-
నీటితొట్టెలో పడి బాలుడి మృతి
మేడిపల్లి(జగిత్యాల): ఓ బాలుడు నీటితొట్టెలో పడి మృతిచెందిన ఘటన మేడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని బేల గ్రామానికి చెందిన బైగాని సాంబారి ఉపాధి నిమిత్తం తన ఇద్దరు పిల్లలను తీసుకొని, 4 నెలల క్రితం మేడిపల్లికి వచ్చింది. స్థానిక ఇటుకల బట్టీలో పని చేస్తోంది. ఆమె కుమారుడు పరమేశ్వర్(7) గురువారం రాత్రి సమయంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ వెళ్లి, దగ్గరలో ఉన్న నీటితొట్టెలో పడిపోయాడు. మిగతా పిల్లలు ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వచ్చి, పరమేశ్వర్ని బయటకు తీసి, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి సాంబారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నెల రోజుల్లో ముగ్గురు.. నెల రోజుల్లో ఒక వలస కార్మికుడు, ఇద్దరు కార్మికుల పిల్లలు మృతిచెందారు. దీంతో వలస కార్మికులకు రక్షణ చర్యలు కరువయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు.. ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) వ్యవసాయబావిలో పడి మృతిచెందింది. ఏఎస్సై లక్ష్మీరాజం తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి రెండు సంవత్సరాల నుంచి కీళ్లనొప్పులతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. శుక్రవారం బహిర్భూమికి వెళ్లి బావిలో పడి మృతిచెందింది. మృతురాలి కుమారుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
No Headline
సుల్తానాబాద్రూరల్: వివిధ గ్రామాల్లో శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఆగమామైంది. ప్రధానంగా కను కు ల, తొగర్రాయి, మంచిరామి గ్రామాల్లోని కొనుగో లు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షంతో తడిసిపోయింది. అందులో నీటిని తొలగించేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. నిర్దేశిత తేమశాతం వచ్చినా ని ర్వాహకులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేదని, దీంతో అకాల వర్షంతో తడిసిపోయిందని పలువురు రైతులు ఆవేదన చెందారు. ఓదెలలో.. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, ఉ ప్పరపల్లె, హరిపురం, పిట్టలపల్లెలో ఈదురుగాలు లతో కూడిన వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందారు. ఆ వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం కుప్పలపై టార్పాలినట్లు కప్పారు. -
సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్
● 20 మంది విద్యార్థులకు అస్వస్థత సుల్తానాబాద్: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థులకు వాంతులు, విరేచనాలయ్యా యి. సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సైలెన్ ఎక్కించారు. మిగిలిన వారి ఆరోగ్యం సాయంత్రం వరకు కుదుటపడటంతో హాస్టల్కు తరలించినట్లు డాక్టర్ వెంకటేశ్ తెలిపారు. అల్పాహారంలో ఆయిల్ ఎక్కువ వాడటం వల్ల పిల్లలు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్కు పంపించిన పిల్లలకు స్టాఫ్ నర్స్ ఆధ్వర్యంలో కొబ్బరి బోండాలు, గ్లూకోజ్ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ రాజు పేర్కొన్నారు. స్వగ్రామానికి మృతదేహంమేడిపల్లి(జగిత్యాల): దమ్మన్నపేటవాసి ని మ్మ రాజశేఖర్ ఈ నెల 3న సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతదేహం శుక్రవారం స్వగ్రామం చేరింది. ఉపాధి కోసం వెళ్లి, విగతజీవుడై రావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. -
కార్మిక హక్కులు కాలరాస్తున్న బీజేపీ
● ఐఎప్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్యైటింక్లయిన్కాలనీ(రామగుండం): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తోందని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక ప్రెస్భవన్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజా, కార్మిక. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతోనే గత అసెంబ్లీలో ఓటమి పాలైందని గుర్తుచేశారు. గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి రాజయ్య, ఐఎఫ్టీయూ అధ్యక్షుడు ఇ.నరేశ్, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, నాయకులు రాజనర్సు, రమేశ్, వెంకటస్వామి తదితతరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కొత్తపల్లి(కరీంనగర్): బైక్ను మరో బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీ సుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలోని చింతకుంట శాంతినగర్కు చెందిన ఠాకు విశాల్ శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై కమాన్పూర్ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. పెట్రోల్ కొట్టించుకొని, తిరిగి వస్తూ డివైడర్ దాటుతుండగా భూమి రాకేశ్ బైక్పై వేగంగా వచ్చి, ఢీకొట్టాడు. ఈ ఘటనలో విశాల్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో కరీంనగర్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడి తల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రైలు కింద పడి బాలిక బలవన్మరణం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రా మ శివారులోని రైల్వే బ్రిడ్జిపై ఒడిశా రాష్ట్రానికి చెందిన కై కేయి(15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సదాకర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మన్మద తన కుటుంబ సభ్యులతో కలిసి చల్గల్ శివారులోని ఇటుక బట్టీల్లో పని చే స్తోంది. గురువారం జగిత్యాల మార్కెట్కు వచ్చి, సా యంత్రం తిరిగి వెళ్తున్నప్పుడు కై కేయి అదృశ్యమైంది. రాత్రి ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కొన్ని రోజులుగా కైకేయి మానసిక పరిస్థితి సరిగా ఉండటం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం రైల్వేట్రాక్పై ఆమె మృతదేహం ఉందన్న సమాచారంతో ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి మన్మద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి పేర్కొన్నారు. -
అప్పుల బాధతో గొర్రెల కాపరి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అ ప్పుల బాధతో గొర్రెల కాప రి ఆత్మహత్య చేసుకున్న ఘ టన రాగట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తుల వివరాల ప్రకా రం.. రాగట్లపల్లికి చెందిన నె త్తెట్ల చిన్న మల్లయ్య(48) ఇ ల్లు నిర్మించుకునేందుకు, భూమిని అభివృద్ధి చే యడం కోసం సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్, కూతురు అమ్ము ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్!
హుజూరాబాద్: స్థానిక ఆర్టీసీ డిపోలోని ఆరుగురు ఉ ద్యోగులను ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉ న్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వారు శుక్రవారం ఆర్ఎం ఆఫీస్లో రిపోర్టు చేసినట్లు తెలిసింది. ఇటీవల ఓ డ్రైవర్ వద్ద హుజూరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విదితమే. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో డీఎం అవినీతి అక్రమాలకు సహకరించినట్లు తేలిన డిపో పరిధిలోని ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డీఎం శ్రీకాంత్ చిన్న చిన్న కారణాలు చూపుతూ, అనుమతి లేకుండా అత్యవసరంగా సెలవులు తీసుకున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి, డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వని పక్షంలో పలువురికి చార్జీ మెమోలు ఇచ్చినట్లు తేల్చారని సమాచారం. వాటిని విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి, కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇన్చార్జి డీఎంగా వెంకటేశ్వర్లు.. హుజూరాబాద్ ఇన్చార్జి డీఎంగా హుస్నాబాద్ డీఎం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. -
తుప్పు పట్టాయి
పచ్చని మొక్కలు, పిల్లలక్రీడా సామగ్రితో ఒకప్పుడు కళకళలాడిన పార్క్.. ఇప్పుడు ఎండిన మొక్కలతో అధ్వానంగా తయారైంది. పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయాయి. కొన్ని తుప్పు పట్టాయి. బోర్ నుంచి నీళ్లు రావడం లేదు. మొక్కలు ఎండిపోతున్నాయి. – సంధ్యారాణి, గంగానగర్, గోదావరిఖని అభివృద్ధి చేయాలి అధికారులు పార్క్పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడల్ పార్క్గా అభివృద్ధి చేయాలి. ఆకతాయిలు పార్క్లోనే మద్యం తాగుతున్నారు. పిల్లల ఆటవస్తువులు విరిగిపోయాయి. బాత్రూంకు నీటి సరఫరా లేదు. నీళ్లులేక మొక్కలు ఎండిపోతున్నాయి. – ఇందారపు సతీశ్, దుర్గానగర్, గోదావరిఖని చర్యలు తీసుకుంటాం నగరంలోని పార్క్ల పరిస్థితి, వాటిలోని సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపడతాం. మొక్క లు ఎండిపోకుండా నీళ్లు అందిస్తాం. ఉద్యాన వనాలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం. – శ్రీకాంత్, కమిషనర్, నగరపాలక సంస్థ, రామగుండం -
ఆస్పత్రి సిబ్బంది విధుల బహిష్కరణ
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వెంటనే వేతనాలను ఇప్పించాలంటూ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, కేవీపీఎస్ నాయకులు అశోక్, రవీందర్ డిమాండ్ చేశారు. వీరి ఆధ్వర్యంలో శుక్రవారం సిబ్బంది విధులు బహిష్కరించారు. శానిటేషన్, పేషంట్కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఏడాదిగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెఇలపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సదరు కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంంలో నాయకులు వెంకటేశ్, శివ, కుమార్, సతీశ్, నాగేంద్ర, భూలక్ష్మి, లావణ్య, రేణుక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బావిలోపడి వృద్ధురాలి మృతి ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) శుక్రవారం వ్యవసాయబావిలో పడి మృతిచెందింది. ఏఎస్సై లక్ష్మీరాజం కథనం ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి రెండు సంవత్సరాల నుంచి కీళ్లనొప్పులతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. నొప్పి భరించలేక బహిర్భూమికని వెళ్లి బావిలోపడి మృతిచెందింది. మృతురాలి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ట్రాక్టర్ను ఢీకొన్ని లారీ సుల్తానాబాద్రూరల్: కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై ధాన్యం లోడ్తో వెళ్తున్నట్రాక్టర్ను లారీ వెనుక నుంచి ఢీకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గర్రెపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్తో ట్రాక్టర్ సుల్తానాబాద్కు వ స్తోంది. ఈక్రమంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అందులో ధాన్యం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. దాదాపు గంటకుపైగానే వాహనాలు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉబికి వస్తున్న నీళ్లు రామగుండం: స్థానిక రైల్వే లోకోపైలట్ల విశ్రాంతి భవనం పక్కన నాలుగేళ్ల క్రితం తాగునీటి అవసరాల నిమిత్తం వేసిన బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలోనూ బోరు నుంచి నీరు పైకి రావడం గమనార్హం. వివిధ జిల్లాల నుంచి విధులకు హాజరయ్యే లోకోపైలట్లు బోర్వెల్ నుంచి వచ్చే ఆకాశగంగను చూసి ఆశ్చర్యపోతున్నారు. -
నీటిబొట్టు.. ఒడిసిపట్టు
● తాగునీటి అవసరాల కోసం బొగ్గు గనుల్లోని వృథా నీరు ● సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న అధికారులు గోదావరిఖని: ‘నీటి బొట్టును వృథా చేయవద్దు.. ప్రతీచుక్కను ఒడిసి పట్టాలి.. బొగ్గు బావుల్లోంచి వచ్చే నీటిని ప్రజావసరాలకు మళ్లించాలి’ అని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఇటీవల ఆదేశించారు. గోదావరినదిలో నీరు అడుగంటడంతో సింగరేణి బొగ్గు బావుల్లోంచి వెలువడే వృథా నీటిని శుద్ధి చేసి జిల్లావాసులకు అందించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పొంచి ఉన్న తాగునీటి ముప్పుపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోరెండు నెలలపాటు పట్టణాలు, గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టింది. సింగరేణి అధికారులతో భేటీ.. వేసవిలో తలెత్తబోయే తాగునీటి ముప్పును అధిగమించేందుకు సింగరేణి బొగ్గు గనుల్లోంచి వెలువడే వృథా నీటిని వినియోగించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ నిర్ణయించారు. ఈమేరకు సింగరేణి అధికారులతో ఆయన ఇటీవల ఇదేవిషయంపై సమీక్షించారు. రామగుండం రీజియన్లోని మూడు ఏరియాల్లో ఉన్న గనుల్లోంచి ఎంత నీరు వెలువడుతోంది? యాజమాన్యం ఎంత వినియోగిస్తోంది? వృథాగా పోతున్నదెంత? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని మిషన్ భగీరధ అధికారులను ఆదేశించారు. గనుల్లోంచి రోజూ దాదాపు 132 ఎంఎల్డీ నీరు పంపింగ్ చేస్తున్నారు. ఇందులోంచి సింగరేణి అవసరాలకు పోను సుమారు 100 ఎంఎల్డీ నీటిని వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలోనే సమీప గ్రామాలు, పట్టణాలకు బొగ్గు గనుల నీరు మళ్లించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. చెరువుల్లోకి వృథా నీరు.. ● ప్రధానంగా ఆర్జీ–2, 3 ఏరియాల్లోని జల్లారం, బొక్కల వాగులో కలుస్తున్న వృథా నీటిపై అధికారులు దృష్టి సారించారు ● ఆర్జీ–1 నుంచి విడుదలయ్యే నీటిని ఎర్రచెరువు, నల్లచెరువులు, ఆర్జీ–2 నుంచి వెలువడే నీటిని జల్లారం వాగు, ఆర్జీ–3 నుంచి విడుదలయ్యే నీటిని బొక్కల వాగుకు మళ్లిస్తున్నారు. ● ఈనీటిని తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధికారులు దృష్టి సారించారు. ● వృథానీటిని ఆర్వోప్లాంట్ ద్వారా శుద్ధి చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్లైన్ వ్యవస్థ ద్వారానే తాగునీటిగా వినియోగించుకోవాలని సింగరేణి అధికారులు సూచించారు. ● తొలుత రామగుండం, పరిసర గ్రామాలకు ప్రజలకు తాగునీరు సరఫరా చేసే అంశంపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ● ఈ క్రమంలో అధికారులు ఈ రెండు ఏరియాల్లో పర్యటించారు. సహకరిస్తాం బొగ్గు గనుల్లోంచి వెలువడే వృథా నీటిని పంటలకు మళ్లిస్తున్నాం. ప్రధానంగా చెరువులు, కుంటల్లోకి మళ్లించి ప్రజావసరాలకు వినియోగిస్తున్నాం. ప్రస్తుతం యాసంగిసీజన్ పంటలకు నీటి అవసరం తీరింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని కలెక్టర్ ముజిమ్మల్ఖాన్ సూచించారు. ఈమేరకు మిషన్ భగీరధ అధికారులు ఏరియాలో పర్యటించి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. జిల్లావాసుల దాహం తీర్చేందుకు మాస్థాయిలో సహకరిస్తాం. – శ్రీనివాస్, ఆర్జీ–1 జీఎం -
ముగ్గురు మహిళా కూలీలకు గాయాలు
సుల్తానాబాద్రూరల్/సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉపాధిహామీ ద్వారా సుద్దాల పెద్దమ్మకుంటలో శుక్రవారం పూడికతీస్తున్న కూలీలపై బండరాయి దొర్లి, మట్టిపెళ్లలు పడ్డాయి. ఈఘటనలో ముగ్గురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దమ్మకుంట పూడికతీత పనుల్లో 163 మంది కూలీలు పనిచేస్తున్నారు. అందులో 20 మంది ఒక బృందంగా ఏర్పడి పూడిక తీస్తుండగా గట్టు కుంగి దానిపై ఉన్న బండరాయి కిందకు జారిపడింది. ఆ క్రమంలోనే మట్టిపెళ్లలు తగిలి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలు ఆవునూరి తార, కల్వల లింగమ్మ, బుర్ర స్వరూపకు గాయాలయ్యాయి. తోటికూలీలు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఈజీఎస్ ఏపీడీ సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి కూలీలను పరామర్శించారు. -
పాలిటెక్నిక్లో ప్రవేశాలు
పెద్దపల్లిరూరల్: ప్రవేశ పరీక్ష రాయకున్నా దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందేందుకు ఆసక్తి గల అనాథ, నిరుపేద బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవుఫ్ఖాన్ తెలిపారు. హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్లో ప్రవేశం పొందేందుకు టెన్త్ పూర్తయి, ఉండి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మూడు సంవత్సరాల కాలపరిమితి గల డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 18వ తేదీలోగా బాలరక్ష భవన్ కార్యాలయంలో అందించాలని కోరారు. పూర్తివివరాలకు సెల్ నంబరు 90324 27241లో సంప్రదించాలని ఆయన కోరారు. -
నిప్పుల కొలిమి
● జిల్లాలో గరిష్టంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ● భయపెడుతున్న వడగాడ్పులు శుక్రవారం నమోదైన ఉష్ణోగత్రలు (డిగ్రీ సెల్సియస్లో) సాక్షి, పెద్దపల్లి: భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉష్ణోగత్రలు 40డిగ్రీలు దాటాయి. అత్యధికంగా కల్వచర్లలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపుతుండటంతో జనం ఇళ్లు విడిచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లు విడిచి బయటకు రావటం లేదు. ఎండలు దంచికొడుతుండడంతో పగటిపూట జనసంచారం తగ్గి వ్యాపారాలు డీలా పడుతున్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు ప్రజలు తమ అవసరాలు తీర్చుకుకంటున్నారు. రాత్రిపూటే పనులు చేసుకుంటున్నారు. ప్రాంతం ఉష్ణోగ్రతలు కల్వచర్ల 44.9 కాల్వశ్రీరాంపూర్ 44.6 మల్యాల 44.4 మంథని 44.4 కూనారాం 44.3 రామగుండం 44.1 ఆకినపల్లి 44.1 -
రాష్ట్రంలో అరాచక పాలన
● పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధ్వజం సుల్తానాబాద్(పెద్దపల్లి): రాష్ట్రంలో నాలుగు నెలల నుంచి అరాచక పాలన కొనసాగుతోందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం రాత్రి స్థానిక కౌన్సిలర్ గొట్టం లక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తమ పార్టీకి ఓట్లు వేయలేదని, కక్షగట్టి దాడులు చేయడం మానుకోవాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతి అమలు చేశామని, అయితే, పోలీసులు ప్రస్తుతం బైండోవర్లు, బెదిరింపులు చేస్తున్నారని, ఆ పద్ధతి మానుకోవాలని కోరారు. ప్రజలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రవీందర్సింగ్, తాళ్లపెల్లి ఆగయ్య ఫౌండేషన్ చైర్మన్ తాళ్లపల్లి మనోజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విరిగిన పరికరాలు
ఎండిన మొక్కలు.. కోల్సిటీ(రామగుండం): నగరవాసులకు ఆహ్లాదం పంచే ఉద్యానవనాలు నిర్వహణ లోపంతో సందర్శకులకు అసంతృప్తి మిగుల్చుతున్నాయి. పచ్చని మొ క్కలు, ఏపుగా పెరిగిన చెట్లు, ఆధునిక ఆటవస్తువు లు, వ్యాయామ, క్రీడా పరికరాలతో సౌకర్యంగా, అందంగా దిద్దిన పార్క్లు కళావిహీనంగా మారా యి. విరిగిన ఓపెన్జిమ్ పరికరాలు, తుప్పు పట్టిన ఆటవస్తువులు, ఎండిపోయిన మొక్కలు అధికారు లు, నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. పార్క్ల నిర్వహణ గాలికి.. రామగుండం నగరవాసులకు ఆహ్లాదం పంచడానికి సుమారు రూ.3కోట్ల పైచిలుకు నిధులతో వివిధ ప్రాంతాల్లో ఉద్యాన వనాలు ఏర్పాటు చేశారు. చి న్నారులు ఆడుకోవడానికి క్రీడాపరికరాలు, జారు డు బళ్లలు, మహిళలు, యువత కోసం వ్యా యా మ పరికరాలు, పాదచారులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్తోపాటు ఓపెన్జిమ్లు కూడా నిర్మించారు. ఇంతసౌకర్యవంతమైన పార్క్ల్లోకి వెళ్లి సరదాగా గడుపుదామనుకునే స్థానికులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఇంజినీరింగ్ విభాగం అధికారులు కూడా సకాలంలో టెండర్లు పిలిచి నిర్వహణ బాధ్యతలను చేపట్టడం లేదు. పర్యవేక్షణ లేక ఆనవాళ్లు కోల్పోయిన ఉద్యాన వనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నగరవాసులు -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
ముత్తారం(మంథని): గ్రామాల్లో తాగునీటి స మస్య తలెత్త కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో నరేందర్ ఆదేశించా రు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటు లో ఉండాని పేర్కొన్నారు. ఎంపీడీవో లలిత, ఎంపీవో వేణుమాధవ్, ఐకేపీ ఏపీఎం పద్మ, సూపరింటెండెంట్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రథమ ప్రాధాన్యం ఇవ్వండి రామగిరి(మంథని): గ్రామాల్లో తాగునీటి స మస్య పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇ వ్వాలని డీపీవో ఆశాలత సూచించారు. లద్నాపూర్, నాగెపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె ప ర్యటించారు. తక్షణమే బోరుబావులను మరమ్మతు చేయించాలని ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణలో తాగునీటి పైపులైన్లు ధ్వంసం కావడంపై అధికారులు నిర్లక్ష్యం వహించారని డీపీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీవో సమ్మిరెడ్డి, పంచాయతీ కార్మదర్శులు పోశం, సంతోష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంటకోత ప్రయోగంతో దిగుబడి అంచనాధర్మారం(ధర్మపురి): వరిలో పంటకోత ప్ర యోగం ద్వారా దిగుబడి అంచనా వేస్తామని ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ అన్నారు. ఽడైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డి ప్యూటీ డైరెక్టర్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రచ్చపల్లి గ్రామంలోని లక్ష్మయ్య వరి పొ లంలో పంటకోత ప్రయోగం చేశారు. 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో పంటకోత ప్ర యోగం నిర్వహించారు. ఇందులో 24.250 కి లోల దిగుబడి వచ్చిందని రవీందర్ తెలిపారు. అనంతరం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి కొనుగోళ్లపై ఆరా తీశారు. అధికారులు శ్యాంసుందర్, నగేశ్, లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, గురువయ్య, షబానా పాల్గొన్నారు. పల్లెప్రకృతి వనం తనిఖీ ముత్తారం(మంథని): ఖ మ్మంపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని డీఎల్పీవో వేణుగోపాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ‘ఎండుతున్న వనం.. నీరుగారుతున్న లక్ష్యం’ శీర్షికన ఈనెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మొక్కలు ఎండిపోవడానికి గల కారణాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అగంతకులు నిప్పుపెట్టడంతో కొన్నిమొక్కలు కాలిపోయాయని, మరికొన్ని నీరంద క ఎండిపోయయని స్థానికులు వివరించారు. మొక్కలను కాపాడే బాధ్యత అందరూ తీసు కోవాలని డీఎల్పీవో సూచించారు. మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని పంచా యతీ కార్యదర్శి రాకేశ్ను అదేశించారు. ఎంపీడీవో లలిత, ఎంపీవో వేణుమాధవ్ ఉన్నారు. ఎల్లంపల్లిలో 6 టీఎంసీల నీరు రామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ప్రాజె క్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శుక్రవారం 6.79 టీఎంసీలు ఉందని అ ధికారులు తెలిపారు. గతేడాది ఇదేరోజు 10 టీ ఎంసీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్కు 331 క్యూసెక్కులు, గూడెం పంపుహౌస్కు 145 క్యూసెక్కులు, పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండంలోని భగీరథ తాగునీటి పథకం కోసం 81 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నామరు. -
సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం
మంథని: పేదలకు చేరాల్సిన రాయితీ బియ్యం సరిహద్దులు దాటుతోంది. అయినా, అధికారులు ప ట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వందలాది క్వింటాళ్ల రేషన్ బి య్యం అక్రమంగా తరలిపోతోంది. అయితే, ఉప్పందుకుంటున్న ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో మాటువేసి పట్టుకుంటున్నారు. వ్యాపారుల మధ్య నెలకొన్న వార్ నేఫథ్యంలో వారంరోజుల వ్యవధిలోనే మంథనిలో రెండుసార్లు రేషన్ బియ్యం అధికారులకు పట్టుబడటం గమనార్హం. మరోవైపు.. అ క్రమ దందాపై అఽధికారులకు సమాచారం ఉన్నా ని లువరించడంలో పట్టించుకోవడం లేదనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఇంతకాలం గుట్టుచప్పుడు కా కుండా సాగిన అక్రమ వ్యాపారం.. అక్రమార్కుల మధ్య వైరంతో బట్టబయలు కావడం గమనార్హం. వారధులుగా బ్యారేజీ.. వంతెనలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీలు, వంతెనలు ప్రజా రవాణాకు కంటే అక్రమ దందాలకు వారధులుగా మారుతున్నాయి. అక్రమార్కులు ప్రధానంగా సబ్సిడీ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారని సమాచారం ఉంది. పేద, మధ్య తరగతితోపాటు ఉన్నతవర్గాలకు చెందిన అనేకమందికి రేషన్కార్డుల ద్వారా వచ్చే బియ్యం.. లబ్ధిదారులు తీసుకోకుండా డీలర్లకే విక్రయిస్తుండడంతో డీలర్లు వాటిని సేకరించి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి. మంథని నుంచి మహారాష్ట్రకు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి సమీప ప్రాంతాల నుంచి మంథనికి చెందిన ఓ వ్యాపారి బియ్యం సేకరించి మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మరికొందరు వ్యాపారులు ఇదే దందాకు తెరలేపడంతో వ్యాపారుల మధ్యపోటీ పెరిగింది. ఈక్రమంలో ఒకరు వాహనం మరొకరు ఉన్నతాధికారులకు పట్టిస్తున్నారు. దీంతో అధికారులు ఏంచేస్తున్నట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చిక్కుండా.. సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు నిఘాలేని మార్గాలను ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ మీదుగా మంచిర్యాల జిల్లా దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజీ, వంతెన.. అటుతర్వాత దామెరకుంట, కాళేశ్వరం, అంతర్రాష్ట్ర వంతెన దాటి మహారాష్ట్రలోకి బియ్యాన్ని చేర్చుతున్నట్లు సమాచారం. మంథని నుంచి తరలించే బియ్యం వాహనాల్లో లోడ్ అయ్యే వరకూ ఇక్కడి వ్యాపారి.. అటుతర్వాత తీసుకెళ్లే బాధ్యత మరో వ్యాపారి తీసుకొని అక్రమ దందాను మూడు లారీలు.. ఆరు వ్యాన్లు అన్నచందంగా రూ.లక్షల్లో దందా సాగిస్తున్నట్లు తెలిసింది. 6ఏ కేసులతో సరి.. జిల్లాలో పలుచోట్ల సబ్సిడీ బియ్యం పట్టుబడుతుంటే అప్పటికప్పుడు 6ఏ కేసులతో సరిపెడుతున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వ్యాపారి ఎవరు? అనే కోణంలో అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు ఉన్నాయి. మూలాల్లో కి వెళ్లకపోవడంతో వ్యాపారులు దందాను ఆపడం లేదు. ఒకట్రెండుసార్లు పట్టుబడితే వారిపై పీడీ యాక్టు నమోదుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది వ్యాపారులు బినామీ పేర్లను వినియోగిస్తూ కేసులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు లు, సివిల్ సప్లయ్ అధికారులు దృష్టి సారిస్తే అక్రమ దందా ఆపవచ్చనే వాదనలు ఉన్నాయి. వ్యాపారుల మధ్య వార్తో పట్టుబడుతున్న బియ్యం గోదావరి బ్యారేజీ, వంతెనలపై అక్రమ రవాణా నిఘా పెంచాం ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాం. గ్రామాల్లో వీఆర్వోలు, ఆర్ఐల ద్వారా అనుమానితుల కదలికలు గమనిస్తున్నాం. 6ఏ కేసులతో పాటు పదేపదే పట్టుబడితే వ్యాపారులపై పీడీ యాక్టు నమోదుకు సిఫారసు చేస్తాం. సబ్సిడీ బియ్యం పక్కాదారి పడుతున్న సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – ప్రకాశ్, తహసీల్దార్, మంథని -
రామగుండం బల్దియాలో పార్క్లు నిరుపయోగం
ఇది రామగుండం బల్దియాలోని దుర్గానగర్ ఉ ద్యానవనం. అమృత్ పథకం ద్వారా విడుదలైన నిధుల్లోంచి రూ.50లక్షలు వెచ్చించి 2017 మా ర్చిలో పార్క్ అభివృద్ధి చేశారు. మరో రూ.20 లక్షల పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ రెండేళ్లుగా నిర్వహణ విస్మరించారు. ఫలితంగా బోర్వెల్ నుంచి చుక్కనీరు రావడం లేదు. నీళ్లు అందక మొక్కలు ఎండిపోయాయి. పిల్లల ఆటవస్తువులు పనికిరాకుండా పోయాయి. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఆడుకోవడానికి పార్క్కు వస్తే పనికిరాని ఆటవస్తువులు వెక్కిరిస్తున్నాయి. ఓపెన్ జిమ్ పరికరాల మరమ్మతు చేయించలేదు. తాగిపడేసిన మద్యం బాటిళ్లు, సిగరెట్ ముక్కలు సందర్శకుల కు ఇబ్బందులుకలిగిస్తున్నాయి. గౌతమినగర్లో నూ రూ.70లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపె న్ జిమ్ నిరుపయోగంగా మారింది. -
రెండోరోజు ముగ్గురు..
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు 5సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఏకదాశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కొరుకంటి చందర్తో కలిసి రెండుసెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.. ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల, నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలిసి ఒకసెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మరోసెట్ అందజేశారు. వీరుకాకుండా బీఆర్ఎస్ తరఫున కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన వేశారు. వీరితో ఇప్పటివరకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కోసం ఆ పార్టీ వ ర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్యకారణాలతో ఆయన రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.●ప్రాజెక్టులు తీసుకొస్తా మా తాత అడుగుజాడల్లో ప్రజాసేవ చేయడానికి రా జకీయాల్లోకి వచ్చా. పదే ళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. నేను, మా నాన్న సక్సెస్ఫుల్ వ్యాపారులం. ఆ అనుభవంతో ఇక్కడకు కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడే పుట్టిన ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన. గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉంటా. ఇక్కడే చస్తా. సింగరేణి లో 26 ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన. ఎక్కడినుంచో వచ్చేవారిని కాకుండా ఉద్యమాల నుంచి వచ్చిన నన్ను గెలిపించాలని కోరుకుతున్నా. మాయమాటల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లతో బుద్ధిచెప్పాలి. – కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ అభ్యర్థి సాదాసీదాగా నామినేషన్ వేసిన కొప్పుల, వంశీ అగ్రనేతల ఆధ్వర్యంలో మరోసెట్ వేయనున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు -
No Headline
● ఇది టీచర్స్కాలనీలోని పార్క్. ఇందిరమ్మకాలనీ, టీచర్స్కాలనీ, గంగానగర్, విఠల్నగర్లో రూ.1.50కోట్లు వెచ్చించి ఉద్యాన వనాలు నిర్మించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో టీచర్స్కాలనీ పార్క్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల విషసర్వం సంచరించడంతో సందర్శకులు, కాలనీవాసులు భయంతో వణికిపోయారు. గంగానగర్ పార్క్ పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. నీళ్లు అందక పచ్చని మొక్కలు, పచ్చని గడ్డి ఎండిపోతున్నాయి. ● వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకునేందుకు పార్క్ల్లో ఏర్పాటు చేసిన ఆటవస్తువులు, క్రీడాపరికరాలు తుప్పుపట్టి, విరిగిపోయాయి. ఎంతోఆశతో ఉద్యానవనాలకు వస్తున్న చిన్నారులు.. వీటిని చూసి ఎలా ఆడుకునేదని నిశ పడుతున్నారు. ఒక్కపార్క్లోని ఆటవస్తువులు కూడా సరిగాలేవు. పరికరాలను అమర్చినన అధికారులు.. ఏనాడూ వాటి నిర్వహణ, మరమ్మతు గురించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. -
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం
ధర్మపురి: అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ వశమైందని, అదే ఊపుతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ది శూన్యమన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ దీక్షలు చేపడుతున్న ఈశ్వర్ తీరును ప్రజలు గమనించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు 50వేల మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కంకణం కట్టుకోవాలన్నారు. ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తామని పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాగూర్, గడ్డం వివేక్, ప్రేమ్సాగర్రావు అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తకు ఫిట్స్.. మంత్రి శ్రీధర్బాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే మంత్రి ప్రసంగాన్ని ఆపివేశారు. విప్ లక్ష్మణ్ అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గెలుపు కోసం చేపడుతున్న దొంగ దీక్షలను ప్రజలు గమనించాలి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కంకణం కట్టుకోవాలి ధర్మపురి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు -
రామగిరి @ 44.9
● జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ● ఉదయం 10 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రహదారులుఉష్ణోగ్రత లు (డిగ్రీలలో)కోల్సిటీ(రామగుండం): భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సెగలు రేపుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండకు తోడు వడగాడ్పులతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గురువారం జిల్లాలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగిరి మండలం కల్వచర్లలో 44.9, ఈసాలతక్కల్లపల్లిలో 44.2, మధ్యాహ్నం రామగుండంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతలకు జనం అనారోగ్యాలకు గురవుతున్నారు. జీజీహెచ్ ఆస్పత్రితోపాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధులతో చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వడదెబ్బ లక్షణాలు, తలనొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలు తదితర సమస్యలతో ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారు. 18న 44.9 17న 43.516న 43.115న 41.4 -
కేటీఆర్ను కలిసిన టీబీజీకేఎస్ నేతలు
గోదావరిఖని(రామగుండం): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను గురువారం టీబీజీకేఎస్ నాయకులు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కలిశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. కేటీఆర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, జాహిద్పాషా, నూనె కొమురయ్య, సంపత్రెడ్డి, నాగెల్లి సాంబయ్య, చల్ల రవీందర్రెడ్డి, వడ్డెపల్లి శంకర్ తదితరులున్నారు. జ్వరాలపై జాగ్రత్తలు తీసుకోవాలిజూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో వైరల్ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ సూచించారు. మండలంలోని చీమలపేటలో డెంగీతో చికిత్స పొందుతున్న ఇద్దరిని గురువారం పరామర్శించారు. క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించి, అనంతరం గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. వైరల్ జ్వరాల బారిన పడిన గ్రామస్తుల రక్త నమూనాలను సేకరించాలని సూచించారు. అంతకు ముందు ఎంపీడీవో పద్మజ, ఎంపీవో కిరణ్ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సంపత్రెడ్డి, హెచ్వీ వసంత, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఏఎన్ఎంలు అరుణ, రుక్మిణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక నాయకుడిగా ‘కొప్పుల’ ఏమి సాధించారు
గోదావరిఖని(రామగుండం): కార్మిక నాయకుడిగా కొప్పుల ఈశ్వర్ ఈప్రాంతానికి ఏమి సాధించారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ప్రశ్నించారు. గురువారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో కార్మికుల కష్టాలు పెరిగాయన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ప్రజాపాలన పేరుతో సింగరేణికి సమర్థుడైన సీఅండ్ఎండీ బలరాంనాయక్ని నియమించామని వివరించారు. ఈప్రాంత యువతను దృష్టిలో ఉంచుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ, ఎంపీగా అవకాశం ఇవ్వాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి న్యాయం చేసేలా కృషి చేస్తానన్నారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, నాయకులు మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, పెద్దెల్లి ప్రకాశ్, తిప్పారపు శ్రీనివాస్, గట్టు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మేదర్బస్తీలోని ఉల్లిగడ్డల బజార్లో నిర్మించిన విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ భవన బ్యాంకెట్హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్లో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement