-
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
ప్రకృతి విలయతాండవం.. 2,000 మంది మృతి
పాపువా న్యూ గినియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ పేర్కొంది. ఈ మేరకు ఐరాస ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది. More than 2,000 people were buried alive in a massive landslide in Papua New Guinea . pic.twitter.com/avgy49mEPg— Baba Banaras™ (@RealBababanaras) May 27, 2024 ఇక, ఈ ప్రమాద ఘటన కారణంగా 2000 మంది మరణించారని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్ నుంచి ఐరాస ఆఫీస్కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. తమ దేశానికి తగు సాయం అందించాలని కోరింది. అలాగే, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. Drone video reveals extent of the damage caused by a landslide in Papua New Guinea, which killed more than 670 people according to the UN.Rescue workers are trying to retrieve bodies from under the mud. pic.twitter.com/SPvUjdeaQF— Al Jazeera English (@AJEnglish) May 26, 2024అయితే, ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా ప్రావిన్స్లో భారీ నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు దాదాపు నేలమట్టమయ్యాయి. కొండచరియల కారణంగా ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ కోసం మరో జట్టును ప్రకటించారు. రెండో సారి ప్రపంచకప్కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా ఇవాళ (మే 8) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల ఈ జట్టుకు అస్సద్ వలా కెప్టెన్గా నియమితుడయ్యాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సీజే అమీనీ అస్సద్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపికయ్యాడు. తూర్పు ఆసియా పసిఫిక్ రీజియనల్ పోటీల ద్వారా వరల్డ్కప్కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా 2021లో తొలిసారి ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యింది. ఆ ఎడిషన్లో ఈ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో 10 మంది 2021 ప్రపంచకప్ స్క్వాడ్లో ఉన్నారు. 2024 ప్రపంచకప్లో గినియా జర్నీ జూన్ 2న ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో గినియా.. పటిష్టమైన వెస్టిండీస్ను ఢీకొంటుంది. ప్రపంచకప్ గ్రూప్-సిలో ఉన్న గినియా.. గ్రూప్ దశలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఉగాండ జట్లతో పోటీపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం పపువా న్యూ గినియా జట్టు: అస్సద్ వలా (కెప్టెన్), సీజే అమీనీ (వైస్ కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరాపొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటిదాకా 15 జట్లను ప్రకటించారు. మరో జట్లను ప్రకటించాల్సి ఉంది. జట్ల వివరాలను వెల్లడించిన దేశాలు..భారత్ఇంగ్లండ్ఆస్ట్రేలియాఒమన్సౌతాఫ్రికాన్యూజిలాండ్ఆఫ్ఘనిస్తాన్నేపాల్కెనడావెస్టిండీస్యూఎస్ఏఉగాండస్కాట్లాండ్ఐర్లాండ్పపువా న్యూ గినియాజట్లను ప్రకటించాల్సిన దేశాలు..పాకిస్తాన్నమీబియానెదర్లాండ్స్శ్రీలంకబంగ్లాదేశ్ -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్రౌండర్గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్రౌండర్గా పేరుంది. -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
టీ20 వరల్డ్కప్ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!
వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్కప్కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు తాజాగా ప్రపంచకప్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి. టీ20 వరల్డ్కప్ 2024 నిబంధనల ప్రకారం.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్లాండ్, భూటాన్, చైనా, మయన్మార్ వరుస స్థానాల్లో ఉన్నాయి. -
T20 WC: టి20 ప్రపంచకప్-2024కు అర్హత సాధించిన పసికూన
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్కప్కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్తో జరిగిన మ్యాచ్లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అర్ష్దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్కప్కు అర్హత సాధించనున్నాయి. ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆 Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq — ICC (@ICC) July 28, 2023 చదవండి: Ashes 2023: పాంటింగ్పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను' -
ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్లో ఎన్ని భాషలంటే..
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా.. ఇతరులు చెప్పేవి అర్థం చేసుకోవాలన్నా ‘భాష’ ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడయ్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంగ్లిష్ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్జీ సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఉత్తర కొరియా ప్రజలు.. కొరియన్ తప్ప ఇతర భాషలను ఉపయోగించరు.ఆ తర్వాత వాటికన్ సిటీలో రెండు, ఐస్ల్యాండ్లో రెండు, దక్షిణ కొరియాలో 5 భాషలే వాడకలో ఉన్నాయి. అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లిష్ భాషను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్ భాష వాడుకలో ఉంది. ఇది కూడా చదవండి: హలో.. ఆస్ట్రోనాట్..! -
భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది. ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు. భారత్కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm — PMO India (@PMOIndia) May 22, 2023 ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు. Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D — PMO India (@PMOIndia) May 22, 2023 జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా జపాన్(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన. ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే! -
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని..
-
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని
ఫసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపే.. మోదీని ఆలింగనం చేసుకుంటూ.. ఆయన పాదాలను తాకుతూ స్వాగతించారు. వాస్తవానికి పాపువా న్యూగినియాలో సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి ఉత్సవ స్వాగతం ఇవ్వదు. కానీ మోదీ కోసం ఆ సెంటిమెంట్ను పక్కనపెట్టారు. అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు చేరకున్న ప్రధాని మోదీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. అంతేగాదు పసిఫిక్ ద్వీప దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయిన మోదీకి న్యూగినియా ప్రధానిచే విశేష స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఇతర ప్రముఖులను కలిసేందుకు వెళ్లేముందు కూడా మరాపే మోదీని మరోసారి ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్టర్ వేదికగా..నేను పాపువా న్యూగినియా చేరుకున్నాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్ మరాప్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు స్వాగతం పలికేందుకు ఆయన చేసిన ప్రత్యేక అభివాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా పర్యటన సందర్భంగా ఈ దేశంతో భారత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. న్యూగినియాలో మోదీకి 19 తుపాకులు గౌరవ వందనం, లాంఛనప్రాయం స్వాగతం గార్డ్ ఆఫ్ హానర్ తోసహా ప్రధాని జేమ్స్ మరాపే చేసిన ప్రత్యేక అభివాదాన్ని స్వీకరించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి-FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆదివారం న్యూగినియా చేరుకున్నారు మోదీకి. సోమవారం ఈ శిఖరాగ్ర సమావేశాంలో నరేంద్ర మోదీ, జేమ్స్ మరాపే ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడం తోపాటు పాపువా న్యూగినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో భేటీ కానున్నారు మోదీ. అదీగాక సోమవారం నాటి చర్చల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. కాగా, అంతకుమునుపే మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు 14 పసిఫిక్ ద్వీప దేశాలు(పీఐసీ) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ ఫిజి పర్యటన సందర్భంగా ప్రారంభించిన ఎఫ్ఐపీఐసీ సదస్సులో మొత్తం 14 దేశాల నాయకులు పాల్గొంటారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
పసిఫిక్ ద్వీపదేశంలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది. కిందటి ఏడాది సెప్లెంబర్లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం. -
పసికూనల మధ్య పరుగుల వరద.. అనుభవమే గెలిచింది
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా నమీబియా, పపువా న్యూ గినియాల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. పేరుకు పసికూనలైనప్పటికి ఆటలో మాత్రం పోటాపోటీని ప్రదర్శించారు. అయితే పపువా కంటే ఎప్పుడో క్రికెట్లో అడుగుపెట్టిన నమీబియానే 48 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కెప్టెన్ గెర్హార్ ఎరాస్మస్ (113 బంతుల్లో 125 పరుగులు), నికో డేవిన్(79 బంతుల్లో 90 పరుగులు), లోప్టీ ఈటన్(59 బంతుల్లో 61 పరుగులు) రాణించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో సెమో కామియా ఐదు వికెట్లతో రాణించగా.. కాబువా మోరియా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 46.2 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన పపువా న్యూ గినియా 282/4తో పటిష్టంగా కనిపించినప్పటికి చివర్లో ఒత్తికి లోనై వికెట్లు చేజార్చుకుంది. చార్ల్స్ అమిని(75 బంతుల్లో 109 పరుగులు, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం సరిపోలేదు. సీస్ బహు(44 బంతుల్లో 54 పరుగులు), కెప్టెన్ అసద్ వాలా(61 బంతుల్లో 57 పరుగులు), కిప్లిన్ డొరిగా(47 పరుగులు) ఆకట్టుకున్నారు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్ స్కొల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్ చెరో మూడు వికెట్లు తీయగా.. గెర్హాడ్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన గెర్హాడ్ ఎరాస్మస్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. An all-round show from Gerhard Erasmus gives Namibia a win against PNG in a high-scoring game 🙌 Watch the @cricketworldcup Qualifier Play-off LIVE and for FREE on https://t.co/vphAWWBUVe (in select regions) 📺 📝 https://t.co/5KxcH6LbW5 pic.twitter.com/6cj4yP2QNs — ICC Cricket World Cup (@cricketworldcup) March 30, 2023 -
ఇండోనేషియా పాపువా గినియా దీవులలో 3 కిలోల బరువున్న అరటిపండు
-
140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..
అత్యంత అరుదైన బ్లాక్ నేప్డ్ పీసాంట్ పీజియన్ పక్షి(నెమలిలా కన్పించే పావురం) 140 ఏళ్ల తర్వాత కన్పించింది. శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ద్వీపకల్ప దేశం పపువా న్యూగినియాలో స్థానికులను వివరాలు అడిగి నెలరోజుల పాటు అడవిలో తిరిగి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమకు ఫలితం దక్కింది. శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ పక్షి దృశ్యాలు రికార్డయ్యాయి. బ్లాక్ నెప్డ్ పీసాంట్ పీజియన్ను ఇప్పటికే అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. ఇది పపువా న్యూ గినియా అడవిలో మాత్రమే ఇంకా అత్యంత అరుదుగా కన్పిస్తోంది. 10 ఏళ్లుగా కన్పించని, ఇంకా అంతరించిపోని పక్షులను కనుగొనే కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నంలో ఈ నెమలి పావురం కన్పించింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలా కన్పించని అరుదైన పక్షులు మొత్తం 150 ఉన్నట్లు చెప్పారు. ఈ పక్షిని చూశామని స్థానికులు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి: ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం -
వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు
Michael Leask: ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. వన్డే ప్రపంచకప్ 2023 అర్హత పోటీల్లో భాగంగా స్కాట్లాండ్, పపువా న్యూ గినియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఆటగాడు మైఖేల్ లీస్క్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐసీసీ అసోసియేట్ దేశాలకు వన్డే క్రికెట్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు బాదిన లీస్క్.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 2 పరుగులు సాధించి ఈ ఘనతను సాధించాడు. Final ball of the innings, and two needed for the fastest Associate ODI fifty 💥Scotland's Michael Leask gets it done in 18 balls 👏Catch all the @cricketworldcup League 2 action live and FREE on https://t.co/CPDKNxoJ9v 📺 pic.twitter.com/qLmRaJTnNg— ICC (@ICC) April 14, 2022 లీస్క్ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఫీట్ను సాధించడం విశేషం. లీస్క్ సాధించిన రికార్డును ఐసీసీ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. కాగా, అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్పై కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఏడేళ్లు పూర్తైనా నేటికీ ఆ రికార్డు ఏబీడి పేరిటే పదిలంగా ఉంది. ఇదిలా ఉంటే, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ 123 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, ఛేదనలో స్కాటిష్ బౌలర్ గావిన్ మెయిన్ (5/52), హమ్జా తాహిర్ (3/27)ల ధాటికి పపువా న్యూ గినియా 36.2 ఓవర్లలో 164 పరుగులకే చాపచుట్టేసింది. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్లో టోనీ ఉరా (47) టాప్ స్కోరర్గా నిలువగా.. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ కొయెట్జర్ (74), బెర్రింగ్టన్ (56), లీస్క్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చదవండి: Odean Smith: ఓ మ్యాచ్లో విలన్గా, రెండు మ్యాచ్ల్లో హీరోగా..! -
వారెవ్వా షకీబ్.. ఇలాంటి ఆల్రౌండర్ ఒక్కడున్నా చాలు
Shakib Al Hasan T20 WC 2021.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ తానెంత గొప్ప ఆల్రౌండర్ అనేది మరోసారి చూపించాడు. టి20 ప్రపంచకప్ 2021లో పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో షకీబ్ మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ముందుగా బ్యాటింగ్లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయడంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. 37 బంతుల్లో 47 పరుగులు చేసిన షకీబ్ ఇన్నింగ్స్లో 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్లోనూ ఇరగదీశాడు. (4-0-9-4) ఇవీ షకీబ్ గణాంకాలు. చదవండి: T20 WC 2021: జట్టులో బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు.. స్టన్నింగ్ క్యాచ్కు షకీబ్ ఫిదా పసికూన పపువాపై విజయం సాధించినప్పటికి.. సూపర్ 12కు అర్హత సాధించాలంటే బంగ్లాకు భారీ విజయం అవసరం ఉంది. అందుకే సరైన సమయంలో షకీబ్ తనలోని ఆల్రౌండర్ను నిద్రలేపాడు. ప్రస్తుతం షకీబ్ ఐసీసీ టి20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక షకీబ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. '' వారెవ్వా ఇలాంటి ఆల్రౌండర్ ఒక్కడున్నా చాలు.. ఒంటిచేత్తో బంగ్లాను సూపర్ 12 దశకు చేర్చాడు... షకీబ్ నిజంగా గ్రేట్.. నెంబర్వన్ ఆల్రౌండర్ అనే పదానికి సరైన నిర్వచనం షకీబ్ అల్ హసన్'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్లో నెగ్గిన 'హిట్మ్యాన్' T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి -
జట్టులో బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు.. స్టన్నింగ్ క్యాచ్కు షకీబ్ ఫిదా
Charles Amini Stunning Catch In BAN Vs PNG.. టి20 ప్రపంచకప్ 2021లో అరంగేట్రం చేసిన పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్లోనూ గెలవకపోయినప్పటికి ఒమన్ అభిమానులను మాత్రం అలరిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్, పపువా మధ్య జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో పపువా ఫీల్డర్ చార్లెస్ అమిని సూపర్ క్యాచ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అందులోనూ షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ ఆల్రౌండర్ క్యాచ్ అందుకుంటే ఆ ఫీల్డర్ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పపువా జట్టులో చార్లెస్ అమిని బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో 46 పరుగులు చేసిన షకీబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. చదవండి: T20 WC 2021: మెంటార్గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్ అయితే అక్కడే ఉన్న చార్లెస్ అమిని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అంతే అర్థసెంచరీ లేకుండానే షకీబ్ కథ ముగిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా సాగుతుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 13 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహ్మదుల్లా, షకీబ్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి View this post on Instagram A post shared by ICC (@icc) pic.twitter.com/KhbiXQ5edS — jennifer (@jennife74834570) October 21, 2021 -
BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత!
బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత! పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా 19.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ విజయం దక్కించుకున్న బంగ్లాదేశ్ గ్రూఫ్-బి నుంచి సూపర్ 12 దశకు అర్హత సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ 46 పరుగులతో రాణించారు. అయితే ఒమన్పై స్కాట్లాండ్ విజయం అందుకుంటే బంగ్లా నేరుగా సూపర్ 12కు వెళుతుంది. అలా కాకుండా ఒమన్ గెలిస్తే మాత్రం ఇరు జట్ల మధ్య రన్రేట్ కీలకం కానుంది. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో పపువా న్యూ గినియా ఓటమి దిశగా పయనిస్తోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. కిప్లిన్ డోరిగా 36, డామియెన్ రావు 1 పరుగులతో ఆడుతున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన పపువా.. 10 ఓవర్లలో 28/6 పపువా న్యూ గినియా దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల దాటికి పసికూన పపువా పరుగులు చేయలేక నానా అవస్థలు పడుతుంది. 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పపువా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో పపువా 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. బంగ్లా భారీ స్కోరు.. పపువా టార్గెట్ 182 పపువా న్యూ గినియాతో జరుగతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీస్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ 46 పరుగులతో రాణించారు. 10 ఓవర్లలో బంగ్లా.. 71/2 బంగ్లాదేశ్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 34, ముష్ఫీకర్ రహీమ్ 5 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ లిటన్ దాస్(29) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. అసద్వాలా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి లిటన్ దాస్ సీసే బసుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా.. 54/2 ఓపెనర్ లిటన్ దాస్(29) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. అసద్వాలా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి లిటన్ దాస్ సీసే బసుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 20, ముష్ఫీకర్ రహీమ్ 2 పరుగుతో ఆడుతున్నారు. 5 ఓవర్లలో బంగ్లా 37/1 5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 20, షకీబ్ అల్ హసన్ 14 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్గా వెనుదిరిగాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఖౠతా తెరవకుండానే తొలి వికెట్ను కోల్పోయింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మహ్మాద్ నయీమ్ కబువా మోరియా బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అల్ అమెరత్: టి20 ప్రపంచకప్ 2021లో గ్రూఫ్ బి క్వాలిఫయర్లో భాగంగా బంగ్లాదేశ్, పపువా న్యూ గినియా మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్లాట్కాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన బంగ్లాదేశ్ ఒమన్తో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచి మళ్లీ ఫామ్లోకి వచ్చింది. పపువాపై విజయం సాధించి సూపర్ 12 దశకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఒకవేళ పపువా చేతిలో ఓడిపోతే మాత్రం ఒమన్ సూపర్ 12 దశకు అర్హత సాధిస్తుంది. పపువా న్యూ గినియా: లెగా సియాకా, అస్సద్ వాలా (కెప్టెన్), చార్లెస్ అమిని, సెసే బౌ, సైమన్ అటాయ్, హిరి హిరి, నార్మన్ వనువా, కిప్లిన్ డోరిగా (వికెట్ కీపర్), చాడ్ సోపర్, కబువా మోరియా, డామియన్ రావు బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, మహేది హసన్, షకీబ్ అల్ హసన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), అఫీఫ్ హొస్సేన్, మహ్మదుల్లా (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్ -
T20 WC 2021: స్కాట్లాండ్ తరపున తొలి బ్యాటర్గా రికార్డు
T20 WC 2021 Richie Berrington.. స్కాట్లాండ్ బ్యాటర్ రిచీ బెర్రింగ్టన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్లో స్కాట్లాండ్ తరపున అర్థ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పపువా న్యూ గినియాతో జరుగుతున్న గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్లో రిచీ బెర్రింగ్టన్ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో 49 బంతుల్లో 70 పరుగులు చేసిన రిచీ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్కు దక్కని హ్యాట్రిక్ ఇక పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్ బి క్వాలిఫయర్ మ్యాచ్లో స్కాట్లాండ్ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ క్వాలిఫయర్ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. నార్మన్ వనూహ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. Richie Berrington is the first Scotland batsman to score a fifty in the T20 World Cups.#T20WorldCup #Scotland #PapuaNewGuinea #SCOvPNG #RichieBerrington pic.twitter.com/Iq76fPEUQD — CricTracker (@Cricketracker) October 19, 2021 -
T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్కు దక్కని హ్యాట్రిక్
T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హై డ్రామా నెలకొంది. ఆఖరి ఓవర్లో నలుగురు బ్యాటర్స్ వెనుదిరగడం విశేషం. అయితే బౌలర్కు మాత్రం హ్యాట్రిక్ దక్కలేదు. విషయంలోకి వెళితే.. కాబువా మోరియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి తొలుత గ్రీవీస్ ఔటయ్యాడు. ఆ తర్వాత నాలుగో బంతికి లీస్క్ రనౌట్ కాగా.. తర్వాతి బంతికి డేవీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక ఆఖరి బంతికి మార్క్వాట్ క్లీన్బౌల్డ్ కాగా.. ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు పడ్డప్పటికీ మధ్యలో ఒక రనౌట్ ఉండడంతో బౌలర్కు హ్యాట్రిక్ మిస్సయింది. చదవండి: T20 WC IND Vs PAK: 'మౌకా.. మౌకా'.. కింగ్ కోహ్లి.. బాద్షా బాబర్ ఇక మ్యాచ్లో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ఇన్నింగ్స్ను మాథ్యూ క్రాస్(45), రిచీ బెరింగ్టన(70) పరుగులతో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ పెద్దగా రాణించలేకపోయారు. చదవండి: T20 World Cup 2021: 2 ప్రపంచకప్లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement