-
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!
వృత్తీరీత్యా చెఫ్గా పదిమందికి భోజనం పెట్టిన ఆమె విధి శాపమో లేక కర్మఫలమో గానీ కడుపు నిండా తినడం కష్టమయ్యే అరుదైన వ్యాధి బారిన పడింది. కనీసం గుప్పెడు మెతుకులు నోట్లో పెట్టుకోవాలంటే అల్లాడిపోయేది. నిజానికి కేన్సర్ నుంచి బయటపడేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స ఆమె పాలిట మృత్యువుగా మారింది. చివరికి ఆ వ్యాధితో పోరాడుతూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ నటాషా దిద్దీ(50) వృత్తి రీత్యా చెఫ్. రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించేది. ఏమోందో ఏమో గానీ 2019లో కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆమె కడుపులో కణుతులు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో వైద్యులు ఆ కేన్సర్ మొత్త వ్యాపించకుండా ఉడేలా మొత్తం కడుపు భాగానే తొలగించారు. ఆమె పొట్ట భాగం లేకపోవడంతో ఆహారాన్ని జీర్ణించుకోవడం ఆనేది సమస్యత్మకంగా మారింది. ఆ క్షణం నుంచే ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారిపోయింది. వైద్యులు చిన్న మీల్స్ తినమని సూచించినా..అది తినడమే మహానరకంగా ఉండేది నటాషాకి. అలా ఆమె ప్రాణాలతో పోరాడుతూ మార్చి 24న తుదిశ్వాస విడిచింది. ఆమె పలు ఇంటర్యూల్లో తాను డంపింగ్ సిండ్రోమ్తో పోరాడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా కడుపులోని ఆహరం స్పీడ్గా కదిలి జీర్ణంకాకమునుపే ప్రేగుల్లోకి వెళ్లిపోతుంది. దీని దుష్ప్రభావం కారణంగా అలసట, చెమటలు పట్డడం, విపరీతంగా ఆవులించడం వంటి సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని వాపోయింది కూడా. డంపింగ్ సిండ్రోమ్ అంటే.. కడుపులో జీర్ణక్రియం సక్రమమైన పద్ధతిలో జరగుతుంది. అలాకాకుండా అనియంత్రంగా కడుపులో పడ్డ ఆహారం వేగంగా కదిలితే దాన్ని 'గ్యాస్ట్రిక్ చలనశీలత' అంటారు. ఆహారం కండరాలు, నరాలు, హార్మోన్లు సంకేతాలతో నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అలాగాకుండా అనియంత్రంగా త్వరితగతిన తిన్న ఆహారం పోట్టలో ఖాళీ అయిపోతుందంటే.. ఇక్కడ పైలోరిక్ వాల్వ్ తెరుచుకుని కడుపులోని ఆహారం బయటకు పోతుందని అర్థం. అంటే..ఇది చిన్న ప్రేగు తక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో తలెత్తే సమస్య ఇది. మాములుగా అయితే చిన్నప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేసేలోపు మిగతా అవయవాలు ఆహారం నెమ్మదిగా కదిలేలా సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడు అది చక్కగా వంటబడుతుంది. మనకు హాయిగా ఉంటుంది. అలాగాకుండా ఆహారం వేగంగా కదిలితే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అర్థం. ఎవరు బాధపడతారంటే.. కడుపుకి సంబంధించిన శస్త్ర చికిత్స కారణంగా ఈ డంపింగ్ సిండ్రోమ్ లక్షణాలను అభివృద్ధి చేస్తారు. గ్యాస్ట్రెక్టమీ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వంటి కడుపులోని పెద్ద భాగాలను తొలగించే లేదా బైపాస్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులలో కూడా ఇది సాధారణం. నిజానికి ఈ డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ..ఒక్కోసారి కొన్ని కేసుల్లో తీవ్రమై..బరువు తగ్గి, పోషకాహార లోపాలను ఎదుర్కొనవల్సి వస్తుంది. దీన్ని స్వీయ సంరక్షణతో నయం చేసుకోవచ్చు. చాలామందికి తేలికపాటి లక్షణాలే ఉండి క్రమేణ తగ్గుముఖం పడతాయి. కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వాంతులు అవుతున్నాయి అతిసారం ఉదరం మరియు తీవ్రమైన తిమ్మిరిలో నొప్పి ఉబ్బరం డిజ్జి అక్షరములు హృదయ స్పందన రేటును వేగవంతం చేయడం బలహీనత అలసట చల్లని చెమటలు ముఖం ఎర్రబడుతోంది మెదడు అలిసిపోవడం ఆకలి (చదవండి: ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
పెళ్లయిన 18 ఏళ్లకు విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ జంట!
పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ జంట విడాకుల దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్- నటాషా మాద్వానీ విడిపోయినట్లు ఓ ప్రచారం నెట్టింట వైరల్గా మారింది. నటుడు ఫర్దీన్ ఖాన్ ప్రముఖ నటి ముంతాజ్ కూతురు నటాషాను 2005 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి దియాని ఇసబెల్లా ఖాన్(10) అనే కూతురు, అజారియస్ ఫర్దీన్ ఖాన్(6) అనే కుమారుడు ఉన్నారు. సుమారు ఏడాదికాలంగా దంపతులిద్దరూ విడివిడిగానే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకోలేని క్రమంలో విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే గతేడాది ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో ఫర్దీన్ ఖాన్ మాట్లాడుతూ.. '2011లో మేము లండన్ షిఫ్ట్ అయ్యాం. సంతాన సమస్యలు ఉండటంతో అక్కడ ఓ డాక్టర్ను సంప్రదించాం. ఐవీఎఫ్(ఇన్వెట్రో ఫర్టిలైజేషన్) ద్వారా నటాషా గర్భంలో కవలలు ప్రవేశించారు. కానీ ఆరో నెలలోనే వారిద్దరూ కడుపులోనే ప్రాణాలు వదిలారు. త్వరలో ఇద్దరు పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ఆడించబోతున్నామన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న మాకు ఈ వార్త అశనిపాతంలా తాకింది. నటాషా ఎంతగానో కుమిలిపోయింది. తర్వాత మాకు పాప పుట్టింది. అప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత పాప మా జీవితాల్లోకి రావడంతో మా మనసంతా తేలికయిపోయింది' అని ఫర్దీన్ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్ త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విస్ఫట్ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్లో అతడు నటించనున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఆయన చివరిసారిగా 2010లో వచ్చిన దుల్హా మిల్ గయా సినిమాలో కనిపించాడు. చదవండి: రాఘవ లారెన్స్ సినిమా ఆడిషన్స్కు వెళ్తే డైరెక్టర్ అలా చేయమని బలవంతం!: నటి ప్రియుడి కోసం పేరు మార్చుకున్న జ్యోతి రాయ్? జగతి మేడమ్ రెండో పెళ్లి -
భార్యతో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్! మరీ..
Hardik Pandya And Natasa Stankovic: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘మీ పద్ధతి బాగాలేదు.. అందరి ముందు ఇలాంటివి అవసరమా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఫైనల్ రిజర్వ్ డే జరుగగా.. అహ్మదాబాద్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక తుదిపోరులో టైటాన్స్ను ఓడించిన ధోని సేన ఐదోసారి చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. క్యాష్రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విరామ సమయం దొరికింది. ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు రోహిత్ సేన లండన్కు వెళ్లగా.. ఈ ఆల్రౌండర్కు రెస్ట్ లభించింది. దీంతో తన సమయాన్నంతా కుటుంబానికే కేటాయించాడు. ఇందులో భాగంగా భార్య నటాషా స్టాంకోవిక్, కుమారుడు అగస్త్యతో కలిసి థాయ్లాండ్ ట్రిప్నకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఆమె పంచుకున్న చిత్రాలే పాండ్యా దంపతులపై నెటిజన్ల ట్రోలింగ్కు కారణమయ్యాయి. హార్దిక్- నటాషా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలపై కొంతమంది ఆకతాయిలు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?’’ అంటూ ముఖ్యంగా నటాషా డ్రెస్సింగ్ను తప్పుపడుతున్నారు. అయితే, పాండ్యా అభిమానులు మాత్రం.. ‘‘వాళ్లు భార్యాభర్తలు. ఎలా ఉంటే మీకేంటి? నటాషా వేసుకున్న డ్రెస్పై మీ అభ్యంతరాలేమిటి? పని చూసుకోండి’’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. కాగా జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్ టూర్తో హార్దిక్ పాండ్యా మళ్లీ బిజీ కానున్నాడు. ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ వారసుడు, భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు! అసలు రహానే ఏం చేశాడని ఆ బాధ్యతలు? మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
థాయ్లాండ్లో ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Hardik Pandya and Natasa Stankovic Holiday: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా హాలీడే మూడ్లో ఉన్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు. ఈ క్రమంలో భార్య నటాషా, కొడుకు అగస్త్యతో కలిసి థాయ్లాండ్లో వాలిపోయాడు. ఫుకెట్లో కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. భార్యా, కొడుకుతో స్విమ్మింగ్పూల్లో జలకాలాడుతూ సేదతీరుతున్నాడు. నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తూ ఈ ముగ్గురూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలను హార్దిక్ భార్య నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అగస్త్య ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. రన్నరప్తో సరి కాగా ఐపీఎల్-2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకుంది. అయితే, అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ధోని సేన ఐదోసారి చాంపియన్గా అవతరించగా... వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న టైటాన్స్కు నిరాశే మిగిలింది. విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ సారథిగా! ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో తలపడింది. దీంతో ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదితరులు ఇంగ్లండ్కు వెళ్లగా.. హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విశ్రాంతి లభించింది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేన.. జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం హార్దిక్ పాండ్యా మరోసారి మైదానంలో దిగనున్నాడు. విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు పాండ్యా సారథ్యం వహించే అవకాశం ఉంది. చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
Yoga Day: యోగా.. కొత్త కొత్తగా
యోగా నిపుణులు, సాధకులు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో తమ ఉనికిని కొత్తగా చాటుతున్నారు. వారి నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వారి మాటలు, ఉత్సాహం ఆకర్షణీయంగా మార్చే సుగుణాన్ని కళ్లకు కడుతున్నాయి. యోగా ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను రెండింటినీ అద్భుతంగా మారుస్తుంది. రోజువారి జీవనంలో యోగా ఒక భాగం అవడానికి ఇన్ఫ్లుయెన్సర్లు మరిన్ని హంగులు అద్దుతున్నారు. శాస్త్రీయ యోగాభ్యాసం ద్వారా వేగవంతమైన ఆధునిక యుగానికి తమను తాము గొప్ప స్ఫూర్తిగా మార్చుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి ఎంతోమంది మహిళలు యోగా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. వారి నుంచి ఎంతో ప్రేరణను పొందవచ్చు. ఈ రోజు నుంచే యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి ప్రభావం శిల్పా శెట్టి భారతదేశంలో అత్యంత ప్రభావ వంతమైన ఫిట్నెస్ ఐకాన్స్, యోగా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరుగా నిలిచింది శిల్ప. ఐదుపదులకు చేరువలో ఉన్న శిల్ప యోగా కోసం చాలా కాలం శిక్షణ పొందారు. తీరైన శరీరాకృతిని పొందడానికి, దైనందిన జీవనంలో వ్యాయామాన్ని చేర్చడానికి ఫిట్నెస్ ఫిల్మ్లు రూపొందించింది. యోగాకు సంబంధించిన డీవీడీలను కూడా రిలీజ్ చేసింది. కొన్ని జీవన శైలి మార్పులు మనలో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో చూపించడానికి సోషల్మీడియాను ఉపయోగిస్తుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్కి 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ యోగానుప్రోత్సహించడంలో శిల్ప చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆమె వ్యాయామం చేసే విధానం, తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గృహిణులకు స్ఫూర్తినిస్తుంది. యోగా సౌందర్యం దీపికా మెహతా రోజును యోగాసనాలతో కొత్తగా ్రపారంభించాలనే ఆలోచనను దీపికా మెహతా కళ్లకు కడుతుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా యోగా లో కళా దృష్టి ఉంటుందని చూపుతుంది. ‘రెండు దశాబ్దాల క్రితం మరణం అనుభవాన్ని చవిచూశానని, యోగా పునర్జీవితాన్ని ఇచ్చింద’ని చెబుతుంది. రాక్ క్లైంబింగ్ ప్రమాదం తర్వాత ఆమె ఇకపై నడవలేదని వైద్యులు అంచనా వేశారు. యోగా ట్రైనర్, అష్టాంగ యోగా స్పెషలిస్ట్ అయిన దీపికా యూ ట్యూబ్ ఛానెల్ కి దాదాపు 4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె చూపే యోగా ప్రతిభ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు యోగా గురూగా మారింది. లోపాలను సరిదిద్దుతూ... సునయన రేఖీ యోగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్గా సునైనా రేఖీ తనను తాను కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పేరొందిన యోగా ట్రైనర్లలలో సునయన ఒకరు. రిషీకేశ్లో యోగా సాధన చేసిన సునయన ఇప్పుడు ముంబైలోని అనేక ప్రసిద్ధ యోగా స్టూడియోలలో నిపుణురాలిగా శిక్షణ ఇస్తోంది. సాధనకు బలమైన పునాదిని ఏర్పరచడానికి, గాయాలను మాన్పడానికి నిపుణులైన పర్యవేక్షణ అవసరమని సునయన వీడియోలు నిరూపిస్తాయి. యోగా సాధనలో చిన్న చిన్న లోపాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో కూడా వివరిస్తుంది. మనస్సు, శరీరం, ఆత్మపై యోగా వల్ల కలిగే మంచి ప్రయోజనాల గురించి వివరిస్తుంది. నిరాశకు దూరం నటాషా నృత్యకారిణి, ఫొటోగ్రాఫర్, యోగా సాధకురాలు నటాషా నోయల్. యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచే కాదు సోల్ఫుల్ హ్యాపీనెస్ బ్లాగ్ ద్వారా తన యోగానుభవాలను తెలియజేస్తుంది. మాట్లాడుతుంది. తత్త్వశాస్త్రాన్ని సాధన చేసే నటాషా ‘మీ మానసిక దృఢత్వమే మీ లక్ష్యం. మిగతావన్నీ అప్రధానం’ అని చెబుతుంది. తన బాల్యంలో జరిగిన విషాదకర సంఘటనల నుంచి తేరుకొని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కండరాల బలాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆమె యోగా సాధకురాలిగా మారింది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్కు సుమారు ఏడు లక్షల ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు. నిరాశ, ఆందోళన, బాడీ షేమింగ్ గురించి చర్చించడానికి ఆమె తన సోషల్మీడియా ΄్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుంది. యోగా ద్వారా సెల్ఫ్ గ్రోత్, చికిత్స గురించి మరీ మరీ చెబుతుంది. ప్రతిరోజూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు ఇస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కష్టపడి పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు తనే ఉదాహరణగా చూపుతుంది. యోగాసిని రాధికా బోస్ అనేక పేరొందిన కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాధికా బోస్కు ఉంది. అయితే, ఆమె తన ఆరోగ్యకరమైన జీవనాన్ని సూచించడానికి మాత్రం సోషల్మీడియానే ప్రధాన వేదికగా ఎంచుకుంటుంది. రాధిక సూచించే అంశాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లలో ఆమె యోగసాధన గురించి ప్రచురించాయి. ‘మీడియా, ప్రకటనలలో గ్లాస్ సీలింగ్ను ఛేదించడానికి మహిళలు గొప్ప పురోగతిని సాధించారు. అయితే మనం ఇంకా పితృస్వామ్యంలో జీవిస్తున్నాం, అన్నింటినీ దాటుకొని చాలా దూరం ప్రయాణించాల్సింది మనమే’ అని నమ్మకంగా చెబుతుంది. యోగా, వ్యాయామ జీవనశైలితో పాటు ఇతర ఆరోగ్య మార్గదర్శకాలను అందిస్తుంది. 9 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, నిపుణురాలిగా తన ప్రతిభను చాటుతోంది. -
రూ. లక్ష ఇవ్వాల్సిందే! అక్కడుంది హార్దిక్ కదా! 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మరీ..
Hardik Pandya Wedding Unseen Video: పెళ్లంటే సందళ్లు.. ఆటపాటలు.. వదినామరదళ్లు- బావాబామ్మర్దుల సరదాలు.. వధూవరులు, వారి కుటుంబాలను దగ్గర చేసేందుకు ఆడే చిలిపి ఆటలు.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్, భవిష్యత్ కెప్టెన్గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్యా వివాహ వేడుకలో ఇలాంటి సన్నివేశాలెన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా అందులోని వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చిన పాండ్యా అనతికాలంలోనే భారత పేస్ ఆల్రౌండర్గా ఎదిగాడు. సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన అతడు.. 2020లో ఆమెను పెళ్లాడాడు. అప్పటికే నటాషా గర్భవతి కాగా.. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 14న హిందూ, క్రిస్టియన్ వివాహ పద్ధతిలో కొడుకు అగస్త్య సమక్షంలో అంగరంగా వైభవంగా హార్దిక్- నటాషాలు మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో భాగంగా హార్దిక్ పాండ్యా వదిన, నటాషా తోటికోడలు ఫాంకురి శర్మ(కృనాల్ పాండ్యా భార్య) .. ‘‘జూతా చురాయి(పాదరక్షలు దాచిపెట్టడం)’’ పేరిట మరిదిని ఆటపట్టించింది. అడిగినంత డబ్బు కానుకగా ఇస్తేనే బూట్లు ఇస్తానంటూ మెలిక పెట్టింది. ఈ సందర్భంగా లక్ష రూపాయలు ఇవ్వాలని హార్దిక్ను డిమాండ్ చేసింది. అయితే, ఇందుకు స్పందించిన హార్దిక్.. లక్ష కాదు ఏకంగా ఐదు లక్షలు ఇస్తానంటూ వదినమ్మను ఖుషీ చేశాడు. వెంటనే డబ్బును ఫాంకురి అకౌంట్కు బదిలీ చేయాలంటూ తమ వాళ్లకు చెప్పాడు. అయినప్పటికీ.. ఫాంకురి ఆటపట్టించడం మానలేదు. డబ్బు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే షూస్ ఇస్తానని చెప్పింది. అలా సరదాగా సాగిన ఈ వేడకకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2023లో తమ జట్టును ఫైనల్కు చేర్చాడు. కానీ ఆఖరి మెట్టుపై చెన్నై సూపర్కింగ్స్ చేతిలో ఓటమిపాలు కావడంతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ ఈసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్ ప్రస్తుతం వెస్టిండీస్తో సిరీస్కు సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq — CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023 -
పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో? ట్వీట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ ధావన్ భార్య నటాషాతో విడిపోనున్నట్లు ఓ ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను వరున్ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఏ పార్టీ, ఫంక్షన్స్ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతుంటారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే సినీ సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్తో వార్తల్లో నిలిచే ఉమైర్సంధు ఇప్పుడు కూడా ప్రబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాడని, ఇందులో నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX — Umair Sandhu (@UmairSandu) May 24, 2023 -
ఎంత అందంగా ఉన్నారో! హార్దిక్ పాండ్యా- నటాషా మెహందీ ఫొటోలు వైరల్
Hardik Pandya Natasa Stankovic Viral Pics: అందమైన ఫొటోలతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ‘‘పెయింటెడ్ ఇన్’’ లవ్ అంటూ భార్య, కుమారుడితో ఉన్న దృశ్యాలు పంచుకున్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టు.. వాలంటైన్స్ డే సందర్భంగా సతీమణి నటాషా స్టాంకోవిక్కు మర్చిపోలేని బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజస్తాన్లోని ఉదయ్పూర్ కోటలో రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో మరోసారి భార్యను వివాహమాడాడు హార్దిక్. తమ మూడేళ్ల కుమారుడు అగస్త్య సహా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆమెతో మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివాడు. ఈ క్రమంలో ఇప్పటికే వైట్వెడ్డింగ్ థీమ్ సహా నటాషాతో కలిసి ఏడడుగులు నడిచిన ఫొటోలను పంచుకున్నాడు ఈ స్టార్ ఆల్రౌండర్. తాజాగా మెహందీ, హల్దీ(పసుపు) ఫంక్షన్ ఫొటోలు షేర్ చేయగా అవి కూడా వైరల్ అవుతున్నాయి. గులాబీ, తెలుపు రంగుల మేళవింపుతో కూడిన కుర్తా పైజామాలో హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్యతో కలిసి ట్విన్నింగ్ చేయగా.. నటాషా పసుపు వర్ణం ప్రధానంగా ఉన్న మల్టీకలర్ డ్రెస్లో మెరిసిపోయింది. ఈ ఫొటోలకు గంటలోపే మిలియన్కు పైగా లైకులు వచ్చాయి. అందమైన జంట అంటూ తోటి క్రీడాకారులు, అభిమానులు హార్దిక్ పాండ్యా దంపతులను మరోసారి విష్ చేస్తున్నారు. అమ్మానాన్నలతో క్యూట్ అగస్త్య.. కలకాలం వర్థిల్లు అంటూ వీరి కుమారుడిని ఆశీర్వదిస్తున్నారు. ముచ్చటైన కుటుంబం అని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా సెర్బియా మోడల్, నటి నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు జన్మించాడు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా వీరి వివాహం జరగడంతో మూడేళ్ల తర్వాత ఇలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు హార్దిక్. గతేడాది కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్న ఈ ఆల్రౌండర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా తన భార్య కలను నెరవేర్చాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో తిరిగి జట్టుతో కలవనున్న హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఐపీఎల్-2023తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా మరింత బిజీ కానున్నాడు. చదవండి: ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్క్రిస్ట్!! Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ -
హార్దిక్ పాండ్యా- నటాషా : ముచ్చటగా మూడోసారి పెళ్లి (ఫొటోలు)
-
భార్య నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Hindu Wedding New Images: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ దంపతులు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. మూడేళ్ల క్రితం అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ ప్రేమజంట.. ఈ వాలంటైన్స్ డేన రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్తాన్లోని ఉదయ్పూర్ కోటలో హార్దిక్- నటాషా పెళ్లి కన్నులపండువగా జరిగింది. తమ కుమారుడు అగస్త్యతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత భార్య విశ్వాసాలకు అనుగుణంగా ‘వైట్ థీమ్ వెడ్డింగ్’ ఏర్పాటు చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను వివాహమాడాడు. క్రిస్టియన్ వివాహ పద్ధతిలో నటాషా పొడవాటి అందమైన తెల్లటి గౌన్ ధరించగా.. రెండో పద్ధతిలో బంగారు- ఎరుపు వర్ణాలు కలగలసిన లెహాంగాలో మెరిసిపోయింది. ఇక పెళ్లికి ఎరుపు రంగు చీరకట్టుకుని అందమైన ఆభరణాలు ధరించి అచ్చమైన భారతీయ వనితలా కనిపించింది. PC: Hardik Pandya Instagram తొలుత ఉంగరాలు మార్చుకుని మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివిన ఈ జంట.. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచి ముచ్చటగా మూడోసారి పెళ్లాడారు. హార్దిక్ పాండ్యా తన భార్య నుదుటిన సింధూరం దిద్ది మురిసిపోయాడు. PC: Hardik Pandya Instagram ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు హార్దిక్- నటాషా దంపతులు. ‘‘ఇప్పుడు.. ఎల్లప్పుడూ’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో తమ ప్రేమబంధం శాశ్వతం అంటూ క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి. PC: Hardik Pandya Instagram (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గుజరాత్కు చెందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు.. సెర్బియా మోడల్, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నటాషా గర్భం దాల్చిన తర్వాత అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. PC: Hardik Pandya Instagram వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా.. త్వరలోనే పూర్తిస్థాయిలో భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో అతడు గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! IND Vs AUS 2nd Test Prediction: సూర్య స్థానంలో అయ్యర్.. గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు -
రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Marriage: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్లోని ఉదయ్పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమికుల దినోత్సవాన(ఫిబ్రవరి 14) హార్దిక్- నటాషాలు తమ కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2020 జనవరి 1న నటాషా వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన హార్దిక్ పాండ్యా.. లాక్డౌన్లో సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లాడాడు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు హార్దిక్. ఇక నటాషా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ... తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. మూడేళ్ల క్రితం చేసిన పెళ్లి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకున్నామని.. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనైంది. చదవండి: Nick Vujicic- Kanae Miyahara: ‘పరిపూర్ణతే’ అర్హతా? వాళ్లది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా.. Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..
Hardik Pandya- Natasa Stankovic Love Story: అమ్మానాన్న.. తోబుట్టువులు మినహా.. జీవితంలో అచ్చంగా తమకు మాత్రమే సొంతమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడనడంలో సందేహం లేదు. ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా సదరు వ్యక్తి ముందు మాత్రమే తమ మనసులోని భావాలు వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా వాళ్లతోనే పంచుకోవడానికే ఇష్టపడతారు. తాము పూర్తిగా నమ్మిన వ్యక్తి.. తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే.. చెప్పేదేముంది! ఎగిరి గంతేయడం సహజం. మనసుకు నచ్చితే చాలు.. ‘‘మనవాళ్లా’’, ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే వారితో ముడిపడిపోతారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధాన్ని బలపరచుకుంటారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ ఈ కోవకు చెందినవాళ్లే! సాధారణ మధ్య తరగతి కుటుంబం హార్దిక్- నటాషా విభిన్న ధ్రువాలకు చెందిన వాళ్లు. గుజరాత్లోని సూరత్లో 1993 అక్టోబరు 11న జన్మించాడు హార్దిక్. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే, కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో సహా వడోదరకు ఫిష్ట్ అయ్యారు. కొడుకులు కృనాల్, హార్దిక్కు క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోన్ ఏజెంట్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి ప్రోత్సాహంతో అన్న కృనాల్తో కలిసి కిరణ్ మోరే అకాడమీలో చేరిన హార్దిక్.. అక్కడే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే, అప్పటికే ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆటను వదల్లేదు. ఆటంటే ప్రాణం తొమ్మిదో తరగతిలోనే హార్దిక్ స్కూల్కు వెళ్లడం మానేసి పూర్తిగా క్రికెట్పైనే దృష్టి పెట్టాడు. జూనియర్ లెవల్లో రాణిస్తూ.. క్లబ్ క్రికెట్లో సత్తా చాటాడు. నిజానికి 18వ ఏట వరకు లెగ్ స్పిన్నర్గా ఉన్న హార్దిక్ పాండ్యా.. బరోడా కోచ్ సనత్ కుమార్ సూచనతో ఫాస్ట్ బౌలర్గా మారాడు. దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ఆడిన హార్దిక్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ దృష్టిలో పడటంతో అతడి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. 2015 నుంచి 2021 వరకు అదే జట్టుతో కొనసాగిన హార్దిక్.. ఆర్థికంగానూ, టీమిండియా క్రికెటర్గానూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. భావి కెప్టెన్గా రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు. ‘ప్లే బాయ్’ ఇమేజ్ అయితే, కొన్నిసార్లు తన ఆటిట్యూడ్ వల్ల హార్దిక్ తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. తోటి క్రికెటర్ కేఎల్ రాహుల్తో కలిసి.. 2019లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హార్దిక్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడు నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన హార్ది్క్ పాండ్యా.. నటాషానూ మధ్యలోనే వదిలేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెర్బియా నుంచి వచ్చి బాలీవుడ్లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటాషాకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుపులు. అయితే, ఎవరెన్ని మాటలు అన్నా నటాషా వెనుకడుగు వేయలేదు.. హార్దిక్ను నమ్మిన నటాషా ఓ పార్టీలో తనకు పరిచయమైన హార్దిక్ను హార్దిక్లానే చూసింది. తన కంటే వయసులో దాదాపు ఏడాది చిన్నవాడైన అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమించింది. ఆమె నమ్మకాన్ని హార్దిక్ వమ్ముచేయలేదు. 2020 జనవరిలో నటాషా చేతి వేలికి ఉంగరాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ముచ్చటైన కుటుంబం మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ గోముగా అడిగాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందే మనసిచ్చిన నెచ్చెలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది మేలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలల్లోనే వీరి దాంపత్యానికి గుర్తుగా కుమారుడు అగస్త్య జన్మించాడు. వీరిది ఇప్పుడు ముగ్గురితో కూడిన ముచ్చటైన కుటుంబం. మరోసారి తన ‘రాణి’తో నిజమైన ప్రేమకు విధి కూడా సహకరిస్తుంది అంటారు. ఇలా రెండు వేర్వేరు దేశాల్లో జన్మించి.. విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన హార్దిక్- నటాషా.. ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వేడుకగా పెళ్లిచేసుకోలేకపోయామనే లోటును తీర్చుకునేందుకు రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనుంది. తమ కుమారుడు అగస్త్య, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్దిక్, నటాషాను వివాహమాడనున్నాడు. రాజస్థాన్ కోటలో తన ‘హృదయపు పట్టపురాణి’ని మనువాడి మరో చిరకాల జ్ఞాపకాన్ని మిగిల్చబోతున్నాడు. భార్య విశ్వాసాలకు గౌరవమిస్తూ ‘వైట్ థీమ్ వెడ్డింగ్’కు ఏర్పాట్లు చేయించి మరోసారి ఆమె మనసు గెలుచుకున్నాడు. వాలంటైన్స్డే-2023 సందర్భంగా ప్రేమ పక్షులు.. సారీ సారీ ప్రేమతో ముడిపడిన దంపతులు.. మరోసారి పెళ్లిచేసుకోబోతున్న అగస్త్య అమ్మానాన్న హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్కు శుభాకాంక్షలు!! చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! -
నటితో హార్దిక్ పాండ్యా పెళ్లి.. మూడేళ్ల తర్వాత!
హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ కాలంలోనే టీమిండియాకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ జంట మరోసారి పెళ్లికి సిద్ధమైంది. అదేంటి ఇప్పటికే పెళ్లయిన జంటకు మరోసారి పెళ్లేంటీ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేసేయండి. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 13 నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున ఉదయపూర్లో ఈ జంట మరోసారి వివాహం చేసుకోనుంది. ఈనెల 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలతో వెడ్డింగ్ వైభవంగా జరగనుంది. పెళ్లయిన మూడేళ్లకు మరోసారి ఈ జంట వివాహం చేసుకోవడం విశేషం. కాగా.. జనవరి 1, 2020న దుబాయ్లో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా.. మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూలై 2020లో వారి బాబు జన్మించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ కుమారుడి ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు. నటాషా 2013 చిత్రం సత్యాగ్రహ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత యాక్షన్ జాక్సన్ (2014), ఫుక్రే రిటర్న్స్ (2017) వంటి చిత్రాలలో నటించింది. ఆమె బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో కూడా కనిపించింది. ఆ తర్వాత బాద్షా బ్లాక్ బస్టర్ ట్రాక్ డీజే వాలీ బాబు సినిమాలోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
మోడలింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటుడితో పాటు మరో నటిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్ను అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాస్మో పాలిటన్ మోడలింగ్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపార వేత్త నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తల పిల్లలే నిందితుల లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన బాలీవుడ్ నటీనటుల నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
స్విమ్మింగ్ పూల్లో అగస్త్యతో హార్ధిక్ పాండ్యా ..
టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్య, అతని ముద్దుల కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. హార్ధిక్, నటాషా దంపతులకు అగస్త్య గతేడాది మే 30న జన్మించాడు. నాటి నుంచి అగస్త్యకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా, హార్ధిక్ పాండ్యా అతని కొడుకు అగస్త్యతో కలిసి స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటున్న చిత్రాన్ని అతని భార్య నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్పూల్లో అగస్త్య తొలిసారిగా అంటూ క్యాప్షన్ను జోడించింది. ఈ ఫోటోతో పాటు వీరి కుటుంబానికి సంబంధించిన మరో మూడు ఫోటోలను అమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, పాండ్యా గతేడాది ఐపీఎల్ సీజన్ తరువాత జరిగిన ఆసీస్ పర్యటనలో చివరి సారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఐదుకు పడిపోయిన విరాట్ టెస్ట్ ర్యాంకింగ్ View this post on Instagram A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఎట్టకేలకు తన ప్రేయసి నటాషా దలాల్ను వివాహమాడారు. జనవరి 24న(ఆదివారం) ముంబైలోని మాన్సన్ హౌస్ రిసార్ట్లో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా పెళ్లిలో హల్దీ వేడుకకు చెందిన ఫోటోలను వరుణ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. హల్దీ జరిగింది కదా అనే క్యాప్షన్తో పోస్టు చేసిన ఈ ఫోటోలో వరుణ్ పసుపు పూసుకొని కండల వీరుడిలా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. చదవండి: కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం ఇక వరుణ్ ధావన్- నటాషాలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. నటాషాకు ధావన్ మూడు సార్లు ప్రపోజ్ చేయగా, తను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఒప్పుకుందట. వరుణ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టే దాకా వీరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అయితే తరువాత ఇద్దరు కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళ్లడంతో కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ 2019 వరుణ్ పుట్టినరోజు సందర్భంగా పప్రియురాలితో కలిసిన ఫోటోను షేర్ చేయడంతో అధికారికంగా తేలిపోయింది. కాగా గతేడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కరోనా కరోనా వాయిదా పడింది. ఇక వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్లో సీనియర్ దర్శకుడు. ఇటీవల వరుణ్తో కూలీ నెం 1 అనే సినిమా తెరకెక్కించారు. చదవండి: భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ పెళ్ళి ఫోటోలు..
-
కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం
ముంబై : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరుణ్ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న ప్రమాదం కావటంతో కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు. కాగా, గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న వరుణ్ ధావన్ పెళ్లి ఆదివారం జరగనుంది. మరికొన్ని గంటల్లో ప్రియురాలు నటాషా దలాల్తో వరుణ్ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. అలీభాగ్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాల వారు హోటల్కు చేరుకున్నారు. శనివారం జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరగనుంది. చదవండి : ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’ -
హీరో వరుణ్ పెళ్లి: ఇదే ఆఖరిది!
ముంబై: మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి ఎట్టకేలకు నేడు(ఆదివారం) జరగబోతోంది. నెచ్చెలి నటాషా దళాల్ చేయి పట్టుకుని ఆమెతో ఏడడుగులు నడవబోతున్నాడు. వీరి దాంపత్య జీవితానికి శుభారంభం పలికేందుకు అలీభాగ్లోని ద మాన్షన్ హౌస్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు శషాంక్ ఖైతన్, మనీష్ మల్హోత్రా, జోవా మొరానీ, డాలీ సిధ్వానీ(రితేష్ సిద్వానీ భార్య) శనివారమే పెళ్లి మండపానికి చేరుకున్నారు. తాజాగా ఈ పెళ్లి గురించి వరుణ్ అంకుల్, నటుడు అనిల్ ధావన్ మాట్లాడుతూ.. "మేమంతా చాలా ఎగ్జైట్గా ఉన్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఇదే చివరి పెళ్లి. వరుణ్ పెద్దన్నయ్య రోహిత్కు ఇదివరకే పెళ్లైంది. నా పిల్లలకు, అందులో నా పెద్దకొడుకు సంతానానికి కూడా పెళ్లిళ్లైపోయాయి. అంటే వరుణ్ జెనరేషన్లో ఇదే ఆఖరి పెళ్లి" అని చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా వరుణ్ పెళ్లి డేటును సైతం ఈయనే లీక్ చేశారు. జనవరి 24న వరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని, ఆ సమయం కోసం వేచి చూస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వరుణ్ పెళ్లి సందడి విషయానికొస్తే.. శనివారం సంగీత్, మెహందీ వేడుకలు జరగ్గా కరణ్ జోహార్తో కలిసి అలియా భట్, జాన్వీకపూర్, అర్జున్ కపూర్ చిందులేశారు. ఈ సంబరాలను రెట్టింపు చేసేందుకు నేడు సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, సాజిద్ నదియాద్వాలా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ వివాహానికి విచ్చేయనున్నారట. ఇదిలా వుంటే కొత్త పెళ్లికొడుకు వరుణ్ చివరిసారిగా తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: సమ్మర్లో బ్యూటిఫుల్ ‘లవ్స్టోరీ’) -
షాకిచ్చిన హీరో.. ఈ నెల 24న పెళ్లి?!
పది రోజుల క్రితమే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన వివాహం గురించి స్పందించారు. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘‘ఈ నెల 24 ఆదివారం నాడు అలీబాగ్లో వరుణ్ ధావన్ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి’’ అని న్యూస్ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. ఇక పెళ్లి కుమార్తె ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు వరుణ్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నటాశా దలాలే. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వీరిద్దరు గతేడాది మార్చిలోనే వివాహం చేసుకోవాలని భావించారట. కానీ కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా వివాహాన్ని ఈ ఏడాదికి వాయిదా వేశారట. మొత్తానికి 2021 వరుణ్ ధావన్ వివాహంతో ప్రారంభం అవుతుంది. ఇక ఎంతమంది వీరి బాటలో నడుస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్ ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ కపూర్, నీతూ కపూర్, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
కాలం కలిసొస్తే ఈ ఏడాదే పెళ్లి: హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి గురించి రెండేళ్ల నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. రేపో మాపో లేదా వచ్చే నెలలో వివాహం జరుగుతుంటూ ఊరిస్తూనే ఉన్నారు. ఎలాగో తన ప్రేయసి నటాషా దలాల్ ఉండనే ఉంది కాబట్టి బయట అడుగు పెడితే చాలు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న బాణంలా దూసుకొస్తోంది. దీంతో వరుణ్ తన పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడతారనే విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ నా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు గందరగోళంగా ఉంది. కాస్త పరిస్థితులు చక్కబడి కాలం కలిసొస్తే తప్పకుండా ఈ ఏడాదే నటాషాతో ఏడడుగులు వేస్తాను అని చెప్పుకొచ్చారు. (చదవండి: రికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్) ఇక వరుణ్ తాజాగా నటించిన చిత్రం కూలీ నెం.1లో హీరోయిన్ సారా అలీఖాన్ను ప్రేమలో పడేయడానికి ఆయన చాలా వేషాలే వేశారట. అయితే రియల్ లైఫ్లో కూడా నటాషాను ప్రేమకు ఒప్పించడానికి ముప్పుతిప్పలు పడ్డారట. మూడు, నాలుగు సార్లు నటాషా అతడి ప్రపోజల్ను రిజెక్ట్ చేసిందట. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా నటాషాను ప్రేమలో పడేసి దాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లుతున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ మాత్రమే కాదు.. అటు రణ్బీర్-అలియా జంట కూడా ఇదివరకే వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. కానీ సడన్గా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల వారు కూడా లవ్ బర్డ్స్గానే ఉండిపోయారు. అయితే ఎలాగైనా త్వరలోనే పెళ్లిపీటలెక్కుతామని చెప్పారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) -
3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..
ఓ అమ్మాయిని ప్రేమలో పడేయటం అంత వీజీ కాదంటున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా నటాశా దలాల్ను ప్రేమలో పడేశానని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం కరీనా కపూర్ నిర్వహిస్తున్న రేడియో షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ సంగతులు చెప్పుకొచ్చారు.‘‘ నేను తనని మొట్టమొదటి సారి ఆరవ తరగతిలో చూశాను. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయినట్లుగా అనిపించింది. కానీ, మేము అప్పటినుంచి ప్రేమించుకోవటం లేదు. ( నర్స్ నం.1) ఇంటర్ వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము. ఆ తర్వాత నేను తనకు ప్రపోజ్ చేశాను. ఆమె నన్ను మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది. కానీ, నేను నమ్మకాన్ని కోల్పోలేదు’’ అని అన్నాడు. వరుణ్ ధావన్ తాజా చిత్రం ‘కూలీ నెం.1’. తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సారా అలీఖాన్ కథానాయిక. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement