనియర్ నుంచి పోటీ తప్పదని భావించిన బాలకృష్ణ జూనియర్ను నందమూరి కుటుంబానికి కూడా దూరం చేశారు. కుటుంబంలో జరిగే మంచి చెడుల కార్యక్రమాలకు సైతం పిలవడం మానేశారు. కుటుంబంలో మిగతా సభ్యులు కూడా జూనియర్తో కలవకుండా కట్టడి చేశారు. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రక్తం పంచుకు పుట్టిన అన్న హరికృష్ణ కుమారులని కూడా చూడకుండా బాలయ్య వారి మీద విద్వేషం వెళ్ళగక్కుతున్నారు. వారి సినిమాలపై టీడీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తూ.. సినిమాలు ప్లాప్ అంటూ రివ్యూలు రాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తీసివేయాలని బాలకృష్ణ హుకుం జారీ చేశారు. అవసరం ఉన్నన్ని రోజులు హరికృష్ణను, జూనియర్ను వాడుకున్న చంద్రబాబు, బాలకృష్ణలు తర్వాత వారిని కరివేపాకులా పక్కన పెట్టేశారు. ఎన్టీఆర్ ఎపిసోడ్లో హరికృష్ణను అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చిన చంద్రబాబు.. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి సీటు లాక్కున్నారు. హరికృష్ణ అవసరం తీరాక అనేక రూపాల్లో అవమానించి మానసికంగా వేధించారు. సమైక్య ఆంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినా మళ్లీ టీడీపీ నుంచి ఎటువంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు. పొలిట్బ్యూరో సభ్యునిగా హరికృష్ణను తొలగించి ఆయన స్థానంలో తన వియ్యంకుడు బాలకృష్ణను తీసుకువచ్చారు. హరికృష్ణ తరహాలోనే జూనియర్ని కూడా వాడుకుని వదిలేసారు. జూనియర్తో ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబు తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇదంతా భవిష్యత్తులో తన కుమారుడు లోకేష్కు జూనియర్ పోటీగా ఎదుగుతాడనే భయంతోనే అటు చంద్రబాబు ఇటు బాలకృష్ణ జూనియర్ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
హనీ పాప అదిరిపోయే లుక్.. ఈసారి ట్రీట్ మామూలుగా లేదుగా!
బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఈ కేరళ కుట్టి ముద్దుగుమ్మ మలయాళంలో '14 వయదిల్ బాయ్ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా 2004లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్లో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. గతేడాది బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవల డిఫరెంట్ లుక్లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేసే కేరళ భామ గతంలోనూ డిఫరెంట్ లుక్స్లో కనిపించింది. తాజాగా ఓ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. డంబెల్తో కసరత్తులు చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ న్యూ లుక్ చూశారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఇలాగే స్టన్నింగ్ లుక్లో కనిపించి ఫ్యాన్స్కు షాకిచ్చిన మలయాళీ భామ.. మరోసారి అదిరిపోయే ట్వీట్ ఇచ్చింది. ఈ సారి ఏకంగా జిమ్ డ్రెస్లో స్టేజీపై అదరగొట్టేసింది. Clicks 📸 pic.twitter.com/n0o6Mofw94 — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 Any fitness tips? 😋 pic.twitter.com/vkRHgg2NUR — Honey Rose (@HoneyRoseNET) January 23, 2024 💪🚶♀️ pic.twitter.com/uW9oEnyWA9 — Honey Rose (@HoneyRoseNET) January 22, 2024 -
బాలకృష్ణకు తిక్క రేగింది..జూనియర్ ను చూస్తే ఫియర్ ఎందుకు ?
-
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూస్తే బాబు బ్యాచ్ కి ఎందుకంత దడుపు జ్వరం ?
-
అబ్బాయి క్రేజ్ చూసి కుళ్లిపోతున్న బాబాయ్..
-
ఆరోజు బ్రాహ్మణి గురించి అడిగితే చంద్రబాబు ఛీఛీ అన్నాడు..
-
కోపంతో ఊగిపోయిన బాలయ్య
-
లోకేష్ పెళ్లిపై చంద్రబాబు నాన్సెన్స్ అన్నారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్ పెళ్లి అంశంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చంద్రబాబు అనేవారు. నాన్సెన్స్ అని నన్ను తిట్టేవారు. కానీ, తర్వాత బాలకృష్ణ కూతురును నారా లోకేష్కు ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని చెప్పుకొచ్చారు. కాగా, యార్లగడ్డ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదు. తారక్పై ఎవరు విమర్శలు చేస్తే అది వారికే నష్టం. గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబును అడిగాను. నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు. తర్వాత లోకేష్కు బాలకృష్ణ కూతురినిచ్చి చంద్రబాబు వివాహం చేశారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. సీఎం జగన్పై పిచ్చి కేసులు పెట్టారు. లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు. సీఎం జగన్ ఒక హీరో. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అలాంటి నేత దేశంలో మరొకరు లేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు గుండెల్లో...జూనియర్ పేలుస్తున్న బాంబు..!
-
Balakrishna Vs Jr NTR: రక్తసంబంధాన్ని కూడా లెక్కచేయని బాలకృష్ణ.. ఎందుకీ చర్య..?
సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా మరోసారి జూ. ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నేడు తెల్లవారుజామున జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్ బ్రదర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత బాలకృష్ణ కూడా తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ తారక్, కల్యాణ్ రామ్లు ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని బాలకృష్ణ హుకుం జారీ చేశాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు వాటిని తొలగించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి వంశంలో ఒంటరిగా మిగిలిన తారక్ ఈ క్రమంలో తారక్ను నందమూరి ఫ్యామిలీ ఒంటరిని చేసిందని సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతర సోదరులు, అక్కాచెల్లెళ్ల పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్తో ఎలాంటి రక్తసంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు కూడా జూనియర్ ఎన్టీఆర్కు ఉంది. కానీ తన బావ చంద్రబాబు రాజకీయం కోసం, తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం నెత్తుటి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడు. తారక్ను ఎప్పటికైనా ఒంటరిగానే మిగల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు. నాడు ఎన్టీఆర్ ఘాట్ పరిస్థితి ఎలా ఉండేది ..? విడ్డూరుం కాకపోతే.. ఎలాంటి విలువలు లేని పవన్ కల్యాణ్ కావాలి గానీ సొంత కుటుంబసభ్యుడు అయిన తారక్ మాత్రం పనికిరాకుండా పోయాడా..? తాతకు సిసలైన మనమడిగా మిగిలింది తారక్ మాత్రమే కదా..? అంటూ బాలయ్య తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘాట్లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరూ లేకపోతే, జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకొని తన వాళ్లతో జయంతికి, వర్ధంతికి అక్కడ అలంకరణ చేయిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డు అయిపోయాయని పీకి పారేస్తున్నారంటే ఎంతటి దుర్మార్గపు చర్య. తన తాత సమాధి వద్ద తారక్ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన నష్టమేమిటి? జీఎచ్ఎంసీ సిబ్బంది మాదిరి ప్లెక్సీలు తొలగించమని ఆదేశించడం ఏంటి..? ఏ హక్కుతో వాటిని తొలగించారు..? అసలు ఎన్టీయార్ ఘాట్ వద్దకు ఎవరు రావాలి..? ఎవరు రాకూడదు..? అని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు..? అక్కడ ఎవరి బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలయ్యకు హక్కు ఎక్కడిది..? నందమూరి తారకరామారావు అనే వ్యక్తి అందరివాడు. ఆయన ఎవరి సొత్తు కాదు. ఎంటో బాలయ్య మాదిరే ఆయన మాటలు కూడా ఏ మాత్రం ఎవరికీ అర్థం కావు. ఏదేమైనా నందమూరి వంశంలో తారక్ను ఒంటరిని చేయాలనే చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి. అందుకే ఇంత జరిగినా తన రక్త సంబంధీకులు ఎవరూ నోరెత్తి కూడా తిరిగి మాట్లాడటం లేదు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం మేమున్నాం అంటూ #WeStandWithNTR అనే హ్యాష్ ట్యాగ్తో పాటు #EndOfTDP అంటూ వారు వైరల్ చేస్తున్నారు. జై లవకుశ చిత్రంలోని డైలాగ్స్ షేర్ చేస్తున్న ఫ్యాన్స్ జై లవకుశ చిత్రం నుంచి తారక్ చెప్పిన డైలాగ్స్ను కూడా వారు వైరల్ చేస్తున్నారు. అందులో 'మనం అనేది అబద్ధం.. నేను అనేది నిజం. ప్రేమను పగగా మార్చింది మీరే.. మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను' అనే డైలాగ్స్ గుర్తు చేస్తూనే.. గతంలో ఎన్నికల కోసం తారక్ను ఎడాపెడా వాడేసుకున్నారని చంద్రబాబు అండ్ తెలుగుదేశం బ్యాచ్పై తారక్ ఫ్యాన్స్ విరుచుకుపడపుతున్నారు. తారక్లో ఫైర్ను గుర్తించిన చంద్రబాబు తన కుమారుడికి ఎక్కడ అడ్డు వస్తాడో అని పక్కకు తప్పించే ఎత్తుగడ ఎప్పుడో వేశాడంటూ వారు గుర్తుచేస్తున్నారు. ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్కు తారక్ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబులో భయం పట్టుకుంది. చంద్రబాబు కన్నింగ్ గేమ్ను అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీని వదిలేశాడు. చివరకు తన సోదరి అయిన నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టినా కూడా తను ప్రచారం చేయలేదు. అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్ దూరం అయ్యాడు. లేని వారసత్వం కోసం లోకేష్ను తెరపైకి తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్తో రక్తసంబంధంలో చంద్రబాబు చిచ్చిపెట్టాడు. అందులో భాగంగానే తారక్ నందమూరి వంశంలో నేడు ఒంటరిగా మిగిలాడని చెప్పవచ్చు. Politics aside, extending our Support to @tarak9999 anna and his fans in this hour of need. 🙌🏻 Stay Strong! Shame on #Balakrishna And Yellow Media😒#WeStandWithNTR #NTR #JrNTR pic.twitter.com/lbTSOFY7vr — smily.chinnu❤️❤️ (@Ishwarya225) January 18, 2024 This is how TDP works CBN didn't support Jr.NTR in Politics. But they need his support in this phase. If they doesn't get any response they start abusing.#WeStandwithNTR in this struggle phase where TDP Leaders and Social Media wantedly targeting Stay Strong @tarak9999 Garu pic.twitter.com/TC0XD8pcSe — Møhámmêd Âfzál محمد افضل (@ShaikAfzal_YSJ) January 18, 2024 We Stand With You @tarak9999 Anna 🥹❤️#WeStandWithNTR #JrNTR #BalaKrishna #EndOfTDP pic.twitter.com/rroN9hSqjI — UrstrulyNani ™ (@Urstrulynanii_) January 18, 2024 -
బాలకృష్ణ ఆశ..జూ.ఎన్టీఆర్ బొచ్చు కూడా పీకలేరు..
-
తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు)
-
వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా మమ్మల్నేమి చేయలేరు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement